-
ఆర్థిక శాఖ ఆదేశాలు: పసిడి రుణాలను సమీక్షించుకోండి!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకులు ఇస్తున్న పసిడి రుణాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతుండటంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇలాంటి పలు ఉదంతాలు తమ దృష్టికి వచ్చాయని, ఈ నేపథ్యంలో బంగారం రుణాల పోర్ట్ఫోలియోను సమగ్రంగా సమీక్షించుకోవాలని పీఎస్యూ బ్యాంకులన్నింటికీ సూచించింది. ఈ మేరకు బ్యాంకుల చీఫ్లకు లేఖ రాసినట్లు ఆర్థిక సర్వీసుల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి తెలిపారు. బంగారం రుణాలపై ఫీజులు.. వడ్డీల వసూళ్లు.. ఖాతాల మూసివేతలో అవకతవకలు జరుగుతుండటం, తగినంత విలువ గల బంగారాన్ని తనఖా పెట్టించుకోకుండానే రుణాలివ్వడం, నగదు రూపంలో రీపేమెంట్లు తీసుకోవడం తదితర ఉల్లంఘనలపై డీఎఫ్ఎస్ ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా 2022 జనవరి 1 నుంచి 2024 జనవరి 31 వరకు మంజూరైన రుణాలపై సమీక్ష జరగనుంది. ఇవి చదవండి: ఈ–స్కూటర్కు రూ.10,000 వరకు ఆర్థిక ప్రోత్సాహకం! -
పేటీఎంకు మరో బిగ్ షాక్..!
టోల్ ప్లాజాల దగ్గర ఇబ్బంది పడే పరిస్థితి తలెత్తకుండా మార్చి 15లోగా ఇతర బ్యాంకుల నుంచి ఫాస్టాగ్లు తీసుకోవాలంటూ పేటీఎం ఫాస్టాగ్ యూజర్లకు నేషనల్ హైవేస్ అథారిటీ (ఎన్హెచ్ఏఐ) సూచించింది. తద్వారా జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు జరిమానాలు, డబుల్ ఫీజు చార్జీలను నివారించవచ్చని ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. ఇతరత్రా సందేహాల నివృత్తి కోసం ఇండియన్ హైవే మేనేజ్మెంట్ కంపెనీ (ఐహెచ్ఎంసీఎల్) వెబ్సైట్లోని ఎఫ్ఏక్యూ సెక్షన్ను సందర్శించాలని తెలిపింది. నిబంధనల ఉల్లంఘనల కారణంగా పేటీఎం పేమెంట్స్ బ్యాంకుపై (పీపీబీఎల్) రిజర్వ్ బ్యాంక్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మార్చి 15 తర్వా త నుంచి పేటీఎం ఫాస్టాగ్ యూజర్లు తమ ఖా తాలను రీచార్జ్ చేసుకునే వీలుండదు. అయితే, తమ ఖాతాల్లో బ్యాలెన్స్ను వాడుకోవచ్చు. ఇవి చదవండి: భారీగా పడుతున్న స్టాక్మార్కెట్లు.. కారణాలు ఇవే.. -
యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ ఏది?
2023వ సంవత్సరం కొద్దిరోజుల్లో ముగియబోతోంది. ఈ నేపధ్యంలో ఈ ఏడాదికి సంబంధించిన అనేక అంశాల గణాంకాలు వెలువడుతున్నాయి. ఈకోవలో 2023లో అత్యధికంగా డిలీట్ చేసిన సోషల్ మీడియా యాప్ల జాబితా కూడా బయటకు వచ్చింది. సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య నిరంతరం పెరుగుతోంది. ఒక నివేదిక ప్రకారం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగదారుల సంఖ్య 4.8 బిలియన్లను (ఒక బిలియన్ అంటే వంద కోట్లు) దాటింది. ప్రపంచంలోని చాలా మంది సోషల్ మీడియా వినియోగదారులు ప్రతిరోజూ 2 గంటల 24 నిమిషాల సమయం సోషల్ మీడియాలో గడుపుతున్నారు. 2023లో యూజర్స్ అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ల విషయానికొస్తే.. అమెరికన్ టెక్ సంస్థ టీఆర్జీ డేటాసెంటర్ నివేదిక ప్రకారం... అందుబాటులోకి వచ్చిన 24 గంటల్లోనే 100 మిలియన్ల (ఒక మిలియన్ అంటే 10 లక్షలు) వినియోగదారులను సంపాదించిన మెటాకు చెందిన త్రెడ్ యాప్.. ఆ తర్వాతి ఐదు రోజుల్లో 80 శాతం మంది వినియోగదారులను కోల్పోయింది. ఆ నివేదిక ప్రకారం 2023లో చాలా యాప్లు భారీ నష్టాన్ని చవిచూశాయి. ప్రపంచంలోని దాదాపు 10 లక్షల మంది యూజర్స్ ఇంటర్నెట్లో ఇన్స్టాగ్రామ్ ఖాతాను తొలగించే మార్గాల కోసం వెతికారు. ఇన్స్టాగ్రామ్ యాప్ను 10,20,000 మందికి పైగా వినియోగదారులు డిలీట్ చేశారు. అత్యధికంగా డిలీట్ చేసిన యాప్ల జాబితాలో రెండవ స్థానంలో స్నాప్చాట్ ఉంది. దీనిని 1,28,500 మంది డిలీట్ చేశారు. దీని తర్వాత ‘ఎక్స్’ (ట్విట్టర్), టెలీగ్రామ్, ఫేస్బుక్, టిక్టాక్,యూట్యూబ్, వాట్సాప్, విచాట్ మొదలైనవి ఉన్నాయి. ఈ ఏడాది 49 వేల మంది ఫేస్బుక్ యాప్ను తొలగించారు. వాట్సాప్ను తొలగించిన వినియోగదారుల సంఖ్య 4,950గా ఉంది. ఇది కూడా చదవండి: చుక్కలు చూపించిన పప్పులు, కూరగాయలు! -
తిరుగులేని జియో.. భారీగా పెరిగిన యూజర్లు
న్యూఢిల్లీ: దేశీ టెలికం రంగంలో రిలయన్స్ జియో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటోంది. ఈ ఏడాది సెప్టెంబర్లో కంపెనీ యూజర్ల సంఖ్య మరో 34.7 లక్షలు పెరిగి మొత్తం 44.92 కోట్లకు చేరింది. అటు పోటీ సంస్థ భారతి ఎయిర్టెల్ సబ్స్క్రైబర్స్ 13.2 లక్షలు పెరగ్గా వొడాఫోన్ ఐడియా యూజర్లు 7.5 లక్షలు తగ్గారు. టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ బుధవారం వెల్లడించిన గణాంకాల ప్రకారం భారతి ఎయిర్టెల్ యూజర్ల సంఖ్య 37.77 కోట్లుగా, వొడాఫోన్ ఐడియా సబ్స్క్రైబర్స్ సంఖ్య 22.75 కోట్లుగా ఉంది. సెప్టెంబర్ ఆఖరు నాటికి మొత్తం వైర్లెస్ సబ్స్క్రైబర్స్ సంఖ్య 115 కోట్లకు చేరింది. పట్టణ ప్రాంతాల్లో యూజర్ల సంఖ్య 63 కోట్లకు, గ్రామీణ ప్రాంతాల్లో సబ్స్క్రైబర్స్ సంఖ్య 52 కోట్లకు చేరింది. 88.5 కోట్లకు బ్రాడ్బ్యాండ్ యూజర్లు.. ట్రాయ్ గణాంకాల ప్రకారం మొత్తం బ్రాడ్బ్యాండ్ యూజర్ల సంఖ్య ఆగస్టులో 87.65 కోట్లుగా ఉండగా సెప్టెంబర్ ఆఖరు నాటికి 88.5 కోట్లకు చేరింది. టాప్ 5 సర్వీస్ ప్రొవైడర్ల మార్కెట్ వాటా 98.35 శాతంగా ఉంది. ఇందులో రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ (45.89 కోట్లు), భారతి ఎయిర్టెల్ (25.75 కోట్లు), వొడాఫోన్ ఐడియా (12.65 కోట్లు), బీఎస్ఎన్ఎల్ (2.51 కోట్లు) ఉన్నాయి. -
ఐఆర్సీటీసీ డౌన్: మండిపడుతున్న వినియోగదారులు
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) వెబ్సైట్ గురువారం మరోసారి డౌన్ అయింది. దీంతో సర్వీసులకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. దీంతో వినియోగదారులు ఇబ్బందుల నెదుర్కొన్నారు. దీంతో సోషల్మీడియాలో వినియోగదారులు ఐఆర్సీటీసీపై విమర్శలు గుప్పించారు. దీంతో ఐఆర్సీటీసీ కూడా ట్విటర్ ద్వారా స్పందించింది. సాంకేతిక సమస్య కారణంగా తమ వెబ్సైట్ (నవంబర్ 23, గురువారం ) సేవలకు తాత్కాలికంగా అంతరాయం కలిగినట్టు వెల్లడించింది. త్వరలోనే ఈ సమస్యను పరిష్కరిస్తామని ట్వీట్ చేసింది. (డీప్ఫేక్లపై కేంద్రం హెచ్చరిక : త్వరలో కఠిన నిబంధనలు) గురువారం ఉదయం 10 గంటల నుంచే సాంకేతిక సమస్యను ఎదుర్కొంటోంది.. తత్కాల్ విండో ఓపెన్ కాగా యూజర్లు ఇబ్బందులు పడ్డారు. అత్యవసరంగా కేన్సిల్ చేయాల్సిన టికెట్లు కేన్సిల్ కాగా, తత్కాల్ ద్వారా టికెట్లు బుక్ కాక యూజర్లు నానా అగచాట్లు పడ్డారు. దీంతో అధ్వాన్నమైన వెబ్ సైట్, దారుణమైన సేవలు అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు. IRCTC వెబ్సైట్ ద్వారా రేల్వే ప్రయాణికులు టిక్కెట్ల బుకింగ్ రైళ్ల స్థితిని తనిఖీ చేయడం, ఇతర సంబంధిత సమాచారాన్ని పొందుతారు. E- ticket booking is temporarily affected due to technical reasons. Technical team is working on it and booking will made available soon. — IRCTC (@IRCTCofficial) November 23, 2023 -
వీల్ఛైర్ యూజర్లకు సరికొత్త కారు డిజైన్.. ఆనంద్ మహీంద్రా ట్విట్ వైరల్
వీల్ఛైర్ వినియోగదారులు కారును ఉపయోగించడం ఇబ్బందితో కూడుకుని ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్లు వారికోసం ప్రత్యేకంగా డిజైన్ చేయలేదు కాబట్టి.. మరొకరి సహాయం అవసరమవుతుంది. కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఈ వీడియో వీల్ ఛైర్ వినియోగదారులు కారు ఉపయోగించే సమస్యలను పరిష్కరిస్తుంది. ఈ వీడియో వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రాను అమితంగా ఆకర్షించింది. Super smart & super useful design. Would fill me with pride if our vehicles could offer these fitments. But it’s hard for an auto OEM engaged in mass production to do. Need a startup engaged in customisation. I would willingly invest in such a startup https://t.co/uoasAKjaZd — anand mahindra (@anandmahindra) November 10, 2023 "సూపర్ స్మార్ట్. ఉపయోగకరమైన డిజైన్. మా వాహనాలు ఈ ఫిట్మెంట్లను అందించగలిగితే నేను ఎంతో గర్వంగా భావిస్తాను. కానీ భారీ ఉత్పత్తిలో నిమగ్నమైన సంస్థలకు అలా చేయడం కష్టం. ఇందుకు స్టార్టప్ అవసరం. అలాంటి స్టార్టప్లకు నేను తప్పకుండా పెట్టుబడి పెడతాను." అని ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను షేర్ చేశారు. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. వీల్ఛైర్ వాడేవారికి కూడా కొత్త డిజైన్లను తీసుకురావాలనే ఆలోచనపై హర్షం వ్యక్తం చేశారు. వీడియోలో చూపిన కారు డిజైన్ను ప్రశంసించారు. అలాంటి స్టార్టప్లు ముందుకు రావాలని కోరారు. వీల్ఛైర్ వినియోగదారులు కూడా ఎవరి సహాయం లేకుండా కారులో ప్రయాణించాలని ఆకాంక్షించారు. ఇదీ చదవండి: ఇదేందయ్యా ఇది.. రోడ్డుపై వెళ్తున్న కారును ఢీకొన్న విమానం.. వీడియో వైరల్ -
ఆయన చేతుల్లోకి వచ్చాకే ఇలా.. మస్క్ గాలి తీసేసిన సీఈవో!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) ఎలాన్ మస్క్ (Elon Musk) ఆధీనంలోకి వచ్చాక డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోతున్నట్లు ఆ సంస్థ సీఈవో లిండా యాకరినో (Linda Yaccarino) ఇటీవల జరిగిన వోక్స్ మీడియా కోడ్ 2023 ఈవెంట్లో పాల్గొన్న ఆమె సీఎన్బీసీ ఇంటర్వ్యూలో కంపెనీ గురించి ఆక్తికర గణాంకాలను తెలియజేశారు. ఇంటర్వ్యూ జరుగుతున్నంత సేపూ తాను ఎక్స్లో కేవలం 12 వారాలు మాత్రమే ఉద్యోగంలో ఉన్నానని పదే పదే చెప్పుకొచ్చిన లిండా యాకరినో.. ఎలోన్ మస్క్ చేతుల్లోకి వచ్చిన తర్వాత ట్విటర్ రోజువారీ యాక్టివ్ యూజర్లను కోల్పోతున్నట్లు వెల్లడించారు. కంపెనీకి ప్రస్తుతం 225 మిలియన్ల రోజువారీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు చెప్పారు. మస్క్ కంపెనీని కొనుగోలు చేయడానికి ముందున్న సంఖ్య కంటే 11.6 శాతం క్షీణించినట్లు తెలిపారు. మరోవైపు ఎలాన్ మస్క్ కూడా గతేడాది తాను టేకోవర్ చేయడానికి వారం ముందు ట్విటర్లో 254.5 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు అప్పట్లో వరుస ట్వీట్లు చేశారు. కాగా ఎక్స్ తమ డైలీ యాక్టివ్ యూజర్ల సంఖ్యను 245 మిలియన్లకు సవరించినట్లు ‘ది ఇన్ఫఫర్మేషన్’ అనే టెక్నాలజీ పబ్లికేషన్ ద్వారా తెలుస్తోంది. ఎక్స్కి ప్రస్తుతం 225 మిలియన్ల మంది యాక్టివ్ యూజర్లు ఉన్నారని చెప్పిన లిండా అంతకుమందుకు నిర్దిష్ట సంఖ్య చెప్పకుండా 200 నుంచి 250 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లు ఉన్నారంటూ చూచాయిగా చెప్పారు. ‘మ్యాషబుల్’ నివేదిక ప్రకారం చూస్తే ముందు కంటే మస్క్ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ట్విటర్ 3.7 శాతం డైలీ యాక్టివ్ యూజర్లను కోల్పోయింది. 2022 నవంబర్ మధ్యలో 259.4 మిలియన్ల డైలీ యాక్టివ్ యూజర్లను కలిగిన ట్విటర్.. ఆ తర్వాత దాదాపు 15 మిలియన్ల యూజర్లను కోల్పోయింది. ఇక మంత్లీ యాక్టివ్ యూజర్ల విషయానికి వస్తే ‘ఎక్స్’కి 550 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు లిండా యాకరినో తెలిపారు. అయితే 2024లో కంపెనీ లాభదాయకంగా ఉంటుందని కోడ్ కాన్ఫరెన్స్ వేదికపై అన్నారు. -
గూగుల్కు బిగ్ షాక్.. రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించాల్సిందే
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్కు భారీ షాక్ తగిలింది. యూజర్ల అనుమతి లేకుండా వారి మ్యాప్స్, లొకేషన్లను ట్రాక్ చేస్తుందన్న ఆరోపణల నేపథ్యంలో.. టెక్ దిగ్గజం 93 మిలియన్ డాలర్లు అంటే సుమారు రూ.7,000 కోట్ల ఫైన్ చెల్లించనుందని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మీరు ఎక్కడికి వెళుతున్నారు? ఏయే యాప్స్ వాడుతున్నారు. మీకు ఎలాంటి ప్రొడక్ట్లంటే ఇష్టం ఇదిగో ఇలాంటి వివరాల్ని గూగుల్ మనకు తెలియకుండా.. మనల్ని ట్రాక్ చేస్తుంది. ఆ డేటాతో ఆయా ప్రాంతానికి సంబంధించిన సర్వీసుల్ని, కొత్త ప్రొడక్ట్లను, ఫీచర్లను అభివృద్ది చేస్తుంది. గూగుల్ చెప్పినట్లు చేయడం లేదు దీంతో పాటు, మీరేదైనా ప్రొడక్ట్ కొనుగోలు చేయాలని అనుకున్నారు. ఇందుకోసం సెర్చ్ ఇంజిన్ గూగుల్ను ఓపెన్ చేసి అందులో మీరు కొనాలనుకుంటున్న ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారు. ఆ మరుక్షణమే మీరు ఏ ప్రొడక్ట్ గురించి సెర్చ్ చేశారో? ఆ ప్రొడక్ట్తో పాటు మిగిలిన ఉత్పత్తులు వివరాల్ని సైతం గూగుల్ మీకు అందిస్తుంది. ఇలా యూజర్లకు ఏం కావాలో.. వాటిని అందించి తద్వారా భారీ ఎత్తున లాభాల్ని గడిస్తుందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే గూగుల్ మాత్రం యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్ను డిసేబుల్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ట్రాక్ చేయలేమని స్పష్టం చేస్తోంది. కానీ అలా చేయడం కుదరదని తెలుస్తోంది. గూగుల్పై రూ.7,000 కోట్ల దావా ఫైల్ ఈ తరుణంలో నిబంధనల్ని ఉల్లంఘించి యూజర్లను ట్రాక్ చేసి.. ఆ డేటా ద్వారా సొమ్ము చేసుకుంటుందని ఆరోపిస్తూ గూగుల్పై కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రాబ్ బొంటా దావా ఫైల్ చేశారు. యూజర్లు ట్రాకింగ్ ఆప్షన్ను డిసేబుల్ చేసుకోవచ్చని, అలా చేయడం వల్ల వ్యక్తిగత డేటా ను సేకరించకుండా నియంత్రించుకోవచ్చని చెబుతోంది. కానీ గూగుల్ అలా చేయడం లేదని, యూజర్లడేటాను సేకరిస్తుందని ఆరోపించారు. గూగుల్ తన సొంత వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగదారుల కదలికల్ని ట్రాక్ చేస్తూనే ఉంద’ని బోంటా తెలిపారు. ఇది ఆమోదయోగ్యం కాదని, గూగుల్ అవలంభిస్తున్న తప్పుడు విధానాల కారణంగా పైన పేర్కొన్న భారీ మొత్తాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. ఫలితంగా గూగుల్ త్వరలో ఈ భారీ మొత్తం చెల్లించనుంది. 93 మిలియన్ డాలర్ల చెల్లింపులు తమపై వస్తున్న ఆరోపణల్ని గూగుల్ యాజమాన్యం అంగీకరించినట్లు పలు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఆరోపణలకు పరిష్కార మార్గంగా 93 మిలియన్ డాలర్ల చెల్లింపులతో పాటు లొకేషన్ ట్రాకింగ్ పద్ధతులకు సంబంధించి పారదర్శకతను మెరుగుపరచడం, లొకేషన్ డేటాను ట్రాక్ చేసే ముందు వారికి నోటిఫికేషన్లు ఇవ్వడం వంటి గణనీయ మార్పులు చేసేలా ఓ అంగీకారానికి వచ్చింది. గూగుల్ దారిలో మెటా యూజర్ల డేటాను అనుమతి లేకుండా వాడుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొన్నది గూగుల్ మాత్రమే కాదు. ఈ ఏడాది ప్రారంభంలో, మార్క్ జుకర్ బర్గ నేతృత్వంలోని మెటా సైతం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఐరోపాలోని ఫేస్బుక్ (మెటా) వినియోగదారుల నుండి సేకరించిన డేటాను యూఎస్కు బదిలీ చేయడాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రొటెక్షన్ నిబంధనలను ఉల్లంఘించినందుకు మెటా 1.2 బిలియన్ యూరోలు (1.3 బిలియన్ డాలర్లు) జరిమానా చెల్లించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. చదవండి👉🏻 బై..బై అమెరికా, స్వదేశానికి తిరిగి వస్తున్న భారతీయులు -
అలా చేస్తే ముప్పే: యూజర్లకు యాపిల్ తీవ్ర హెచ్చరిక
Apple Warning: టెక్ దిగ్గజం, ఐఫోన్ మేకర్ యాపిల్ కీలక హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఫోన్ను పక్కనే పెట్టుకొని నిద్రపోయే అలవాటు ఉన్న వ్యక్తుల కోసం కీలక హెచ్చరిక జారీ చేసింది. స్మార్ట్ఫోన్ ఛార్జింగ్లో ఉండగా పక్కన పెట్టుకుని నిద్రపోవడం ప్రమాదకరమని హెచ్చరించింది. అంతేకాదు ఈ సూచనలను తమ ఆన్లైన్ యూజర్ గైడ్లో చేర్చింది. ఐఫోన్లను సరైన వెలుతురు ఉన్న వాతావరణంలోనూ, టేబుల్ల వంటి ఫ్లాట్ ఉపరి తలాలపై మాత్రమే ఛార్జింగ్ చేయాలని సలహా ఇచ్చింది. దుప్పట్లు, దిండ్లు, శరీరం వంటి మృదువైన ఉపరితలాలపై ఉంచి చార్జ్ చేయవద్దని సూచించింది. ఛార్జింగ్ ప్రక్రియలో ఐఫోన్లు కొంత వేడిని ఉత్పత్తి చేస్తాయని, ఫలితంగా ఫోన్ కింద ఉన్న భాగం కాలిపోవడం, లేదా కొన్ని సందర్భాల్లో మంటలంటుకోవడంతో ప్రమాదాలకు దారి తీస్తాయని తెలిపింది. అలాగే,ఘైను ఛార్జింగ్ చేస్తున్నప్పుడు పవర్ అడాప్టర్, వైర్లెస్ ఛార్జర్పై నిద్రపోవద్దని సూచించింది. వాటిని పవర్ సోర్స్కి కనెక్ట్చేసినప్పుడు దుప్పటి, దిండు, శరీరం కింద ఉంచొద్దంటూ తన యూజర్లకు మార్గ దర్శకాలు జారీ చేసింది. అంతేకాదు దెబ్బతిన్న కేబుల్స్ లేదా ఛార్జర్లను ఉపయోగించడం లేదా తేమగా ఉన్న ప్రదేశాల్లో చార్జింగ్ చేయకూడదని సలహా ఇచ్చింది. కాగా పొద్దున లేచింది మొదలు రాత్రి నిద్రపోయేవరకు చివరికి వాష్ రూంలో కూడా వదలకుండా ఫోన్ వాడటం ఇపుడు అందరికీ అలవాటుగా మారిపోయింది. అంతేకాదు చార్జింగ్లో ఉన్నపుడు చాలాసార్లు ఫోన్ పేలిన ప్రమాదాల్లోప్రాణాల్లో కోల్పోతున్న ఘటనలు కూడా చాలానే చూశాం. ఫోన్ ఛార్జింగ్ పెట్టినప్పుడు ఫోన్ వినియోగం ప్రమాదకరమనీ, సిగ్నల్ లేని సమయంలో వాడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని కూడా ఇప్పటికే పలు అధ్యయనం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
ఆరంభ శూరత్వం..ట్విటర్ దెబ్బకు చాప చుట్టేసిన ‘థ్రెడ్స్’!
ఆరంభంలో శూరత్వం అన్నట్టు.. ట్విటర్కు పోటీగా ఎదురైన కొన్ని రోజులకే థ్రెడ్స్ యూజర్ల విషయంలో చాప చుట్టేస్తున్నట్లు తెలుస్తోంది. రోజులు గడిచే కొద్ది యాక్టీవ్ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. మెటా అధినేత మార్క్ జుకర్ బర్గ్.. థ్రెడ్స్ను యూజర్లకు పరిచయం చేసిన ప్రారంభంలో దాని రోజూ వారీ యూజర్లు 10 మిలియన్ యూజర్లు ఉన్నట్లు తెలిపారు. కానీ ఇటీవల విడుదలైన నివేదిక మాత్రం పూర్తి భిన్నంగా చూపిస్తోంది. వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రకారం.. యాప్లో రోజువారీ యాక్టీవ్ యూజర్ల సంఖ్య వరుసగా రెండవ వారం పడిపోయింది. ఇప్పుడు 13 మిలియన్లకు చేరుకుంది. జూలై ప్రారంభంలో గరిష్ట స్థాయి నుండి 70 శాతం యూజర్లు తగ్గినట్లు సూచిస్తుంది. అదే సమయంలో ట్విటర్ రోజువారీ యాక్టీవ్ యూజర్లు 200 మిలియన్లు ఉన్నారు. దీంతో ట్విటర్కు గట్టి పోటీ ఇవ్వాలంటే థ్రెడ్స్కు భారీ ఎత్తున యూజర్లు కావాల్సి ఉంటుంది. దీంతో పాటు సైన్ ఆప్ల విషయంలో మార్క్ జుకర్ బెర్గ్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటూ వెలుగులోకి వచ్చిన నివేదికలు హైలెట్ చేస్తున్నారు. జులై 5న అందుబాటులోకి వచ్చిన థ్రెడ్స్ ప్రారంభం రోజుల్లో.. లాగిన్ అయ్యేందుకు యూజర్లు పోటెత్తేవారు. రాను రాను అలా సైన్ అప్ అయ్యే వారి సంఖ్య సైతం తగ్గింది. వినియోగదారుల్లో ఆసక్తి తగ్గుతూ వస్తుంది. యూజర్ల సంఖ్య భారీగా పడిపోతున్నప్పటికీ మెటా యాజమాన్యం ట్విటర్కు పోటీ థ్రెడ్సేనన్న సంకేతాలిస్తుంది. యాప్ను పునరుద్ధరిస్తూ కొత్త ఫీచర్లను పరిచయం చేసేలా దృష్టిసారిస్తున్నట్లు తెలిపింది. అయినప్పటికీ, వినియోగదాలు తగ్గిపోకుండా ట్విటర్ ఎలాంటి ఫీచర్లను యూజర్లకు అందిస్తుందో.. థ్రెడ్స్ సైతం అవే ఫీచర్లను ఎనేబుల్ చేయాలని టెక్నాలజీ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
వాట్సాప్ కొత్త ఫీచర్ - భద్రతకు పెద్దపీట!
WhatsApp Phone Number Privacy: ఆధునిక కాలంలో కొత్త యాప్స్ లాంచ్ అవుతున్నాయి. అయితే ఇప్పటికే ఉన్న యాప్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రముఖ మెసేజింగ్ యాప్ 'వాట్సాప్' (WhatsApp) త్వరలో మరో అప్డేట్ అందుకోనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నివేదికల ప్రకారం, వాట్సాప్ త్వరలో 'ఫోన్ నెంబర్ ప్రైవసీ' అనే లేటెస్ట్ ఫీచర్ పొందనున్నట్లు తెలుస్తోంది. ఇది యూజర్లకు చాలా ఉపయోగకరంగా ప్రైవసీ విషయంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు మాత్రమే కాకుండా ఐఫోన్ యూజర్లందరికి అందుబాటులో ఉంటుంది. అయితే వాట్సాప్ అప్డేటెడ్ బీటా యూజర్లకు మాత్రమే ఇది వర్తించే అవకాశం ఉందని సమాచారం. (ఇదీ చదవండి: షాకిచ్చిన ఇన్ఫోసిస్.. తీవ్ర నిరాశలో ఉద్యోగులు - కారణం ఇదే!) వాట్సాప్ లేటెస్ట్ ఫీచర్ కమ్యూనిటీ యూజర్లు మాత్రమే ఉపయోగించగలరు. ఒక యూజర్ తన ఫోన్ నెంబర్ తెలియనివారికి కనిపించకుండా ఉండాలనుకున్నప్పుడు వాట్సాప్ సెట్టింగ్స్లో ఫోన్ నెంబర్ ప్రైవసీ అనే ఫీచర్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ సెలక్ట్ చేసుకున్నప్పుడు యూజర్ మొబైల్లో సేవ్ అయిన కారికి మాత్రమే కనిపిస్తుంది. ఇతరులకు కనిపించే అవకాశం లేదు. ఇది యూజర్ భద్రతకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. -
ట్విటర్ను షేక్ చేస్తున్న మెటా కొత్త యాప్! గంటల వ్యవధిలో..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అధీనంలోని ప్రముఖ మైక్రోబ్లాగింగ్ సైట్ 'ట్విటర్'కి పోటీగా సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' ఓ కొత్త యాప్ పరిచయం చేసిన విషయం తెలిసిందే. 'థ్రెడ్స్' (Threads) పేరుతో విడుదలైన ఈ యాప్ ఇటీవలే అందుబాటులో వచ్చింది. దీనిని ప్రస్తుతం ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు ఉపయోగించవచ్చు. ఈ లేటెస్ట్ యాప్కు అతి తక్కువ సమయంలో కనీవినీ ఎరుగని రీతితో స్పందన లభిస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. లక్షలు దాటుతున్న యూజర్లు.. నివేదికల ప్రకారం.. థ్రెడ్స్ యాప్ విడుదలైన కేవలం 2 గంటల్లో 20 లక్షల మంది, 4 గంటల్లో 50 లక్షల మంది అకౌంట్స్ ఓపెన్ చేశారు. ఈ విషయాన్నీ మెటా సీఈఓ 'మార్క్ జుకర్బర్గ్' స్వయంగా వెల్లడించారు. ట్విటర్ మాదిరిగా ఉండే ఫీచర్స్ కలిగిన ఈ మెటా కొత్త యాప్ ఇన్స్టాగ్రామ్కు అనుసంధానంగా ఉంటుంది. కావున ఇన్స్టాగ్రామ్ యూజర్లు తమ యూజర్ నేమ్ కొనసాగించొచ్చు. పరిస్థితులను చూస్తుంటే థ్రెడ్స్ యాప్ ఖాతాదారుల సంఖ్య త్వరలోనే ట్విటర్ను అధిగమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇన్స్టాలో ఫాలో అవుతున్న అకౌంట్స్ కొత్త యాప్లోనూ అనుసరించే అవకాశం ఉంది. కావున తప్పకుండా ఎక్కువమంది ఈ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్ ఫోటో లైక్, షేర్ వంటి సౌలబ్యాన్ని కూడా అందిస్తుంది. టెక్స్ట్ మెసేజ్లు చేసుకోవాలనుకునే వారికి ఇది తప్పకుండా కొత్త అనుభవాన్ని అందిస్తుందని, ఆధునిక ప్రపంచంలో ఇలాంటి ఇలాంటి యాప్ అవసరం చాలా ఉందని మెటా చీప్ వెల్లడించారు. (ఇదీ చదవండి: రతన్ టాటా ఎమోషనల్ పోస్ట్! మొదటి సారి ఇలా రిక్వెస్ట్ చేస్తూ..) pic.twitter.com/MbMxUWiQgp — Mark Zuckerberg (@finkd) July 6, 2023 ఎలాన్ మస్క్ స్పందన.. మెటా థ్రెడ్స్ యాప్ మీద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ఇది పూర్తిగా Ctrl + C + V ట్విటర్ కాపీ పేస్ట్ అని వ్యంగ్యంగా అన్నాడు. దీనికి స్పందిస్తూ ఒక నవ్వుతున్న ఎమోజీని ఎలాన్ మస్క్ పోస్ట్ చేసాడు. అయితే జుకర్బర్గ్ కొత్త యాప్ ప్రారంభించిన సందర్భంగా 11 సంవత్సరాల తరువాత తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక పోస్ట్ చేసాడు. ఇందులో ఇద్దరు స్పైడర్ మ్యాన్ ఫోటోలు ఉండటం చూడవచ్చు. ఎలాన్ మస్క్ను ఉద్దేశించి జుకర్బర్గ్ చేసిన పోస్ట్ ఇది చాలామంది భావిస్తున్నారు. (ఇదీ చదవండి: అత్త ఐడియా కోడలి వ్యాపారం.. కళ్ళు తిరిగే సంపాదన, విదేశాల్లో కూడా యమ డిమాండ్!) 😂 — Elon Musk (@elonmusk) July 6, 2023 -
ట్విటర్లో సాంకేతిక సమస్యలు.. యూజర్ల గగ్గోలు
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విటర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. భారత్తోపాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది యూజర్లకు ట్విటర్ మొరాయించినట్లుగా ఆన్లైన్లో సాంకేతిక సమస్యలను సమీక్షించే వేదిక ‘డౌన్ డిటెక్టర్’ నివేదించింది. ‘డౌన్ డిటెక్టర్’ ప్రకారం.. భారత్లో 300 మందికి పైగా ట్విటర్ యూజర్లు ఈ మైక్రోబ్లాగింగ్ సైట్ను ఉపయోగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. 7 వేల మందికి పైగా యూజర్లు అవుట్టేజ్ ట్రాకర్ వెబ్సైట్లో తాము ఎదుర్కొన్న ఇబ్బందులను నివేదించారు. సాంకేతిక సమస్యలపై యూజర్ల ఫిర్యాదుల నేపథ్యంలో ట్విటర్లో #TwitterDown హ్యాష్ట్యాగ్ ట్రెండింగ్ అవుతోంది. యూజర్లు ఎవరికి తోచిన విధంగా వారు ఎలాన్ మస్క్ను తమ కామెంట్లతో ఆడేసుకున్నారు. "ఎలాన్ మస్క్ను ఎవరైనా నిద్రలేపి అతని 44 బిలియన్ డాలర్ల యాప్ పని చేయడం లేదని చెప్పండి!" అంటూ ఓ యూజర్ రాసుకొచ్చారు. “ట్విటర్ డౌన్ అయిందా? ఇంకా ఎవరికైనా ఇదే సమస్య వచ్చిందా? కామెంట్ సెక్షన్ తెరవడం సాధ్యం కాలేదు" అని మరొక యూజర్ ట్వీట్ చేశారు. "నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ.... #TwitterDown" ఇంకొక యూజర్ పోస్ట్ చేశారు. “Sorry. You are rate limited. Please try again in a few minutes.” That’s what I’m getting now. 🙃 #TwitterDown — SamanthaM (@Sammy6170) July 1, 2023 Twitter Down now Elon Musk trying to fix the problem be like😅#TwitterDown pic.twitter.com/7OeWprN7CJ — Ashutosh Srivastava 🇮🇳 (@sri_ashutosh08) March 1, 2023 Live footage of Elon at Twitter HQ trying to fix the rate limit exceeded debacle.#twitterdown pic.twitter.com/KtzqdRj9HH — Em (@emmasaurustex) July 1, 2023 -
గూగుల్ యూజర్లకు చేదు వార్త...
-
వాళ్ళ లక్ష్యం చాట్ GPT యూజర్స్ భయపెడుతున్న కొత్త మాల్ వేర్స్.!
-
యూజర్లకు గుడ్ న్యూస్: అమెజాన్ ప్రైమ్ లైట్ ప్లాన్ వచ్చేసింది!
యూజర్లకు తీపికబురు చెప్పింది ఈకామర్స్ దిగ్గజం అమెజాన్. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ను గురువారం దేశంలో ప్రారంభించింది. ఇప్పటివరకు దేశంలో కొంతమందికి టెస్టింగ్లో అందుబాటులో ఉన్న ఈ సర్వీసును ఇపుడిక అందరికీ అందిస్తోంది. అంతేకాదు రెగ్యులర్ అమెజాన ప్రైమ్ వీడియో ప్లాన్ ఫీజు 1499రూపాయలతో పోలిస్తే ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్ ధర రూ. 999గా ఉండటం గమనార్హం. అంటే రూ. 500 తక్కువ. అమెజాన్ ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్, ప్రయోజనాలు అమెజాన్ ప్రైమ్ ప్రయోజనాలను మరింత సరసమైన ధరకు యాక్సెస్ చేయాలనుకునే కస్టమర్లకు ఇది చీపెస్ట్ ఆప్షన్. అమెజాన్ వెబ్సైట్లో లేదా యాప్ ద్వారా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా అన్ని అమెజాన్ ఆర్డర్లపై 5 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంటుంది. అయితే ప్రైమ్ వీడియో మాదిరిగా గాకుండా ప్రైమ్ లైట్ సబ్స్క్రిప్షన్లో యాడ్స్ ఉంటాయి. ఈ ప్రకటనల వ్యవధి, ఫ్రీక్వెన్సీ వివరాలను పేర్కొన లేదు. కొన్ని పరిమితులతో ప్రైమ్ వీడియో కంటెంట్ యాక్సెస్తో పాటు, అదనపు ఖర్చు లేకుండా రెండు రోజుల డెలివరీల ఆప్షన్ను అందిస్తోంది. (రూ. 1600 కోట్ల ఇంద్రభవనం అమ్మకానికి ఎక్కడో తెలుసా? భారతీయుడి మోజు) అలాగే ప్రైమ్ లైట్ ప్లాన్లో అమెజాన్ మ్యూజిక్, అమెజాన్ గేమింగ్, ప్రైమ్ రీడింగ్ అందుబాటులో ఉండవు. అమెజాన్ ప్రైమ్ లైట్లో ఏడాది సబ్స్క్రిప్షన్ మాత్రమే ఉంది. కాగా ఏడాది ప్రారంభంలో కొంతమంది వినియోగదారులతో ప్లాన్ను పరీక్షించడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. (యూట్యూబర్లకు గుడ్ న్యూస్, 500 చాలట!) -
జియో యూజర్లకు గుడ్న్యూస్: ఐదు కొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్, ఆఫర్లేంటో చూడండి!
సాక్షి, ముంబై: ముఖేశ్ అంబానీకి చెందిన టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం ఐదు కొత్త ప్లాన్లను లాంచ్ చేసింది. రూ.269 -రూ. 789మధ్య వీటిని తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆప్లాన్లలో జియో సావన్ ప్రో సబ్స్క్రిప్షన్ను కూడా పొందవచ్చు. కొత్త జియో ప్లాన్లలో అపరిమిత డేటా, యాడ్-ఫ్రీ మ్యూజిక్, లిమిట్లెస్ డౌన్లోడ్లు, అత్యుత్తమ ఆఫ్లైన్ మ్యూజిక్ క్వాలిటీ, JioSaavn సబ్స్క్రిప్షన్తో జియో టూన్స్ ఫీచర్లను యాక్సెస్ ఉంటుంది. ప్లాన్లు, ఆఫర్లు రూ. 269 ప్లాన్ :ఈ ప్లాన్ 28 రోజుల చెల్లుబాటులో ఉంటుంది. అపరిమిత, ఉచిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5జీబీ డేటా, అలాగే రోజుకు 100SMSలు ఉచితం. (MRF బెలూన్లు అమ్మి, కటిక నేలపై నిద్రించి: వేల కోట్ల ఎంఆర్ఎఫ్ సక్సెస్ జర్నీ) రూ. 529 ప్లాన్ : రోజుకు 1.5GB డేటా, అపరిమిత కాలింగ్, రోజుకు 100SMS అందిస్తుంది. ప్లాన్ వాలిడిటీ 56 రోజులు. ఇంకా Jio సూట్ యాప్లకు యాక్సెస్ ఉచిత Jio Saavn సబ్స్క్రిప్షన్ (షావోమీ సరికొత్త ట్యాబ్లెట్ వచ్చేసింది, ధర, ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?) రూ.589 ప్లాన్: 56 రోజుల వాలిడిటీతో వస్తున్న జియో రూ.589 ప్లాన్లో ప్రతిరోజూ 2జీబీ డేటా వాడుకోవచ్చు. అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS Jio సూట్ యాప్లకు ఉచిత యాక్సెస్ రూ.739 ప్లాన్: 84 రోజుల చెల్లుబాటు. రోజుకు 1.5జీబీ డేటాను అందిస్తుంది. అంటే మొత్తం 126 జీబీ డేటా. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలు. రూ. 789 ప్లాన్: 84 రోజుల వాలిడిటీ. రోజుకు 2జీబీ హై-స్పీడ్ డేటా. ఇంకా అన్లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 SMSలు ఉచితం. JioSaavn Pro, JioTV, JioCinema, JioSecurity , JioCloudతో సహా Jio యాప్లకు ఉచిత సభ్యత్వం ఇతర ప్రయోజనాలను ఆస్వాదించవచ్చు. -
వారికి గుడ్న్యూస్ చెప్పిన ఎలాన్ మస్క్: ఇక డబ్బులే డబ్బులు!
సాక్షి,ముంబై: ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్ గుడ్ న్యూస్ చెప్పారు. వెరిఫైడ్ కంటెంట్ క్రియేటర్స్కు డబ్బులు చెల్లించనున్నట్టు వెల్లడించారు. కంటెంట్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ఆధారంగా ఈ చెల్లింపులు చేయనున్నట్టు మస్క్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. రానున్న కొద్ది వారాల్లో ఈ చెల్లింపులను మొదలు పెడతామని మస్క్ తెలిపారు. అయితే ధృవీకరించబడిన వినియోగదారులను మాత్రమే పరిగణనలోకి తీసుకోనున్నామని మస్క్ స్పష్టం చేశారు. ఈ చెల్లింపుల నిమిత్తం సుమారు రూ. 41.2 కోట్లు (5 మిలియన్ డాలర్లు) కేటాయించినట్టు తెలిపారు. మస్క్ తాజా నిర్ణయం ప్రకారం యూట్యూబర్స్ మాదిరిగా ట్వీపుల్ కూడా తమ కంటెంట్లో రిప్లై సెక్షన్లో డిస్ప్లే అయ్యే యాడ్స్ ప్రకారం డబ్బులు సంపాదించవచ్చు. (1200 లోన్తో మొదలై.. రూ 2.58 లక్షల కోట్లకు) కాగా గత ఏడాది అక్టోబర్లో ఎలాన్ మస్క్ ట్విటర్ను కొనుగోలు చేసినప్పటి నుండి, ప్రకటనదారులనుంచి పెనుసవాళ్లను ఎదుర్కొంటోంది ట్విటర్. మరోవైపు ట్విటర్ సీఈవోగా అడ్వర్టైజింగ్ ప్రొఫెషనల్ లిండా యాకారినో పదవి చేపట్టిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం ప్రకటనల పరిశ్రమలో ఆమెకున్న విస్తృతమైన నేపథ్యం , సరికొత్త వ్యూహాలతో భారీ ఆదాయ సమకూరనుందని అంచనా. (డిజిటల్ చెల్లింపుల్లో ఇండియా రికార్డ్: విశేషం ఏమిటంటే!) In a few weeks, X/Twitter will start paying creators for ads served in their replies. First block payment totals $5M. Note, the creator must be verified and only ads served to verified users count. — Elon Musk (@elonmusk) June 9, 2023 -
షాకింగ్: 100కు పైగా డేంజరస్ యాప్స్, వెంటనే డిలీట్ చేయకపోతే
యాప్స్కు సంబంధించి యూజర్లకు మరో షాకింగ్న్యూస్. స్మార్ట్ ఫోన్లను హ్యాక్ చేసి భయంకర వైరస్లను ఆండ్రాయిడ్ యాప్స్ ద్వారా డేటాను కొట్టేస్తున్న కేటుగాళ్లపై తాజా పరిశోధన సంచలన విషయాలను వెల్లడించింది. తాజాగా గూగుల్ ప్లే స్టోర్లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన అత్యంత ప్రమాదకరమైన మాల్వేర్ను పరిశోధకులు గుర్తించారు. గూగుల్ ప్లే స్టోర్ లోని 100 కంటే ఎక్కువ యాప్లకు సోకిన ‘స్పిన్ ఓకే’ అనే కొత్త స్పైవేర్ను ఇటీవల గుర్తించారు. పైగా ఈ యాప్స్ 400 మిలియన్లకు పైగా డౌన్లోడ్లు నమోదైనాయి, అంటే దాదాపు 40 కోట్ల మంది సైబర్ ముప్పులో పడిపోయినట్టే. రోజువారీ రివార్డ్లు, మినీ గేమ్లను ద్వారా ఈ ట్రోజన్ మాల్వేర్ నిజమైందిగా కనిపిస్తుందని, వినియోగదారులను ఆకర్షిస్తుందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ విషయాన్ని గూగుల్కి తెలియజేసి. వాటిని తొలగించినప్పటికీ, ఇలాంటి డేంజరస్ యాప్స్పై అప్రమత్తంగా ఉండాలని పరిశోధకులు సూచిస్తునారు. భవిష్యత్తులో ఇలాంటి యాప్లను గుర్తించి, డౌన్లోడ్ చేయొద్దని హెచ్చరించారు. (బుగట్టి రెసిడెన్షియల్ టవర్...నెక్ట్స్ లెవల్: దిమ్మదిరిగే ఫోటోలు) ప్రభావితమైన యాప్లు ఇవే నాయిజ్: వీడియో ఎడిటర్ విత్ మ్యూజిక్ జాప్యా: ఫైల్ బదిలీ, షేర్ వీఫ్లై: వీడియో ఎడిటర్&వీడియో మేకర్ ఎంవీ బిట్- ఎంవీ వీడియో స్టేటస్ మేకర్ బియూగో- వీడియో మేకర్&వీడియో ఎడిటర్ క్రేజీ డ్రాప్ క్యాష్జైన్ – క్యాష్ రివార్డ్ ఫిజ్జో నావల్ – ఆఫ్లైన్ రీడింగ్ క్యాష్ ఈఎం: రివార్డ్స్ టిక్: వాట్ టు ఎర్న్ మాల్వేర్ సోకిన యాప్లను ఎలా గుర్తించాలి ♦ యాప్ అనుమతులను చెక్ చేసుకోవాలి.యాక్సెస్ లేదా నెట్వర్క్ కనెక్టివిటీ వంటి వాటిని పరిశీలించాలి. ♦ నకిలీ ఆఫర్లు లేదా రివ్యూస్లో అధిక ప్రకటనలుంటే పట్ల జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అభిప్రాయానికి, సపోర్ట్కు స్పందించే డెవలపర్ల విశ్వసనీయతను గమనించాలి. ♦ ఇన్స్టాల్ల-టు-రివ్యూల రేషియోను గమనించాలి. ఇన్స్టాల్ల-టు-రివ్యూల నిష్పత్తి ఎంత; ఎంతమంది యాప్ను ఇన్స్టాల్ చేసారనే దానితో పోలిస్తే ఎంతమంది రివ్యూ చేశారనేది చూడాలి. డౌన్లోడ్లకు మించి రివ్యూలుంటే అనుమానించాల్సిందే. ♦ యాప్ డెవలపర్ని ఇతర సోషల్మీడియా హాండిల్స్, చట్టబద్ధతను చూడాలి. (మనవరాలికోసం అంబానీ ఏం చేశారో తెలుసా? ఇంటర్నెట్లో వీడియో వైరల్) ♦ స్పెల్లింగ్ లేదా వ్యాకరణ లోపాలు, అస్పష్టమైన సమాచారం లేదా యాప్ ఫంక్షనాలిటీ వివరాల కొరత గురించి జాగ్రత్తగా గమనించాలి. ♦ పాస్వర్డ్లు లేదా క్రెడిట్ కార్డ్ వివరాల వంటి సున్నితమైన డేటాను అభ్యర్థించే యాప్ల జోలికి అసలు వెళ్ల వద్దు. ముఖ్యంగా యాప్లను డౌన్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్త గా ఉండాలి. యాప్ అనుమానాస్పదంగా అనిపిస్తే, ఇన్స్టాల్ చేయకపోవడమే మంచిది. మరిన్ని బిజినెస్ వార్తలు, అప్డేట్స్ కోసం చదవండి:సాక్షిబిజినెస్ -
యూజర్లకు ఊహించని షాక్ ఇచ్చిన నెట్ ఫ్లెక్స్
-
ఫోన్పే యూజర్లకు బంపరాఫర్.. దేశంలోనే తొలిసారిగా..
Phonepe Link 2 Lakh Rupay Credit Cards To Upi : ప్రముఖ ఫిన్టెక్ దిగ్గజం ఫోన్పే యూపీఐ(యునిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్)కు 2 లక్షల రూపే క్రెడిట్ కార్డులను విజయవంతంగా అనుసంధానం చేసింది. దీంతో రూపే క్రెడిట్ కార్డ్ సాయంతో యూజర్లు, వ్యాపారస్థులు నగదు చెల్లింపులు చేసుకోవచ్చు’ అని ఐఏఎన్ఎస్ నివేదిక పేర్కొంది. ఇప్పటికే రూపే క్రెడిట్ కార్డ్తో యూపీఐ టోటల్ పేమెంట్ వ్యాల్యూ (టీపీవీ) రూ. 150 కోట్ల వరకు చేరుకోగా.. తొలిసారి క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి యూపీఐ చెల్లింపులు చేయడం తొలి సంస్థగా గుర్తింపు పొందింది. చెల్లింపు సమస్యలకు పరిష్కార మార్గంగా యూపీఐ నిర్వహణ సంస్థ ఎన్సీపీఐ భాగస్వామ్యంతో రూపే క్రెడిట్ కార్డ్ను అందుబాటులోకి తెచ్చామని ఫోన్పే వెల్లడించింది. యూజర్లు, వ్యాపారులు రూపే క్రెడిట్ కార్డ్తో యూపీఐ చెల్లింపులు చేస్తున్నట్లు సూచించింది. దేశ వ్యాప్తంగా 12 మిలియన్ల మర్చెంట్ అవుట్ లెట్లలో ఆమోదం పొందినట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. ఫోన్పే యూపీఐ ద్వారా రూ.2లక్షల క్రెడిట్ కార్డ్ను ఉపయోగించి చెల్లింపులు జరిపేలా ఎన్పీసీఐ భాగస్వామ్యంతో చేతులు కలపడం సంతోషం వ్యక్తం చేస్తున్నాం. అటు కస్టమర్లు, ఇటు వ్యాపారులు జరిపే చెల్లింపుల్ని మరింత సులభతరం చేసేలా క్రెడిట్ కార్డ్ ఈకో సిస్టంను అభివృద్ధి చేయడం శుభపరిణామమని ఫోన్పే కన్జ్యూమర్ ప్లాట్ఫామ్ అండ్ పేమెంట్స్ వైస్ప్రెసిడెంట్ సోనికా చంద్రా తెలిపారు. చదవండి👉 చంద్రుడిపై రొమాన్స్.. రూ.158 కోట్లు నష్టం! -
Apple iPhone 15 ప్రో మ్యాక్స్ కెమెరాపై భారీ అంచనాలు, మురిసిపోతున్న యూజర్లు
సాక్షి, ముంబై: టెక్నాలజీ దిగ్గజం యాపిల్ కొత్త ఐఫోన్ను లాంచ్ చేస్తోందటే చాలు.. మార్కెట్లో సందడి మామూలుగా ఉండదు. ఎప్పటికప్పుడు గణనీయమైనమార్పులతో కొత్త సిరీస్లను రిలీజ్ చేస్తూ ఐఫోన్ లవర్స్ను ఆకట్టుకుంటున్న యాపిల్ త్వరలోనే ఐఫోన్ 15 సిరీస్ను లాంచ్ చేయనుంది. దీంతో ఐఫోన్ సిరీస్ 15 ఫీచర్లపై తీవ్ర ఆసక్తి నెలకొంది. రోజుకొక కొత్త లీక్ ఐఫోన్ లవర్స్ను ఊరిస్తోంది. ముఖ్యంగా కెమెరా విషయంలో యూజర్లను ఆకట్టుకునేందుకు రడీ అవుతోంది. తాజా నివేదికల ప్రకారం ఐఫోన్ 15 ప్రో మాక్స్ స్మార్ట్ఫోన్లో పెరిస్కోప్ జూమ్ లెన్స్ ఉన్న కొత్త 48ఎంపీ సోనీ సెన్సార్ను వినియోగిస్తోందట. ఐస్ యూనివర్స్ అంచనా ప్రకారం, అధునాతన Sony IMX903 48MP యూనిట్ని ఇందులో ఉపయోగిస్తుంది. ఇటీవల లాంచైన షావోమి 13 అల్ట్రాలోని కెమెరాలానే ప్రధాన సెన్సార్ (సుమారం ఒక అంగుళం) ఉంటుందని టిప్పర్ ట్వీట్ చేయడం గమనార్హం. కాగా గత ఏడాది రిలీజ్ అయిన ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్లు సక్సెస్ అయ్యాయి. యాపిల్ కంపెనీ డైనమిక్ ఐలాండ్ ,కెమెరా ఫీచర్లతో తీసుకొచ్చినట్టుగానే 15 సిరీస్ మోడల్స్లో కీలక మార్పులు ఉంటాయని అంచనాలు భారీగా నెకొలన్నాయి. 6x జూమ్కు మద్దతు ఇచ్చేపెరిస్కోప్ లెన్స్ ఫీచర్తో పవర్ఫుల్ కెమెరాతో వస్తున్న తొలి ఐఫోన్ కానుందని అంచనా. కొత్త టెక్నాలజీతో తీసుకొస్తుందని భావిస్తున్న ఐఫోన్ 15 సిరీస్ ఈ ఏడాది చివర్లో లాంచ్ కానుంది. The iPhone's main camera is improving every year, which is commendable, with 15pm approaching 1 ". iPhone 15 Pro Max :IMX903,≈1” iPhone 14 Pro:48MP, IMX803,1/1.28 iPhone 13 Pro:12MP,IMX703,1/1.63 iPhone 12 Pro:12MP, IMX603,1/1.78 iPhone 11 Pro:12MP, IMX503, 1/2.55 — Ice universe (@UniverseIce) April 23, 2023 -
నెట్ఫ్లిక్స్ స్కాం 2023 కలకలం: ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!
న్యూఢిల్లీ: సైబర్ నేరగాళ్లు డేటా చోరీకి, ఆన్లైన్లో వినియోగదారులను మోసం చేసేందుకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. అధునాతన టెక్నిక్స్తో హ్యాకర్లు చెలరేగిపోతున్నారు. తాజాగా నెట్ఫ్లిక్స్ స్కామ్ ఒకటి వెలుగులో వచ్చింది. హ్యాకర్లు ఫిషింగ్ ప్రచారం ద్వారా వినియోగదారుల చెల్లింపు వివరాలను చోరీ చేస్తున్నారు. (సవాళ్లెన్నైనా సాహసమే: రూ.1.1 లక్షల కోట్ల కంపెనీకి వారసురాలు నిసాబా) నెట్ఫ్లిక్స్ స్కామ్ 2023 చెక్ పాయింట్ రీసెర్చ్ గుర్తించింది. చెక్ పాయింట్ సాఫ్ట్వేర్లోని డేటా గ్రూప్ మేనేజర్ ఒమర్ డెంబిన్స్కీ, వీలైనంత ఎక్కువ మంది వ్యక్తిగత సమాచారాన్ని పొందడానికి హ్యాకర్లు ఫిషింగ్ ప్రయత్నాలను ప్లాన్ చేస్తాయని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో, నెట్ఫ్లిక్స్ ఫిషింగ్ ప్రచారంలో ఎటాక్ చేసినట్టుగా గుర్తించింది. మరికొన్ని చెల్లింపు వివరాలను తస్కరించేందుకు ప్రయత్నించాయని తెలిపింది. యూజర్ ఏదైనా ఒక పేమెంట్ చేసినపుడు హ్యాకర్లు చొరబడతారు. తదుపరి బిల్లింగ్ అపుడు నెట్ఫ్లిక్స్ ఖాతా తాత్కాలికంగా నిలిపివేయబడిందంటూ ఫేక్ ఐడీనుంచి ఇమెయిల్ వస్తుంది. అంతేకాదు సభ్యత్వాన్ని పునరుద్ధరించు కోండంటూ ఒక లింక్ను కూడా షేర్ చేస్తుంది. ఆ లింక్ను నమ్మి వివరాలు అందించారో వారి పని సులువు అవుతుంది. ఈ లింక్ వారి క్రెడిట్ కార్డ్ సమాచారం కోసం ఉద్దేశించిన మోసపూరిత వెబ్సైట్కి మళ్లించి మోసానికి పాల్పడతారు. బ్రాండ్ ఫిషింగ్ దాడులకు గురయ్యే వారిలో ఎక్కువ మంది టెక్-అవగాహన లేని వారేనని చెక్ పాయింట్ తెలిపింది. ఈనేపథ్యంలో అయాచిత ఇమెయిల్స్ లేదా సందేశాలను స్వీకరించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ సూచించింది.ముఖ్యంగా అక్షరదోషాలు, తప్పుగా వ్రాసిన వెబ్సైట్లు, సరికాని తేదీలు ,మోసపూరిత ఇమెయిల్ లేదా లింక్ను సూచించే ఇతర కారకాలు వంటి ప్రమాద సంకేతాలను గుర్తించాలని ఇందుకు సిబ్బందికి అవసరమైన శిక్షణ ఇవ్వాలని డెంబిన్స్కీ సలహా ఇచ్చారు. డిసెంబర్ 2022లో, ముంబైకి చెందిన 74 ఏళ్ల వ్యక్తి తన నెట్ఫ్లిక్స్ ఖాతాను పునఃప్రారంభించే ప్రయత్నంలో 1,200 డాలర్లను కోల్పోయాడనీ పాస్వర్డ్ను రీసెట్ చేయడానికి లేదా సబ్స్క్రిప్షన్ను పునరుద్ధరించడానికి వినియోగదారుని అభ్యర్థించే ఇమెయిల్ మూలాన్ని తప్పనిసరిగా ధృవీకరించాలని హెచ్చరించింది. తాజా పరిణామంపై నెట్ఫ్లిక్స్ అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. (Twitter Down: ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!) ఎలా గుర్తించాలి ఆన్లైన్లో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి, ఎల్లప్పుడూ పంపినవారి గుర్తింపును ధృవీకచుకోవాలి. ఏదైనా సున్నితమైన సమాచారాన్ని నమోదు చేయడానికి ముందు వెబ్సైట్ URLని తనిఖీ చేయాలి. యాంటీ-ఫిషింగ్ సాఫ్ట్వేర్ను ఉపయోగించాలి. తాజా భద్రతా ప్యాచ్లతో అప్డేట్ చేయడం ద్వారా ఫిషింగ్ దాడులకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. సైబర్ నేరగాళ్లకి అవకాశం ఇవ్వకుండా నిరంతరం అప్రతమత్తంగా ఉండాలి. -
ట్విటర్ డౌన్, మీకు పనిచేస్తోందా? నెటిజన్లు గగ్గోలు!
న్యూఢిల్లీ:సోషల్ మీడియా ప్లాట్ఫాం ట్విటర్ యూజర్లకు మరో ఎదురు దెబ్బ. ఇప్పటికే బ్లూటిక్ పోవడంతో హతాశులైన యూజర్లు చాలామందికి ఇపుడిక ట్విటర్ లోడ్ కూడా కావడం లేదు. ప్రస్తుతం చాలామంది వినియోగదారులకు మైక్రో బ్లాగింగ్ సేవలు అందుబాటులో లేవు. ప్రధానంగా డెస్క్టాప్ యూజర్లకు ‘దిస్ పేజ్ ఈజ్ డౌన్’ అనే సందేశం కనిపిస్తోంది. అయితే తొందరలోనే లోపాన్ని సవరిస్తామనే మెసేజ్ దర్శనమిస్తోంది. దీంతో ట్విటర్ మీకు పనిచేస్తోందా అంటూ నెటిజన్లు తెగ ఎంక్వయిరీ చేస్తున్నారు. ఇదీ చదవండి: Twitter Blue Tick: బడా బిజినెస్మేన్లకూ షాకిచ్చిన మస్క్! ట్విటర్-డౌన్ ట్విటర యాప్ లేదా వెబ్సైట్ (డెస్క్టాప్, మొబైల్ రెండూ)చాలావరకు పని చేయలేదు. మొబైల్ సైట్ని యాక్సెస్ చేసినప్పుడు, ప్రస్తుతం ‘మీ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ కనెక్షన్ ప్రైవేట్ కాదు’ లేదా ‘ఈ సైట్ని చేరుకోవడం సాధ్యం కాదు’ అని లాంటి మెసేజెస్ కనిపించింది. ఈ సమస్య ఎంత విస్తృతంగా వ్యాపించిందనే దాని గురించి ప్రస్తుతం ఎటువంటి సమాచారం లేదు, అయితే దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఈ సమస్య ఉన్నట్టు కొన్ని నివేదికల ద్వారా తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ సమస్యను పరిష్కరించేందుకు కంపెనీకి ఎంత సమయం పడుతుంది అనే దానిపై కూడా స్పష్టత లేదు. కాగా శుక్రవారం ఉదయం నుంచి సెలబ్రిటీలకు బ్లూటిక్ తీసివేయడంతో కలకలం రేగింది. దీంతో యూజర్లు జోక్స్, మీమ్స్తో ట్విటర్పై విమర్శలు గుప్పిస్తున్నారు. Elon Musk be like.#BlueTick pic.twitter.com/hlB9NxDKgd — Farhan Khan (@babarazam215) April 21, 2023 ట్విటర్ను టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ టేకోవర్ తర్వాత చేసిన పలు మార్పుల్లో భాగంగా బ్లూ టిక్ వెరిఫికేషన్ ఫీజును తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. బ్లూటిక్ కావాలనుకునే యూజర్లు బ్లూటిక్ కోసం నెలవారీ రుసుము చెల్లించాలి. -
నిలిచిపోయిన నెట్ఫ్లిక్స్.. సబ్స్క్రయిబర్ల పరేషాన్
ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫాం నెట్ఫ్లిక్స్ ప్రసారాలు ఆదివారం (ఏప్రిల్ 16) కొంత మంది సబ్స్క్రయిబర్లకు నిలిచిపోయాయి. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్సైట్ Downdetector.com ప్రకారం.. ఆదివారం సాయంత్రం యునైటెడ్ స్టేట్స్లో 11,000 కంటే ఎక్కువ మంది యూజర్లకు నెట్ఫ్లిక్స్ ప్రసారాల్లో అంతరాయం ఏర్పడింది. (Dulquer Salmaan: రూ.3 కోట్లు పెట్టి దుల్కర్ సల్మాన్ కొన్న కొత్త కారు ఏంటో తెలుసా?) భారత కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 5 గంటలకు తలెత్తిన అంతరాయం 6.49 గంటలకు ముగిసింది. దీంతో ‘లవ్ ఈజ్ బ్లైండ్: ది లైవ్ రీయూనియన్’ స్ట్రీమింగ్ ఆలస్యం అయింది. వెనెస్, నిక్ లాచీ హోస్ట్ చేసిన ఈ కార్యక్రమం లాస్ ఏంజెల్స్ నుంచి సాయంత్రం 5 గంటలకు ( భారత కాలమానం ప్రకారం ఉదయం 5:30) ప్రారంభం కావాల్సిఉంది. ఈ షో కోసం సబ్స్క్రయిబర్లు ప్రారంభ సమయానికి 10 నిమిషాల ముందే నుంచి వేచిఉన్నారు. ఇంతలో అంతరాయం తలెత్తడంతో ఒక గంటకు పైగా యూజర్లు వేచిఉన్నారు. ఈ కార్యక్రమ ప్రసారం చివరకు సాయంత్రం 6:16 (పసిఫిక్ కాలమానం) గంటలకు ప్రారంభమైంది. ఆలస్యంగా మేల్కొన్న నెట్ఫ్లిక్స్ యూజర్లకు క్షమాపణలు చెప్పింది. లవ్ ఈజ్ బ్లైండ్ లైవ్ రీయూనియన్ షో స్ట్రీమింగ్ ఆలస్యమైనందుకు చింతిస్తున్నామంటూ సాయంత్రం 6:29 గంటల (పసిఫిక్ కాలమానం) సమయంలో ట్వీట్ చేసింది.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ప్రశాంతంగా జాతర జరుపుకోవాలి
నేరచరిత లేనివారిని బైండోవర్ చేయొద్దు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి
టమాట సీజన్ ప్రారంభం
No Headline
కూడేరులో జూనియర్ కాలేజ్ ఏర్పాటు
బాధ్యతగా విధులు నిర్వర్తించండి
ఆ ఇద్దరు టీచర్లపై విద్యాశాఖ ప్రేమ
ఆకట్టుకున్న మాక్డ్రిల్
27 నుంచి విజయవాడ రైలు రద్దు
తప్పక చదవండి
- అందుకే నా పేరుకి బ్లూ చేర్చా: ‘పుష్ప పుష్ప..’ సింగర్
- ‘బీజేపీ చేయలేని పని రాహుల్ చేస్తున్నారు’
- అంబానీల అతిథులకు కరీంనగర్ కానుకలు
- కన్హయ్యకు రూ. 52 లక్షలు? ఎవరెవరిచ్చారు?
- తెలుగు రాష్ట్రాల్లో డెత్ ట్రావెల్స్
- ఛాన్స్ వచ్చినా మోదీ బయోపిక్లో నటించను: సత్యరాజ్
- భారత సంతతి శాస్త్రవేత్తకు ‘షా’ అవార్డ్
- Daily Horoscope: ఈ రాశి వారు ఊహించని కార్యాల్లో పాల్గొనే అవకాశం
- మరీ ఇంత ‘పచ్చ’పాతమా!
- రాయల్స్ ముందుకు...చాలెంజర్స్ ఇంటికి...
Advertisement