-
'లగ్గం' షూటింగ్ పూర్తి.. త్వరలో థియేటర్లలో రిలీజ్
'ఇల్లు కట్టి చూడు పెళ్ళి చేసి చూడు' అన్నారు పెద్దలు. 'ఇల్లు ఈఎమ్ఐ లో కొనుక్కొవచ్చు ముందు పెళ్ళి చేద్దాంరండి' అంటున్నారు దర్శకుడు రమేష్ చెప్పాల. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో జనవరిలో 'లగ్గం' మూవీని మొదలుపెట్టి శరవేగంగా తాజాగా 'లగ్గం' టాకీ పార్ట్ పూర్తయింది.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్)రాజేంద్ర ప్రసాద్, ఎల్.బి. శ్రీరామ్, రోహిణి, రఘు బాబు ప్రధాన పాత్రల్లో నటించారు. తెలుగు సంప్రదాయం, తెలుగుదనం ఉట్టిపడేలా దర్శకుడు రమేష్ చెప్పాల లగ్గం సినిమాను తీసినట్లు తెలుస్తోంది. చరణ్ అర్జున్ సంగీతమందించారు. 'బేబి' ఫేమ్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫి చేశారు. బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. త్వరలో రిలీజ్ డేట్ గురించి చెబుతారు.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) -
ఇంట్రెస్టింగ్గా వరుణ్ సందేశ్ 'నింద' పోస్టర్
ప్రస్తుతం కంటెంట్, కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాల్ని ప్రేక్షకులు బాగా ఆదరిస్తున్నారు. ఈ క్రమంలోనే సినిమాలో స్టార్స్ ఉన్నారా లేదా అనేది అస్సలు పట్టించుకోవట్లేదు. మంచి కథ ఉంటే చాలు థియేటర్, ఓటీటీల్లో బ్రహ్మరథం పడుతున్నారు. ప్రస్తుతం అలాంటి ఓ కొత్త కాన్సెప్ట్తో వరుణ్ సందేశ్ సినిమా తీశాడు. యదార్థ సంఘటనల ఆధారంగా 'నింద' చిత్రం రాబోతుంది. రాజేష్ జగన్నాథం దర్శక-నిర్మాతగా వ్యవహరించారు. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్తో రాబోతోన్న ఈ చిత్ర టైటిల్ పోస్టర్ తాజాగా రిలీజ్ చేశారు. ఊరి వాతావరణం, చీకటి, గుడిసె, కత్తి పట్టుకున్న ఓ వ్యక్తి, కత్తి పట్టుకుని దుర్మార్గులను అంతం చేసేందుకు సిద్దంగా ఉన్నటువంటి న్యాయదేవత విగ్రహం ఇంట్రెస్టింగ్ అనిపిస్తున్నాయి. ఈ సినిమాని ఇప్పటికే ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులకు చూపించారు. వారంతా సినిమాను మెచ్చుకున్నారట. మంచి కాన్సెప్ట్తో చిత్రాన్ని తీశారని దర్శక నిర్మాతలని ప్రశంసించారట. ఇక ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. (ఇదీ చదవండి: మెగాకోడలు క్యూట్నెస్.. చీరలో స్టార్ హీరో కూతురు అలా!) -
'సీతాకళ్యాణ వైభోగమే' టీజర్ రిలీజ్ చేసిన తెలంగాణ మంత్రి
సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'సీతాకళ్యాణ వైభోగమే'. సతీష్ పరమవేద దర్శకత్వం వహించగా.. రాచాల యుగంధర్ నిర్మించారు. ఏప్రిల్ 26న థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే ప్రమోషన్స్ జరుగుతున్నాయి. అలా చిత్ర టీజర్ని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విడుదల చేశారు. (ఇదీ చదవండి: మరో తెలుగు సినిమాలో సన్నీ లియోన్.. అలాంటి కథతో!) 'టీజర్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాలి' అని కోరుకుంటున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సినిమాకు చరణ్ అర్జున్ మ్యూజిక్ అందించగా.. సహజమైన లొకేషన్లలో, ఎంతో సహజంగా సినిమాని తీసినట్లు తెలుస్తోంది. అన్ని అంశాలు జోడించి తీసిన ఈ మూవీ కుటుంబ సమేతంగా చూసేలా ఉంది. ఏప్రిల్ 26న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: టాలీవుడ్ యంగ్ హీరో షాకింగ్ నిర్ణయం.. ఇకపై వాటికి నో!) -
హీరోగా సీనియర్ నటుడు.. మూవీ టీజర్ రిలీజ్
చాలా ఏళ్ల నుంచి చాలా సినిమాల్లో పలు పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజా రవీంద్ర. ఇప్పుడు ఇతడు ప్రధాన పాత్రలో ఓ మూవీ చేశాడు. అదే 'సారంగదరియా'. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. మే నెలలో సినిమాని రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా టీజర్ రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఇన్నేళ్ల ఒంటరి జీవితానికి కారణమేంటి?) టీజర్ రిలీజ్ చేసిన యంగ్ హీరో శ్రీవిష్ణు.. మూవీ యూనిట్కి విషెస్ చెప్పారు. ఓ మధ్య వయస్కుడైన ఓ వ్యక్తి.. తన భార్య, ఇద్దరు కొడుకులు, కూతురితో సంసారాన్ని వెల్లదీస్తుంటాడు. సమాజంలో పరువుగా బతికితే చాలు అనుకునే వ్యక్తికి.. తన కొడుకులు, కూతురు వల్ల ఇబ్బందులు వస్తాయి. సమాజం అతన్ని నిలదీసే పరిస్థితులు ఎదురవుతాయి. అప్పుడు ఆ కన్నతండ్రి ఏం చేశాడు.. తన కుటుంబాన్ని ఎలా కాపాడుకున్నాడు.. అనే కథతో సినిమా తీసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: ప్రముఖ బుల్లితెర నటికి రోడ్డు ప్రమాదం..!) -
'లక్ష్మీ కటాక్షం' సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్
ఇప్పటి వరుకు తెలుగులో చాలా తక్కువ సెటైరికల్ కాన్సెప్ట్ మూవీస్ వచ్చాయి. అందులోను పొలిటికల్ సెటైరికల్ కామెడీ మాత్రం ఇంకా తక్కువ వచ్చాయి. ఇప్పుడు అదే తరహాలో ప్రేక్షకులని నవ్వించడానికి 'లక్ష్మీ కటాక్షం' అనే చిత్రం నుంచి డైలాగ్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ డైలాగ్ పోస్టర్ లో ఓటరే తన రేటును తాను నిర్ణయించుకుంటాడు అనేలా చూపించారు. (ఇదీ చదవండి: 'రేసుగుర్రం' విలన్ సీక్రెట్ ఫ్యామిలీ.. ఎన్నికల టైంలో ఇరికించేశారు!) మహతి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వస్తున్న ఈ 'లక్ష్మీకటాక్షం' సినిమాకు సూర్య దర్శకుడు. శ్రీనివాసులరెడ్డి నిర్మించగా, అభిషేక్ రుఫుస్ సంగీతం అందించారు. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకి చాలా ఆప్ట్ గా ఉన్నట్లు కనిపిస్తోంది. సాయి కుమార్ ముఖ్య పాత్రలో నటించగా.. వినయ్, అరుణ్, దీప్తి వర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. త్వరలోనే సరదాగా ఉండే టీజర్ ట్రైలర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తామని చిత్రబృందం వెల్లడించింది. (ఇదీ చదవండి: రహస్యంగా పెళ్లి చేసుకున్న 'టెంపర్' నటి) -
సినిమాలో విలన్గా టీమిండియా స్టార్ క్రికెటర్.. టీజర్ రిలీజ్
టీమిండియా తరఫున పలు మ్యాచులాడి, ఐపీఎల్లో ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్న శ్రీశాంత్.. ప్రస్తుతం నటుడిగా బిజీగా ఉన్నాడు. ఇప్పటికే పలు సినిమాలు చేసిన శ్రీశాంత్.. 'యమధీర' చిత్రంతో త్వరలో ప్రేక్షకుల్ని పలకరించనున్నాడు. మార్చి 23న తెలుగులో రిలీజ్ కాబోతున్న ఈ చిత్ర టీజర్ని తాజాగా రిలీజ్ చేశారు. చిత్ర విశేషాలని పంచుకున్నారు. (ఇదీ చదవండి: హీరో వెంకటేశ్ రెండో కూతురి పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడు ఎక్కడో తెలుసా?) కన్నడ హీరో కోమల్ కుమార్, భారత క్రికెటర్ శ్రీశాంత్ ప్రతినాయక పాత్రలో నటించిన సినిమా 'యమధీర'. వేదాల శ్రీనివాస్ నిర్మించారు. నాగబాబు, అలీ, సత్య ప్రకాష్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. తాజాగా ఈ చిత్ర టీజర్ని నటుడు-నిర్మాత అశోక్ కుమార్ లాంచ్ చేశారు. క్రికెటర్ శ్రీశాంత్ ఫాస్ట్ బౌలర్గా మైదానంలో చూపే దూకుడుని ప్రతినాయకుడిగా చూపించే అవకాశం ఉందన్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 24 సినిమాలు.. ఆ మూడు స్పెషల్) -
అవార్డ్ విన్నర్స్ పనిచేసిన చిన్న సినిమా రిలీజ్కి రెడీ
వినోద్ విజయన్ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్ బ్యానర్స్పై వినోద్ విజయన్, గార్లపాటి రమేష్ సంయుక్తంగా నిర్మించిన సినిమా 'ఒక పథకం ప్రకారం'. సాయిరామ్ శంకర్, అషిమా నర్వాల్, శృతి సోదీలు హీరోహీరోయిన్లుగా నటించారు. పలు జాతీయ అంతర్జాతీయ అందుకున్న దర్శకుడు వినోద్ విజయ్.. ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. మార్చి లో థియేటర్ విడుదల చేయనున్నట్లు ఇప్పుడు అధికారికంగా ప్రకటించారు. (ఇదీ చదవండి: తన పేరుతో మోసం.. బండారం బయటపెట్టిన సీరియల్ నటి) ఈ సందర్భంగా దర్శక నిర్మాత వినోద్ విజయన్ మాట్లాడుతూ.. 'ఈ థ్రిల్లర్ సినిమాలో సాయిరామ్ శంకర్ పవర్ఫుల్ అడ్వకేట్ పాత్రలో కనిపిస్తారు. అలానే ఈ సినిమా కోసం నాతో కలిసి ఏకంగా ఆరుగురు నేషనల్ అవార్డు విన్నర్స్ పనిచేశారు' అని చెప్పుకొచ్చారు. (ఇదీ చదవండి: సెన్సేషన్ సృష్టిస్తున్న ఈ మలయాళ మూవీస్.. వీటిలో అంతలా ఏముంది?) -
ఇకపై ఆ పని చేయను.. పక్కన బెట్టేస్తున్నా: హీరో ఆకాశ్
'ఆనందం' లాంటి సినిమాతో తెలుగులోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్.. ఆ తర్వాత కాలంలో సరైన మూవీస్ చేయకపోవడంతో అలా అలా టాలీవుడ్కి దూరమైపోయాడు. గత ఏడెనిమిదేళ్ల నుంచి తమిళంలో మాత్రమే చిత్రాలు చేస్తున్నాడు. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ పనిచేస్తున్నాడు. (ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీలోకి హీరో అల్లు అర్జున్ మామ.. త్వరలో ఎన్నికల్లో పోటీ?) అయితే చిన్న చిత్రాలకు థియేటర్ల దొరక్కపోవడంతో తనే సొంతంగా 'ఏ క్యూబ్ మూవీస్' అనే యాప్ లాంచ్ చేశాడు. తన సినిమాలతో పాటు పలు చిన్న చిత్రాల్ని ఇందులో రిలీజ్ చేస్తున్నాడు. జై ఆకాశ్.. గతేడాది 'జై విజయం' చిత్రంలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ఓటీటీలోనూ ఇది సక్సెస్ అయిన సందర్భంగా.. చిత్ర విజయోత్సవాన్ని స్థానిక వడపళనిలోని ఘనంగా నిర్వహించారు. తాను నటించిన 'అమైచర్ రిటర్న్', 'మామరం' వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయని జై ఆకాశ్ చెప్పాడు. ప్రస్తుతం హీరోగా నటించడానికి నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయని.. ఈ క్రమంలోనే ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నటుడు జై ఆకాష్ క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
'రాధా మాధవం' సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఫిక్స్
గ్రామీణ ప్రేమ కథతో తీసిన సినిమా 'రాధా మాధవం'. వినాయక్ దేశాయ్, అపర్ణా దేవీ హీరో హీరోయిన్లుగా నటించారు. గోనాల్ వెంకటేష్ నిర్మించారు. దాసరి ఇస్సాకు దర్శకత్వం వహించారు. వసంత్ వెంకట్ బాలా ఈ చిత్రానికి కథ, మాటలు, పాటలని అందించారు. (ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీలోకి హీరో అల్లు అర్జున్ మామ.. త్వరలో ఎంపీగా పోటీ?) 'రాధా మాధవం' పాటలు, టీజర్, ట్రైలర్ ఇలా అన్నీ కూడా గత కొన్నిరోజుల క్రితం రిలీజ్ కాగా.. మంచి స్పందన దక్కించుకున్నాయి. తాజాగా సెన్సార్ పూర్తి కాగా.. ఈ మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. చక్కని సందేశాత్మక చిత్రమని ప్రశంసలు కురిపించారు. ఈ క్రమంలోనే మార్చి 1న సినిమా థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: తెలివిగా కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన 'దేవర') -
'డర్టీ ఫెలో' మూవీలోని పాట రిలీజ్ చేసిన 'బేబి' డైరెక్టర్
శ్రీమతి గుడూరు భద్రకాళీ సమర్పణలో రాజ్ ఇండియా ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై శాంతి చంద్ర, దీపిక సింగ్, సిమ్రితి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా 'డర్టీ ఫెలో'. ఆడారి మూర్తి సాయి దర్శకత్వం వహించారు. జియస్ బాబు నిర్మించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని మూవీ రిలీజ్కు రెడీ అయింది. (ఇదీ చదవండి: ఏడాది కిందట నిశ్చితార్థం.. పెళ్లికి సిద్ధమైన హీరోయిన్) తాజాగా ఈ సినిమాలోని 'సందేవేళ' అంటూ సాగే పాటని 'బేబి' దర్శకుడు సాయిరాజేష్ రిలీజ్ చేశారు. 'నా మిత్రుడు శాంతి చంద్ర నటించిన డర్టీఫెలో సినిమాలోని సందెవేళ సాంగ్ చాలా బాగుంది. సినిమా రిలీజ్ అయ్యి మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను' అని చెప్పుకొచ్చారు. త్వరలో చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని హీరో శాంతి చంద్ర చెప్పాడు. (ఇదీ చదవండి: నా మాజీ భార్య వేధిస్తుంది.. ఫిర్యాదు చేసిన ప్రముఖ నటుడు) -
92 ఏళ్ల తొలి తెలుగు టాకీ సినిమా.. బడ్జెట్ ఎంతో తెలుసా?
ఇది తెలుగు సినిమా పరిశ్రమలో ఒక చరిత్రాత్మక సంఘటన. తొలి పూర్తి తెలుగు టాకీ సినిమా ‘భక్త ప్రహ్లాద’ విడుదలై నేటికి సరిగ్గా 92 ఏళ్లు పూర్తయ్యాయి. అంతకు ముందు సగం తెలుగు, సగం తమిళంతో 1931 అక్టోబర్ 31న తొలి దక్షిణ భారతీయ భాషా టాకీ ‘కాళిదాస్’ వచ్చింది. ఆ పైన పూర్తిగా తెలుగు మాటలు, పాటలతో ‘భక్త ప్రహ్లాద’ 1932 ఫిబ్రవరి 6న విడుదలై సంచలనం సృష్టించింది. అందుకే ఫిబ్రవరి 6న మొదటి పూర్తి తెలుగు టాకీ ఆవిర్భావ సంబురాలు జరుపుకుంటారు. గతంలో ఈ సినిమా సెప్టెంబరు 15న విడుదల అయినట్టు ప్రచారం జరిగింది. కాని సీనియర్ జర్నలిస్టు డా.రెంటాల జయదేవ ఎన్నో యేళ్లు ఊరూరా తిరిగి, ఎంతో పరిశోధించి, సాక్ష్యాలు సేకరించి, ఈ సినిమా 1932 జనవరి 21న బొంబాయిలో సెన్సారై, ఫిబ్రవరి 6న అక్కడే తొలిసారి విడుదలై నట్లు ఆధారాలతో నిరూపించారు. ఆ విధంగా 1932 ఫిబ్రవరి 6న బొంబాయి శ్రీకృష్ణా సినిమా థియేటర్లో విడుదలైన తర్వాత, విజయవాడ, రాజమండ్రి తదితర ప్రాంతాలకు రిలీజై విజయవంతంగా ఆడింది. 1932 ఏప్రిల్ 2న మద్రాసులోని ‘నేషనల్ పిక్చర్ ప్యాలెస్’లో విడుదల చేశారు. ఈ చిత్ర దర్శకుడు హెచ్ఎమ్ రెడ్డి. సురభి కళాకారులు సహా పలువురిని బొంబాయి తీసుకెళ్లి అక్కడ స్టూడియోలో 20 రోజుల్లో షూటింగ్ పూర్తిచేశారు. తొలి తమిళ, తెలుగు చిత్రాలకు దర్శకత్వం వహించిన హెచ్ఎం రెడ్డి కూడా తెలుగు వారే కావడం విశేషం. ఆ రోజుల్లో ఈ చిత్ర నిర్మాణానికి అయిన మొత్తం ఖర్చు.. దాదాపు 20 వేల రూపాయలు. ఈ సినిమా సహజంగానే అనేక రికార్డులు నమోదు చేసుకుంది. ఇందులో లీలావతిగా నటించిన సురభి కమలాబాయి తొలి తెలుగు తెర ‘కథానాయిక’ గుర్తింపు తెచ్చుకుంది. ఈ చిత్ర నిర్మాణానికి ప్రధాన కారకులు పూర్ణా మంగరాజు. ఆంధ్రాలో తొలి సినీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ‘క్వాలిటీ పిక్చర్స్’ వ్యవస్థాపకుడు. ఈ చిత్ర గీత రచయిత ‘చందాల కేశవదాసు’. ఆ విధంగా తొలి పూర్తి తెలుగు సినిమా తయారై సంచలనం సృష్టించింది. అయితే దురదృష్టవశాత్తూ ఈ ఫిల్మ్ ప్రింట్ ఇప్పుడు లభ్యం కావడం లేదు. నిజానికి, టాకీలు రావడానికి చాలాకాలం ముందే మూకీల కాలం నుంచి మన సినీ పితామహులు రఘుపతి వెంకయ్య నాయుడు వంటివారెందరో మన గడ్డపై సినిమా నిలదొక్కు కొని, అభివృద్ధి చెందడానికి ఎంతో కృషి చేశారు. అప్పట్లోనే తన కుమారుడు ప్రకాశ్ని విదేశాలకు పంపి ప్రత్యేక సాంకేతిక శిక్షణనిప్పించి, సినిమాలు తీసి తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేశారు వెంకయ్య. ఇలాంటి వారి గురించి ముందు తరాల వారికి తెలియజేసే కార్యక్రమాలను సినిమా పెద్దలు, ఫిల్మ్ ఛాంబర్ లాంటి సంస్థలు, పాలకులు నిర్వహించాలి. తెలుగు సినిమా ఆవిర్భావ రోజును ఒక ఉత్సవంగా నిర్వహించి... భావి తరాలకు తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధికి సంబంధించిన విషయాలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. అలాగే పాత చిత్రాలు అన్నీ సేకరించి ఒక సినీ మ్యూజియం ఏర్పాటు చేయాలి. ఇటువంటిది దేశంలో మహారాష్ట్రలోని పుణేలో మాత్రమే ఉంది. ప్రపంచ ఉత్తమ చిత్రాలు ప్రదర్శిస్తున్న వైజాగ్ ఫిలిం సొసైటీ ‘తెలుగు టాకీ సినిమా ఆవిర్భావ దినోత్సవం’ సందర్భంగా ఫిబ్రవరి 6 నుండి 8 వరకు క్లాసిక్ చిత్రాలు ప్రదర్శిస్తోంది. అంతే కాకుండా ఉచిత ఫిల్మ్ వర్క్షాప్ నిర్వహిస్తోంది. -
దిల్ రాజు చేతుల మీదుగా 'షరతులు వర్తిసాయి' టీజర్ రిలీజ్
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన చిత్రం 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి దర్శకత్వం వహించారు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్ గుండా, డాక్టర్ కృష్ణకాంత్ చిత్తజల్లు నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే దిల్ రాజు టీజర్ విడుదల చేశారు. (ఇదీ చదవండి: పెళ్లి అయిపోయిందిగా సినిమాలు మానేస్తారా? క్లారిటీ ఇచ్చిన మెగా కోడలు) 'బలగం' కంటే ఎక్కువగా తెలంగాణ నేటివ్తో సినిమా తీశారు. ఇదో మంచి మూవీ అవుతుందని ఆశిస్తున్నా. చిత్రబృందానికి అందరికీ ఆల్ ది బెస్ట్ అని నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చారు. ఒక సున్నితమైన కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ చేర్చుతూ అందరికీ నచ్చేలా సినిమా తీశారు. ఈ మూవీ రిలీజ్ తర్వాత కుమారస్వామి మరిన్ని మంచి మూవీస్ చేస్తాడు. త్వరలోనే 'షరతులు వర్తిస్తాయి' థియేటర్లలోకి వస్తుంది. మీరంతా ఆదరించాలని కోరుకుంటున్నానని హీరో చైతన్య రావు చెప్పారు. (ఇదీ చదవండి: బిగ్బాస్ ప్రియాంకతో సహజీవనం, పెళ్లి.. బాయ్ఫ్రెండ్ సమాధానమిదే) -
తెలంగాణ పల్లె గొంతులో డిఫరెంట్ పెళ్లి పాట.. మీరు విన్నారా?
చైతన్య రావు, భూమి శెట్టి జంటగా నటించిన సినిమా 'షరతులు వర్తిస్తాయి'. కుమారస్వామి(అక్షర) దర్శకుడు. స్టార్ లైట్ స్టూడియోస్ బ్యానర్పై నాగార్జున సామల, శ్రీష్ కుమార్, డాక్టర్ కృష్ణకాంత్ నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో థియేటర్లలోకి రానుంది. ఈ క్రమంలోనే 'పన్నెండు గుంజల పందిర్ల కిందా' అని సాగే పెళ్లి పాటని ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల రిలీజ్ చేశారు. తెలంగాణ పల్లెగొంతుతో ఉన్న ఈ సాంగ్, డిఫరెంట్గా ఉంటూ ఆకట్టుకుంటోంది. (ఇదీ చదవండి: రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్న తెలుగు స్టార్ హీరోయిన్) -
'బేబి' నిర్మాత నుంచి మరో సినిమా.. ఈసారీ అలాంటి ప్రేమకథే
రీసెంట్ టైంలో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన లవ్ స్టోరీ అంటే చాలామంది చెప్పే పేరు 'బేబి'. ప్రస్తుతం చాలామందికి తెలిసిన కథనే సినిమాగా తీస్తే బ్లాక్బస్టర్ హిట్ అయింది. నిర్మాతకు మూడు నాలుగు రెట్ల లాభాలు తీసుకొచ్చిందని టాక్. ఇప్పుడు ఆ నిర్మాత నుంచి మరో క్రేజీ లవ్ స్టోరీ మూవీ రాబోతుంది. తాజాగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'హనుమాన్'.. ప్లాన్లో మార్పు.. వచ్చేది అప్పుడేనా?) అయితే ఇది తెలుగు స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ ప్రేమకథ సినిమా. 'గుడ్ నైట్' చిత్రంతో గతేడాది హిట్ కొట్టిన మణికందన్.. ఇప్పుడు' ట్రూ లవర్'గా రాబోతున్నాడు. ఇందులో తెలుగమ్మాయి గౌరిప్రియ హీరోయిన్. తమిళంలో లవర్ పేరుతో తీసిన ఈ చిత్రాన్ని వాలంటైన్స్ డే కానుకగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. తెలుగులో ఫిబ్రవరి 9న రిలీజ్ కావొచ్చని అంటున్నారు. టీజర్ బట్టి చూస్తుంటే.. ఇంజినీరింగ్ చదివేటప్పుడు అమ్మాయి-అబ్బాయి ప్రేమలో పడతారు. కాకపోతే ఈ అబ్బాయి మరీ ఎక్కువగా ప్రేమించేయడంతో అసలు సమస్యలు మొదలవుతాయి. అమ్మాయి వేరే ఏ అబ్బాయితో మాట్లాడినా సరే ఇతడు చిరాకుపడిపోతుంటాడు. కాస్త 'బేబి' పోలికలు కనిపిస్తున్న ఈ చిత్రాన్ని 'బేబి' ప్రొడ్యూసర్ ఎస్కేఎన్, దర్శకుడు మారుతి కలిసి తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఇది మరో 'బేబి' అవుతుందా అనేది చూడాలి? (ఇదీ చదవండి: నిశ్చితార్థం జరిగిన నాలుగేళ్లకు పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్) -
9 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా
మరో డిఫరెంట్ తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. కేవలం ఒకే ఒక పాత్రతో తీసిన ఈ చిత్రం గతేడాది థియేటర్లలో రిలీజ్ అయింది. దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇన్నాళ్లకు డిజిటల్గా అందుబాటులోకి వచ్చేసింది. అయితే సమ్థింగ్ స్పెషల్ ఉండే మూవీస్ చూద్దామనుకునేవాళ్లు ఇది ట్రై చేయొచ్చు.ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: కుర్చీ తాత అరెస్ట్.. అసలు నిజాలు బయటపెట్టిన యూట్యూబర్) హీరోయిన్ కమ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నందిత శ్వేతా.. తెలుగు ప్రేక్షకులకు కాస్త పరిచయమే. ఈమెని ప్రధాన పాత్రలో పెట్టి తీసిన విభిన్న సినిమా 'రా రా పెనిమిటి'. సత్య వెంకట్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ.. మ్యూజిక్ అందించారు. గతేడాది ఏప్రిల్ 28న థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు సరిగ్గా తొమ్మిది నెలల తర్వాత 'హంగామా ప్లే', 'గ్యాలక్సీ ఓటీటీ' అనే రెండు డిజిటల్ ఫ్లాట్ఫామ్స్లోకి ఈ సినిమా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్లోనూ ఉన్నప్పటికీ.. మనం దేశంలో మాత్రం స్ట్రీమింగ్ అందుబాటులో లేదు. కథ విషయానికొస్తే టైటిల్కి తగ్గట్లు.. ఓ భార్య తన భర్త కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. మరి చివరకు ఏమైంది? భర్త వచ్చాడా లేదా అనేది స్టోరీ. పలువురు ఆర్టిస్టుల వాయిస్ వినిపిస్తుంది. కానీ మూవీ మొత్తం నందితా శ్వేతా మాత్రమే కనిపిస్తుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. మీరు చూశారా?) -
Premalo Movie Review: 'ప్రేమలో' సినిమా రివ్యూ
చిత్రం: ప్రేమలో నిర్మాణ సంస్థ: డ్రీమ్ జోన్ పిక్చర్స్ నటీనటులు: చందు కోడూరి, చరిష్మా శ్రీకర్, శివాజీ రాజా తదితరులు దర్శకుడు: చందు కోడూరి నిర్మాత: రాజేష్ కోడూరి సంగీతం: సందీప్ కనుగుల ఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్ చందు కోడూరి హీరోగా నటించి స్వీయదర్శకత్వంలో తీసిన సినిమా 'ప్రేమలో'. చరిష్మా శ్రీకర్ హీరోయిన్. ట్రైలర్తోనే ఆకట్టుకున్న ఈ చిత్రం.. తాజాగా థియేటర్లలోకి వచ్చింది. ఇంతకీ ఈ సినిమా ఎలా ఉంది? ఏంటనేది రివ్యూలో ఇప్పుడు చూద్దాం. 'ప్రేమలో' కథేంటి? రాజమండ్రిలో పుట్టి పెరిగిన రవి (చందూ కోడూరి) చిన్నప్పుడే తల్లిని కోల్పోతాడు. తండ్రి(శివాజీ రాజా) ఉన్నాసరే రవిని పట్టించుకోకుండా తాగుడికి బానిస అయిపోయింటాడు. మెడికల్ షాప్లో పనిచేసే రవి.. ఎప్పటికైనా ఓ మెడికల్ షాప్ పెట్టుకోవాలనేది మనోడి డ్రీమ్. అనుకోకుండా ప్రశాంతి(చరిష్మా)ని చూసి తొలిచూపులోనే ప్రేమించేస్తాడు. మూగదైన ప్రశాంతి.. ఇష్టపడుతున్నానని రవి చెప్పేసరికి ఇతడిని ప్రేమిస్తుంది. అంతా బాగుందనుకున్న సమయంలో ప్రశాంతి.. ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంది. రవి తనని రేప్ చేస్తున్న వీడియోనే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే ప్రాణంగా ప్రేమించిన రవి.. ఎందుకు ఆమెపై బలత్కారం చేశాడు? అసలేం జరిగింది? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: 'సలార్' నటుడికి కోర్టు నోటీసులు.. కారణం అదే?) ఎలా ఉందంటే? తెలుగులో లవ్ స్టోరీ సినిమాలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. 'ప్రేమలో' సినిమా కూడా పేరుకు తగ్గట్లే మొత్తం ప్రేమ చుట్టూనే తిరుగుతుంది. మొదలుపెట్టడమే ఓ వ్యక్తి మీద ఎటాక్ చేయడం చూపించి సినిమాని ఆసక్తిని పెంచే ప్రయత్నం చేశారు. అసలు ఏమైంది? ఎందుకు ఒక్కొక్కరిని హీరో ఎందుకు ఛేజ్ చేస్తున్నాడనే విషయం నెమ్మదిగా రివీల్ చేస్తూ కథలోకి తీసుకువెళ్లారు. ఫస్టాప్లో హీరో క్యారెక్టర్, స్టోరీని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు.సెకండాఫ్లో అసలు కథేంటనేది రివీల్ చేశారు. నిజానికి ఇది కొత్త కథేం కాదు. రాజమండ్రి బ్యాక్ డ్రాప్లో పూర్తిస్థాయి గోదావరి యాసలో ఎక్కడ బోర్ కొట్టకుండా ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. ప్రేమించిన వారి కోసం ఎంత దూరమైనా వెళతాం అని డైలాగులు చెప్పే ప్రేమికులే ఉన్న ఈ రోజుల్లో.. ప్రేమించిన అమ్మాయి కోసం చావుకు కూడా వెనకాడకుండా ముందుకు వెళ్లేవారు ఉన్నారని ఒక సినిమాటిక్ టచ్ ఇచ్చి మరీ చెప్పారు. రొటీన్ కథ, ఊహకు అందేలా ఉన్న సీన్లు కొంత నిరాశ కలిగిస్తాయి. స్క్రీన్ ప్లే విషయంలో మరింత వర్కౌట్ చేస్తే బాగుండేది. క్లైమాక్స్ ఎవరు ఊహించని విధంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు డైరెక్టర్. (ఇదీ చదవండి: 'యానిమల్' ఓటీటీ రిలీజ్.. ఆ విషయంలో అభిమానులు అసంతృప్తి) ఎవరెలా చేశారు? హీరో కమ్ డైరెక్టర్ చందు కోడూరి.. అయితే ఈయనలోని దర్శకుడిని నటుడు కొంత డామినేట్ చేసే ప్రయత్నం చేశాడు. ఎలాంటి చెడు అలవాట్లు లేక జీవితంలో ఒక లక్ష్యం పెట్టుకుని ముందుకు వెళ్లే యువకుడి పాత్రలో చందు సరిగ్గా సరిపోయాడు. నటనతో ఆకట్టుకున్నాడు. హీరోయిన్ ప్రశాంతి.. డైలాగ్స్ లేని పాత్రలో కళ్ళతోనే భావాలు పలికించి ఆకట్టుకుంది. శివాజీ రాజా చేసింది అతిథి పాత్ర లాంటిదే. కానీ ఉన్నంతవరకు ఎమోషన్స్ పండించాడు. మిగతా వాళ్లు పర్వాలేదనిపించారు. టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే పాటలు పెద్దగా గుర్తుండవు. బ్యాక్ గ్రౌండ్ స్కోరు పర్వాలేదనిపించింది. సినిమాటోగ్రఫీ సరిగా సరిపోయింది. నిర్మాణ విలువలు స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. (ఇదీ చదవండి: ‘105 మినిట్స్’ మూవీ రివ్యూ) -
హీరోగా తెలుగు కమెడియన్.. టైటిల్గా ఫేమస్ డైలాగ్
'ఈ నగరానికి ఏమైంది', 'మీకు మాత్రమే చెబుతా', 'సేవ్ టైగర్' సినిమాలతో కమెడియన్గా పాపులారిటీ సంపాందించిన అభినవ్ గోమటం.. ఇప్పుడు హీరో అయిపోయాడు. 'ఈ నగరానికి ఏమైంది' మూవీలో అతడు చెప్పిన పాపులర్ డైలాగ్ పేరునే ఇప్పుడు టైటిల్ చేసేశారు. ఈ చిత్రంలో అభినవ్ కథానాయకుడు. 'మస్తు షేడ్స్ ఉన్నాయ్ రా' అనే టైటిల్ నిర్ణయించడంతో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. వైశాలి రాజ్ హీరోయిన్. (ఇదీ చదవండి: టీనేజీలోనే గట్టిగా సంపాదిస్తున్న సితార.. నెలకు ఎన్ని లక్షలంటే?) తిరుపతి రావు ఇండ్ల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. భవాని కాసుల, ఆరెమ్ రెడ్డి, ప్రశాంత్.వి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. హాస్యనటుడు, సహాయ నటుడిగా ప్రశంసలు అందుకున్న అభినవ్లోని కొత్త కోణాన్ని ఈ చిత్రంలో చూస్తారని చెప్పాడు. లవ్, కామెడీ ఎంటర్టైనర్గా చిత్రాన్ని తీస్తున్నట్లు పేర్కొన్నాడు. కొత్తదనంతో కూడిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం ఉందని అన్నాడు. ఫిబ్రవరి చివర్లో సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తామని పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: సైలెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్బాస్' శోభాశెట్టి) -
సమాజానికి స్ఫూర్తినిచ్చే 'కంచర్ల'.. త్వరలో రిలీజ్
సమ సమాజం, నవ సమాజ నిర్మాణానికి స్ఫూర్తినిచ్చే సినిమాలు తెలుగులో చాలా వచ్చాయి. ఇప్పుడు అలాంటి కాన్సెప్ట్తో తీసిన చిత్రం 'కంచర్ల'. ఎస్.ఎస్.ఎల్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై కంచర్ల ఉపేంద్ర హీరోగా, మీనాక్షి జైస్వాల్, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. రెడ్డెం యాద కుమార్ దర్శకత్వం వహించారు. కంచర్ల అచ్యుత రావు నిర్మించారు. తాజాగా టాకీ పార్ట్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం.. త్వరలో విడుదల కానుంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన 'సలార్'.. అక్కడ మాత్రం ఇంకా పెండింగ్లోనే) యువత రాజకీయాల్లోకి రావాలని, భూస్వాముల దగ్గర ఉన్న భూమి పేద ప్రజలకు పంచాలన్నది ఈ చిత్ర ప్రధానాంశం. దీనికి కమర్షియల్ అంశాలను మేళవించి, ప్రేక్షకులను అలరింపజేసేలా చిత్రాన్ని మలచామని నిర్మాత అచ్యుత రావు చెప్పారు. రఘు కుంచె సంగీతమందించిన ఈ చిత్రం త్వరలో థియేటర్లలోకి రానుంది. (ఇదీ చదవండి: హీరోయిన్ రష్మిక డీప్ ఫేక్ వీడియో.. ఎట్టకేలకు నిందితుడి అరెస్ట్) -
ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు రొమాంటిక్ సినిమా.. స్ట్రీమింగ్ అందులోనే?
తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి గట్టిగా కనిపిస్తోంది. అందరూ పండగ హడావుడిలో బిజీగా ఉన్నారు. కొందరు మాత్రం ఏం చేయాలో తెలీక కొత్తగా తెలుగు సినిమాలు ఓటీటీల్లో ఏం రిలీజ్ అయ్యాయా అని చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ సైలెంట్గా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ ఆ సినిమా సంగతేంటి? సంక్రాంతి కానుకగా థియేటర్లలో నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. వీటిలో 'హను-మాన్' మూవీ విజేతగా నిలిచింది. మిగతా మూడు చిత్రాలతో మిక్స్డ్ టాక్ వచ్చింది. అయితేనేం ఎవరికి ఏ చిత్రం అందుబాటులో దాన్ని చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. థియేటర్కి వెళ్లే ఓపిక లేని వాళ్లు మాత్రం ఓటీటీల వైపు చూస్తున్నారు. రీసెంట్గా 'డెవిల్' మూవీ ఓటీటీలోకి వచ్చింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 45 సినిమాలు) తాజాగా '#మాయలో' అనే తెలుగు మూవీ.. అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చేసింది. డిసెంబరు 15న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. ఎప్పుడొచ్చి వెళ్లిందనేది కూడా చాలామందికి తెలియదు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తీసిన ఈ సినిమాలో పెద్దగా పేరున్న యాక్టర్స్ ఎవరూ లేరు. అయితేనేం ఈ పండక్కి టైంపాస్ కావాలంటే కొత్తగా వచ్చిన ఈ సినిమాని వీలైతే చూసేయండి. ఇక '#మాయలో' కథ విషయానికొస్తే.. మాయ(జ్ఞానేశ్వరి)కి పెళ్లి ఫిక్స్ అవుతుంది. దీంతో తన చిన్నప్పటి ఫ్రెండ్స్ క్రిష్(నరేశ్ అగస్త్య), సింధు (భావన)ని తన వివాహానికి పిలుస్తుంది. దీంతో వీళ్లిద్దరూ ఓ కారు అద్దెకు తీసుకుని రోడ్డు మార్గంలో వస్తుంటారు. మరి ఈ జర్నీలో ఏం జరిగింది? చివరకు ఏమైందనేదే సినిమా స్టోరీ. (ఇదీ చదవండి: విజయ్-రష్మిక రిలేషన్పై మళ్లీ రూమర్స్.. అంతా ఆ ఫొటోల వల్లే?) -
సూపర్స్టార్ కృష్ణ నటించిన చివరి మూవీ రిలీజ్కి రెడీ
సంక్రాంతి కానుకగా 'గుంటూరు కారం' సినిమాతో మహేశ్ థియేటర్లలోకి వచ్చాడు. అయితే టాక్ విషయంలో రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆల్ ఇండియా కృష్ణ-మహేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఖాదర్ ఘోరి, పద్మాలయ శర్మ, ధనలక్ష్మి.. ఓ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్నారు. మహేశ్ సినిమాపై వస్తున్న మిక్స్డ్ టాక్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇదీ చదవండి: రెండో రోజుకే భారీగా తగ్గిపోయిన 'గుంటూరు కారం' కలెక్షన్స్) "గుంటూరు కారం" సాధిస్తున్న రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ చూసి ఓర్వలేక.. కొందరు కావాలని విమర్శలు చేస్తున్నారని, వాటిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఆలిండియా కృష్ణ -మహేష్ సేన అధ్యక్షులు ఖాదర్ ఘోరి అన్నారు. సినిమా బాగా లేకపోతే ఆ విషయాన్ని తమ హీరో కృష్ణ ముందుగా చెప్పేసేవారని, ఆ లక్షణం మహేష్లోనూ ఉందని చెప్పారు. కానీ ఫ్యాన్స్తోపాటు అందరూ ఆస్వాదిస్తున్న 'గుంటూరు కారం' గురించి ఘోరంగా మాట్లాడడం సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. సూపర్స్టార్ కృష్ణ గతేడాది మరణించారు. కాకపోతే ఆయన నటించిన చివరి చిత్రం "కృష్ణ విజయం" ఇంకా రిలీజ్ కాలేదు. ఇప్పుడు త్వరలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకురానున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించారు. ఇందులోనే 'గుంటూరు కారం' ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వ్యాఖ్యలు చేశారు. మధుసూదన్ హవల్దార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సెన్సార్ జరుగుతోంది. ఈ మూవీలో నాగబాబు, సుహాసిని, యశ్వంత్, అలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మహేశ్ సినిమా చైల్డ్ ఆర్టిస్.. ఎవరో కనిపెట్టారా?) -
సంక్రాంతి విన్నర్ ఎవరు...?
-
10 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా
ఓటీటీలు వచ్చిన తర్వాత చిన్న సినిమాలకు ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాలకు అటు థియేటర్లు, ఇటు టీవీల్లో మంచి రెస్పాన్స్ వచ్చేది. చిన్న చిత్రాలు ఆడితే థియేటర్లలో ఆడేవి. ఆ తర్వాత దాదాపు అందరూ వాటిని మర్చిపోయేవారు. కానీ ఇప్పుడు ఓటీటీల పుణ్యమా అని వాటిని చూసేవాళ్లు కొందరు ఉంటున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ల కోసమా అన్నట్లు మరో తెలుగు సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. 'సాచి' అనే సినిమా.. 2023 మార్చి 3న థియేటర్లలో రిలీజైంది. అయితే చిన్న సినిమా కావడంతో పాటు పెద్దగా పేరున్న నటులు లేకపోవడంతో ఎప్పుడొచ్చి వెళ్లిపోయిందో కూడా ఎవరికీ తెలియకుండా పోయింది. మహిళ సాధికారత అనే అంశాన్ని ప్రధానంగా తీసుకుని నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తీశారు. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) బార్బర్ షాప్ నడిపే తండ్రి.. అంతంత మాత్రంగా ఉండే సంపాదన.. ఇతడికి ముగ్గురు కూతుళ్లు. అంతా బాగానే ఉందనుకునే టైంలో బ్రెయిన్ ట్యూమర్ జబ్బు వస్తుంది. దీంతో ఇల్లు గడవడం కష్టమైపోతుంది. ఇలాంటి టైంలో కూతురే తండ్రి బాధ్యతలు అందుకుంటుంది. కటింగ్ షాప్ రన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది. అయితే ఈ క్రమంలో అమ్మాయి ఎలాంటి సవాళ్లు ఎదుర్కొంది అనే స్టోరీతో ఈ సినిమా తీశారు. స్టోరీ పరంగా మంచి పాయింట్ ఎంచుకున్నప్పటికీ మరీ సాగదీసినట్లు ఉండటం ఈ సినిమాకు మైనస్ పాయింట్లా అనిపించింది. ఇందులో పెద్దగా పేరున్న నటులు కూడా ఎవరూ లేరు. ప్రస్తుతానికి భారత్లో తప్పితే మిగతా దేశాల్లో అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. త్వరలో మన ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి రావొచ్చు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) -
నేరుగా ఓటీటీలోనే రిలీజ్ అవుతున్న ఆ తెలుగు సినిమా.. డేట్ ఫిక్స్
సంక్రాంతికి దాదాపు నాలుగు పెద్ద సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో ఏ సినిమాకు ఎప్పుడు వెళ్లాలా అని అందరూ ప్లాన్స్ వేసుకుంటున్నారు. మరోవైపు పండగ సీజన్ని క్యాష్ పలు చిన్న సినిమాలు కూడా రెడీ అవుతున్నాయి. కాకపోతే థియేటర్లు దొరికే ఛాన్స్ లేదు కాబట్టి ఓటీటీల వైపు చూస్తున్నాయి. అలా ఇప్పుడు ఓ తెలుగు సినిమా నేరుగా డిజిటల్ స్ట్రీమింగ్కి రెడీ అయిపోయింది. ఇంతకీ ఏంటా మూవీ? (ఇదీ చదవండి: రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా) పలు సినిమాల్లో సహాయ పాత్రలు పోషించిన అజయ్ కతుర్వర్.. బిగ్బాస్ ఓటీటీ షోతో కాస్తోకూస్తో పాపులారిటీ సంపాదించుకున్నాడు. ఈ షోలో పాల్గొన్న తర్వాత హీరోగా అవకాశాలు దక్కించుకున్నాడు. అలా చేసిన సినిమానే 'అజయ్ గాడు'. దాదాపు ఏడాదిన్నర క్రితమే అంతా రెడీ అయినప్పటికీ.. కారణం ఏంటో తెలీదు గానీ రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. ఇన్నాళ్లకు ఈ సినిమాకు మోక్షం కలిగింది. నేరుగా ఓటీటీలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అజయ్, భానుశ్రీ, శ్వేత మెహతా హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు టీమ్ ఏ దర్శకత్వం వహించాడు. చందన కొప్పిశెట్టితో కలిసి హీరో అజయ్ కతుర్వార్ స్వయంగా ఈ సినిమాని నిర్మించాడు. ఇప్పుడు సంక్రాంతి కానుకగా జనవరి 12 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. దీంతో పండగపూట థియేటర్లకు వెళ్లే ఇంట్రెస్ట్ లేకపోతే ఇంట్లో కూర్చుని ఈ సినిమా ఫ్రీగా చూడొచ్చు. (ఇదీ చదవండి: విమాన ప్రమాదం.. కూతుళ్లతో సహా ప్రముఖ నటుడి దుర్మరణం) View this post on Instagram A post shared by ZEE5 Telugu (@zee5telugu) -
రెండు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన ఆ తెలుగు సినిమా
ఓటీటీలోకి మరో తెలుగు సినిమా వచ్చేసింది. థియేటర్లలో విడుదలైన దాదాపు రెండు నెలల తర్వాత ఎలాండి హడావుడి లేకుండా స్ట్రీమింగ్ అయిపోతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసిన ఈ మూవీ.. అప్పుడు ప్రేక్షకులకు అనుకున్నంతగా రీచ్ కాలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది కాబట్టి ఫ్రీగా టైమ్ ఉన్నప్పుడు చూసేయొచ్చు. ఇంతకీ ఏంటా సినిమా? అసలు కథేంటి? (ఇదీ చదవండి: థియేటర్లలో డిజాస్టర్.. ఓటీటీలో మాత్రం ఇదే టాప్ ట్రెండింగ్ సినిమా!) సినిమా డీటైల్స్ అవే చిన్న సినిమాలు అయినా సరే కాన్సెప్ట్ పరంగా ప్రయోగాలు చేస్తుంటారు. అలా మహాభారతం నుంచి స్ఫూర్తిగా తీసిన తెలుగు సినిమా 'కృష్ణఘట్టం'. చైతన్యకృష్ణ, వెంకటకృష్ణ గోవడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం.. నవంబరు 3న థియేటర్లలోకి వచ్చింది. కాకపోతే కంటెంట్ సరిగా తీయకపోవడం వల్ల జనాలకు పెద్దగా ఎక్కలేదు. కథ ఎంపిక బాగున్నప్పటికీ.. దాన్ని డీల్ చేయడంలో దర్శక నిర్మాత సురేశ్ పల్ల తడబడ్డారు. స్టేజీ నాటకాలు వేసే ఓ బ్యాంక్ ఉద్యోగి, అల్లరిచిల్లరగా తిరిగే కుర్రాడు జీవితాల్లో ఎలాంటి సంఘటనలు జరిగాయనేదే ీ సినిమా కథ. ఆ ఓటీటీలోనే స్ట్రీమింగ్ ఇక యాక్టింగ్ పరంగా నటీనటులు అందరూ బాగానే చేసిన 'కృష్ణఘట్టం' సినిమాలో నాటకాలు, దానికి సంబంధించిన స్టోరీ, సన్నివేశాల్ని చెప్పారు. అందువల్ల ఈ సినిమా అందరికీ నచ్చకపోవచ్చు. ఇకపోతే నవంబరులో థియేటర్లలో రిలీజైన ఈచిత్రం.. దాదాపు రెండు నెలల తర్వాత ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి వచ్చింది. కొత్త సినిమా ఏమైనా చూడాలనిపిస్తే.. దీన్ని చూస్తూ వీకెండ్ని టైమ్పాస్ చేసేయండి. (ఇదీ చదవండి: వేణుస్వామి నటించిన రెండు తెలుగు సినిమాలు... అవేంటో తెలుసా?) -
Year End 2023: హిట్లు తక్కువ..ఫ్లాపులెక్కువ
స్ట్రయిట్ చిత్రాలు 236... డబ్బింగ్ సినిమాలు 70... మొత్తం 306 చిత్రాలను 2023 ఇచ్చింది. మరి జయాపజయాల శాతం ఎంత? అంటే... ఎప్పటిలానే విజయాలను వేళ్ల మీద లెక్కపెట్టొచ్చు... అపజయాలు లెక్కలేనన్ని. అయితే విజయం సాధించినవాటిలో ఎమోషనల్గా సాగేవి ఎక్కువగా ఉన్నాయి. ఆ విధంగా ఈ ఏడాది భావోద్వేగాలకు ప్రేక్షకులు ప్రాధాన్యం ఇచ్చారనుకోవచ్చు. ఇక ఈ ఏడాది ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు..’ పాటకిగాను కీరవాణి, చంద్రబోస్లకు ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు దక్కడం ఓ రికార్డ్. తెలుగు నుంచి జాతీయ తొలి ఉత్తమ నటుడి అవార్డు అల్లు అర్జున్కి దక్కడం మరో ఆనందం. ఇలా కొన్ని ఆనందాలను ఇచ్చింది 2023. కె. విశ్వనాథ్, జమున, కైకాల సత్యనారాయణ, చంద్రమోహస్ వంటి వారిని దూరం చేసి, విషాదాన్ని మిగిల్చింది. ఇక... ఈ ఏడాది లెస్ హిట్.. మోర్ ఫట్గా సాగింది తెలుగు సినిమా. ఆ విశేషాల్లోకి... స్టార్ హీరోలు కొందరు ‘హిట్ హిట్ హుర్రే’ అంటూ మంచి విజయాలు అందుకున్నారు. వారితో పాటు కొందరు మీడియమ్ రేంజ్, చిన్న రేంజ్ హీరోలకూ 2023 విజయానందాన్నిచ్చింది. ఆ హిట్స్ గురించి తెలుసుకుందాం. సంక్రాంతి అంటే సినిమాల పండగ. అలా ఈ ఏడాది పండగకి అన్నదమ్ముల సెంటిమెంట్ నేపథ్యంలో వచ్చిన చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’, అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో వచ్చిన బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ మంచి వసూళ్లు రాబట్టాయి. చిరంజీవి హీరోగా, రవితేజ ఓ కీలక పాత్రలో ‘వాల్తేరు వీరయ్య’కు బాబీ (కేఎస్ రవీంద్ర) దర్శకత్వం వహించగా, ‘వీరసింహారెడ్డి’ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. సంక్రాంతికి మంచి హిట్ అందుకున్న బాలకృష్ణ దసరా పండక్కి ‘భగవంత్ కేసరి’తోనూ మరో హిట్ సాధించారు. తండ్రీకూతుళ్ల సెంటిమెంట్తో దర్శకుడు అనిల్ రావిపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు ఈ ఏడాది ఓ హిట్.. ఓ ఫట్ పడ్డాయి. ‘సలార్: సీజ్ఫైర్’తో ప్రభాస్కి సూపర్ డూపర్ హిట్ దక్కింది. స్నేహం ప్రధానాంశంగా ఈ సినిమాను దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు. ఈ ఏడాది నానీకి బాగా కలిసొచ్చింది. శ్రీకాంత్ ఓదెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ నాని హీరోగా నటించిన మాస్, ఎమోషనల్ మూవీ ‘దసరా’ బ్లాక్బస్టర్గా నిలిచింది. అలాగే శౌర్యువ్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో నాని హీరోగా నటించిన ఎమోషనల్ మూవీ ‘హాయ్ నాన్న’ కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. విజయ్ దేవరకొండ, సమంతల వెండితెర ప్రేమకథ ‘ఖుషీ’ కూడా ప్రేక్షకులను ఖుషీ చేసింది. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపోందిన ఈ ఎమోషనల్ లవ్స్టోరీ మంచి వసూళ్లు రాబట్టుకుంది. తమిళ స్టార్ ధనుష్ తెలుగులో చేసిన స్ట్రయిట్ ఫిల్మ్ ‘సార్’. తెలుగు, తమిళ భాషల్లో వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపోందిన ఈ పీరియాడికల్ యాక్షన్ అండ్ మెసేజ్ ఓరియంటెడ్ చిత్రం ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. నాలుగేళ్లుగా హీరోయిన్ గా తెలుగు వెండితెరపై కనిపించని అనుష్కా శెట్టి ఈ ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ నవీన్ పోలిశెట్టితో కలిసి ఈ సినిమాతో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ చిత్రానికి పి. మహేశ్బాబు దర్శకుడు. అలాగే కుర్ర హీరోల్లో సాయిధరమ్ తేజ్ ‘విరూపాక్ష’ హిట్తో జోష్గా ఉన్నారు. హారర్ థ్రిల్లర్గా కార్తీక్ దండు దర్శకత్వంలో ‘విరుపాక్ష’ రూపోందింది. గత ఏడాది హిట్ అందుకోలేకపోయిన శ్రీవిష్ణు ‘సామజవరగమన’ అంటూ ప్రేక్షకులను నవ్వించి ఈ ఏడాది సూపర్ హిట్ సాధించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ ఆకట్టుకుంది. అలాగే కుర్ర హీరో ఆనంద్ దేవరకొండ ‘బేబీ’తో పెద్ద హిట్ అందుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్స్టోరీ మూవీకి సాయి రాజేశ్ దర్శకత్వం వహించారు. హాస్య నటుడు వేణు కెరీర్ డైరెక్షన్ ఈ ఏడాది మరో మలుపు తిరిగింది. వేణు తొలిసారి దర్శకత్వం వహించిన ‘బలగం’ సినిమా సూపర్‡హిట్గా నిలిచింది. తెలంగాణలోని కాకిముట్టుడు సంప్రదాయం, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో రూపోందిన ఈ సినిమాలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్రామ్, సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. ‘బలగం’ విడుదలయ్యేటప్పుడు చిన్న చిత్రమైనా వసూళ్లతో పెద్ద సినిమాగా మారింది. రెండేళ్ల క్రితం ‘మా ఊరి పోలిమేర’తో మంచి హిట్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. అయితే ఆ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమా సీక్వెల్ ‘మా ఊరి పోలిమేర 2’తో ఈ ఏడాది థియేటర్స్లో సక్సెస్ అందుకున్నారు ‘సత్యం’ రాజేశ్. ఈ చిత్రానికి అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. ఇక 2023కి ముగింపు పలుకుతూ శుక్రవారం (డిసెంబర్ 29) విడుదలైన చిత్రాల్లో కల్యాణ్రామ్ ‘డెవిల్’కి ప్రేక్షకాదరణ లభిస్తోంది. స్వీయదర్శకత్వంలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇంకా స్ట్రయిట్ హిట్ చిత్రాల్లో కార్తికేయ ‘బెదురులంక 2012’, ‘అల్లరి’ నరేశ్ ‘ఉగ్రం’, పాయల్ రాజ్పుత్ ‘మంగళవారం’, నవీన్ చంద్ర ‘మంత్ ఆఫ్ మధు’, సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ల ‘మ్యాడ్’, తరుణ్ భాస్కర్ ‘కీడా కోలా’ వంటివి ఉన్నాయి. అనువాద చిత్రాల్లో రజనీకాంత్ ‘జైలర్’, విజయ్ ‘వారసుడు’, ‘లియో’, మణిరత్నం ‘పోన్నియిన్ సెల్వన్ 2’, విజయ్ ఆంటోని ‘బిచ్చగాడు 2’, టొవినో థామస్ ‘2018’, షారుక్ ఖాన్ ‘పఠాన్’, ‘జవాన్’, రణ్బీర్ కపూర్ ‘యానిమల్’ వంటివి మంచి వసూళ్లు రాబట్టాయి. ఈ ఏడాది భారీ అంచనాల నడుమ విడుదలైన కొన్ని చిత్రాలతో పాటు ఏ అంచనాలు లేకుండా విడుదలైన చిత్రాలు పరాజయాన్ని చవి చూశాయి. ఫట్ అయిన ఆ చిత్రాల గురించి.. ‘వాల్తేరు వీరయ్య’చిత్రంతో హిట్ సాధించిన చిరంజీవికి ‘భోళా శంకర్’ ఆశించిన ఫలితాన్నివ్వలేదు. తమిళ సూపర్ హిట్ ‘వేదాళం’ రీమేక్గా మెహర్ రమేశ్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ రూపోందింది. ఆల్రెడీ వేరే భాషలో హిట్టయిన సినిమా కాబట్టి ఇక్కడ కూడా ఆ ఫలితాన్ని ఆశించారు. కానీ అది నెరవేరలేదు. ఇక ప్రభాస్ శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆది పురుష్’. ఓం రౌత్ దర్శకత్వంలో రూపోందిన ఈ పాన్ ఇండియా చిత్రంపై అంచనాలు ఓ రేంజ్లో నెలకొన్నాయి. రామాయణంలోని కొన్ని ముఖ్య ఘట్టాల నేపథ్యంలో రూపోందిన ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోవడంతో పరాజయంగా నిలిచింది. రవితేజ సోలో హీరోగా నటించిన (‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో కీలక పాత్ర చేశారు) ‘రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు’ సినిమాలు బోల్తా కొట్టాయి. సుధీర్ వర్మ దర్శకత్వంలో ‘రావణాసుర’, వంశీ దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వరరావు’ రూపోందాయి. ‘కస్టడీ’ చిత్రం రూపంలో ఈ ఏడాది నాగచైతన్యకు పరాజయం ఎదురైంది. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ద్విభాషా చిత్రంగా ఈ యాక్షన్ థ్రిల్లర్ రూపోందింది. హీరో రామ్–దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘స్కంద అంచనాలను అందుకోలేకపోయింది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్’ కూడా నిరాశనే మిగిల్చింది. ఈ ఏడాది వరుణ్ తేజ్ వ్యక్తిగతంగా ఫుల్ హ్యాపీ. లావణ్యా త్రిపాఠీని పెళ్లి చేసుకుని, లైఫ్లో కొత్త చాప్టర్ని మొదలుపెట్టారు. అయితే కెరీర్ పరంగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’ నిరాశపరిచింది. నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్లో రూపోందిన ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మేన్’ ఆర్డినరీ సినిమా అనిపించుకుంది. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘రంగ మార్తాండ’ ఎమోషనల్ మూవీ అనిపించుకుంది. టాక్ బాగున్నా వసూళ్లు ఆశించిన విధంగా రాలేదు. హీరోయిన్ సమంత, నటుడు దేవ్ మోహన్ కాంబినేషన్లో గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన పౌరాణిక చిత్రం ‘శాకుంతలం’ పరాజయాన్ని మూటకట్టుకుంది. ఇవే కాదు.. గోపీచంద్ ‘రామబాణం’, కల్యాణ్ రామ్ ‘అమిగోస్’, నిఖిల్ ‘స్పై’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, సుధీర్ బాబు ‘హంట్, మామా మశ్చీంద్ర’ వంటి సినిమాలతో పాటు మరికొన్ని ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement