-
BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టుకు కొత్త హెడ్ కోచ్ను ఎంపిక చేసేందుకు బీసీసీఐ ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ అత్యున్నత పదవి కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు కోరుతూ బీసీసీఐ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగలవారు ఈనెల 27వ తేదీలోపు తమ దరఖాస్తులు పంపించాలి.ఎంపికైన కొత్త హెడ్ కోచ్ పదవీకాలం మూడేన్నరేళ్లపాటు (1 జూలై 2024 నుంచి 31 డిసెంబర్ 2027 వరకు) ఉంటుంది. ప్రస్తుత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవీకాలం గత ఏడాది నవంబర్లో వన్డే వరల్డ్కప్ అనంతరం ముగిసింది.అయితే టి20 ప్రపంచకప్ నేపథ్యంలో ఈ మెగా ఈవెంట్ ముగిసేవరకు టీమిండియాకు తాత్కాలిక కోచ్గా కొనసాగాలని బీసీసీఐ కోరడంతో ద్రవిడ్ అంగీకరించాడు. ఈ నేపథ్యంలో కొత్త హెడ్ కోచ్ పదవి కోసం ద్రవిడ్ కూడా మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు. నో చెప్పిన ద్రవిడ్అయితే, ఇందుకు ద్రవిడ్ సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. మరికొంత కాలం పాటు అతడిని కోచ్గా కొనసాగాలని టీమిండియా ప్రధాన ఆటగాళ్లలో కొందరు అభ్యర్థించినట్లు సమాచారం. కనీసం టెస్టు జట్టుకైనా ద్రవిడ్ మార్గదర్శకుడిగా ఉంటే బాగుంటుందని వారు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.కానీ వేర్వేరు ఫార్మాట్లకు వేర్వేరు కోచ్ల నియామకంపై క్రికెట్ అడ్వైజరీ కమిటీదే తుది నిర్ణయం అని.. ఏదేమైనా ఇలాంటి ప్రతిపాదనలు ఆమోదం పొందకపోవచ్చని జై షా ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. మరోవైపు.. రాహుల్ ద్రవిడ్ సైతం హెడ్ కోచ్ పదవికి గుడ్బై చెప్పాలని గట్టిగా నిర్ణయించుకున్నట్లు సమాచారం. కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.లక్ష్మణ్కు ఆ ఛాన్స్ లేదుమరోవైపు.. ద్రవిడ్ గైర్హాజరీలో టీమిండియా కోచ్గా వ్యవహరించిన వీవీఎస్ లక్ష్మణ్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ పనులతో బిజీగా ఉన్నాడు. అయితే, బీసీసీఐ అతడిని అక్కడి నుంచి కదిలించేందుకు సిద్ధంగా లేనట్లు తెలుస్తోంది.ఫ్లెమింగ్ లేదంటే రిక్కీ పాంటింగ్?ఈ నేపథ్యంలో.. ఈసారి విదేశీ కోచ్ను రంగంలోకి తీసుకువచ్చేందుకు బీసీసీఐ సుముఖంగానే ఉన్నట్లు జై షా హింట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటికే న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ స్టీఫెన్ ఫ్లెమింగ్ పేరును బీసీసీఐ పరిశీలిస్తున్నట్లు వార్తలు రాగా.. మరో పేరు కూడా తెర మీదకు వచ్చింది.ఆస్ట్రేలియా దిగ్గజ సారథి రిక్కీ పాంటింగ్ కూడా టీమిండియా హెడ్కోచ్ పదవి రేసులో ఉన్నాడనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా వీరిద్దరు ప్రస్తుతం ఐపీఎల్ జట్లకు హెడ్కోచ్లుగా ఉన్నారు. చెన్నై సూపర్ కింగ్స్ కోచ్గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆ జట్టును ఐదుసార్లు విజేతగా నిలపడంలో కృషి చేయగా.. ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్(ప్రస్తుతం) జట్లకు కోచ్గా పనిచేసిన అనుభవం పాంటింగ్కు ఉంది.అది సాధ్యం కాదన్న పాంటింగ్అయితే, వీళ్లిద్దరు కూడా టీమిండియా హెడ్కోచ్ పదవి చేపట్టేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. ఎందుకంటే వరుస సిరీస్లతో బిజీగా ఉండే టీమిండియా కోసం కోచ్ ఏడాదిలో దాదాపు 10 నెలల పాటు అంకితం కావాల్సి ఉంటుంది.కాబట్టి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించే వీలుండదు. అందుకే భారత జట్టు హెడ్కోచ్ పదవి ఆఫర్ వచ్చినా తాను చేపట్టలేదని రిక్కీ పాంటింగ్ గతం(2021)లో వెల్లడించాడు. ఈ పరిణామాల నేపథ్యంలో టీమిండియా కొత్త కోచ్గా ఎవరు వస్తారో? అంటూ క్రికెట్ వర్గాల్లో విస్తృత చర్చ నడుస్తోంది.చదవండి: సీజన్ మొత్తం మాకు అదే సమస్య.. అందుకే ఈ దుస్థితి: కేఎల్ రాహుల్ -
IPL 2024: గంభీర్ గుడ్బై.. లక్నో మెంటార్గా రాహుల్ ద్రవిడ్?
టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్ కొనసాగుతాడా లేదా అన్న అంశంపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత అతడి భవితవ్యంపై ఓ స్పష్టత వస్తుందనుకుంటే బీసీసీఐ నుంచి ఇందుకు సంబంధించి ఎటువంటి ప్రకటనా రాలేదు. కాగా టీ20 వరల్డ్కప్-2021 తర్వాత రవిశాస్త్రి టీమిండియా హెడ్కోచ్గా వైదొలగగా.. ‘ది వాల్’ రాహుల్ ద్రవిడ్ ఆ బాధ్యతలు చేపట్టాడు. నాటి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా ద్రవిడ్ను ఒప్పించి మరీ ఈ పదవిని కట్టబెట్టారు. ఈ క్రమంలో రాహుల్ మార్గదర్శనం, రోహిత్ శర్మ కెప్టెన్సీలో ద్వైపాక్షిక సిరీస్లలో అద్భుత విజయాలు సాధించిన టీమిండియా ఐసీసీ టోర్నీల్లో మాత్రం చేతులెత్తేసింది. టీ20 వరల్డ్కప్-2022లో సెమీస్లోనే నిష్క్రమించిన భారత జట్టు.. సొంతగడ్డపై వన్డే వరల్డ్కప్-2023లో ఆఖరి మెట్టుపై బోల్తా పడింది. ఇక ఈ ఐసీసీ ఈవెంట్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం అధికారికంగా ముగింపు దశకు వచ్చింది. ఈ నేపథ్యంలో ద్రవిడ్ హెడ్కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, బీసీసీఐ మాత్రం అతడి సేవలను మరోమారు వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. అతడు గనుక సుముఖంగా లేకపోతే వీవీఎస్ లక్ష్మణ్ హెడ్కోచ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త తెరమీదకు వచ్చింది. రాహుల్ ద్రవిడ్ను తమ మెంటార్గా నియమించుకునేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీ లక్నో సూపర్ జెయింట్స్ ఆసక్తిగా ఉన్నట్లు సమాచారం. దైనిక్ జాగరణ్ కథనం ప్రకారం.. మెంటార్గా గౌతం గంభీర్ స్థానంలో ద్రవిడ్ అయితే బాగుంటుందని ఎల్ఎస్జీ యాజమాన్యం ఆలోచిస్తోందట. కాగా లక్నో మెంటార్గా సేవలు అందించిన మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ తిరిగి కోల్కతా నైట్రైడర్స్ గూటికి చేరుకున్నాడు. ఇక ఐపీఎల్-2024 వేలానికి ముందు ఆవేశ్ ఖాన్ వదులుకున్న లక్నో ఫ్రాంఛైజీ రాజస్తాన్ రాయల్స్తో డైరెక్ట్ స్వాప్ ద్వారా దేవ్దత్ పడిక్కల్ను దక్కించుకుంది. కోచ్గా ఆస్ట్రేలియా మాజీ హెడ్కోచ్ జస్టిన్ లాంగర్ను నియమించుకుంది. -
కాంట్రాక్ట్ పొడిగింపునకు నో చెప్పిన ద్రవిడ్.. టీమిండియా కొత్త హెడ్ కోచ్ అతడే..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. 2021 నవంబర్లో బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్ రెండేళ్ల పాటు పదవిలో కొనసాగాడు. వరల్డ్కప్ ఫైనల్లో టీమిండియా ఓటమి నేపథ్యంలో ద్రవిడ్ భారత జట్టు కోచింగ్ పదవికి గుడ్బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంపై ద్రవిడ్ ఎలాంటి అధికారిక ప్రకటన చేయనప్పటికీ, సన్నిహితులతో స్పష్టం చేశాడని సమాచారం. వరల్డ్కప్ ఫైనల్ ముగిసిన అనంతరం కోచ్గా కొనసాగడంపై ఇంకా తేల్చుకోలేదని చెప్పిన ద్రవిడ్ తాజాగా బీసీసీఐ పెద్దల వద్ద నో చెప్పాడని తెలుస్తుంది. ద్రవిడ్ నుంచి అధికారికంగా ప్రకటన వచ్చిన వెంటనే భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్గా ప్రస్తుత ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ను నియమిస్తారని సమాచారం. ఈ విషయంపై బీసీసీఐ పెద్దలు పూర్తి క్లారిటీగా ఉన్నారని తెలుస్తుంది. లక్ష్మణ్కు పట్టం కట్టేందుకు బీసీసీఐ ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నట్లు వినికిడి. ప్రస్తుతం లక్ష్మణ్ స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్లో భారత్ తాత్కాలిక హెడ్ కోచ్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఒకటి రెండు రోజుల్లో బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. గత రెండేళ్ల కాలంలో ద్రవిడ్ గైర్హాజరీలో లక్ష్మణ్ పలు సిరీస్ల్లో టీమిండియా కోచ్గా వ్యవహరించాడు. లక్ష్మణ్ టీమిండియా హెడ్ కోచ్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్రవిడ్ ఎన్సీఏ చీఫ్గా ట్రాన్స్ఫర్ అవుతాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ద్రవిడ్ ఓ ఐపీఎల్ జట్టుతో జత కట్టనున్నాడని టాక్ కూడా నడుస్తుంది. మొత్తానికి ద్రవిడ్ దిగిపోతే టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్కు పట్టం కట్టేందుకు సర్వం సిద్దమైందని తెలుస్తుంది. ఇదిలా ఉంటే, ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా వైజాగ్లోని వైఎస్సార్ ఏసీఏ–వీడీసీఏ స్టేడియం వేదికగా ఇవాళ భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి మ్యాచ్ జరుగనున్న విషయం తెలిసిందే. -
లక్ష్మణ్ హెడ్కోచ్గా సూర్య కెప్టెన్సీలో! షెడ్యూల్, జట్లు.. పూర్తి వివరాలు
వన్డే వరల్డ్కప్-2023 ఫైనల్లో ఓటమి బాధను మర్చిపోకముందే.. భారత జట్టు తిరిగి మైదానంలో దిగేందుకు సిద్ధమైంది. ప్రపంచ చాంపియన్ ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ను మొదలుపెట్టనుంది. వైజాగ్ వేదికగా గురువారం ఈ ఐదు మ్యాచ్ల సిరీస్ ఆరంభం కానుంది. ఇందుకోసం ఇప్పటికే ఇరుజట్లు అక్కడి చేరుకుని ప్రాక్టీస్లో తలమునకలయ్యాయి. కాగా ఆసీస్తో టీ20 సిరీస్కు ఎప్పటిమాదిరే రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి దూరంగా ఉండనున్నారు. ఇక వీరితో పాటు వన్డే వరల్డ్కప్ ఆడిన శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, సిరాజ్, బుమ్రా, షమీ తదితరులు కూడా విశ్రాంతి తీసుకోనున్నారు. మరోవైపు హార్దిక్ పాండ్యా గాయం కారణంగా దూరంగా.. సూర్యకుమార్ యాదవ్ తొలిసారి టీమిండియా సారథిగా ఈ సిరీస్తో పగ్గాలు చేపట్టనున్నాడు. ఇక హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ మరోసారి టీమిండియాకు మార్గదర్శనం చేయనున్నాడు. ఈ దిగ్గజ బ్యాటర్ నేతృత్వంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలు వైరల్గా మారాయి. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ ►తొలి టీ20- నవంబరు 23- గురువారం- వైజాగ్ ►రెండో టీ20- నవంబరు 26- ఆదివారం- తిరువనంతపురం ►మూడో టీ20- నవంబరు 28- మంగళవారం- గువాహటి ►నాలుగో టీ20- డిసెంబరు 1- శుక్రవారం- రాయ్పూర్ ►ఐదో టీ20- డిసెంబరు 3- ఆదివారం- బెంగళూరు ఆరంభ సమయం, లైవ్ స్ట్రీమింగ్ భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ మ్యాచ్లు భారత కాలమానం ప్రకారం రాత్రి ఏడు గంటలకు ఆరంభం కానున్నాయి. టీవీలో.. స్పోర్ట్స్ 18, కలర్స్ సినీప్లెక్స్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. అదే విధంగా డిజిటల్ మీడియాలో జియో సినిమాలో లైవ్ స్ట్రీమింగ్ జరుగనుంది. ఆసీస్తో టీ20 సిరీస్కు టీమిండియా సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్ ), ఇషాన్ కిషన్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేశ్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, అవేశ్ ఖాన్, ముకేశ్ కుమార్. ఆస్ట్రేలియా జట్టు మాథ్యూ వేడ్ (కెప్టెన్), ఆరోన్ హార్డీ, జాసన్ బెహ్రెన్డార్ఫ్, సీన్ అబాట్, టిమ్ డేవిడ్, నాథన్ ఎల్లిస్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, గ్లెన్ మాక్స్వెల్, తన్వీర్ సంఘా, మాట్ షార్ట్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, కేన్ రిచర్డ్సన్, ఆడం జంపా. చదవండి: అందుకే దాన్ని ఫైనల్ అంటారు: కైఫ్ విమర్శలపై వార్నర్ స్పందన -
విశాఖలో భారత్ VS ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ (ఫొటోలు)
-
ద్రవిడ్ను కొనసాగిస్తారా? సాగనంపితే... టీమిండియా కొత్త కోచ్ ఎవరు..?
టీమిండియా హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్ రెండేళ్ల పదవీకాలం వరల్డ్కప్ 2023 ఫైనల్తో ముగిసింది. దీంతో భారత జట్టు కొత్త హెడ్ కోచ్ ఎవరనే అంశంపై చర్చ మొదలైంది. మరో దఫా కొనసాగాలా లేదా అనే దానిపై ఇంకా తేల్చుకోలేదని ద్రవిడ్ వరల్డ్కప్ అనంతరం మీడియా సమావేశంలో తెలిపాడు. మరి బీసీసీఐ రవిశాస్త్రిలా ద్రవిడ్ను రెండో దఫా కొనసాగిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆసీస్తో టీ20 సిరీస్కు స్టాండ్ ఇన్ కోచ్గా ఎన్సీఏ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ను బీసీసీఐ ఎంపిక చేసింది. ఒకవేళ ద్రవిడ్ రెండో దఫా కోచ్గా పని చేసేందుకు నిరాకరిస్తే లక్ష్మణ్ భారత జట్టు హెడ్ కోచ్ పదవి రేసులో ముందువరుసలో ఉంటాడు. ఈ పదవి కోసం లక్ష్మణ్తో పాటు మరో ఇద్దరు టీమిండియా దిగ్గజాలు పోటీలో ఉండే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇటీవలే ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్గా ప్రకటించబడ్డ వీరేంద్ర సెహ్వాగ్, స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే లక్ష్మణ్తో పాటు ప్రధాన పోటీదారులుగా నిలిచే ఛాన్స్ ఉంది. వీరిలో కుంబ్లేకు గతంలో భారత జట్టు హెడ్ కోచ్గా పని చేసిన అనుభవం ఉంది. ధోనిని ఒప్పించి అప్పచెబితే.. టీమిండియా హెడ్ కోచ్ పదవి ఖాళీ అయిన నేపథ్యంలో ఈ అంశంపై నెట్టింట జోరుగా చర్చలు సాగుతున్నాయి. కొందరు ద్రవిడ్నే కొనసాగించాలని అంటుంటే, మరికొందరు అతడిని సాగనంపాలని వాధిస్తున్నారు. ఒకవేళ హెడ్ కోచ్ పదవిలో కొనసాగేందుకు ద్రవిడ్ ఆసక్తి కనబర్చకపోతే లక్ష్మణ్, అనిల్ కుంబ్లే, సెహ్వాగ్లు రేసులో ఉంటారని ప్రచారం జరుగుతుంది. కొత్తగా కొందరు టీమిండియా మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరును తెరపైకి తెస్తున్నారు. ధోనికి ఇష్టం లేకపోయినా అతన్ని ఒప్పించి మరీ భారత క్రికెట్ జట్టు కోచింగ్ బాధ్యతలు అప్పజెప్పాలని వారు పట్టుబడుతున్నారు. మరి భారత జట్టుకు కోచింగ్ ఇచ్చేందుకు ధోని ముందుకు వస్తాడో లేదో వేచి చూడాలి. -
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్.. టీమిండియా హెడ్ కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్!
వన్డే వరల్డ్కప్-2023 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో తలపడనుంది. నవంబర్ 23న విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇచ్చే ఛాన్స్ ఉంది. టీమిండియా హెడ్ కోచ్గా లక్ష్మణ్.. మరోవైపు ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్లో భారత జట్టు హెడ్ కోచ్గా దిగ్గజ ఆటగాడు, ఏన్సీఏ హెడ్ వీవీయస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం టీమిండియా హెడ్కోచ్గా ఉన్న రాహుల్ ద్రవిడ్ పదవీ కాలం ఈ వరల్డ్కప్తో ముగియనుంది. ఈ క్రమంలో అతడి స్ధానాన్ని భర్తీ చేసేందుకు బీసీసీఐ ధరఖాస్తులను అహ్హనించనుంది. కొత్త కోచ్ వచ్చేటప్పటికి సమయం పట్టే అవకాశమున్నందన లక్ష్మణ్ తాత్కాలిక హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్కు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. కాగా లక్ష్మణ్ ఇప్పటికే చాలా సిరీస్లలో భారత జట్టు హెడ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించాడు. ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్కు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. గతంలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్కోచ్గా పనిచేశాడు.అతడి పర్యవేక్షణలోనే అండర్ 19 ప్రపంచకప్-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది. చదవండి: WC 2023: పాండ్యా లేని లోటు తీర్చేందుకు రంగంలోకి కోహ్లి.. వీడియో షేర్ చేసిన బీసీసీఐ -
శ్రీవారి ఆలయ అలంకరణకు వీవీఎస్ లక్ష్మణ్ విరాళం
సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారిని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ క్రికెటర్ వివిఎస్.లక్ష్మణ్ స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శ్రీవారి ఆలయంకు ఒక్క రోజు అలంకరణకు అయ్యే ఖర్చును వీవీఎస్ లక్ష్మణ్ విరాళంగా అందించారు. దాదాపు రూ.14 లక్షలు విరాళంగా ఇచ్చిన ఆయన, శ్రీవారి ఆలయంలో ధ్వజస్తంభం మొదలుకుని శ్రీవారి గర్భాలయం వరకూ టీటీడీ ఉద్యానవనం సిబ్బంది వివిధ రకాల కట్ ప్లవర్స్ అలంకరణను ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి శ్రద్ధగా గమనించారు. చదవండి: ‘గగన్యాన్’ TV-D1 ప్రయోగం సక్సెస్ -
ఓటు వేసిన VVS లక్ష్మణ్, మిథాలీ రాజ్
-
800 మూవీ విజయ్ సేతుపతి చేయాల్సింది, కుటుంబాన్ని బెదిరించడంతో..
టెస్ట్ క్రికెట్ చరిత్రలో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్, లెజెండరీ ఆఫ్ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా రూపొందిన సినిమా '800'. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీలో మురళీధరన్ పాత్రలో 'స్లమ్డాగ్ మిలియనీర్' ఫేమ్ మధుర్ మిట్టల్, మదిమలర్ పాత్రలో మహిమా నంబియార్ నటించారు. ఎంఎస్ శ్రీపతి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 6న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల అవుతోంది. నాకు బ్రదర్ కంటే ఎక్కువ: లక్ష్మణ్ సోమవారం నాడు హైదరాబాద్లో '800' ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వీవీఎస్ లక్ష్మణ్ చేతుల మీదుగా బిగ్ టికెట్ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ ''మైదానంలో మురళీధరన్ సాధించినది మాత్రమే కాదు, అతని జీవితం అంతా ఇన్స్పిరేషన్. సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి మురళీధరన్ మెంటార్ కూడా! అతనితో పాటు క్రికెట్ ఆడాను. అతనికి అపోజిట్ టీంలో ఆడాను. మురళీధరన్ గొప్ప క్రికెటర్ అని అందరికీ తెలుసు. అంత కంటే గొప్ప మనసు ఉన్న వ్యక్తి, నిగర్వి. ఈతరం యువతకు రోల్ మోడల్. నాకు బ్రదర్ కంటే ఎక్కువ. అతనిలాంటి ఫ్రెండ్ ఉండటం లక్కీ. మురళీధరన్ కి క్రికెట్టే జీవితం'' అని అన్నారు. లక్ష్మణ్తో అలాంటి అనుబంధం: ముత్తయ్య ముత్తయ్య మురళీధరన్ మాట్లాడుతూ ''1998లో ఫస్ట్ టైమ్ లక్ష్మణ్ను చూశా. ఒరిస్సాలోని కటక్లో మ్యాచ్ ఆడాం. నా కంటే వయసులో లక్ష్మణ్ చిన్న. అప్పుడు టీనేజర్ అనుకుంట! అప్పుడే తన ఆటతో లక్ష్మణ్ అందరికి షాక్ ఇచ్చాడు. ఈ అబ్బాయి ఇండియన్ టీంలో ఎందుకు లేడని అనుకున్నా. ఆ తర్వాత చాలాసార్లు కలిశాం. స్పిన్ ఆడటంలో లక్ష్మణ్ మేటి. మేం మైదానంలో వేర్వేరు దేశాలకు ఆడినప్పటికీ... మైదానం బయట సచిన్, అనిల్ కుంబ్లే, గంగూలీ అంతా స్నేహితులుగా ఉన్నాం. క్రికెట్ అంటే రికార్డులు కాదు... స్నేహితుల్ని చేసుకోవడం! వెంకటేశ్ను కెప్టెన్ చేయాలి హైదరాబాద్ నాకు స్పెషల్... నేను ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యాక సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకి పని చేయమని అడిగారు. ఒకసారి టీం అంతా హైదరాబాద్ నుంచి వేరే సిటీకి వెళుతున్నాం. సరదాగా బిర్యానీ అడిగా. అరగంటలో విమానంలో చాలా బిర్యానీలు ఉన్నాయి. లక్ష్మణ్ అంటే అది'' అని చెప్పారు. ఇండియన్ సెలబ్రిటీలతో క్రికెట్ టీం ఏర్పాటు చేయాల్సి వస్తే... ఎవరెవరిని ఎంపిక చేస్తారని అడగ్గా ''వెంకటేష్ ను కెప్టెన్ చేయాలి. ఆయనకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఆయన ఎప్పుడూ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ మిస్ కారు'' అని మురళీధరన్ చెప్పారు. నానితో ఒకసారి మాట్లాడానని ఆయన తెలిపారు. విజయ్ సేతుపతిని బెదిరించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ముత్తయ్య మురళీధరన్ కీలక విషయాన్ని తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. 'విజయ్ సేతుపతితో '800' తీయాలని అనుకున్నాం. ఆయన కూడా అందుకు ఒప్పుకున్నారు. కానీ ఇది ఇష్టం లేని కొందరు నాయకులు ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. తన కుటుంబాన్ని బెదిరించారు. దీంతో ఆయన సినిమా నుంచి తప్పుకున్నారు' అని చెప్పుకొచ్చాడు. చదవండి: రెండుసార్లు బ్రేకప్, డిప్రెషన్లో.. కాంట్రాక్టు మీద సంతకం పెట్టాక రాత్రికి రమ్మనేవాళ్లు! -
టీమిండియా హెడ్కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్.. అతడు కూడా
చైనా వేదికగా జరగనున్న ఆసియా క్రీడలు 2023లో భారత పురుష, మహిళ క్రికెట్ జట్లు తొలిసారి పాల్గోనున్నాయి. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్ కోసం భారత జట్లను బీసీసీఐ ప్రకటించింది. ఈ క్రీడలు సెప్టెంబర్ 23 నుంచి ఆక్టోబర్ 8 హాంగ్జౌలో జరగనున్నాయి. కాగా ఈవెంట్ కోసం భారత పురుషల ద్వితీయ శ్రేణి జట్టును బీసీసఘై ఎంపిక చేసింది. ఆక్టోబర్లో వన్డే ప్రపంచకప్ జరగనుండడంతో.. ఆసియాకప్లో యువ భారత జట్టు పాల్గొనుంది. ఈ జట్టులో ఐపీఎల్ హీరోలు యశస్వీ జైశ్వాల్,రింకూ సింగ్, జితేష్ శర్మకు చోటు దక్కింది. ఇక ఈవెంట్లో భారత పురుషల జట్టు కెప్టెన్గా యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ వ్యవహరించనుండగా.. మహిళల జట్టును హర్మన్ ప్రీత్ కౌర్ నడపించనుంది. హెడ్ కోచ్లుగా వీవీఎస్ లక్ష్మణ్, హృషికేష్ కనిట్కర్ కాగా ఈ ఆసియా క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు కూడా బీసీసీఐ రెస్టు ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ప్రస్తుతం ఆసియాకప్-2023 కోసం ఆలూర్లో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రైనింగ్ క్యాంప్లో భారత ఆటగాళ్లతో పాటు ఉన్నాడు. ఇక లక్ష్మణ్తో పాటు చైనాకు సాయిరాజ్ బహుతులే(బౌలింగ్కోచ్),మునీష్ బాలి (ఫీల్డింగ్ కోచ్) కూడా వెళ్లనున్నారు. లక్ష్మణ్తో పాటు, ఆసియాడ్ కోసం భారత పురుషుల జట్టు సహాయక సిబ్బందిలో బౌలింగ్ కోచ్గా భారత మాజీ లెగ్ స్పిన్నర్ సాయిరాజ్ బహుతులే మరియు ఫీల్డింగ్ కోచ్గా మునీష్ బాలి ఉన్నారు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్కు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. గతంలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్కోచ్గా వ్యవహరించారు. లక్ష్మణ్ పర్యవేక్షణలోనే అండర్ 19 ప్రపంచకప్-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది. మరోవైపు ఈ ఆసియాటోర్నీలో భారత మహిళల జట్టు హెడ్కోచ్గా మాజీ ఆటగాడు హృషికేష్ కనిట్కర్ వ్యవహరించనున్నాడు. కాగా గత డిసెంబర్ నుంచి భారత మహిళల జట్టు రెగ్యూలర్ హెడ్కోచ్ లేకుండానే ఆడుతోంది. చదవండి: నా కూతురు ఫీజు కూడా కట్టలేకపోయా.. కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ క్రికెటర్ -
హ్యాపీ బర్త్డే మచ్చా.. నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు: పంత్ భావోద్వేగం
Rishabh Pant Shares Video: టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందుతున్నాడు. ఘోర రోడ్డు ప్రమాదం నుంచి అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ అతడు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఫిట్నెస్పై దృష్టి సారించి జిమ్లో కసరత్తులు మొదలుపెట్టాడు. నెట్స్లో బ్యాటింగ్ చేయడం ఆరంభించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా రిషభ్ పంత్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఎన్సీఏ బ్యాటింగ్ కోచ్ సితాంశు కొటక్ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం అతడితో కేక్ కట్ చేయించాడు ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్. ఎన్సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ సమక్షంలో సితాంశు బర్త్డే సెలబ్రేట్ చేశాడు. హ్యాపీ బర్త్డే మచ్చా.. థాంక్యూ ‘‘కొంచెం బ్లర్గా ఉంది గానీ! పుట్టినరోజు శుభాకాంక్షలు మచ్చా. గత కొన్ని నెలలుగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నందుకు ధన్యవాదాలు’’ అని ఎమోషనల్ అయ్యాడు. కాగా గతేడాది డిసెంబరులో రిషభ్ పంత్ యాక్సిడెంట్కు గురయ్యాడు. కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకొనేందుకు వెళ్తున్న క్రమంలో రూర్కీ వద్ద అతడి కారుకు ప్రమాదం జరిగింది. ఘోర ప్రమాదం నుంచి బయటపడి ఆ సమయంలో ఒక్కడే ఉన్న పంత్ను స్థానికులు గుర్తించి ఆస్పత్రికి తరలించగా.. కాస్త కోలుకున్న తర్వాత బీసీసీఐ అతడిని ముంబైకి ఎయిర్లిఫ్ట్ చేసింది. నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. నడవగలిగే స్థితికి చేరుకున్న తర్వాత బెంగళూరులోని ఎన్సీఏకు పంత్ను పంపగా.. అక్కడ పునరావాసం పొందుతున్నాడు. కాగా ఇప్పటికే ఐపీఎల్తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్-2023 వంటి మెగా మ్యాచ్ మిస్ అయిన రిషభ్ పంత్ వన్డే వరల్డ్కప్ నాటికైనా అందుబాటులోకి వస్తే బాగుండని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: తిలక్, యశస్వి బౌలింగ్ చేస్తారు.. ఇకపై: టీమిండియా కోచ్ కీలక వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Rishabh Pant (@rishabpant) -
ఐర్లాండ్తో టీ20 సిరీస్.. హెడ్కోచ్ లేకుండానే! టీమిండియా ఎలా మరి?
జస్ప్రీత్ బుమ్రా సారధ్యంలోని యువ భారత జట్టు ఐర్లాండ్ పర్యటనకు సిద్దమవుతోంది. ఈ టూర్లో భాగంగా అతిథ్య ఐర్లాండ్తో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్లో టీమిండియా తలపడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టు రెండు బ్యాచ్లగా ఐర్లాండ్కు చేరుకోనుంది. మంగళవారం(ఆగస్టు 15)న జస్ప్రీత్ బుమ్రా, రుత్రాజ్ గైక్వాడ్తో కూడిన బృందం మొదటి బ్యాచ్గా ఐర్లాండ్కు పయనం కానుంది. మరోవైపు విండీస్తో టీ20 సిరీస్లో భాగంగా ఉన్న తిలక్ వర్మ, జైశ్వాల్, సంజూ శాంసన్ నేరుగా యూఎస్ నుంచి ఐర్లాండ్కు బయలదేరునున్నారు. ఆగస్టు 18న డబ్లిన్ వేదికగా జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. హెడ్కోచ్ లేకుండానే.. ఇక ఐర్లాండ్ పర్యటనకు హెడ్కోచ్ లేకుండా భారత జట్టు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. వెస్టిండీస్ టూర్ తర్వాత రెగ్యులర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్తో పాటు ఇతర కోచింగ్ స్టాప్కు బీసీసీఐ విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఐర్లాండ్ టూర్కు టీమిండియా హెడ్కోచ్గా ఏన్సీఏ ఛీప్ వీవీయస్ లక్ష్మణ్ వ్యవహరించనున్నట్లు వార్తలు వినిపించాయి. గతంలో చాలాసార్లు ద్రవిడ్ గైర్హజరీలో ఈ హైదరాబాదీనే భారత జట్టు కోచ్గా పనిచేశాడు. కానీ ఈ సారి మాత్రం ఐరీష్ టూర్కు లక్ష్మణ్ కూడా వెళ్లడం లేదు. క్రిక్బజ్ రిపోర్టు ప్రకారం.. ఇండియా-ఏ జట్టు కోచ్లు సితాన్షు కోటక్ , సాయిరాజ్ బహుతులే నేతృత్వంలో భారత్ ఈ సిరీస్ ఆడనుంది. ఐర్లాండ్ సిరీస్కు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్ , యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్, జితేష్ శర్మ, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్ , ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్ చదవండి: The Hundred 2023: సన్రైజర్స్ ఆటగాడు ఊచకోత.. కేవలం 22 బంతుల్లోనే! -
చిక్కుల్లో టీమిండియా కెప్టెన్! అప్పీలుకు వెళ్లేది లేదన్న బీసీసీఐ..
ICC- Harmanpreet Kaur- BCCI: భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్గా వరుస విజయాలు అందుకున్న హర్మన్ప్రీత్కౌర్ బంగ్లాదేశ్తో వన్డే సిరీస్ సందర్భంగా అపఖ్యాతి మూటగట్టుకుంది. బంగ్లాతో ఆఖరి మ్యాచ్లో అంపైర్ నిర్ణయాన్ని తప్పుబడుతూ పెవిలియన్కు చేరే క్రమంలో బ్యాట్తో వికెట్లను కొట్టింది. అంతేకాదు.. సిరీస్ 1-1తో సమానమైన నేపథ్యంలో ట్రోఫీ పంచుకునేటపుడు కూడా కాస్త దురుసుగా ప్రవర్తించింది. బంగ్లాదేశ్ కెప్టెన్ దగ్గరికి రాగానే.. ఈ మ్యాచ్ టై అవడానికి అంపైర్లు కూడా కారణం.. వాళ్లను కూడా పిలువు అంటూ వ్యంగ్యస్త్రాలు సంధించింది. హర్మన్ నుంచి ఊహించని కామెంట్ల నేపథ్యంలో ఆమె తమ జట్టును తీసుకుని డ్రెసింగ్రూంకి వెళ్లిపోయింది. ఈ వరుస సంఘటనల నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. పలువురు టీమిండియా మాజీ క్రికెటర్లు సైతం హర్మన్ వ్యవహారశైలిని తప్పుబట్టారు. ఐసీసీ సైతం ఆమెపై కఠిన చర్యలు చేపట్టింది. నిబంధనలు ఉల్లంఘించిందని పేర్కొంటూ.. రెండు అంతర్జాతీయ మ్యాచ్లు ఆడకుండా నిషేధం విధించింది. ఈ విషయంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి ఎలా స్పందిస్తున్న అంశం ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీసీసీఐ కార్యదర్శి జై షా కీలక వ్యాఖ్యలు చేశాడు. ‘‘బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వీవీఎస్ లక్ష్మణ్ అనుచిత ప్రవర్తన గురించి హర్మన్తో మాట్లాడతారు. మేమైతే ఆమె సస్పెన్షన్ గురించి ఐసీసీని సవాలు చేయబోము. ఇప్పటికే ఆ సమయం కూడా మించిపోయింది’’ అని జై షా పేర్కొన్నాడు. కాగా హర్మన్ ప్రవర్తన ఆమె పట్ల గౌరవాన్ని తగ్గించిందనే కామెంట్లు వినిపిస్తుండగా.. అభిమానులు మాత్రం ఇంతకంటే ఓవరాక్షన్ చేసిన వాళ్లు మాత్రం మీకు కనబడరా అంటూ అండగా నిలుస్తున్నారు. కాగా ఐసీసీ నిషేధం నేపథ్యంలో హర్మన్ప్రీత్ కౌర్ ఆసియా క్రీడలు-2023లో రెండు మ్యాచ్లకు దూరం కానుంది. చదవండి: సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి తొలగింపు.. భువనేశ్వర్ కుమార్ కీలక నిర్ణయం! టీమిండియా క్రికెటర్లలో ప్రభుత్వ ఉద్యోగులు వీరే! లిస్టులో ఊహించని పేర్లు.. Harmanpreet Kaur was not happy with the decision 👀#HarmanpreetKaur #IndWvsBangW #INDvWI pic.twitter.com/ZyoQ3R3Thb — Ajay Ahire (@Ajayahire_cric) July 22, 2023 -
టీమిండియా హెడ్కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్
చైనా వేదికగా జరగనున్న ఆసియాగేమ్స్లో భారత క్రికెట్ జట్లు తొలిసారి పాల్గొనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ మెగా ఈవెంట్లో భాగమయ్యే మెన్స్, ఉమెన్స్ జట్లను బీసీసీఐ ప్రకటించింది. భారత పురుషుల జట్టుకు యువ ఓపెనర్ రుత్రాజ్ గైక్వాడ్ సారధ్యం వహించనుండగా.. మహిళల జట్టుకు హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వం వహించనుంది. ఇక ఐపీఎల్లో అదరగొట్టిన రింకూ సింగ్, ప్రభుసిమ్రాన్ సింగ్,తిలక్ వర్మ వంటి యువ ఆటగాళ్లకు ఈ జట్టులో చోటు దక్కింది. ఆసియా క్రీడలకు భారత సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చారు. అయితే ఈ జట్టులో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్కు చోటు దక్కకపోవడం గమానార్హం. హెడ్కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్.. ఇక ఈ క్రీడలకు సీనియర్ ఆటగాళ్లతో పాటు హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్కు కూడా బీసీసీఐ రెస్టు ఇచ్చింది. అతడి స్ధానంలో టీమిండియా మాజీ క్రికెటర్, నేషనల్ క్రికెట్ అకాడమీ ఛీప్ వీవీఎస్ లక్ష్మణ్ బాధ్యతలు చేపట్టనున్నాడు. లక్ష్మణ్ ఇప్పటికే ద్రవిడ్ గైర్హజరీలో ఐర్లాండ్, జింబాబ్వే టూర్లకు, స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన సిరీస్కు హెడ్ కోచ్గా వ్యవహరించాడు. గతంలో భారత అండర్-19 క్రికెట్ జట్టుకు కూడా లక్ష్మణ్ హెడ్కోచ్గా వ్యవహరించారు. లక్ష్మణ్ పర్యవేక్షణలోనే అండర్ 19 ప్రపంచకప్-2021ను యువ భారత జట్టు సొంతం చేసుకుంది.మరోసారి జట్టును తన నేతృత్వంలో జట్టును నడిపించేందుకు హైదరాబాదీ సిద్దమయ్యాడు. ఈ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 19 నుంచి ఆక్టోబర్ 7 వరకు జరగనున్నాయి. చదవండి: Ind Vs Pak: సూర్యకుమార్కు 32, నాకింకా 22 ఏళ్లే.. అతడితో పోలిక ఎందుకు: పాక్ బ్యాటర్ ఓవరాక్షన్ -
IND VS WI 2nd Test: రాహుల్ ద్రవిడ్కు విశ్రాంతి
వెస్టిండీస్తో జరుగుతున్న సిరీస్లు ముగిసాక టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, అతని సహాయక సిబ్బందికి కొన్ని రోజుల పాటు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ప్రకారం విండీస్ సిరీస్ ముగిసాక టీమిండియా.. ఐర్లాండ్తో వారి స్వదేశంలో మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ ఆడాల్సి ఉంది. అయితే ఈ సిరీస్కు వెళ్లకుండా స్వదేశంలో రెస్ట్ తీసుకునేందుకే ద్రవిడ్ బృందానికి బీసీసీఐ అనుమతి ఇచ్చినట్లు సమాచారం. విండీస్తో ఆఖరి రెండు టీ20ల తర్వాత ద్రవిడ్ అండ్ కో యునైటెడ్ స్టేట్స్ (ఆఖరి 2 టీ20లు విండీస్లో కాకుండా యుఎస్ఏలో జరుగనున్నాయి) నుంచి నేరుగా భారత్కు పయనమవుతుంది. ద్రవిడ్ టీమ్లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోర్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేతో పాటు మరికొంత మంది సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్తులో టీమిండియాకు ఉన్న బిజీ షెడ్యూల్ దృష్ట్యా వీరికి విశ్రాంతి ఇస్తున్నట్లు తెలుస్తోంది. ద్రవిడ్ టీమ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని జాతీయ క్రికెట్ అకాడమీ (NCA) సిబ్బంది ఐర్లాండ్ పర్యటనను నిర్వహిస్తారు. లక్ష్మణ్ టీమ్లో బ్యాటింగ్ కోచ్గా హృషికేశ్ కనిత్కర్, బౌలింగ్ కోచ్గా సాయిరాజ్ బహుతులే ఉన్నారు. కాగా, గతంలోనూ పలు సందర్భాల్లో ద్రవిడ్ గైర్హాజరీలో వీవీఎస్ లక్ష్మణ్ టీమిండియా కోచింగ్ బాధ్యతలను నిర్వర్తించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్న భారత్ డొమినికా వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారీ విజయం సాధించి, మరో విజయం కోసం తహతహలాడుతుంది. ఈ సిరీస్లో భారత్ తదుపరి మరో టెస్ట్ మ్యాచ్, 3 వన్డేలు, 5 టీ20లు ఆడుతుంది. తొలి టెస్ట్లో యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ శతకాలు సాధించి, టీమిండియా భారీ స్కోర్కు దోహదపడగా.. అశ్విన్ 12 వికెట్లు పడగొట్టి, భారత గెలుపులో ప్రధాన పాత్ర పోషించారు. -
VVS Laxman Rare Photos: టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అరుదైన (ఫోటోలు)
-
IPL 2023: కెప్టెన్ అయ్యానన్న ఆనందం అంతలోనే ఆవిరి! లక్ష్మణ్ తర్వాత..
IPL 2023 LSG Vs CSK- Krunal Pandya: కేఎల్ రాహుల్ గాయపడిన కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్లో తొలిసారి కెప్టెన్ అయ్యాడు టీమిండియా ఆల్రౌండర్ కృనాల్ పాండ్యా. ఐపీఎల్-2023లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ సారథిగా పగ్గాలు చేపట్టాడు. అయితే, కెప్టెన్ అయ్యానన్న ఆనందం కృనాల్కు ఎంతో సేపు నిలవలేదు. అంతలోనే ఆనందం ఆవిరి లక్నో బ్యాటింగ్ ఆరంభించిన కొద్దిసేపటికే అతడి సంతోషం ఆవిరైపోయింది. కృనాల్ పేరిట ఓ చెత్త రికార్డు నమోదైంది. అటల్ బిహారీ వాజ్పేయి ఏకనా క్రికెట్ స్టేడియంలో సీఎస్కేతో మ్యాచ్లో టాస్ ఓడిన లక్నో తొలుత బ్యాటింగ్కు దిగింది. చెత్త రికార్డు మూటగట్టుకుని ఈ క్రమంలో చెన్నై బౌలర్ మొయిన్ అలీ.. ఓపెనర్ కైల్ మేయర్స్(14)ను పెవిలియన్కు పంపగా.. మహీశ్ తీక్షణ మరో ఓపెనర్ మనన్ వోహ్రా(10) వికెట్ కూల్చాడు. ఈ క్రమంలో వన్డౌన్లో వచ్చిన కరణ్ శర్మ 9 పరుగులు చేయగా.. నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కృనాల్ పాండ్యా డకౌట్ అయ్యాడు. లక్నో ఇన్నింగ్స్ ఆరో ఓవర్ చివరి బంతికి మహీశ్ తీక్షణ బౌలింగ్లో అజింక్య రహానేకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఫస్ట్ స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న రహానే అద్భుత రీతిలో క్యాచ్ అందుకోవడంతో పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. తద్వారా ఐపీఎల్లో కెప్టెన్గా డెబ్యూ మ్యాచ్లోనే డకౌట్ అయిన మూడో క్రికెటర్గా అప్రదిష్ట మూటగట్టుకున్నాడు. ఐపీఎల్లో కెప్టెన్గా వ్యవహరించిన తొలి మ్యాచ్లో డకౌట్ అయింది వీరే! ►2008లో కేకేఆర్తో కోల్కతాలో జరిగిన మ్యాచ్లో దెక్కన్ చార్జర్స్ కెప్టెన్ వీవీఎస్ లక్ష్మణ్ ►2023లో లక్నో సూపర్ జెయింట్స్తో మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ నాయకుడు ఎయిడెన్ మార్కరమ్ ►2023లో లక్నోలో చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ సారథి కృనాల్ పాండ్యా చదవండి: 'నేను ఔటయ్యానా?'.. జడ్డూ దెబ్బకు షాక్లో స్టోయినిస్ Virat Kohli: ఐపీఎల్ ఆడేందుకే వచ్చా! ఎవరెవరితోనూ తిట్టించుకోవడానికి కాదు! var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చరిత్ర సృష్టించిన విలియమ్సన్, హెన్రీ నికోల్స్... ద్రవిడ్- లక్ష్మణ్తో పాటు..
New Zealand vs Sri Lanka, 2nd Test: న్యూజిలాండ్ బ్యాటర్లు కేన్ విలియమ్సన్, హెన్రీ నికోల్స్ చరిత్ర సృష్టించారు. కివీస్ టెస్టు చరిత్రలో అధికసార్లు అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన తొలి జోడీగా నిలిచారు. అదే విధంగా.. ఓవరాల్గా రెండు లేదంటే ఎక్కువసార్లు ఈ ఫీట్ నమోదు చేసిన ఎనిమిదో జోడీగా ఘనత సాధించారు. ద్రవిడ్- లక్ష్మణ్లతో పాటు స్వదేశంలో శ్రీలంకతో రెండో టెస్టు రెండో రోజు సందర్భంగా 300 పైచిలుకు భాగస్వామ్యంతో ఈ రికార్డు అందుకున్నారు. వీరు ఈ ఫీట్ నమోదు చేయడం ఇది రెండోసారి. తద్వారా మహేళ జయవర్ధనే- కుమార సంగక్కర, డాన్ బ్రాడ్మన్- విల్ పోన్స్ఫోర్డ్, మైకేల్ క్లార్క్- రిక్కీ పాంటింగ్, మహ్మద్ యూసఫ్- యూనిస్ ఖాన్, రాహుల్ ద్రవిడ్- వీవీఎస్ లక్ష్మణ్ల తర్వాత ఈ ఘనత సాధించిన ఆరో జోడీగా నిలిచారు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్లో భాగంగా న్యూజిలాండ్ శ్రీలంకతో రెండు మ్యాచ్ల సిరీస్ ఆడుతోంది. ఈ క్రమంలో తొలి టెస్టులో ఆఖరి బంతికి విజయం అందుకున్న కివీస్.. రెండో టెస్టులో రెండో రోజు ఆట ముగిసే సరికి పటిష్ట స్థితిలో నిలిచింది. వన్డౌన్ బ్యాటర్ కేన్ విలియమ్సన్(215), నాలుగో స్థానంలో వచ్చిన హెన్రీ నికోల్స్(200 నాటౌట్) డబుల్ సెంచరీలతో రాణించారు. పటిష్ట స్థితిలో వెల్లింగ్టన్లోని బేసిన్ రిజర్వ్ మైదానంలో ఇద్దరూ కలిసి 363 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. ఈ క్రమంలో 4 వికెట్ల నష్టానికి 580 పరుగుల భారీ స్కోరు వద్ద న్యూజిలాండ్ తమ తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో రెండో రోజు ఆట ముగిసే సరికి లంక రెండు వికెట్లు నష్టపోయి 26 పరుగులు చేసింది. దీంతో ఆతిథ్య కివీస్కు 554 పరుగుల ఆధిక్యం లభించింది. చదవండి: IPL 2023: కేకేఆర్కు మరో బిగ్షాక్.. స్టార్ ఆటగాళ్లు దూరం! IND vs AUS: హార్దిక్పై కోపంతో ఊగిపోయిన కోహ్లి.. ఏం జరిగిందంటే? వీడియో వైరల్ -
సౌరవ్ గంగూలీకి కీలక బాధ్యతలు..
బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ తిరిగి మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు క్రికెట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. గతేడాది ఆక్టోబర్లో బీసీసీఐ అధ్యక్ష పదవి నుండి వైదొలిగిన దాదా.. ఇప్పటికే యూఏఈ టీ20 లీగ్లో దుబాయ్ క్యాపిటల్స్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్లో ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు క్రికెట్ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టాడు. కాగా దుబాయ్ క్యాపిటల్స్, ప్రిటోరియా క్యాపిటల్స్ ఫ్రాంచైజీలను ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ క్రికెట్ డైరెక్టర్గా సౌరవ్ తిరిగి బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే అతడితో ఢిల్లీ ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిగింది. గతంలో క్రికెట్ డైరెక్టర్గా పనిచేసిన దాదాకు ఢిల్లీ యాజమాన్యంతో మంచి సంబంధం ఉంది. కాబట్టి మళ్లీ అతడు తన బాధ్యతలను తిరిగి చేపట్టునున్నాడు అని ఐపీఎల్ వర్గాలు పీటీఐతో వెల్లడించాయి. ఇక టీమిండియా స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ రెగ్యూలర్ కెప్టెన్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో గాయపడిన సంగతి తెలిసిందే. అతడు పూర్తిగా కోలుకోవడానికి దాదాపు ఆరు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో అతడు ఐపీఎల్కు దూరం కావడం దాదాపు ఖాయంగానే కన్పిస్తోంది. ఒక వేళ పంత్ దూరమైతే ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్గా ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. చదవండి: టీమిండియా హెడ్ కోచ్గా లక్ష్మణ్.. ద్రవిడ్కు త్వరలోనే గుడ్బై! -
టీమిండియా హెడ్ కోచ్గా లక్ష్మణ్.. ద్రవిడ్కు త్వరలోనే గుడ్బై!
స్వదేశంలో ఈ ఏడాది జరగనున్న వన్డే వరల్డ్కప్ తర్వాత టీమిండియా హెడ్ కోచ్ పదవి నుంచి రాహుల్ ద్రవిడ్కు బీసీసీఐ ఉద్వాసన పలకనున్నట్లు తెలుస్తోంది. అతడి స్థానంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు వీవీయస్ లక్ష్మణ్ను నిమించాలని బీసీసీఐ భావిస్తున్నట్లు సమాచారం. ఈ ఏడాది నవంబర్తో హెడ్ కోచ్గా ద్రవిడ్ రెండేళ్ల పదవీ కాలం ముగియనుంది. ఈ క్రమంలో ద్రవిడ్ పదవీ కాలన్ని పెంచే ఆలోచనలో బీసీసీఐ లేనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే విధంగా గతేడాది జరిగిన ఆసియాకప్, టీ20 ప్రపంచకప్లో భారత జట్టు వైఫల్యం తర్వాత ద్రవిడ్ను హెడ్ కోచ్ నుంచి తప్పించాలన్న డిమాండ్లు వినిపించిన సంగతి తెలిసిందే. ఇక గతంలో భారత- ఏ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించిన లక్ష్మణ్ అత్యంత విజయవంతమయ్యాడు. అదే విధంగా రాహుల్ ద్రవిడ్ స్థానంలో భారత సీనియర్ జట్టుకు తాత్కాలిక హెడ్ కోచ్గా కూడా వీవీయస్ బాధ్యతలు నిర్వర్తించాడు. గతేడాది జరిగిన ఐర్లాండ్తో జరిగిన టీ20 సిరీస్లో లక్ష్మణ్ తొలి భారత హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టాడు. అనంతరం జింబాబ్వేతో వన్డే సిరీస్, న్యూజిలాండ్తో టీ20, వన్డే సిరీస్లో కూడా భారత జట్టు ప్రధాన కోచ్గా లక్ష్మణ్ పనిచేశాడు. న్యూజిలాండ్తో వన్డే సిరీస్ మినహా.. మిగితా అన్ని సిరీస్లో భారత్ విజయం సాధించింది. ఇక లక్ష్మణ్ ప్రస్తుతం నేషనల్ క్రికెట్ ఆకాడమీ డైరెక్టర్గా ఉన్నాడు. చదవండి: IND vs SL: శ్రీలంకతో వన్డే సిరీస్.. జట్టులోకి బుమ్రా.. బీసీసీఐ ప్రకటన -
సుశీల్ జీ మీకు రుణపడిపోయాం.. హ్యాట్సాఫ్: లక్ష్మణ్ ట్వీట్ వైరల్
Rishabh Pant Accident- VVS Laxman Hails Bus Driver: ‘‘మంటల్లో కాలిపోతున్న కారులో నుంచి రిషభ్ పంత్ను బయటకు తీసి.. బెడ్షీట్ చుట్టి.. వెంటనే అంబులెన్స్కు ఫోన్ చేసి.. తనను కాపాడిన హర్యానా డ్రైవర్ సుశీల్ కుమార్కు ధన్యవాదాలు. మీరు చేసిన సేవకు కృతజ్ఞులం. సుశీల్ జీ మీకు రుణపడిపోయాం’’ అంటూ టీమిండియా దిగ్గజం, జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు. టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్ ప్రాణాలతో బయటపడటానికి కారణమైన బస్సు డ్రైవర్ సుశీల్ కుమార్ను రియల్ హీరోగా అభివర్ణించాడు. అదే విధంగా.. కండక్టర్ పరంజిత్కు కూడా లక్ష్మణ్ ధన్యవాదాలు తెలియజేశాడు. పెద్ద మనసు రిషభ్ను కాపాడే క్రమంలో పరంజిత్.. సుశీల్కు సాయం చేశాడన్న లక్ష్మణ్.. వీరి సమయస్ఫూర్తికి సలాం కొట్టాడు. పంత్ను ప్రాణాలతో రక్షించిన సుశీల్, పరంజిత్లది పెద్ద మనసు అంటూ హ్యాట్సాఫ్ చెప్పాడు. కాగా టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ యువ వికెట్ కీపర్ స్వయంగా కారు నడుపుకొంటూ స్వస్థలం ఉత్తరాఖండ్కు వెళ్తుండగా.. డివైడర్ను ఢీకొట్టాడు. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన సుశీల్ వెంటనే తమ బస్సు నిలిపివేసి.. అప్పటికే కారు నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్న పంత్ను మరికొంత మంది సాయంతో బయటకు తీశాడు. ఈ నేపథ్యంలో గాయాలతో బయటపడ్డ పంత్ను ఆస్పత్రికి తరలించగా చికిత్స జరుగుతోంది. కాగా భయంకరమైన యాక్సిడెంట్ నుంచి 25 ఏళ్ల పంత్ ప్రాణాలతో బయటపడటంలో సుశీల్ పాత్ర కీలకం. ఈ నేపథ్యంలో అతడిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్లకు ప్రోత్సాహకం టీమిండియా బ్యాటర్ రిషభ్ పంత్ను ప్రమాదం నుంచి కాపాడిన వారందరికీ సముచిత గౌరవం దక్కనుంది. ఈ విషయం గురించి ఉత్తరాఖండ్ డీజీపీ అశోక్ మాట్లాడుతూ.. ‘‘ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత బాధితులకు మొదటి గంట సమయం అత్యంత కీలకం. గోల్డెన్ పీరియడ్. ఆ సమయంలో సరైన చికిత్స అందితే ప్రాణాలతో బయటపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరించి బాధితుడిని కాపాడిన వాళ్లను ప్రోత్సహించేందుకే కేంద్రం ది గుడ్ సామరిటన్ స్కీమ్ ప్రవేశపెట్టింది’’ అని తెలిపారు. కాగా రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను వెంటనే ఆస్పత్రికి తరలించి సకాలంలో వైద్య సేవ అందేలా చేసిన వారికి రూ. 5 వేల నగదు ప్రోత్సాహకం ఇస్తారు. చదవండి: Pele: అటకెక్కిన అంతర్యుద్దం.. అట్లుంటది పీలేతోని! కానీ.. ఎంత ఎదిగినా... ఆయనకూ తప్పలేదు! ఘనంగా షాహిద్ ఆఫ్రిది కుమార్తె వివాహం.. హాజరైన షాహిన్ ఆఫ్రిది Gratitude to #SushilKumar ,a Haryana Roadways driver who took #RishabhPant away from the burning car, wrapped him with a bedsheet and called the ambulance. We are very indebted to you for your selfless service, Sushil ji 🙏 #RealHero pic.twitter.com/1TBjjuwh8d — VVS Laxman (@VVSLaxman281) December 30, 2022 -
Rishabh Pant: ఉదయమే పంత్ గురించి ఆలోచించా.. ఇంతలో ఇలా
Rishabh Pant- Car Accident- Pray For Speedy Recovery: టీమిండియా యువ బ్యాటర్ రిషభ్ పంత్ త్వరగా కోలుకోవాలని దిగ్గజ ఆటగాడు వీవీఎస్ లక్ష్మణ్ ప్రార్థించాడు. పంత్కు ప్రాణాపాయం తప్పిందన్న లక్ష్మణ్ త్వరగా కోలుకో చాంపియన్ అంటూ 25 ఏళ్ల ఈ వికెట్ కీపర్ను ఉద్దేశించి ట్వీట్ చేశాడు. కాగా శుక్రవారం ఉదయం రిషభ్ పంత్ ప్రయాణిస్తున్న కారు రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఉత్తరాఖండ్కి నుంచి ఢిల్లీ నుంచి వస్తున్న సమయంలో రూర్కీ సమీపంలో ఈ ఘటన చేసుకుంది. డివైడర్ను ఢీకొట్టిన కారు పూర్తిగా కాలిపోయింది. అయితే, పంత్ ముందే కారు నుంచి దూకేయడంతో ప్రాణాలతో బయటపడగలిగాడు. కానీ, ఈ క్రమంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో పంత్ ఆరోగ్య పరిస్థితిపై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున ట్వీట్లు చేస్తుండటంతో #RishabhPant ట్రెండ్ అవుతోంది. లక్ష్మణ్ ట్వీట్ ద్వారా.. ఈ క్రమంలో జాతీయ క్రికెట్ అకాడమీ హెడ్ వీవీఎస్ లక్ష్మణ్ ఈ మేరకు బిగ్ అప్డేట్ అందించాడు. ‘‘పంత్ కోసం ప్రార్థిస్తున్నా. దేవుడి దయ వల్ల అతడు ప్రమాదం నుంచి బయటపడ్డాడు’’ అని లక్ష్మణ్ ట్విటర్లో పేర్కొన్నాడు. Praying for Rishabh Pant. Thankfully he is out of danger. Wishing @RishabhPant17 a very speedy recovery. Get well soon Champ. — VVS Laxman (@VVSLaxman281) December 30, 2022 స్పందించిన క్రీడా వర్గాలు రిషభ్ పంత్ కారు ప్రమాదం గురించి తెలుసుకున్న క్రికెట్ వర్గాల ప్రముఖులు అతడు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు. ‘‘వీలైనంత త్వరగా కోలుకో డియర్ పంత్’’ అని టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. Wishing dear @RishabhPant17 a super speedy recovery. Bahut hi Jald swasth ho jaao. — Virender Sehwag (@virendersehwag) December 30, 2022 ఉదయమే తన గురించి ఆలోచించా ఇక.. ‘‘ఈరోజు ఉదయమే రిషభ్ పంత్ గురించి ఆలోచనలు చుట్టుముట్టాయి. ఇంతలోనే ఇలా.. తను బాగుండాలి. త్వరగా కోలుకోవాలి’’ అని క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లే ట్వీట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ ప్లేయర్ సామ్ బిల్లింగ్స్ సైతం.. రిషభ్ పంత్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశాడు. కాగా పంత్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. Thinking about Rishabh Pant this morning and desperately hoping he is fine and recovers soon. — Harsha Bhogle (@bhogleharsha) December 30, 2022 ఉత్తరాఖండ్ సీఎం ఆదేశాలు రిషభ్ పంత్ కారు ప్రమాద ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. దురదృష్టవశాత్తూ పంత్ ప్రమాదానికి గురయ్యాడన్న ఆయన.. వైద్య సహాయం అందించి, ఎప్పటికప్పుడు పరిస్థితి పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. పంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కాగా ఈ ఏడాది పంత్ను తమ రాష్ట్ర అంబాసిడర్గా నియమిస్తూ పుష్కర్ సింగ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Rest in Power- ‘King’ Pele: అల్విదా కింగ్.. పీలే రాకముందు అసలు ఫుట్బాల్ అంటే కేవలం.. Rashid Khan: వద్దనుకున్నోడే మళ్లీ దిక్కయ్యాడు.. టి20 కెప్టెన్గా -
బంగ్లా చేతిలో ఓటమిని ఊహించలేదు.. బీసీసీఐ ఆగ్రహం! తిరిగి రాగానే
India tour of Bangladesh, 2022 - ODI Series Loss : బంగ్లాదేశ్ చేతిలో టీమిండియా ఓటమి నేపథ్యంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కోపంగా ఉన్నట్లు తెలుస్తోంది. పటిష్ట జట్టుగా పేరొందిన రోహిత్ సేన.. బంగ్లా పర్యటనలో విఫలం కావడంపై మేనేజ్మెంట్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కాగా ద్వైపాక్షిక టీ20 సిరీస్లలో సత్తా చాటుతున్న టీమిండియా అసలైన సమయంలో మాత్రం చేతులెత్తేస్తున్న సంగతి తెలిసిందే. కీలక సమయాల్లో చేతులెత్తేసి! రోహిత్ సారథ్యంలోని మాజీ చాంపియన్ ఆసియా టీ20 టోర్నీ-2022లో సూపర్-4 దశలోనే నిష్క్రమించడం సహా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్లోనే ఇంటిబాట పట్టింది. ఇక ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటనలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో టీ20 సిరీస్ గెలిచినా.. శిఖర్ ధావన్ నేతృత్వంలో వన్డే సిరీస్ను కోల్పోయింది. ఈ క్రమంలో బంగ్లాదేశ్ పర్యటనకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ సహా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి, వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ తదితర కీలక ఆటగాళ్లు అందుబాటులోకి వచ్చారు. దీంతో సులువుగానే వన్డే సిరీస్ గెలుస్తుందని భావించగా మొదటి మ్యాచ్లో బ్యాటర్లు, రెండో మ్యాచ్లో బౌలర్లు వైఫల్యం చెందడంతో బంగ్లా చేతిలో చిత్తైంది టీమిండియా. స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరచలేక సిరీస్ను 0-2తో ఆతిథ్య జట్టుకు సమర్పించుకుంది. బంగ్లా చేతిలో ఓటమిని ఊహించలేదు.. రాగానే రోహిత్ ఇంకా ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ.. జట్టు ఆట తీరుపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. టీమిండియా వైఫల్యాలపై సమీక్ష చేపట్టి తగిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం. అదే విధంగా ఆటగాళ్ల ఫిట్నెస్ ప్రమాణాలపైనా ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ సారథి విరాట్ కోహ్లి సహా హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్, జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ తదితరులతో బీసీసీఐ అధికారులు సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీసీసీఐ కీలక అధికారి ఒకరు ఇండియన్ ఎక్స్ప్రెస్తో మాట్లాడుతూ.. ‘‘కొంతమంది ఆఫీస్ బేరర్లు బిజీగా ఉన్న కారణంగా బంగ్లాదేశ్ పర్యటనకు ముందు ఆటగాళ్లతో సమావేశం కాలేకపోయాం. ఈ టూర్లో టీమిండియా ప్రదర్శన ఘోరంగా ఉంది. బంగ్లాదేశ్ చేతిలో జట్టు ఓడిపోతుందని మేము అస్సలు ఊహించలేదు. వాళ్లంతా తిరిగి రాగానే మీటింగ్కు ఏర్పాటు చేస్తాం. నిజానికి ప్రపంచకప్ ముగిసిన తర్వాతే ఈ సమావేశం జరగాల్సింది’’ అని పేర్కొన్నారు. చదవండి: BAN vs IND: బంగ్లాదేశ్తో మూడో వన్డే.. టీమిండియాకు భారీ షాక్! రోహిత్తో పాటు Team India Schedule: స్వదేశంలో టీమిండియా వరుస సిరీస్లు.. షెడ్యూల్ విడుదల -
పంత్ సెంచరీ చేసి ఎన్నాళ్లైందని! అతడికి కచ్చితంగా అండగా ఉంటాం: కోచ్
India Vs New Zealand- Rishabh Pant- Sanju Samson- BCCI: ‘‘విఫలమవుతున్నా రిషభ్ పంత్కు ఎందుకు వరుస అవకాశాలు ఇస్తున్నారు? ప్రతిభ ఉన్నా మరో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్కు ఎందుకు అన్యాయం చేస్తున్నారు? ఆటగాళ్ల విషయంలో ఈ వివక్ష ఎందుకు ప్రదర్శిస్తున్నారు?’’.. గత కొన్నాళ్లుగా భారత తుది జట్టు కూర్పుపై అసహనం వ్యక్తం చేస్తూ అభిమానులు అంటున్న మాటలివి. పాపం సంజూ ప్రపంచకప్-2022 టోర్నీలో విఫలమైన టీమిండియా యువ వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ న్యూజిలాండ్ టూర్కు వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. టీ20 సిరీస్లో విఫలమైన అతడు.. వన్డే సిరీస్లోనూ దారుణ ప్రదర్శన కనబరిచాడు. మరోవైపు.. తనను తాను నిరూపించుకున్నప్పటికీ.. ఎప్పుడో ఓసారి మాత్రమే టీమిండియాకు ఎంపికయ్యే మరో వికెట్ కీపర్ సంజూ శాంసన్కు మాత్రం తుది జట్టులో చోటు దక్కలేదు. టీ20 సిరీస్కు పూర్తిగా అతడిని పక్కనపెట్టిన యాజమాన్యం.. మొదటి వన్డేలో మాత్రమే ఆడించింది. ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో పంత్, సంజూల పేర్లు ట్రెండ్ అవుతున్నాయి. తాజాగా కివీస్తో మూడో వన్డేలో విఫలమైన పంత్పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పంత్ను ట్రోల్ చేస్తూ.. సంజూను సమర్థిస్తూ బీసీసీఐ తీరును ఎండగడుతున్నారు ఫ్యాన్స్. పంత్ అద్భుతం.. అండగా నిలబడతాం ఈ క్రమంలో న్యూజిలాండ్తో మూడో వన్డేకు ముందు తాత్కాలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ పంత్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ‘‘పంత్ నాలుగో స్థానంలో అద్భుతంగా ఆడుతున్నాడు. ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో అతడు విలువైన సెంచరీ చేసి మరీ ఎక్కువ రోజులేం కావడం లేదు కదా! తనకు కచ్చితంగా మద్దతుగా నిలవాల్సిన అవసరం ఉంది. టీ20 క్రికెట్లో మెరవడం ద్వారా బ్యాటర్ల ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. మైదానాలు పెద్దగా ఉన్నాయా, చిన్నగా ఉన్నాయా అన్న అంశంతో సంబంధం లేకుండా హిట్టింగ్ ఆడే అవకాశం దొరుకుతుంది. నిజానికి ఒక ఆటగాడికి ఎందుకు వరుసగా చాన్స్ ఇస్తున్నామో.. ఒక్కోసారి వాళ్లను ఎందుకు జట్టు నుంచి తప్పిస్తున్నామో వాళ్లకు సమాచారం ఇస్తూనే ఉంటాం’’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించాడు. నాడు జట్టును గెలిపించిన పంత్ ఈ ఏడాది జూలైలో మాంచెసర్ట్లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో ఇంగ్లండ్తో జరిగిన వన్డే మ్యాచ్లో పంత్ సెంచరీ బాదాడు. 113 బంతులు ఎదుర్కొన్న అతడు 16 సిక్స్లు, 2 ఫోర్ల సాయంతో 125 పరుగులు చేసి ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఇలా పంత్ అద్భుత ఇన్నింగ్స్తో 5 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత జట్టు.. ట్రోఫీ గెలిచింది. ఈ మ్యాచ్లో పంత్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ లక్ష్మణ్.. పంత్కు మద్దతుగా నిలవడం గమనార్హం. ఇక తాజాగా కివీస్తో మూడో వన్డేలోనూ పంత్ 10 పరుగులకే పెవిలియన్ చేరాడు. వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కాగా ఆతిథ్య జట్టు 1-0తో ట్రోఫీ గెలిచింది. చదవండి: టీమిండియాకు వెలకట్టలేని ఆస్తి దొరికింది! జడ్డూ నువ్వు రాజకీయాలు చూసుకో! ఇక నీ అవసరం ఉండకపోవచ్చు! ICC ODI Rankings: అదరగొట్టిన కేన్ మామ..లాథమ్! దిగజారిన కోహ్లి, రోహిత్ ర్యాంక్లు
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
రైతు సంక్షేమాన్ని విస్మరిస్తున్న ప్రభుత్వం
ధాన్యం సేకరణ సాఫీగా సాగాలి
పాఠశాలల ప్రారంభం లోగా పనులు పూర్తి
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ముగ్గురు డిబార్
4,63,983 మంది ఓటుకు దూరం
ప్రణాళిక సిద్ధం
డెంగీ నివారణకు సహకరించాలి
సాక్షి మైత్రి మహిళ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ
అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలి
కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు
తప్పక చదవండి
- రూ. 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్.. యాదాద్రి చిన్నారి ఉదంతం విషాదాంతం
- బుల్ బ్యాక్ ర్యాలీ
- రిజర్వేషన్లను రద్దు చేయాలని చూస్తోంది: కేజ్రీవాల్
- రూ.170 కోట్ల నగదు, నగలు స్వాదీనం
- నరసరావుపేట: గోపిరెడ్డి హత్యకు చదలవాడ కుట్ర..!
- మలివాల్ వాంగ్మూలం నమోదు
- Lok Sabha Election 2024: దేశవ్యాప్తంగా అల్లర్లకు విపక్షాల కుట్రలు
- భార్యను బెదిరించబోయి ఉరి బిగిసి..
- నిలకడగా స్లొవాకియా ప్రధాని ఆరోగ్యం
- తెలంగాణ ‘ఆర్టీసీ విలీనం’ అంతేనా?
Advertisement