-
భర్తతో పుణ్యక్షేత్రాల చుట్టూ తిరుగుతున్న నయనతార.. కారణం ఇదేనా?
సౌత్ ఇండియా లేడీ సూపర్స్టార్గా గుర్తింపు పొందిన నయనతార సిండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు దశాబ్ధాలు దాటినా ఆమె క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే దర్శకుడు విఘ్నేష్ శివన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అనంతరం ఆమె కాస్మొటిక్స్ వ్యాపారంలో కూడా అడుగుపెట్టింది. తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా గడుపుతున్న సమయంలో ఈ మధ్య ఎక్కువగా ఆమె పలు దేవాలయాల చుట్టు తిరుగుతూ తన భర్తతో కలిసి పూజలు నిర్వహిస్తుంది. దీంతో వరుసగా పుణ్యక్షేత్రాలు, ప్రత్యేక పూజలు చేయడం వెనుక కారణం ఏమైనా ఉందా..? ఆమె జాతకంలో దోశం ఏమైనా ఉందా..? ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ఒకటే చర్చ జరుగుతుంది.నయనతార జాతకంలో దోషం ఉందని, అందుకే విక్కీతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు ఆమె పలు దేవాలయాలను సందర్శిస్తూ పూజలు, పరిహారాలు చేస్తోందని ఓ వార్త వైరల్ అవుతోంది. సినిమాలకు కూడా కాస్త బ్రేక్ ఇచ్చి మరీ.. పుణ్యక్షేత్రాల చుట్టూ ఆమె తిరగడం విశేషం. వాస్తవంగా నయనతారకు కాస్త దైవభక్తి ఎక్కువేనని చెప్పవచ్చు. తన వివాహం అయిన వెంటనే ఆ పట్టు వస్త్రాలతోనే తిరుమల శ్రీవారిని ఆమె సందర్శించిన విషయం తెలిసిందే. వారి పెళ్లి ముహూర్తాన్ని తిరుమల తిరుపతికి సంబంధించిన పండితులు నిర్ణయించినట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కొద్దిరోజుల క్రితం నయన్,విక్కీ విడిపోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. దీంతో వారు క్లారిటీ ఇవ్వడంతో ఆ రూమర్స్కు ఫుల్స్టాప్ పడింది. ఇలాంటి వార్తలు వచ్చిన కొద్దిరోజుల తర్వాత నయనతార జంటగా పలు పుణ్యక్షేత్రాలను సందర్శించారు. అంతేకాదు తమ జాతకంలో దోషాల నివారణకై పలు పూజలు, హోమాలు కూడా నిర్వహించారు. నయనతార జాతకంలో చిన్నపాటి దోషం ఉన్నట్టు పండితులు చెబుతున్నారని సమాచారం. తన భర్తతో కలిసి సంతోషంగా జీవించేందుకు పలు పూజలు చేస్తున్నట్లు తెలుస్తోంది. -
డైరెక్టర్ శంకర్ కూతురి రెండో పెళ్లి.. ఆశీర్వదించిన సెలబ్రిటీలు (ఫోటోలు)
-
ఆ హీరో వల్లే ఒక్కటైన నయన్-విఘ్నేశ్ (ఫోటోలు)
-
నయన్- విఘ్నేశ్లను కలిపిన స్టార్ హీరో ఎవరంటే?
నయనతార- విఘ్నేశ్ శివన్.. దక్షిణాది చిత్రపరిశ్రమలోనే స్టార్ కపుల్. నయనతార హీరోయిన్గా నటించిన నానుమ్ రౌడీ దాన్ (2015) సినిమాకు విఘ్నేశ్ (విక్కీ) దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో నేను రౌడీ అనే టైటిల్ పేరిట రిలీజైంది. ఆ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్లపాటు ప్రేమలో మునిగి తేలిన ఈ జంట 2022 జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సరోసగి ద్వారా ఉయిర్, ఉలగం అని ఇద్దరు కుమారులకు తల్లిదండ్రులయ్యారు. ఇకపోతే వీరి మధ్య లవ్ పుట్టడానికి ఓ స్టార్ హీరో కారణమంటున్నాడు విక్కీ. తాజాగా అతడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నానుమ్ రౌడీ ధాన్ కథ నయనతారకు చెప్పమని ధనుష్ సరే సూచించాడు. అలా ఆమె ఈ సినిమాలోకి వచ్చింది. మొదట్లో ఈ స్క్రిప్ట్ నచ్చలేదన్న విజయ్ సేతుపతి నయన్ ఓకే చేసిందనగానే తను కూడా సంతకం చేశాడు. ఈ సినిమా వల్ల నయన్కు ఎక్కువ సమయం కేటాయించాను. తెలియకుండానే ఇద్దరం ప్రేమలో పడిపోయాం. ఒకరకంగా మా ప్రేమకు ధనుషే కారణమయ్యాడు' అని చెప్పాడు. నానుమ్ రౌడీ ధాన్ మూవీకి ధనుష్ నిర్మాతగా వ్యవహరించాడు. -
Nayanthara-Vignesh Shivan Photos: భర్తను వదిలి ఉండలేకపోతున్న నయనతార
-
20 రోజులు దూరంగా.. భర్త కోసం అల్లాడిపోయిన నయనతార
కోలీవుడ్లో సంచలన జంట ఎవరైనా ఉన్నారంటే అది నయనతార, విఘ్నేశ్ శివన్నే. వీరు సుదీర్ఘ ప్రేమలో ఉన్న తరువాత పెళ్లికి సిద్ధం అయ్యారు. 2022 జూన్ 9వ తేదీన వివాహం చేసుకున్నారు. అలాగే సరోగసి విధానం ద్వారా కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. వారికి ఉయిర్, ఉలగం అని నామకరణం చేశారు. పెళ్లికి ముందు వరకూ పుట్టిన రోజులు, పండుగలు అంటూ ట్రిప్పుకు వెళ్తూ.. ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసేవారు. రాక కోసం ఎదురుచూశాం ఇప్పుడు తమ కవల పిల్లలతో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటున్నారు. తాజాగా విదేశానికి వెళ్లిన భర్త విఘ్నేశ్ శివన్ను ఎంతగానో మిస్ అయ్యామంది నయనతార. తాను, తన పిల్లలు అతడి రాకకోసం ఎదురు చూశామని, విఘ్నేశ్ శివన్ తిరిగి వచ్చిన తరువాత ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారో తెలుపుతూ ఇన్స్ట్రాగామ్లో ఫోటోలు షేర్ చేసింది. మాటల్లో చెప్పలేం.. విఘ్నేశ్ శివన్ ప్రస్తుతం ఏల్ఐసీ అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా, నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ కోసం ఇటీవల సింగపూర్ వెళ్లారు. ఈ చిత్రం సింగపూర్ షెడ్యూల్ పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా నయనతార తన ఇన్స్ట్రాగామ్లో '20 రోజుల ఎదురుచూపుల తర్వాత నిన్ను చూస్తుంటే మాకెంత సంతోషంగా ఉందో మాటల్లో చెప్పలేము. నిన్ను ఎంతో మిస్ అయ్యాం' అని పేర్కొన్నారు. అందులో పిల్లలతో కలిసున్న ఫొటోలను పోస్ట్ చేశారు. అవి ఇప్పుడు నెట్టింట వైరల్గా మారాయి. View this post on Instagram A post shared by N A Y A N T H A R A (@nayanthara) View this post on Instagram A post shared by Vignesh Shivan (@wikkiofficial) -
భర్తతో నయనతార ఎప్పటికీ విడిపోదు.. అసలు సీక్రెట్ ఏమిటంటే
సౌత్ ఇండియాలో నిత్యం వార్తల్లో ఉండే హీరోయిన్ నయనతార. ఆమె సినీ పయనం ఒక సంచలనం. అవమానాలు, ఆరోపణలు, వివాదాలమయ జీవితం. అయితే అందులోనూ ఆనందాన్ని వెతుక్కుంటూ అకుంఠిత శ్రమతో నంబర్ వన్ నటి అనే అంతస్తులో నిలిచారు. సూపర్ స్టార్గా అత్యంత అధిక పారితోషికం తీసుకుంటున్న ఇండియన్ నాయకిగా రాణిస్తున్నారు. రెండు మూడు సార్లు ప్రేమలో ఓడిపోయి చివరికి దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమను పొంది, ఆయనతో గత రెండేళ్ల క్రితం ఏడు అడుగులు వేశారు. ఇప్పుడు వీరికి ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం కథానాయకిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా రాణిస్తున్న నయనతార తనకు సంబంధించిన సినీ, వ్యక్తిగత విషయాలను ఇన్స్ట్రాగామ్లో పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్ టైన్ చేయడంతో పాటు అప్పుడప్పుడు వివాదాస్పదమైన విషయాలను పొందుపరుస్తూ షాకింగ్కు గురి చేస్తుంటారు. భర్త విగ్నేష్ శివన్, పిల్లలు ఉయిర్, ఉలగంతో ఎంతో అన్యోన్యంగా ఉండే నయనతార ఇటీవల తాను ఓడిపోయాను అంటూ ఇన్స్ట్రాగామ్లో చేసిన పోస్ట్ అందరిని షాక్కు గురి చేసింది. దర్శకుడు విగ్నేశ్ శివన్తో మనస్పర్థలా? ఇద్దరు విడిపోతున్నారా? అసలు వీరి మధ్య ఏం జరుగుతోంది? అంటూ పలు ప్రశ్నలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఆ వెంటనే తన భర్త పిల్లలతో ఆనందంగా గడుపుతున్న ఫొటోలను ఆమె పోస్ట్ చేశారు. దీంతో అదంతా ఒక పబ్లిసిటీ స్టంట్ అని తేలిపోయింది. కాగా నయనతార విగ్నేష్ శివన్ విడిపోతారనే పదానికే తావు లేదని విశ్లేషకులు అంటున్నారు. నయనతార ఇతర రంగాల్లో పెట్టుబడులు పెట్టించడానికి సలహాలు ఇచ్చిందే విగ్నేష్ శివన్ అని, ఎంతో కష్టపడి కూడబెట్టిన ఆస్తులు, చేస్తున్న వ్యాపారాలకు ఆమె భర్త విగ్నేష్ శివన్ ఫౌండర్గానో, కో ఫౌండర్గానో ఉన్నారని, కాబట్టి విడిపోయే ఛాన్సే లేదని విశ్లేషకులు చెబుతున్న మాట. -
ఓడిపోయానంటూ పోస్ట్.. విఘ్నేష్ , నయనతారల మధ్య ఏం జరుగుతుంది?
నేను ఓడిపోయాను అని నటి నయనతార తన ఇన్స్ర్ట్రాగామ్లో పేర్కొన్నారు. ఇప్పుడిది పెద్ద చర్చకి దారి తీస్తోంది. లేడీ సూపర్స్టార్గా రాణిస్తున్న బహుభాషా నటి నయన తార. నాలుగు పదుల వయసులోనూ అగ్రకథా నాయకిగా రాణిస్తూ అత్యధిక పారితోషికం పు చ్చుకుంటున్న నటి ఈమె. ఇటీవల జవాన్ చిత్రం ద్వారా బాలీవుడ్కి ఎంట్రీ ఇచ్చి అక్కడ సక్సెస్ అందుకున్నారు. దీంతో ఈ సంచలన నటికి మరింత డిమాండ్ పెరిగిపోయింది. ప్రస్తుతం ఈమె తమిళంలో శశికాంత్ దర్శకత్వంలో టెస్ట్, యూ ట్యూబర్ డ్యూడ్ విక్కీ దర్శకత్వంలో మన్నాంగట్టి, తన భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో ఎల్ఐసీ, దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. అదే విధంగా తన భర్తతో కలిసి చిత్ర నిర్మాణం చేపట్టారు. మరో పక్క ఇతర వ్యాపార రంగాలలోనూ బిజీ గా వున్నారు. కాగా 2022లో దర్శకుడు విఘ్నేష్ శివన్ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా ఇటీవలే సరోగసి విధానం ద్వారా ఈ జంట ఉయిర్, ఉలగం అనే కవల పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు. వీరికి సంబంధించిన ఫొటోలను నయనతార తరచూ తన ఇన్స్ర్ట్రాగామ్లో పోస్ట్ చేస్తూ వస్తున్నారు. కాగా సమీప కాలంలో ఆమె తన భర్త విఘ్నేష్ శివన్ను అన్పాలో చేస్తూ చేసిన పోస్టు పెద్ద చర్చకే దారి తీసింది. దీంతో వీరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఆ ఇద్దరు విడిపోబోతున్నారా? అనే చర్చ జరుగుతోంది. దీనికి ఆజ్యం పోసే విధంగా తాజాగా నటి నయనతార నేను ఓడిపోయాను అంటూ ఇన్స్టాగ్రామ్లో పేర్కొనడం మరింత అలజడికి దారి తీస్తోంది. దీంతో విఘ్నేష్ శివన్, నయనతారల మధ్య అసలు ఏం జరుగుతోంది? నయనతార ఇలా పోస్ట్ చేయడానికి కారణం ఏమిటి? ఇదంతా వాస్తవమా? లేక ఏదైనా ఒక ప్రకటనలో భాగమా..? అనే చర్చ కోలీవుడ్లో జోరందుకుంది. -
నయనతార - విగ్నేష్ - విడాకులు ?
-
నయన్ - విఘ్నేశ్ జంటపై రూమర్స్.. ఆ ఫోటో షేర్ చేసిన భర్త!
లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి పరిచయం అక్కర్లేదు. సౌత్లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది షారుక్ సరసన జవాన్తో బాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల ఆమె నటించిన అన్నపూరణి పెద్దఎత్తున వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో ఓ వర్గం వారిని కించపరిచేలా సీన్స్ ఉన్నాయంటూ పలువురు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. దీంతో నెట్ఫ్లిక్స్ ఈ మూవీని ఓటీటీ నుంచి తొలగించింది. అయితే ఇటీవల నయన్ మరోసారి వార్తల్లో నిలిచింది. తన భర్తను ఇన్స్టాలో అన్ఫాలో చేయడంతో పెద్ద ఎత్తున రూమర్స్ మొదలయ్యాయి. గతేడాది పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట విడిపోనుందా? అనే అనుమానాలు తలెత్తాయి. కానీ అంతలోనే మళ్లీ తన భర్తను ఫాలో చేసింది. దీంతో ఈ జంట విడాకుల రూమర్స్కు చెక్ పెట్టింది. కానీ తాజా పరిణామాలతో వాటికి చెక్ పెడుతూ.. విఘ్నేశ్ శివన్ ఆమె ఫొటోను తన ఇన్స్టా స్టోరీలో షేర్ చేశారు. దీంతో ఈ జంటపై వస్తున్న రూమర్స్కు తెరపడింది. కాగా.. నయనతార ప్రస్తుతం ‘టెస్ట్’ సినిమాలో నటిస్తున్నారు. ఆర్.మాధవన్, సిద్ధార్థ్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్. శశికాంత్ తెరకెక్కిస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందుతున్న చిత్రంలో కుముద అనే పాత్రలో కనిపించనున్నారు. కాగా.. గత నెల ప్రేమికుల రోజు నయనతార.. తన భర్త ప్రేమను వర్ణిస్తూ విషెస్ చెబుతూ పోస్ట్ పెట్టిన సంగతి తెలిసిందే. -
భర్తను అన్ ఫాలో చేసిన నయనతార..
-
అన్ఫాలో.. ఫాలో!
అస్టార్ హీరోయిన్ నయనతార, ప్రముఖ దర్శకుడు విఘ్నేష్ శివన్ ప్రేమ వివాహం చేసుకున్న విషయం, కవల పిల్లలు (కుమారులు) ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ దంపతులు అన్యోన్యంగా కనిపిస్తారు. అలాంటిది తాజాగా తన భర్త విఘ్నేష్ శివన్ను నయనతార ఇన్స్టాగ్రామ్లో అన్ఫాలో కావడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ఖాతాని ప్రారంభించిన నయనతార తక్కువ సమయంలోనే 78 లక్షల మంది ఫాలోవర్స్ని సొంతం చేసుకున్నారు. ఇన్స్టాలో విఘ్నేష్ని ఫాలో అవుతూ వచ్చిన నయనతార అకస్మాత్తుగా అన్ఫాలో అయ్యారు. గత నెల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజున కూడా ‘మా ప్రేమ బంధానికి పదేళ్లు’ అంటూ భర్తతో ఉన్న ఫొటోలు షేర్ చేసిన నయనతార ఇప్పుడు ఇలా అన్ఫాలో కావడం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే సాంకేతిక కారణాల వల్లే అలా జరిగి ఉండొచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. కాగా అన్ఫాలో వార్త వైరల్ అయిన కొంత సమయానికి తిరిగి విఘ్నేష్ని ఫాలో అయ్యారు నయనతార. -
భర్తను అన్ఫాలో చేసిన నయనతార!
నయనతార.. సౌత్లో టాప్ హీరోయిన్, విఘ్నేశ్ శివన్.. కోలీవుడ్లో ప్రముఖ డైరెక్టర్. ఇద్దరూ ప్రేమించుకున్నారు. ఎన్నో అడ్డంకులు దాటి గతేడాది జూన్లో పెళ్లి చేసుకున్నారు. మొన్నటి ప్రేమికుల రోజున కూడా మా ప్రేమ బంధానికి పదేళ్లు అంటూ భర్తతో కలిసి ఉన్న ఫోటోలు షేర్ చేసింది. నయనతార గతేడాదే ఇన్స్టాగ్రామ్లో ఎంట్రీ ఇచ్చింది. అప్పటినుంచి భర్త విక్కీని ఫాలో అవుతూ వచ్చింది. కానీ సడన్గా ఇప్పుడు అతడిని అన్ఫాలో చేసింది. కన్నీటితో కూడా అదే మాట.. కన్నీళ్లు ఉబికి వస్తున్నప్పుడు కూడా.. ఇదే నాకు మిగిలిందని ఆమె చెప్పడం మానదు అంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఓ ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. అయితే జంటగా కలిసున్న ఫోటోలు మాత్రం ఇద్దరి సోషల్ మీడియా ఖాతాలో అలాగే ఉన్నాయి. దీంతో పొరపాటున అన్ఫాలో అయ్యారేమోనని కొందరు అభిప్రాయపడుతుండగా.. ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు మొదలయ్యాయా? ఎంతో ఆప్యాయంగా ఉండే వీరు కూడా విడిపోతారా? అసలేం జరిగింది? అంటూ తల పట్టుకుంటున్నారు. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బ్యూటీ కానీ అంతలోనే బిగ్ ట్విస్ట్ ఇచ్చిందీ బ్యూటీ. ఈ వార్త అంతటా పాకేలోపు ఇన్స్టాగ్రామ్లో భర్తను మళ్లీ ఫాలో అయింది. ఇది చూసిన అభిమానులు హమ్మయ్య.. అని ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకపోతే నయనతార గతేడాది జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. అట్లీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా వెయ్యికోట్లకు పైగా రాబట్టింది. తర్వాత ఆమె నటించిన అన్నపూరణి సినిమా ఎన్నో విమర్శలను మూటగట్టుకుంది. ప్రస్తుతం టెస్ట్ సినిమాలో నటిస్తోంది. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. -
మళ్లీ సక్సెస్ బాట పట్టేందుకు ప్లాన్ చేస్తున్న నయనతార
నయనతార వంటి ప్రముఖ నటీనటులకు అవకాశాలు తగ్గే చాన్స్ ఉండదు. ఒకవేళ తగ్గినా వారే స్వయంగా చిత్రాలను నిర్మించడానికి సిద్ధమవుతారు. కాగా ప్రస్తుతం నయనతారకు అవకాశాలు తగ్గే అవకాశమే లేదు. అయితే విజయాలకు దూరం అవుతున్న ఈ లేడీ సూపర్స్టార్ మళ్లీ సక్సెస్ బాట పట్టే ప్రయత్నంలో సొంతంగా చిత్రాన్ని చేయడానికి సిద్ధం అవుతున్నట్లు తాజా సమాచారం. ఈమె ఇటీవల జయంరవి సరసన నటించిన ఇరైవన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఆ తరువాత నటించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం 'అన్నపూరణి' కూడా నిరాశపరిచింది. ప్రస్తుతం మాధవన్, సిద్ధార్థ్తో కలిసి టెస్ట్ చిత్రంలో ఆమె నటిస్తుంది. కాగా భర్త విఘ్నేష్ శివన్తో కలిసి రౌడీ పిక్చర్స్ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సంస్థ ద్వారా పలు చిత్రాలను నిర్మించడంతో పాటు, అనేక సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. తాజాగా సెంథిల్కుమార్ దర్శకత్వంలో నటించడానికి నయనతార సిద్ధమవుతున్నట్లు సమాచారం. అదేవిధంగా ఈ చిత్రాలు నయనతార విఘ్నేష్ శివన్ తమ రౌడీ పిక్చర్స్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఎలాగైన ఈ చిత్రంతో హిట్ కొట్టాలని ఆమె ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కనెక్ట్ చిత్రం తరువాత రౌడీ పిక్చర్స్ సంస్థ నిర్మించే చిత్రం ఇదే అవుతుంది. కాగా ఇది కచ్చితంగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రమే అవుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు అధికారికంగా ఇంకా వెలువడాల్సి ఉంది. -
నయనతార భర్తకు 'ఎల్ఐసీ' నోటీసులు..!
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ నయనతార భర్త, దర్శకుడు విఘ్నేష్ శివన్ చిత్రం అంటేనే సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఈయన అజిత్తో ఒక చిత్రం చేయడానికి కొద్దిరోజుల క్రితం విశ్వప్రయత్నం చేశారు. కథా చర్చలు కూడా పూర్తి చేశారు. ఇక చిత్రం సెట్పైకి వెళ్లడమే తరువాయి అనుకుంటున్న తరుణంలో కారణాలేమైనా ఆ చిత్రం నుంచి వైదొలిగారు. ఆ తరువాత 'లవ్ టుడే' చిత్రం ఫేమ్ ప్రదీప్రంగనాథన్ హీరోగా చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. లియో చిత్ర నిర్మాత సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార కూడా నటిస్తుంది. ఈ చిత్రానికి ఎల్ఐసీ (లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్) అనే టైటిల్ను ఖరారు చేశారు. అదే ఈ చిత్ర దర్శక, నిర్మాతలను చిక్కుల్లో పడేసింది. ఎల్ఐసీ అనేది భారత్లో అత్యంత ప్రజాధరణ పొందిన జీవిత బీమా సంస్థ అని ఈ టైటిల్ తమ పేటెంట్ హక్కు అంటూ చిత్ర నిర్మాత, దర్శకులకు నోటీసులు జారీ చేసింది ఆ సంస్థ. ఈ విషయంపై చిత్ర యూనిట్ నుంచి ఎవరూ స్పందించలేదు. అయితే ఎల్ఐసీ అనే టైటిల్ను వాడుకునే అవకాశం మాత్రం వీరికి లభించే అవకాశం ఉండదని సమాచారం. ఏదేమైనా నటి కృతిశెట్టి నాయకిగా నటిస్తున్న ఇందులో నటుడు ఎస్జే సూర్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే చడీచప్పుడు లేకుండా కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్ ఆవరణలో చిత్రీకరణను జరుపుకుంటోందని సమాచారం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. -
భర్త సినిమా నుంచి నయనతార అవుట్!
లేడీ సూపర్స్టార్ నయనతార, ఆమె భర్త, దర్శకుడు విఘ్నేశ్ శివన్లకు టైమ్ అస్సలు బాగోలేనట్లుంది. కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రం తరువాత విఘ్నేశ్ ఇప్పటి వరకు మరో చిత్రం చేయలేదు. ఆ మధ్య అజిత్ కథానాయకుడిగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల కోసం చాలా సమయం వెచ్చించారు. అయితే చివరి క్షణంలో ఆ చిత్రం నుంచి వైదొలగాల్సిన పరిస్థితి నెలకొంది. నయనతారకు అక్కగా.. ఈ మధ్యే లవ్టుడే చిత్రం ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా చిత్రాన్ని తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. కృతిశెట్టిని హీరోయిన్గా ఎంపిక చేశారు. ఇందులో ప్రదీప్ రంగనాథన్కు అక్కగా నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. దీనిని 7 స్క్రీన్స్ స్టూడియోస్ పతాకంపై లలిత్కుమార్ నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన పూజాకార్యక్రమాలు ఇటీవల జరిగాయి. ఇక ఈ చిత్ర టైటిల్ చిక్కుల్లో పడిన సంగతి తెలిసిందే! వివాదాస్పదంగా అన్నపూరణి ఎల్ఐసీ సంస్థ.. తమ ఖాతాదారుల నమ్మకాన్ని పొందిన ఈ టైటిల్ చిత్రానికి ఉపయోగించరాదని నిర్మాతకు నోటీసులు పంపింది. లేనిపక్షంలో తగిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. దీంతో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తన చిత్రానికి టైటిల్ మార్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక నయనతార విషయానికి వస్తే ఈమె నటించిన తన 75వ చిత్రం అన్నపూరణి ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. అంతేకాకుండా చిత్రంలోని కొన్ని సన్నివేశాలు వివాదాస్పదంగా మారడంతో సినిమాపై కేసు నమోదైంది. దీంతో ఈ చిత్రాన్ని ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ స్ట్రీమింగ్ను నిలిపేసింది. అంత డబ్బు ఇచ్చుకోలేక.. ఇవన్నీ నయనతారకు ఎదురుదెబ్బలే. మరో విషయం ఏమిటంటే నయనతార తన భర్త విఘ్నేశ్ దర్శకత్వం వహిస్తున్న ఎల్ఐసీ చిత్రం నుంచి వైదొలగినట్లు తాజా సమాచారం. ఆమె ఎక్కువ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేయడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఈమె ఒక చిత్రానికి రూ.10 నుంచి రూ.12 కోట్లు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఎల్ఐసీ చిత్ర నిర్మాత అంత చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు ఓ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. చదవండి: ఓటీటీలో మలయాళ బ్లాక్బస్టర్ మూవీ.. తెలుగులోనూ చూడొచ్చు! -
స్టార్ జంటకు కలిసిరాని కొత్త ఏడాది.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్!
లవ్ టుడే ఫేమ్ ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తోన్న చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ఈ సినిమాలో ఉప్పెన ఫేమ్ కృతిశెట్టి హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని తమిళంలో నయనతార భర్త శివన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే తాజాగా ఈ మూవీ వివాదంలో చిక్కుకుంది. అసలు ఎందుకు సమస్య ఎక్కడ వచ్చింది? ఆ వివాదం ఎందుకు మొదలైందో తెలుసుకుందాం. ఈ చిత్రానికి ఎల్ఐసీ టైటిల్ పెట్టడంపై ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొషన్ ఆఫ్ ఇండియా (LIC) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సినిమా టైటిల్ తమ సంస్థ పేరును గుర్తు చేసేలా ఉందంటూ వెల్లడించింది. ఈ మేరకు మూవీ టైటిల్ మార్చాలంటూ దర్శకుడు విఘ్నేశ్ శివన్కు ఎల్ఐసీ లీగల్ నోటీసులు పంపినట్లు ఓ నివేదిక వెల్లడించింది. అంతే కాకుండా.. ఎల్ఐసీ సినిమా టైటిల్ను ఏడు రోజుల్లోగా మార్చాలని.. లేకపోతే తగిన చర్యలు తీసుకుంటామని నోటీసుల్లో పేర్కొంది. ఈ విషయంలో విఘ్నేశ్తో పాటు మూవీ నిర్మాణ సంస్థ సెవెన్ స్క్రీన్ స్టూడియోస్కు నోటీసులు పంపినట్లు సమాచారం. పేరు మార్చకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవని ఎల్ఐసీ హెచ్చరించినట్టు తెలుస్తోంది. అయితే ఎల్ఐసీ పంపిన నోటీసులకు మూవీ టీమ్ నుంచి ఇంకా అధికారికంగా స్పందన రాలేదు. అయితే ఇప్పటికే నయనతార నటించిన అన్నపూరణి చిత్రం కూడా వివాదానికి దారితీసింది. ఈ సినిమాలో హిందువులు మనోభావాలు దెబ్బతినేలా సన్నివేశాలు ఉన్నాయంటూ ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాజాగా నయనతార భర్త సినిమా సైతం వివాదంలో చిక్కుకుంది. కాగా.. ఈ చిత్రం ప్రముఖ నటుడు ఎస్జే సూర్య కీలకపాత్ర చేస్తున్నారు. ప్రదీప్ సోదరి పాత్రలో ఈ చిత్రంలో నయనతార కూడా నటిస్తారని తెలుస్తోంది. చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. -
వాళ్లు హర్ట్ అయ్యారు.. హీరోయిన్ నయనతార భర్తకు నోటీసులు!
ప్రముఖ హీరోయిన్ నయనతార భర్త, స్టార్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్ చిక్కుల్లో పడ్డాడు. అయితే ఒక్క పేరు వల్ల రెండు వివాదాలు ఇతడిని ఇబ్బందిపెడుతున్నాయి. కొత్త సినిమా ఇంకా మొదలుపెట్టనే లేదు అప్పుడే కాంట్రవర్సీలు ఎక్కువైపోయాయి. తాజాగా ఓ పెద్ద సంస్థ.. విఘ్నేశ్కి నోటీసులు జారీ చేసింది. ఇంతకీ అసలేం జరిగింది? గొడవేంటి? తమిళంలో పేరున్న దర్శకుల్లో విఘ్నేశ్ శివన్ ఒకడు. 'నా పేరు రౌడీ' లాంటి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల ముందు హీరోయిన్ నయనతారని పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచాడు. రీసెంట్గా 'ఎల్ఐసీ' పేరుతో కొత్త సినిమా తీస్తున్నట్లు అధికారికంగా ప్రకటించాడు. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో ప్రారంభం కావాల్సి ఉంది. కానీ టైటిల్పై రోజుల వ్యవధిలో రెండు కాంట్రవర్సీలు ఏర్పడ్డాయి. (ఇదీ చదవండి: పుట్టిన బిడ్డని కోల్పోయిన 'జబర్దస్త్' కమెడియన్ అవినాష్) సినిమా గురించి అనౌన్స్ చేసినప్పుడే.. కోలీవుడ్ డైరెక్టర్ కుమారన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు. తాను ఎనిమిదేళ్ల క్రితమే ఈ టైటిల్ రిజస్టర్ చేయించుకున్నానని చెప్పారు. ఈ పేరుపై పూర్తి హక్కులు తనకే ఉన్నాయని, లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని కూడా చెప్పాడు. ఈ వివాదం అలా ఉండగానే ఇప్పుడు మరొకటి వచ్చింది. ప్రముఖ ఇన్సూరెన్స్ సంస్థ ఎల్ఐసీ.. ఇప్పుడు డైరెక్టర్ విఘ్నేశ్ శివన్కి నోటీసులు జారీ చేసింది. తమ సంస్థకు ప్రజల్లో మంచి పేరు ఉందని, సినిమా కోసం ఈ టైటిల్ని ఉపయోగిస్తే.. తమ సంస్థ ప్రతిష్ఠకు భంగం కలిగే అవకాశం ఉందని నోటీసుల్లో పేర్కొంది. వారం రోజుల్లోపు పేరు మార్చకపోతే లీగల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అయితే దీనిపై చిత్రబృందం, విఘ్నేశ్ స్పందించాల్సి ఉంది. (ఇదీ చదవండి: రిలీజ్ డేట్ గందరగోళం.. సడన్గా ఓటీటీలోకి వచ్చేసిన మూవీ) -
మళ్లీ అలాంటి చిత్రానికే రెడీ అవుతున్న నయనతార
కోలీవుడ్లో హీరోయిన్ సెంట్రిక్ కథా పాత్రలకు కేరాఫ్గా మారిన నటి నయనతార. ఇంతకుముందు త్రిష, కాజల్ అగర్వాల్ వంటి వారు ఇలాంటి పాత్రల్లో నటించినా సక్సెస్ కాలేదు. నటి ఐశ్వర్యారాజేశ్ కొన్ని చిత్రాల్లో నటించి సక్సెస్ అయినా, ఆ తరువాత ఆమె నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దీంతో ఐశ్వర్యారాజేశ్కు అలాంటి అవకాశాలు ముఖం చాటేశాయనే చెప్పాలి. అయితే నయనతార విషయం వేరు. ఈమె నటించిన లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రాలు కొన్ని నిరాశపరిచినా, కొత్త అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అలా ఇటీవల నటించిన అన్నపూరిణి చిత్రం పెద్దగా ఆడలేదు. అయినప్పటికీ మరో లేడీ ఓరియెంటెడ్ కథా చిత్రం ఈ సంచలన నటి తలుపు తట్టినట్లు తాజా సమాచారం. ఇంతకుముందు ఐశ్వర్యారాజేశ్ ప్రధాన పాత్రలో నటించిన కనా చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమైన అరుణ్రాజా కామరాజ్ తొలి చిత్రంతోనే సక్సెస్ అయ్యారు. ఆ తరువాత ఉదయనిధి స్టాలిన్ హీరోగా నెంజిక్కు నీతి చిత్రాన్ని చేశారు. ఆ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇటీవల ఉత్తర చైన్నె నేపథ్యంలో లేబుల్ అనే వెబ్ సీరీస్కు దర్శకత్వం వహించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాన్ని తెరకెక్కించే పనిలో ఉన్నారు. ఇందులో నయనతారను హీరోయిన్గా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. ప్రస్తుతం తన 75వ చిత్రంలో నటిస్తున్న నయనతార, మాధవన్, సిద్ధార్థ్లతో కలిసి టెస్ట్ అనే చిత్రంలో నటిస్తున్నారు. అదేవిధంగా తన భర్త విగ్నేశ్ శివన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించనున్నారు. ఇందులో లవ్టుడే చిత్రం ఫేమ్ దర్శక, నటుడు ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా నటి కృతిశెట్టి నటిస్తుండగా, నయనతార హీరోకు అక్కగా ప్రధాన పాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. -
నయన్-విఘ్నేశ్ క్రేజీ సెలబ్రేషన్స్.. ఈ ఫొటోలు చూశారా?
-
Nayanthara And Vignesh Christmas Pics: ట్విన్స్తో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న నయనతార (ఫొటోలు)
-
ఎల్ఐసీ మూవీ.. కృతీ శెట్టికి తండ్రిగా నటించేదెవరో తెలుసా?
దర్శకుడు విఘ్నేశ్ శివన్ కొత్త సినిమా గురువారం ఉదయం చైన్నెలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విఘ్నేశ్ గత ఏడాది కాత్తు వాక్కుల రెండు కాదల్ చిత్రానికి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అజిత్ కథానాయకుడిగా ఓ సినిమా చేయాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల ఆ చిత్రం నుంచి వైదొలిగారు. తాజాగా ఈయన దర్శకుడిగా మరో సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి ఎల్ఐసీ అని టైటిల్ ఖరారు చేశారు. ఎల్ఐసీ అంటే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అని అర్థం. లవ్ టుడే చిత్రంతో సంచలన విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఆయనకు జంటగా హీరోయిన్ కృతిశెట్టి నటిస్తుండగా నటుడు ఎస్జే.సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని, రవి వర్మన్ చాయాగ్రహణం అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రేమికుల మధ్య ఏర్పడే ఈగో, విడిపోవడం, మళ్లీ కలవడం వంటి అంశాలతో వినోదభరిత కథాచిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. కృతి శెట్టికి తండ్రిగా ఎస్జే సూర్య, హీరోకి మిత్రుడిగా యోగి బాబు నటిస్తున్నారు. పలు ఆసక్తికరమైన అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్ రెండు షెడ్యూల్లో పూర్తి చేసి 2024 సమ్మర్ స్పెషల్ గా విడుదల చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారు. చదవండి: రూ.100 కోట్ల కేసులో ప్రకాష్ రాజ్కు ఊరట.. ఆ స్కామ్లో క్లీన్ చిట్ -
యంగ్ హీరోకు అక్కగా నటించనున్న నయనతార
కోలీవుడ్లో దర్శకుడిగా తొలి చిత్రంతోనే మంచి విజయాన్ని అందుకున్న ప్రదీప్ రంగనాథన్ ఆ తర్వాత కథానాయకుడిగా తొలి చిత్రంతోనే సంచలన విజయాన్ని సాధించడం విశేషం. ఆయన జయం రవి, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన 'కోమాలి' చిత్రం ద్వారా దర్శకుడుగా పరిచయమైన విషయం తెలిసిందే. ఆ చిత్ర విజయంతో పెరిగిన ఆత్మవిశ్వాసంతో వెంటనే కథానాయకుడు గానూ పరిచయమయ్యారు. అలా ఈయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం లవ్ టుడే. ఈ చిత్రం అనూహ్య విజయాన్ని సాధించింది. దీంతో ప్రదీప్ రంగనాథన్కు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అందులో ఒకటి నటుడు కమలహాసన్ నిర్మించ తలపెట్టిన చిత్రం. అయితే బడ్జెట్ అధికం కావడంతో ఆ చిత్రం ఆగిపోయింది. ఇక ప్రదీప్ రంగనాథన్ రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో మరికొందరు నిర్మాతలు వెనక్కి తగ్గారు. ఇలాంటి సమయంలో లియో చిత్ర నిర్మాత ప్రదీప్ రంగనాథన్తో చిత్రం చేయడానికి ముందుకు వచ్చారు. దీనికి నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నారు. నటుడు అజిత్ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన విఘ్నేష్ ఆ చిత్రం నుంచి వైదొలగిన విషయం తెలిసిందే. కాగా ప్రదీప్ రంగనాథన్ హీరోగా ఈయన దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానున్నట్లు సమాచారం. కాగా ఈ చిత్రానికి 'ఎల్ఐసీ' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు తాజా సమాచారం. కాగా ఇందులో దర్శకుడు మిష్కిన్, ఎస్ జే సూర్య, యోగిబాబు తదితరులు ముఖ్య పాత్రలు పోషించనున్నట్లు తెలిసింది. కాగా ఇందులో కథానాయకిగా ఓ ప్రముఖ బాలీవుడ్ నటి నటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. లేకపోతే ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటుడు ప్రదీప్ రంగనాథన్కు అక్కగా ప్రధాన పాత్రను పోషించబోతున్నట్లు తెలిసింది. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించినట్లు సమాచారం. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది. -
ప్రేమ గాయాలను తట్టుకుని ఆపై పడిలేచిన కెరటం నయనతార
సినిమా ఇండస్ట్రీలో కొందరు హీరోయిన్లు వెండితెరపై అలా మెరిసి, ఇలా కనుమరుగవుతారు. మరికొందరు సుదీర్ఘ ప్రయాణం చేసి ఒక బెంచ్ మార్క్ను క్రియేట్ చేస్తారు. అలాంటి మార్క్నే సినిమా ప్రపంచంలో నయనతార వేశారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 20 ఏళ్లు పూర్తి అవుతుంది. ఇదే సందర్భంలో నేడు (నవంబర్ 18) నయన్ 39వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. వెండితెరపై ఎలాంటి పాత్రలోనైనా ఆమె నటించగలదు అదే ఆమె ప్రత్యేకత. సీనియర్ హీరోలు, కుర్ర హీరోలు అనే తేడా లేకుండా.. కథ, అందులో ఆమె పాత్రకు ప్రాధాన్యం ఇవ్వడమే ఆమె ప్రత్యేకత.ప్రారంభంలో ఏ సినిమా ఛాన్స్ వచ్చినా కాదనకుండా ఓకే చెప్పిన నయన్... తర్వాత తన రూట్ మార్చి ప్రేక్షల చేత విజిల్స్ వేసే పాత్రలు చేసింది. అలా ఇప్పటి వరకు 80కి పైగా చిత్రాల్లో నటించింది. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం. నయనతార అసలు పేరు డయానా మరియం కురియన్. ఆమె బెంగళూరులో జన్మించారు. కానీ ఆమె స్వస్థలం కేరళ.. తల్లిదండ్రులు కురియన్ కొడియట్టు, ఓమన్ కురియన్. . నయన్ తండ్రి భారత వైమానిక దళంలో పనిచేశారు. కేరళలో ఇంగ్లిషు లిటరేచర్లో డిగ్రీ పూర్తి చేసిన నయన్ కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే మోడలింగ్ వైపు అడుగులు వేశాంరు. అలా కెరియర్ ప్రారంభంలో టీవీ యాంకర్గా కూడా పనిచేశారు. ఆపై 2003లో మలయాళ సినిమా అయిన 'మానస్సినక్కరే' తో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. చంద్రముఖి సినిమాతో గుర్తింపు రావడంతో ఆమెకు టాలీవుడ్లో 'లక్ష్మీ'లో ఛాన్స్ దక్కింది. ఆ తర్వాత బాస్, యోగి,దుబాయ్ శ్రీను, తులసి తదితర సినిమాల్లో నటించినా ఆమెకు అంతగా గుర్తింపు దక్కలేదు. 2010లో వచ్చిన అదుర్స్ సినిమా ఆమె కెరియర్నే మార్చేసింది. అక్కడి నుంచి ఆమె జర్నీలో భారీ విజయాలు దక్కాయి. అలా ఇక్కడ యంగ్, సీనియర్ హీరోలతో వరుస ఛాన్సులు దక్కించుకుని లేడీ సూపర్ స్టార్గా ఎదిగింది. కొద్దిరోజుల క్రితం చిరంజీవి చెల్లెలుగా గాడ్ ఫాదర్లో మెప్పించిగా.. షారుక్ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్లో అడుగుపెట్టింది. వారిద్దరితో ప్రేమ.. ఆ గాయాలను తట్టుకుని నిలిచింది సినిమాలే కాదు. వ్యక్తిగత విషయాలతోనూ నయనతార వార్తల్లో నిలిచింది. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. అయితే కొద్దిరోజుల తర్వాత నయన్ తాను శింబుతో విడిపోయినట్టు వెల్లడించింది. ఆయన సినిమాల్లో తానిక నటించనని తేల్చిచెప్పేసింది. తర్వాత 'విల్లు' షూటింగ్ సమయంలో ప్రభుదేవాతో తాను ప్రేమలో ఉన్నట్టు వార్తలొచ్చాయి. దీనిపై 2010లో ప్రభుదేవా స్పందిస్తూ తామిద్దరం పెళ్ళి చేసుకోబోతున్నామని ప్రకటించారు. అలా పెళ్లి కోసం సినిమా కెరీర్కు ఫుల్స్టాప్ పెట్టింది నయన్. అయితే ఆ తర్వాత 2012లో తామిద్దరం విడిపోయామని ప్రకటించింది నయనతార. తన ప్రేమ గురించి నయనతార ఏమన్నారంటే..? ఒక ఇంటర్వ్యూలో నయన్ మాట్లాడుతూ తాను రెండు సార్లు ప్రేమలో విఫలమయ్యానని స్వయంగా నయన్ ఇలా చెప్పింది. 'నమ్మకం లేని చోట ప్రేమ ఉండదు. ఆ ఇద్దరికీ నాకూ మధ్య అపార్థాలు వచ్చాయి. వాటి కారణంగా ఒకరిమీద ఒకరికి నమ్మకం పోయింది. అలాంటి పరిస్థితుల్లో విడిగా ఉంటేనే మంచిది అనుకున్నాం. ప్రేమ కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధం. ఎంత కష్టం అయినా పడతాను. అలాంటిది నా ప్రేమ ఫెయిల్ అయినప్పుడు ఎంత బాధపడ్డానో మాటల్లో చెప్పలేను. ఆ పరిస్థితి నుంచి బయటికి రావడానికి చాలా కష్టపడ్డా. కొంత గ్యాప్ తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చా.. ఆ సమయంలో సినిమాలే నన్ను తిరిగి బలంగా నిలబెట్టాయి. నాలో ధైర్యాన్ని నింపాయి.' అని నయన్ అన్నారు. అలా ప్రేమ గాయాలను తట్టుకుని కొంత కాలం తర్వాత దర్శకుడు విఘ్నేశ్ శివన్ను ప్రేమించి 2022 జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకుంది. వారికి ఇద్దరు పిల్లలు ఉయిర్, ఉలగం ఉన్నారు. వీరిద్దరూ కూడా సరోగసీ ద్వారా జన్మించారు. నయనతార ఆస్తులు ఎంత..? నయనతార ఒక్కో సినిమాకి దాదాపు రూ.10 నుంచి 14 కోట్లు కోట్ల పారితోషికాన్ని తీసుకుంటుందని సమాచారం. అంతేకాకుండా ఈ బ్యూటీ ఆస్తుల నికర విలువ దాదాపు రూ.200 కోట్లపై మాటే. 2018లో అయితే ఏకంగా ఫోర్బ్స్ ఇండియా ‘సెలబ్రిటీ 100’ లిస్ట్లో చోటు సాధించింది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ జాబితాలో నిలిచిన మొదటి మహిళా నటి నయనతారే కావడం ఇక్కడ విశేషం.అలాగే, ఆమె ఇటీవల తన భర్త విఘ్నేష్ శివన్తో కలిసి చర్మ సౌందర్య ఉత్పత్తుల కొత్త వెంచర్ను ప్రారంభించింది. వారి వ్యక్తిగత అవసరాల కోసం ఒక ప్రైవేట్ జెట్ కూడా కలిగి ఉంది. హిందూ మతాన్ని స్వీకరించిన నయన్ నయన్ క్రిస్టియన్.. ఆమె 2011లో హిందూ మతాన్ని స్వీకరించింది. ఆమె తమిళంలో నిర్మించిన కూళంగల్ (పెబెల్స్) సినిమా 2022లో జరిగే 94వ ఆస్కార్ పోటీలకు భారతదేశం తరఫున ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ కేటగిరిలో ఎంట్రీ అందుకుంది. శ్రీరామరాజ్యంలో సీతగా మెప్పించిన నయనతారకు 2011లో నంది అవార్డు దక్కింది. అదే సినిమాకు ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా ఆమెకు వచ్చింది. -
ఓటీటీలోకి వచ్చిన హిట్ సినిమా.. నయన్ భర్త ఇంట్రెస్టింగ్ కామెంట్స్
రెండేళ్ల క్రితమే అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన సినిమా 'కూళంగల్'. పీఎస్ వినోద్ రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కరుత్తడైయాన్, చెల్లపాండి ప్రధానపాత్రులు పోషించారు. యువన్ శంకర్ రాజా సంగీతమందించాడు. నయనతార, విఘ్నేశ్ శివన్ నిర్మాతలు. తమిళనాడు, తంజావూర్లోని ఓ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని అత్యంత సహజంగా తెరపై ఆవిష్కరించిన చిత్రమిది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న 'మ్యాడ్' మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించిన ఈ సినిమా అక్టోబరు 27న సోనీ లివ్ ఓటీటీలో డైరెక్ట్గా రిలీజైంది. ఈ సందర్భంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత విఘ్నేశ్ శివన్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. సినిమా చూడగానే చాలా నచ్చిందని, తమకు ఎంతో ఘనత తెచ్చిపెట్టిన చిత్రం ఇదని అన్నాడు. ఈ మూవీని థియేటర్లోనే విడుదల చేయాలనుకున్నామని కానీ సమయం గడిచిపోతుండడంతో సోనీ లివ్ ఓటీటీలో విడుదల చేసినట్లు విఘ్నేశ్ శివన్ చెప్పుకొచ్చాడు. కాగా దర్శకుడు వినోద్ రాజ్తో కలిసి మరో చిత్రం చేయడానికి చర్చలు జరుగుతున్నాయని విఘ్నేష్ శివన్ పేర్కొన్నాడు. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- గిరికీలు కొట్టిన హెలికాప్టర్
- విస్తృతంగా పోలీసుల తనిఖీలు
- Lok Sabha Election 2024: గురుగ్రాంలో ముక్కోణం
- Lok Sabha Election 2024: బీజేడీకి సవాల్!
- హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ
- Lok Sabha Election 2024: మహిళా ఎంపీలు 9 మందే!
- ఆ పచ్చ ‘సీఐ’ పై చర్యలేవి?
- Lok Sabha Election 2024: లోక్సభ బరిలో ప్యాడ్ ఉమన్
- జూన్ 27 నుంచి ఇంజనీరింగ్ కౌన్సెలింగ్
- మేడిగడ్డ కింద అగాధం!
Advertisement