Sakshi News home page

సాక్షి మనీ మంత్ర : సూచీల్లో కొనసాగుతున్న లాభాల పరంపర

Published Fri, Feb 16 2024 3:35 PM

Nifty Above 22,000, Sensex Up 376 Points - Sakshi

దేశీయ సూచీల్లో లాభాల పరంపర కొనసాగుతుంది. ఫిబ్రవరి 16న నిఫ్టీ 22,000 ఎగువన భారతీయ బెంచ్‌మార్క్ సూచీలు వరుసగా నాల్గవ సెషన్‌లో లాభాలతో ముగిశాయి.

 విప్రో, ఎం అండ్ ఎం, ఎస్‌బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టి అత్యధికంగా లాభపడగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్‌జీసీ, ఎస్‌బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. 

 చమురు అండ్‌ గ్యాస్, పవర్ మినహా, ఇతర అన్ని సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 1-2 శాతం వరకు గ్రీన్‌లో ట్రేడ్‌ అవ్వగా బీఎస్‌ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి.

Advertisement

What’s your opinion

Advertisement