-
IPL LSG Vs DC Photos: కుల్దీప్ మాయాజాలం, 6 వికెట్ల తేడాతో ఢిల్లీ గెలుపు (ఫొటోలు)
-
మెరుపు ఇన్నింగ్స్తో పంజాబ్ను గెలిపించిన శశాంక్ (ఫొటోలు)
-
ఆఖరి టి20లో పాకిస్తాన్కు ఊరట విజయం
న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్లో క్లీన్స్వీప్ కాకుండా పాకిస్తాన్ తప్పించుకుంది. శనివారం జరిగిన ఐదో టి20లో పాక్ 42 పరుగుల తేడాతో న్యూజిలాండ్పై విజయం సాధించింది. ముందుగా పాక్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది. మొహమ్మద్ రిజ్వాన్ (38), ఫఖర్ జమాన్ (33) రాణించారు. కివీస్ బౌలర్లలో సౌతీ, ఇష్ సోధి, ఫెర్గూసన్, హెన్రీ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 92 పరుగులకే కుప్పకూలింది. సొంతగడ్డపై కివీస్కు టి20ల్లో ఇది రెండో అత్యల్ప స్కోరు. ఫిలిప్స్ (26), అలెన్ (22) మాత్రమే ఫర్వాలేదనిపించారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇఫ్తికార్ అహ్మద్ (3/24) ప్రత్యర్థిని దెబ్బ తీశాడు. 275 పరుగులు సాధించిన అలెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. తొలి నాలుగు మ్యాచ్లు గెలిచిన న్యూజిలాండ్ 4–1తో సిరీస్ గెలుచుకుంది. -
ఆఫ్ఘనిస్తాన్తో టీ20 సిరీస్.. ఓపెనర్గా విరాట్ కోహ్లి..?
ఆఫ్ఘనిస్తాన్తో గురువారం నుంచి ప్రారంభం కాబోయే టీ20 సిరీస్లో టీమిండియా ఓపెనర్గా విరాట్ కోహ్లి వస్తాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ ప్రచారాన్ని చూసి కోహ్లి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తుంటే, కొందరు విశ్లేషకులు మాత్రం ఇది సాధ్యమయ్యే విషయం కాదని సదరు ప్రచారాన్ని కొట్టిపారేస్తున్నారు. వాస్తవానికి కోహ్లి గత ఐపీఎల్ సీజన్లో ఓపెనర్ అవతారమెత్తినప్పటికీ, అది క్యాష్ రిచ్ లీగ్ వరకే పరిమతమైంది. గత సీజన్లో అతను ఓపెనర్గా పరుగుల వరద పారించినా, ఆతర్వాత అంతర్జాతీయ టీ20లు ఆడలేదు. దీంతో ఆ అంశం అప్పటితో మరుగున పడిపోయింది. అయితే తాజాగా కోహ్లి అంతర్జాతీయ టీ20ల్లోకి రీఎంట్రీ ఇవ్వడంతో ఓపెనర్ ప్రస్తావన మళ్లీ తెరపైకి వచ్చింది. పొట్టి ఫార్మాట్లో కోహ్లిని ఓపెనర్గా పంపాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత సమీకరణల ప్రకారం ఇది సాధ్యపడకపోవచ్చనే చెప్పాలి. ఈ ఏడాది టీ20 వరల్డ్కప్ ఉన్న నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ ఇలాంటి సాహసాల జోలికి పోకపోవచ్చు. అలాగే ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్కు సైతం భారత సెలెక్టర్లు రోహిత్కు జతగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్లను ఓపెనర్లును ఎంపిక చేశారు. రోహిత్కు జతగా కోహ్లి ఇన్నింగ్స్ను ఓపెన్ చేస్తే వీరి పరిస్థితి ఏంటనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఇప్పటికే గిల్ టెస్ట్ల్లో ఓపెనర్గా తన స్థానాన్ని కోల్పోయి జట్టులో చోటే ప్రశ్నార్ధకంగా మార్చుకున్నాడు. ఈ పరిస్థితుల్లో టీమ్ మేనేజ్మెంట్ కోహ్లిని ఓపెనర్గా పంపించే సాహసం చేస్తుందో లేదో వేచి చూడాలి. వాస్తవానికి కోహ్లి వన్డౌన్లో వస్తే టీమిండియాకు కొండంత బలం ఉంటుంది. ఈ విషయాన్ని కూడా చాలామంది మాజీలు ప్రస్తావిస్తూ, కోహ్లి ఇన్నింగ్స్ను ఓపెన్ చేయడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరి కోహ్లి విషయంలో జరుగుతున్న ప్రచారం నిజమో లేదో తేలాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే, ఆఫ్ఘనిస్తాన్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ జనవరి 11, 14, 17 తేదీల్లో జరుగనుంది. చాలాకాలంగా అంతర్జాతీయ టీ20లకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఈ సిరీస్ ద్వారా టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఆఫ్ఘన్తో సిరీస్ అనంతరం టీమిండియా స్వదేశంలోనే ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది. ఓపెనర్గా టీ20ల్లో విరాట్ గణాంకాలు.. 107 మ్యాచ్లు 107 ఇన్నింగ్స్లు 4011 పరుగులు 122 నాటౌట్ అత్యధిక స్కోర్ 44.56 సగటు 137.64 సగటు 8 శతకాలు 28 అర్ధశతకాలు టీమిండియా: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్కీపర్), సంజు శాంసన్ (వికెట్కీపర్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్ అఫ్గనిస్తాన్: ఇబ్రహీం జద్రాన్ (కెప్టెన్), రహ్మతుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇక్రమ్ అలీఖిల్ (వికెట్ కీపర్), హజ్రతుల్లా జజాయ్, రహ్మత్ షా, నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, కరీం జనత్, అజ్మతుల్లా ఒమర్జాయ్, షరాఫుద్దీన్ అష్రఫ్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఫజల్ హక్ ఫారూఖీ, ఫరీద్ అహ్మద్, నవీన్ ఉల్ హక్, నూర్ అహ్మద్, మహ్మద్ సలీం, కైస్ అహ్మద్, గుల్బదిన్ నైబ్, రషీద్ ఖాన్. -
ఆసీస్తో రెండో టీ20.. సిరీస్ విజయమే లక్ష్యంగా!
ముంబై: వన్డే సిరీస్ వైఫల్యాన్ని అధిగమించి తొలి టి20లో ఆ్రస్టేలియా మహిళలపై ఘన విజయం సాధించిన భారత జట్టు ఇప్పుడే అదే ఊపులో సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. గత మ్యాచ్ ఇచ్చిన ఉత్సాహంతో హర్మన్ప్రీత్ సేన బరిలోకి దిగుతోంది. మరో వైపు సాధారణ బ్యాటింగ్తో ఓటమిని ఆహ్వానించిన ఆస్ట్రేలియా కోలుకొని సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. యువ పేసర్ టిటాస్ సాధు అద్భుత బౌలింగ్ ప్రదర్శన తొలి మ్యాచ్లో హైలైట్గా నిలిచింది. 19 ఏళ్ల ఈ బెంగాలీ పేసర్ మరోసారి తన జోరును ప్రదర్శిస్తే ఆసీస్కు కష్టాలు తప్పవు. శ్రేయాంక, దీప్తిల ఆటతో డీవై పాటిల్ స్టేడియంలో స్పిన్నర్ల ప్రభావం కూడా బాగా కనిపించింది. పేసర్లు రేణుక, పూజ కూడా ఆకట్టుకున్నారు. బ్యాటింగ్లో షఫాలీ, స్మృతి మరో బ్యాటర్కు అవకాశం ఇవ్వకుండా మ్యాచ్ను ముగించారు. ఫామ్ కోల్పోయి చివరి రెండు వన్డేల్లో తుది జట్టులో అవకాశం లభించని షఫాలీ తాను ఎంత కీలకమో తొలి టి20 పోరులో చూపించింది. స్మృతి కూడా చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ ఆటతీరుతో అలరించింది. జెమీమా, హర్మన్ కూడా చెలరేగితే బ్యాటింగ్లో తిరుగుండదు. జట్టుపరంగా చూస్తే ముఖ్యంగా వన్డేలతో పోలిస్తే ఫీల్డింగ్ జట్టు మెరుగైన ప్రదర్శన కనబర్చింది. మరో వైపు ఆ్రస్టేలియా జట్టు అనూహ్య రీతిలో తడబడింది. టి20ల్లో దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆ జట్టు ఆలౌట్ కావడం భారత బౌలర్ల పైచేయిని చూపించింది. సీనియర్ బ్యాటర్లు ఉన్న టాప్–5లో పెరీ మినహా అంతా విఫలమయ్యారు. అయితే హీలీ, మూనీ, తహీలా, గార్డ్నర్ రాణిస్తే జట్టు భారీ స్కోరు చేయగలుగుతుంది. వన్డే సిరీస్లో అద్భుత ఆటను చూపించిన లిచ్ఫీల్డ్ టి20 మ్యాచ్లో కూడా సత్తా చాటడం ఆసీస్కు సానుకూలాంశం. ఆమె ఆడిన కొన్ని చక్కటి షాట్లు లిచ్ఫీల్డ్ సామర్థ్యాన్ని చూపించాయి. గత మ్యాచ్లో పూర్తిగా కట్టు తప్పిన ఆసీస్ బౌలింగ్ ఈ సారి ఎంత ప్రభావం చూపిస్తుంననేది ఆసక్తికరం. -
సూర్య సూపర్ సెంచరీ.. దక్షిణాఫ్రికా చిత్తు
జొహన్నెస్బర్గ్: వాండరర్స్ మైదానంలో భారత్ విజయహాసం చేసింది. గత మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటూ భారీ విజయాన్ని నమోదు చేసింది. గురువారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్లో భారత్ 106 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఫామ్లో ఉన్న కెప్టెన్ , ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (56 బంతుల్లో 100; 7 ఫోర్లు, 8 సిక్స్లు) మెరుపు శతకంతో చెలరేగాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (41 బంతుల్లో 60; 6 ఫోర్లు, 3 సిక్స్లు) కూడా రాణించాడు. అంతర్జాతీయ టి20ల్లో నాలుగో సెంచరీ సాధించిన సూర్య... రోహిత్ శర్మ, గ్లెన్ మ్యాక్స్వెల్లతో సమంగా నిలిచాడు. అనంతరం ఛేదనలో దక్షిణాఫ్రికా ఏ దశలోనూ ప్రభావం చూపలేకపోయింది. చివరకు ఆ జట్టు 13.5 ఓవర్లలోనే 95 పరుగులకే కుప్పకూలింది. డేవిడ్ మిల్లర్ (25 బంతుల్లో 35; 2 ఫోర్లు, 2 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, మార్క్రమ్ (25) ఫర్వాలేదనిపించాడు. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (5/17) తన కెరీర్లో అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శనతో ప్రత్యర్థిని పడగొట్టాడు. తొలి టి20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా... తాజా ఫలితంతో 1–1తో టి20 సిరీస్ సమంగా ముగిసింది. ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆదివారం తొలి మ్యాచ్ జరుగుతుంది. సూర్య సిక్సర్ల జోరు... టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్కు సరైన ఆరంభం లభించలేదు. గిల్ (12), తిలక్ వర్మ (0)లను వరుస బంతుల్లో కేశవ్ మహరాజ్ అవుట్ చేశాడు. అయితే మరో ఎండ్లో యశస్వి మాత్రం దూకుడు కనబరుస్తూ మార్క్రమ్ ఓవర్లో 2 ఫోర్లు, సిక్స్ బాదాడు. నాలుగో స్థానంలో వచ్చిన సూర్య తనదైన శైలిలో ఆరంభం నుంచి విరుచుకుపడటంతో స్కోరు వేగంగా దూసుకుపోయింది. పవర్ప్లే ముగిసేసరికి స్కోరు 62 పరుగులకు చేరింది. మధ్యలో కొంత నెమ్మదించిన యశస్వి 34 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఫెలుక్వాయో ఓవర్లో సూర్య చెలరేగిపోయాడు. వరుసగా 6, 4, 6, 6 కొట్టిన అతను 32 బంతుల్లో హాఫ్ సెంచరీని అందుకున్నాడు. మూడో వికెట్కు సూర్యతో 70 బంతుల్లోనే 112 పరుగులు జోడించిన అనంతరం యశస్వి వెనుదిరిగాడు. రింకూ సింగ్ (14) ఈసారి ప్రభావం చూపలేకపోగా, జితేశ్ (4), జడేజా (4) విఫలమయ్యారు. మరోవైపు సూర్య మాత్రం తన జోరు కొనసాగించాడు. బర్జర్ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 బాదిన అతను షమ్సీ ఓవర్లోనూ 4, 6 కొట్టాడు. 55 బంతుల్లో సూర్య సెంచరీ పూర్తి కాగా, 20వ ఓవర్లో భారత్ 3 వికెట్లు కోల్పోయింది. చివరి 4 ఓవర్లలో టీమిండియాను కట్టడి చేయడంలో సఫలమైన సఫారీ టీమ్ 40 పరుగులే ఇచ్చింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: యశస్వి (సి) హెన్డ్రిక్స్ (బి) షమ్సీ 60; గిల్ (ఎల్బీ) (బి) మహరాజ్ 8; తిలక్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 0; సూర్యకుమార్ (సి) బ్రీట్కే (బి) విలియమ్స్ 100; రింకూ (సి) (సబ్) స్టబ్స్ (బి) బర్జర్ 14; జితేశ్ (హిట్వికెట్) (బి) విలియమ్స్ 4; జడేజా (రనౌట్) 4; అర్‡్షదీప్ (నాటౌట్) 0; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–29, 2–29, 3–141, 4–188, 5–194, 6–199, 7–199. బౌలింగ్: బర్జర్ 4–0–39–1, మార్క్రమ్ 1–0–15–0, కేశవ్ మహరాజ్ 4–0– 26–2, విలియమ్స్ 4–0–46–2, ఫెలుక్వాయో 3–0–33–0, షమ్సీ 4–0–38–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: హెన్డ్రిక్స్ (రనౌట్) 8; బ్రీట్కే (బి) ముకేశ్ 14; మార్క్రమ్ (సి) యశస్వి (బి) జడేజా 25; క్లాసెన్ (సి) రింకూ (బి) అర్‡్షదీప్ 5; మిల్లర్ (బి) కుల్దీప్ 35; ఫెరీరా (బి) కుల్దీప్ 12; ఫెలుక్వాయో (సి) అండ్ (బి) జడేజా 0; మహరాజ్ (బి) కుల్దీప్ 1; బర్జర్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 1; విలియమ్స్ (ఎల్బీ) (బి) కుల్దీప్ 0; షమ్సీ (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 3; మొత్తం (13.5 ఓవర్లలో ఆలౌట్) 95. వికెట్ల పతనం: 1–4, 2–23, 3–42, 4–42, 5–75, 6–82, 7–89, 8–89, 9–94, 10–95. బౌలింగ్: సిరాజ్ 3–1–13–0, ముకేశ్ 2–0–21–1, అర్‡్షదీప్ 2–0–13–1, జడేజా 3–0–25–2, తిలక్ 1–0–4–0, కుల్దీప్ 2.5–0–17–5. -
భారత్vsఆస్ట్రేలియా T20 ఉత్కంఠపోరులో భారత్ విజయం (ఫొటోలు)
-
విశాఖ వేదికగా కాసేపట్లో భారత్, ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్
-
నేటి నుంచి ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ టికెట్ల విక్రయం
విశాఖపట్నం: విశాఖ వేదికగా ఈ నెల 23న జరగనున్న ఇండియా, ఆస్ట్రేలియా టీ–20 మ్యాచ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు డీసీపీ–1 కె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం నుంచి టికెట్ల విక్రయాలు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. నగర పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ నెల 15, 16 తేదీల్లో ఆన్లైన్లో టికెట్లు అందుబాటులో ఉంటాయని, ఉదయం 11 గంటల నుంచి పేటీఎం(ఇన్సైడర్.ఇన్)లో టికెట్లు పొందవచ్చన్నారు. 17, 18 తేదీల్లో పీఎంపాలెంలోని డాక్టర్ వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ క్రికెట్ స్టేడియం బీ గ్రౌండ్, వన్టౌన్లోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియం, గాజువాకలోని రాజీవ్ గాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆఫ్లైన్లో టికెట్ల విక్రయించనున్నట్లు చెప్పారు. ఆఫ్లైన్లో ఒకరికి రెండు టికెట్లు మాత్రమే విక్రయిస్తారని స్పష్టం చేశారు. ఆన్లైన్లో 10,500, ఆఫ్లైన్లో 11,500 టికెట్లు విక్రయిస్తారని, కాంప్లిమెంటరీ టికెట్లు 5 వేల వరకు ఉంటాయన్నారు. పోలీసులకు సహకరించాలి : క్రికెట్ మ్యాచ్ చూసేందుకు వచ్చే వారు పోలీసులకు సహకరించాలని డీసీపీ–1 కోరారు. మ్యాచ్ ప్రారంభానికి ముందుగానే వచ్చి ఎవరి సీట్లలో వారు కూర్చోవాలని సూచించారు. పోలీసులు సూచించిన ప్రాంతాల్లో వాహనాలు పార్కింగ్ చేసుకోవాలన్నారు. విలువైన వస్తువులు, ఎక్కువ మొత్తంలో నగదు తీసుకురావద్దన్నారు. సెక్యూరిటీ పరంగా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. టికెట్లపై ప్రత్యేకంగా మార్కు ఉంటుందన్నారు. స్కాన్లో ఆ మార్కు రాకపోయినా, కలర్ జిరాక్స్ టికెట్లు తీసుకొచ్చినా అనుమతించేదిలేదని స్పష్టం చేశారు. వేరే వారి దగ్గర కొనుగోలు చేశామని కుంటిసాకులు చెప్పవద్దన్నారు. అలా వచ్చిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో ఏసీఏ కార్యదర్శి ఎస్.ఆర్.గోపీనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వానతో ముగిసిన ఆట!
డబ్లిన్: భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు వర్షంతో ముగింపు లభించింది. బుధవారం జరగాల్సిన మూడో టి20 మ్యాచ్ వాన కారణంగా ఒక్క బంతి కూడా వేయకుండానే రద్దయింది. నిర్విరామంగా కురిసిన వర్షం తెరిపినివ్వకపోవడంతో టాస్ వేసే అవకాశం కూడా లేకుండా పోయింది. మధ్యలో కొద్దిసేపు వాన తీవ్రత తగ్గడంతో అంపైర్లు మైదానాన్ని పరీక్షించినా... కనీసం 5 ఓవర్ల మ్యాచ్ కూడా నిర్వహించే అవకాశం లేదని తేలిపోయింది. దాంతో స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు మ్యాచ్ రద్దుపై అంపైర్లు అధికారిక ప్రకటన చేశారు. దాంతో తొలి రెండు మ్యాచ్లలో గెలిచిన భారత్ ఖాతాలో 2–0తో సిరీస్ చేరింది. భారత కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. ‘చంద్రయాన్’ను వీక్షిస్తూ... మ్యాచ్ రోజు డబ్లిన్లో భారత క్రికెటర్లు టీవీలో ‘చంద్రయాన్–3’ ప్రత్యక్ష ప్రసారాన్ని చూస్తూ సమయం గడిపారు. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగు పెట్టిన క్షణాన సంబరాలు చేసుకుంటూ భావోద్వేగంతో తమ ఆనందాన్ని ప్రదర్శించారు. మరోవైపు మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, స్టార్ ప్లేయర్ కోహ్లి తదితరులు తమ సంతోషాన్ని ప్రకటిస్తూ ట్విట్టర్లో ‘ఇస్రో’కు అభినందనలు తెలియజేశారు. -
Ind Vs Ire: ప్రయోగానికి ఆఖరి అవకాశం .. జితేశ్, షహబాజ్లకు ఛాన్స్!
డబ్లిన్: వెస్టిండీస్తో ఐదు టి20 మ్యాచ్లు, ఆ తర్వాత ఐర్లాండ్తో మూడు టి20 మ్యాచ్లు భారత యువ ఆటగాళ్లను ఈ ఫార్మాట్లో పరీక్షించేందుకు అవకాశం ఇచ్చాయి. వన్డే ప్రపంచకప్ ఏడాది ఎక్కువ మంది సీనియర్లు విరామం తీసుకోగా, కుర్రాళ్లంతా తమకు లభించిన చాన్స్ను చక్కగా ఉపయోగించుకున్నారు. ఈ రెండు పర్యటనల్లో కలిపి ఏడు మ్యాచ్లలో ఇప్పటికే ఐదుగురు ఆటగాళ్లు అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశారు. ఇక మరో ఇద్దరు దాని కోసం ఎదురు చూస్తున్నారు. టూర్ చివరి మ్యాచ్లో ఆ చాన్స్ దక్కుతుందా అనేది చూడాలి. సిరీస్ను 2–0తో సొంతం చేసుకున్న భారత్ కోణంలో ఇది మాత్రమే ఆసక్తికర అంశం. మరోవైపు వన్డే, టి20 ఫార్మాట్లలో కలిపి భారత్తో ఆడిన 10 సార్లూ ఓడిన ఐర్లాండ్ ఈసారైనా సొంతగడ్డపై ఒక్క మ్యాచ్ గెలవాలని కోరుకుంటోంది. ఈ నేపథ్యంలో నేడు చివరి టి20కి రంగం సిద్ధమైంది. జితేశ్, షహబాజ్లకు అవకాశం! ఐర్లాండ్తో రెండు మ్యాచ్లోలనూ రాణించిన కెప్టెన్ బుమ్రా, పేసర్ ప్రసిధ్ కృష్ణ ఫామ్లోకి రావడం, ఆసియా కప్కు ఎంపిక కావడంతో ఈ సిరీస్ నుంచి భారత్కు ఆశించిన ప్రధాన ఫలితం దక్కింది. అయితే మరింత మ్యాచ్ ప్రాక్టీస్ కోసం వీరిద్దరు ఈ మ్యాచ్లోనూ బరిలోకి దిగుతారు. రవి బిష్ణోయ్ కూడా సిరీస్లో తన బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. బ్యాటింగ్లో రుతురాజ్, సామ్సన్, రింకూ సింగ్ కూడా తమకు లభించిన అవకాశాలు చక్కగా ఉపయోగించుకోగా, శివమ్ దూబే కూడా తన ధాటిని ప్రదర్శించాడు. సిరీస్లో విఫలమైన తిలక్ వర్మ చివరి పోరులో సత్తా చాటాలని పట్టుదలగా ఉన్నాడు. యశస్వి కూడా మరో మెరుపు ఇన్నింగ్స్ బాకీ ఉన్నాడు. ఈ స్థితిలో తుది జట్టులో మూడు మార్పులకు అవకాశం ఉంది. ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడని వికెట్ కీపర్ జితేశ్ శర్మ, 3 వన్డేలు ఆడిన షహబాజ్ అహ్మద్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. వీరిని తీసుకోవాలని మేనేజ్మెంట్ భావిస్తే సంజు సామ్సన్, వాషింగ్టన్ సుందర్ స్థానాల్లో అవకాశం దక్కుతుంది. మరోవైపు కొంత విరామం తర్వాత టీమ్లోకి వచ్చిన అవేశ్ ఖాన్ కూడా టీమ్తో పాటు ఉన్నాడు. అతనికీ ఒక మ్యాచ్ ఇవ్వాలనుకుంటే అర్‡్షదీప్కు విశ్రాంతినిస్తారు. ఇదే జరిగితే కుర్రాళ్లతో భారత్ ప్రయోగం సంపూర్ణమవుతుంది. స్టిర్లింగ్ ఫామ్లోకి వచ్చేనా! రెండు టి20 మ్యాచ్లలో ఐర్లాండ్ ఆటతీరు మరీ పేలవంగా లేకున్నా భారత్లాంటి బలమైన జట్టుకు పోటీనిచ్చేందుకు సరిపోలేదు. గతంలోనూ కొన్ని చక్కటి ప్రదర్శనలు వచ్చినా టీమిండియాను ఓడించడంలో మాత్రం ఆ జట్టు సఫలం కాలేకపోయింది. ఈ నేపథ్యంలో చివరి పోరులోనైనా ఆ జట్టు గెలుపు బాట పడుతుందేమో చూడాలి. ప్రపంచవ్యాప్తంగా లీగ్లలో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ వచ్చిన కెప్టెన్ పాల్ స్టిర్లింగ్ ఇక్కడ మాత్రం రెండింటిలోనూ విఫలమయ్యాడు. బల్బిర్నీ మినహా మిగతావారంతా ప్రభావం చూపలేకపోయారు. విజయం సాధించాలంటే జట్టు సమష్టిగా రాణించడం కీలకం. ఐర్లాండ్ కూడా గత మ్యాచ్తో పోలిస్తే మూడు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. -
మరో విజయంపై టీమిండియా గురి.. ఫ్లోరిడాలో నాలుగో టీ20
లాడర్హిల్ (ఫ్లోరిడా): భారత్, వెస్టిండీస్ సమరం అమెరికా గడ్డకు చేరింది. సిరీస్ను సమం చేసే లక్ష్యంతో భారత్ బరిలోకి దిగుతుండగా... గత మ్యాచ్లో ఓటమి పాలైన తర్వాత ఇక్కడైనా సిరీస్ అందుకోవాలని వెస్టిండీస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే నాలుగో టి20 మ్యాచ్లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ టూర్లో ఇప్పటి వరకు జరిగిన అన్ని మ్యాచ్లతో పోలిస్తే అమెరికాలోని ఈ రీజినల్ పార్క్ స్టేడియం బ్యాటింగ్కు బాగా అనుకూలించే మైదానం. గతంలోనూ ఇక్కడ భారీ స్కోర్లే నమోదయ్యాయి కాబట్టి సిరీస్లోని చివరి రెండు టి20ల్లో బ్యాటర్ల నుంచి మెరుపు ప్రదర్శనలు ఆశించవచ్చు. అయితే శనివారం రోజున వర్ష సూచన ఉంది. మ్యాచ్కు వాన అంతరాయం కలిగించవచ్చు. ఇక్కడ జరిగిన 13 టి20ల్లో 11 సార్లు ముందుగా బ్యాటింగ్ చేసిన జట్టే గెలిచింది. అదే జట్టుతో... గత మ్యాచ్లో ఏకపక్ష విజయం సాధించిన భారత జట్టు మార్పుల్లేకుండానే బరిలోకి దిగే అవకాశం ఉంది. తన సత్తా చాటేందుకు యశస్వి జైస్వాల్కు ఇది మరో అవకాశం. అయితే రెండో ఓపెనర్ శుబ్మన్ గిల్ మూడు మ్యాచుల్లోనూ ‘సింగిల్ డిజిట్’ స్కోరుకే పరిమితమయ్యాడు. ఇక్కడైనా అతను ఫామ్ను అందుకుంటాడా చూడాలి. ఈ ఫార్మాట్లో తాను ఎంత ప్రమాదకరమైన ఆటగాడో సూర్యకుమార్ నిరూపించాడు. అయితే ఇప్పుడు అందరి దృష్టీ హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మపై నిలిచింది. సిరీస్లో అన్ని మ్యాచ్లలో సత్తా చాటిన అతనిపై అన్ని వైపుల నుంచి ప్రశంసలతో పాటు వన్డేల్లోనూ తీసుకోవాలనే సూచనలు వస్తున్న నేపథ్యంలో తిలక్ తన జోరును కొనసాగించాల్సి ఉంది. సంజు సామ్సన్కు కూడా ఇది చావోరేవోలాంటి మ్యాచ్. ఇక్కడా అవకాశం వృథా చేస్తే మున్ముందు కష్టమే. బౌలింగ్లో పేసర్లు ముకేశ్, అర్ష్ దీప్ అంతంత మాత్రమే ప్రభావం చూపిస్తుండగా... చహల్, కుల్దీప్ తమ స్పిన్తో ప్రత్యర్థిని కట్టిపడేస్తున్నారు. వీరు మరోసారి చెలరేగితే విండీస్కు కష్టాలు తప్పవు. హెట్మైర్ రాణిస్తాడా... విండీస్ జట్టులో పూరన్, హెట్మైర్లు టి20 ఫార్మాట్లో స్టార్లుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పూరన్ తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకోగా, హెట్మైర్ ఇప్పటి వరకు ప్రభావం చూపలేకపోయాడు. ఈసారైనా అతను దూకుడుగా ఆడాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. కెపె్టన్ పావెల్ ఫామ్లోకి సానుకూలాంశం కాగా... మేయర్స్, చార్లెస్ కనీస ప్రదర్శన కూడా ఇవ్వడం లేదు. ఓపెనర్ కింగ్ కూడా శుభారంభం అందించాల్సి ఉంది. చార్లెస్ స్థానంలో వన్డే కెప్టెన్ షై హోప్ను ఆడించే అవకాశం ఉంది. ఫిట్గా ఉంటే చేజ్ స్థానంలో హోల్డర్ తిరిగొస్తాడు. నెమ్మదైన పిచ్లపై మెరుగైన రీతిలో రాణించిన విండీస్ పేసర్లు జోసెఫ్, మెకాయ్, షెఫర్డ్ ఈ పిచ్పై భారత బ్యాటర్లను ఎలా నిలువరిస్తారనేది చూడాలి. అన్ని విధాలుగా ఆకట్టుకున్న స్పిన్నర్ అకీల్ హొసీన్పై కూడా టీమ్ ఆధారపడుతోంది. -
WI vs IND 3rd T20 Match Photos: మూడో టీ20లో భారత ఘన విజయం (ఫొటోలు)
-
సిరీస్ కాపాడుకునేందుకు...
ప్రావిడెన్స్ (గయానా): ఏడేళ్ల తర్వాత వెస్టిండీస్ చేతిలో భారత్ వరుసగా రెండు టి20 మ్యాచ్లలో ఓడింది. ఇప్పుడు అదే తరహాలో సిరీస్ కూడా కోల్పోయే స్థితిలో టీమిండియా నిలిచింది. రోహిత్, కోహ్లి లేకపోయినా ఐపీఎల్ కారణంగా తగినంత టి20 అనుభవం ఉన్న భారత జట్టు తొలి రెండు మ్యాచ్లలో ప్రత్యరి్థకి అనూహ్యంగా తలవంచింది. ఇప్పుడైనా హార్దిక్ పాండ్యా బృందం కోలుకొని తమ స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరుస్తుందా అనేది కీలకం. మరోవైపు రెండు మ్యాచ్లు గెలిచిన ఉత్సాహంతో వెస్టిండీస్ సిరీస్పై కన్నేసింది. ఆ జట్టు ఇదే జోరు కొనసాగిస్తే మరో మ్యాచ్ గెలవడం కూడా కష్టం కాబోదు. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య నేడు మూడో టి20 మ్యాచ్కు రంగం సిద్ధమైంది. గత మ్యాచ్ జరిగిన వేదికపైనే ఈ మ్యాచ్ కూడా కావడంతో పిచ్ నెమ్మదిగా ఉండవచ్చు. సూర్య చెలరేగేనా... తొలి రెండు టి20ల్లోనూ భారత ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. బ్యాటింగ్కు గొప్పగా అనుకూలించని నెమ్మదైన పిచ్పై పరుగులు చేసేందుకు మనవాళ్లు తడబడుతున్నారు. ఇషాన్ కిషన్, గిల్, సంజు సామ్సన్, హార్దిక్ పాండ్యా ప్రభావం చూపలేకపోయారు. దీంతోపాటు టి20ల్లో అద్భుత రికార్డు ఉన్న సూర్యకుమార్ యాదవ్ కూడా తనదైన దూకుడు ప్రదర్శించలేదు. హైదరాబాద్ బ్యాటర్ తిలక్ వర్మ ఒక్కడే చక్కటి బ్యాటింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. బౌలింగ్లో స్పిన్నర్ చహల్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోగా, అర్‡్షదీప్, ముకేశ్ కుమార్ నిరాశపరిచారు. పాండ్యా కెపె్టన్సీ కూడా పేలవంగా ఉంది. గత మ్యాచ్లో అక్షర్ పటేల్కు బౌలింగ్ ఇవ్వకపోగా, కీలకదశలో చహల్కు బౌలింగ్ ఇవ్వకుండా విండీస్ గెలిచే అవకాశం సృష్టించాడు. ఈ తప్పులను దిద్దుకుంటేనే భారత్ గెలుపు బాట పట్టగలదు. వారిద్దరిపై భారం... వెస్టిండీస్ రెండుసార్లూ చక్కటి బౌలింగ్ ప్రదర్శనలతో మ్యాచ్లను సొంతం చేసుకోగలిగింది. పటిష్టమైన భారత లైనప్ను నిలువరించడంలో ఆ జట్టు సఫలమైంది. ముఖ్యంగా అకీల్ హొసీన్, మెకాయ్, జోసెఫ్లు నియంత్రణతో బౌలింగ్ చేస్తున్నారు. హోల్డర్ కూడా కీలక దశలో రాణించడం ఆ జట్టుకు సానుకూలాంశం. బ్యాటింగ్లో తన విలువేమిటో పూరన్ చూపించాడు. హెట్మైర్ కూడా జట్టు బ్యాటింగ్లో కీలకం. ఈ ఇద్దరు ఐపీఎల్ అనుభవం ఉన్న ఆటగాళ్లు జట్టును ఒంటిచేత్తో గెలిపించగల సమర్థులు. అదే తరహాలో మేయర్స్ కూడా రాణించాలని టీమ్ కోరుకుంటోంది. మొత్తంగా చూస్తే ఈ ఫార్మాట్లో అంత సులువుగా తలవంచమని చూపిన విండీస్ సిరీస్ గెలుపుపై దృష్టి పెట్టింది. -
WI vs IND 1st T20 Match Photos : ఉత్కంఠపోరులో విండీస్ విజయం (ఫొటోలు)
-
రాన్నున్న T -20 సిరీస్ లో ఈ యువ ఆటగాళ్లు
-
ఒక్క సిరీస్ తో వరల్డ్ కప్ కి యశస్వి జైస్వాల్..
-
దుమ్మురేపుతున్న సామ్ కర్రన్.. ఓరేంజ్ లోే తిడుతున్న ఫ్యాన్స్
-
పతిరణకి ధోని సలహా...మండి పడుతున్న మలింగ
-
క్రికెట్ లో సరికొత్త రికార్డు... ఒక్క ఓవర్ లో 46 పరుగులు
-
అఫ్గన్ చేతిలో పాక్ చిత్తు
షార్జా: అంతర్జాతీయ క్రికెట్లో పాకిస్తాన్తో తొలి మ్యాచ్ ఆడిన పుష్కరకాలం తర్వాత అఫ్గనిస్తాన్కు ఆ జట్టుపై మొదటి విజయం దక్కింది. శుక్రవారం జరిగిన తొలి టి20లో అఫ్గన్ 6 వికెట్ల తేడాతో పాక్ను చిత్తు చేసింది. ముందుగా పాకిస్తాన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 92 పరుగులు చేసింది. అనంతరం అఫ్గనిస్తాన్ 17.5 ఓవర్లలో 4 వికెట్లకు 98 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మొహమ్మద్ నబీ (38 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) అఫ్గన్ను గెలిపించాడు. -
Ind Vs NZ: ఆఖరి ఆటకు సిద్ధం!
హార్దిక్ పాండ్యా సారథ్యంలో ఇప్పటికే మూడు టి20 సిరీస్లు గెలుచుకున్న భారత జట్టు ఇప్పుడు మరో సిరీస్లో తుది సమరానికి సన్నద్ధమైంది. ఏకపక్షంగా సాగిన వన్డేలతో పోలిస్తే రెండు టి20ల్లోనూ న్యూజిలాండ్ నుంచి టీమిండియా గట్టి పోటీ ఎదుర్కొంది. దాంతో సిరీస్ ఫలితం చివరి మ్యాచ్కు చేరింది. ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ కారణంగా మున్ముందు కొన్ని నెలల పాటు భారత జట్టు టి20 మ్యాచ్లు ఆడే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో మన జట్టు విజయంతో ముగిస్తుందా లేక కివీస్ తన సత్తా చాటి సిరీస్ సాధిస్తుందా చూడాలి. అహ్మదాబాద్: సొంతగడ్డపై శ్రీలంకను చిత్తు చేసి రెండు ఫార్మాట్లలోనూ సిరీస్ గెలుచుకున్న భారత జట్టు న్యూజిలాండ్తోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. వన్డేల్లో విజేతగా నిలిచిన టీమిండియా, టి20ల్లో సిరీస్ అందుకునే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. మరోవైపు న్యూజిలాండ్ కూడా ఈ అవకాశాన్ని వదిలి పెట్టరాదని పట్టుదలగా ఉంది. ఇరు జట్లు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ 1–1తో సమంగా ఉన్న స్థితిలో నేడు జరిగే చివరి టి20 మ్యాచ్లో భారత్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. తాజా ఫామ్, జట్లను చూస్తే మ్యాచ్ హోరాహోరీగా సాగడం ఖాయం. ఉమ్రాన్కు చాన్స్... రోహిత్, రాహుల్, కోహ్లిల గైర్హాజరులో భారత్ టాప్–3 ఈ సిరీస్లో పెద్దగా ప్రభావం చూపలేదనేది స్పష్టం. గిల్, ఇషాన్, రాహుల్ త్రిపాఠి అంచనాలకు అనుగుణంగా ఆడలేకపోయారు. ఈ మ్యాచ్లోనైనా వీరు మెరుగ్గా రాణిస్తే మ్యాచ్లో భారత్ భారీ స్కోరుకు అవకాశం ఉంటుంది. చాలా కాలం తర్వాత టీమ్లోకి ఎంపికైన పృథ్వీ షాకు ఆడే అవకాశం రాకుండానే సిరీస్ ముగిసిపోయేలా కనిపిస్తోంది. బౌలింగ్లో భారత తుది జట్టులో ఒక మార్పు జరగవచ్చు. లక్నోలాంటి టర్నింగ్ పిచ్ కాకపోవడంతో మళ్లీ చహల్ స్థానంలో ఉమ్రాన్ జట్టులోకి రావచ్చు. అరుదైన అవకాశం... న్యూజిలాండ్ జట్టు 2012లో చెన్నైలో జరిగిన ఏకైక టి20లో భారత్ను ఓడించింది. అది మినహా 1955 నుంచి ఏ ఫార్మాట్లో కూడా మన గడ్డపై ఆ జట్టు సిరీస్ గెలవలేకపోయింది. అయితే తాజా ఫామ్ను బట్టి చూస్తే తమ జట్టు ఆ అరుదైన ఘనత అందుకోగలదని కివీస్ ఆశిస్తోంది. టీమ్ తుది జట్టులో కూడా ఎలాంటి మార్పులు ఉండకపోవచ్చు. కాన్వే జోరు మీదుండగా, ఇతర ఆటగాళ్ల నుంచి కూడా తగిన సహకారం అందుతోంది. అలెన్, ఫిలిప్స్ బ్యాటింగ్లో కీలకం కానుండగా, ఆల్రౌండర్లు బ్రేస్వెల్, మిచెల్ కూడా ఆకట్టుకున్నారు. స్పిన్నర్లు సాన్ట్నర్, ఇష్ సోధి భారత లైనప్ను కట్టిపడేయగల సమర్థులు. వ్యక్తిగతంగా గొప్ప ఘనతలు లేకపోయినా... సమష్టిగా తమ జట్టు బలమైందని ఎన్నోసార్లు నిరూపించిన న్యూజిలాండ్ మళ్లీ అదే పట్టుదలను చూపిస్తే సంతోషంగా తిరిగి వెళ్లవచ్చు. పిచ్, వాతావరణం నరేంద్ర మోదీ స్టేడియంలోని పిచ్ మొదటి నుంచీ బ్యాటింగ్కు బాగా అనుకూలం. ఇక్కడ జరిగిన అన్ని మ్యాచ్లలో భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్ రోజు వర్ష సూచనలేదు. పశ్చిమ భారత్లో పెద్దగా మంచు ప్రభావం లేదు. ►గత పదేళ్లలో భారత జట్టు సొంతగడ్డపై మూడు ఫార్మాట్లలో కలిపి 55 సిరీస్లు ఆడింది. ఇందులో 47 సిరీస్లు గెలవడం విశేషం. ఒక్క ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మాత్రమే భారత్ను ఓడించగలిగాయి. -
సీనియర్లు లేకుండా టీ20 సమరానికి 'సై'! ఆ ముగ్గురికి విశ్రాంతి
సీనియర్లు లేకుండా మరో టి20 సిరీస్... రోహిత్ శర్మ, కోహ్లి, కేఎల్ రాహుల్ విశ్రాంతి తీసుకోగా, వరల్డ్కప్ తర్వాత హార్దిక్ పాండ్యా కెప్టెన్ వరుసగా మూడో సిరీస్... వన్డేల్లో న్యూజిలాండ్పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా ఇప్పుడు టి20ల్లో కూడా అదే జోరును కొనసాగించేందుకు సిద్ధమైంది. ఏడాది వన్డే వరల్డ్కప్ ఉండటంతో టి20 ఫార్మాట్కు ప్రాధాన్యత తగ్గిన నేపథ్యంలో సీజన్లో చివరి టి20 ద్వైపాక్షిక పోరులో సత్తా చాటేందుకు యువ ఆటగాళ్లకు మరో అవకాశం దక్కింది. గత ప్రత్యర్థి శ్రీలంక తరహాలో కివీస్ కూడా కనీసం ఈ ఫార్మాట్లో అయినా పోటీనిస్తుందా లేదా అనేది చూడాలి. రాంచీ: దాదాపు ఏకపక్షంగా సాగిన వన్డే సిరీస్ తర్వాత టి20ల్లో అమీతుమీ తేల్చుకునేందుకు భారత్, న్యూజిలాండ్ సన్నద్ధమయ్యాయి. మూడు మ్యాచ్ల సిరీస్లో భాగంగా నేడు ఇరు జట్ల మధ్య తొలి టి20 పోరు జరగనుంది. అనుభవం, గణాంకాల దృష్ట్యా ప్రత్యర్థి కంటే టీమిండియా ఎంతో బలంగా కనిపిస్తుండగా... కివీస్ తమ యువ ఆటగాళ్లతో సంచలనాన్ని ఆశిస్తోంది. ఇలాంటి స్థితిలో ఈ సిరీస్ అయినా పోటాపోటీగా సాగుతుందా లేక ఇదీ ఏకపక్షమవుతుందా అనేది ఆసక్తికరం. గిల్తోనే ఓపెనింగ్... దాదాపు ఇరవై రోజుల క్రితం భారత జట్టు తమ చివరి టి20 మ్యాచ్ను శ్రీలంకతో ఆడింది. స్వల్ప మార్పుల మినహా అదే జట్టు ఈసారి కూడా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఒక ఓపెనర్గా ఇషాన్ కిషన్ ఖాయం కాగా... రెండో ఓపెనర్గా శుబ్మన్ గిల్ ఆడతాడని కెప్టెన్ హార్దిక్ చెప్పేశాడు. రుతురాజ్ గైక్వాడ్ గాయంతో సిరీస్కు దూరం కాగా, పృథ్వీ షా రూపంలో మరో ఓపెనర్ అందుబాటులో ఉన్నాడు. శ్రీలంకతో సిరీస్లోనే అరంగేట్రం చేసిన గిల్ టి20 రికార్డు అంత గొప్పగా ఏమీ లేదు. అయితే వన్డేల్లో అతని తాజా ఫామ్ను చూస్తే జట్టులో స్థానం ఇవ్వక తప్పదని కూడా హార్దిక్ వెల్లడించాడు. రాహుల్ త్రిపాఠి తన సత్తాను గత మ్యాచ్లో చూపించగా... నాలుగో స్థానంలో ‘ఐసీసీ టి20 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’ రూపంలో సూర్యకుమార్ సిద్ధంగా ఉన్నాడు. ఆల్రౌండర్గా దీపక్ హుడా బరిలోకి దిగనుండగా, పెళ్లి కారణంగా అక్షర్ పటేల్ ఈ సిరీస్కు దూరంగా ఉండటంతో వాషింగ్టన్ సుందర్కు చోటు ఖాయమైంది. సీనియర్ పేసర్లు ఎవరూ లేకపోవడంతో మరోసారి ఉమ్రాన్ మాలిక్, అర్ష్దీప్ సింగ్, శివమ్ మావిలపైనే జట్టు భారం ఉంది. మున్ముందు అగ్రశ్రేణి బౌలర్లు వచ్చినా... తమ స్థానం నిలబెట్టుకోవాలంటే ఈ సిరీస్లో వీరు సత్తా చాటాల్సి ఉంది. మణికట్టు స్పిన్నర్ స్థానానికి సహజంగానే కుల్దీప్, చహల్ మధ్య పోటీ నెలకొంది. ఇష్ సోధికి చోటు... వన్డేలలాగే టి20 సిరీస్ నుంచి కూడా న్యూజిలాండ్ సీనియర్లు విలియమ్సన్, సౌతీ విశ్రాంతి తీసుకున్నారు. దాంతో సాన్ట్నర్ నాయకత్వంలో జట్టు బరిలోకి దిగుతోంది. కెప్టెన్గా సాన్ట్నర్ బలహీన జట్లు ఐర్లాండ్, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ జట్లపై విజయాలు అందించాడు. టి20 వరల్డ్కప్ తొలి మ్యాచ్లో మెరుపు సెంచరీతో చెలరేగిన తర్వాత ఓపెనర్ ఫిన్ అలెన్ ఆడిన ఆరు టి20ల్లోనూ విఫలమయ్యాడు. తాజా వన్డే సిరీస్లో కూడా రెండుసార్లు డకౌట్ అయిన అతను ఇప్పుడైనా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడాలని జట్టు కోరుకుంటోంది. ఆల్ఫార్మాట్ బ్యాటర్గా తనకంటూ ఇప్పటికే గుర్తింపు తెచ్చుకొని చివరి వన్డేలో సెంచరీ బాదిన కాన్వే మరోసారి కీలకం కానుండగా... ముగ్గురు ఆల్రౌండర్లు మిచెల్, బ్రేస్వెల్, సాన్ట్నర్ రాణిస్తేనే జట్టుకు విజయావకాశాలు ఉంటాయి. పేస్ బౌలింగ్లో కివీస్ బాగా బలహీనంగా కనిపిస్తోంది. లిస్టర్, షిప్లీ ఇప్పటివరకు టి20లు ఆడకపోగా... టిక్నర్, డఫీ అనుభవం కూడా అంతంత మాత్రమే. దాంతో ఫెర్గూసన్పై అదనపు భారం పడింది. లిస్టర్ ఈ మ్యాచ్తో అరంగేట్రం చేసే అవకాశం ఉంది. అయితే గాయంతో వన్డేలు ఆడని ప్రధాన స్పిన్నర్ ఇష్ సోధి కోలుకోవడం జట్టుకు పెద్ద ఊరట. భారత గడ్డపై అతనికి మంచి రికార్డు ఉంది. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హార్దిక్ (కెప్టెన్), గిల్, ఇషాన్ కిషన్, రాహుల్ త్రిపాఠి, సూర్యకుమార్, హుడా, సుందర్, మావి, ఉమ్రాన్, అర్ష్దీప్, కుల్దీప్/చహల్. న్యూజిలాండ్: సాన్ట్నర్ (కెప్టెన్), అలెన్, కాన్వే, చాప్మన్, ఫిలిప్స్, మిచెల్, మైకేల్ బ్రేస్వెల్, టిక్నర్, సోధి, లిస్టర్, ఫెర్గూసన్. చదవండి: Australian Open: ఆశలు గల్లంతు! ఫైనల్లో ఓటమిపాలైన సానియా-బోపన్న జోడి -
న్యూజీలాండ్ పై ఇండియా గ్రాండ్ విక్టరీ
-
రోహిత్ పై వేటు తప్పదా ..?
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement