-
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లో సరికొత్త రికార్డ్లు నమోదయ్యాయి. సోమవారం స్టాక్మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ, సెన్సెక్స్ ఆల్టైం హైకి చేరుకుని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ సానుకూల అంశాలు, ఐటీ, ఆటోమొబైల్ షేర్ల కొనుగోలు, రాబోయే లోక్సభ ఎన్నికల తర్వాత జరిగే రాజకీయ పరిణామాలకు కొనసాగింపుగా పెట్టుబడి దారులు మళ్లీ ఆశాజనకంగా మారడంతో బ్యాంక్ నిఫ్టీ తాజా గరిష్ట స్థాయికి చేరుకుంది. ఫలితంగా సెన్సెక్స్ 494 పాయింట్లు లాభంతో 74,742 వద్ద ముగియగా, నిఫ్టీ 152 పాయింట్ల లాభంతో 22,666 వద్ద ముగిసింది. ఎథేర్ మోటార్స్,మారుతి సుజికీ, ఎం అండ్ ఎం,ఎన్టీపీసీ, జేఎస్డబ్ల్యూ స్టీల్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ముగియగా.. అదానీ పోర్ట్స్,నెస్లే, అపోలో హాస్పిటల్,విప్రో, ఎల్టీఐ మైండ్ట్రీ, సన్ ఫార్మా, హెచ్సీఎల్ టెక్, హెచ్డీఎఫ్సీ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
ఈయన్ని నమ్మి స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా?
న్యూఢిల్లీ: ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ (ఫిన్ఫ్లూయెన్సర్) రవీంద్ర బాలుకు సెబీ భారీ షాకిచ్చింది. స్టాక్ మార్కెట్ పేరుతో అక్రమంగా సంపాదించిన మొత్తం రూ.12 కోట్లను తిరిగి చెల్లించాలని ఆదేశించింది ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందచ్చనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఆ ప్రచారాన్ని నమ్మి పలువురు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టి భారీగా నష్టపోతున్నారు. ఇదే అంశంపై మార్కెట్ నియంత్రణ మండలి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో మార్కెట్ రెగ్యులేటర్ నిబంధనల్ని అతిక్రమించిన సంస్థలు, వ్యక్తులపై సెబీ కొరడా ఝుళిపిస్తోంది. ఈ నేపథ్యంలో రవీంద్ర భారతి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ప్రైవేట్ లిమిటెడ్ (RBEIPL)వ్యవస్థాపకుడు రవీంద్ర బాలుకు సెబీ నోటీసులు అందించింది. రవీంద్రబాలు,తన భార్య శుభాంగి భారతితో కలిసి 2016 నుంచి భారతి షేర్ మార్కెట్ పేరుతో వెబ్సైట్ను నిర్వహిస్తున్నారు. అందులో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు, మార్కెట్లో ఎలా పెట్టుబడులు పెట్టాలో తెలిపేలా మదుపర్లకు క్లాసులు ఇస్తున్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నారు. అంతేకాదు ఈ వెబ్సైట్ ద్వారా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టిన వారికి 25 శాతం నుంచి 1000 శాతం వరకు లాభాలు గడించవచ్చనే ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారంపై సమాచారం అందుకున్న సెబీ రవీంద్ర బాలుకు సంబంధించిన అన్నీ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. తదుపరి నోటీసు వచ్చే వరకు పెట్టుబడి సలహా సేవలు, ట్రేడింగ్ కార్యకలాపాలలో పాల్గొనొద్దంటూ సెబీ వారిని నిషేధించింది. దీంతో పాటు నేషనల్ బ్యాంక్లో ప్రత్యేక ఎస్క్రో ఖాతాలో రూ.12 కోట్లను డిపాజిట్ చేయాలని సూచించింది.కాగా, రెగ్యులేటరీ బాడీ నుండి స్పష్టమైన అనుమతి లేకుండా వాటిని విడుదల చేయడం సాధ్యం కాదని నిర్ధారిస్తూ, ఈ ఎస్క్రో ఖాతాలో నిధుల్ని సెబీ సంరక్షణలో ఉంటాయి. -
సాక్షి మనీ మంత్ర : ప్లాట్గా ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్మార్కెట్లు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 27.09 పాయింట్లు నష్టపోయి 73,876.82 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 22,434.70 వద్ద ముగింపు పలికాయి. శ్రీరామ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టీసీఎస్, యాక్సిస్ బ్యాంక్, టెక్ మహీంద్రా షేర్లు లాభపడగా, నెస్లే ఇండియా, బజాజ్ ఆటో, కోటక్ మహీంద్రా బ్యాంక్, బ్రిటానియా ఇండస్ట్రీస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. రియల్టీ ఇండెక్స్ 2.5 శాతం క్షీణించగా, ఆటో ఇండెక్స్ 0.4 శాతం పడిపోయింది. మరోవైపు పవర్, పీఎస్యూ బ్యాంక్ సూచీలు ఒక్కొక్కటి 1 శాతం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా సూచీలు 0.5 శాతం చొప్పున పెరిగాయి. బీఎస్ఈ మిడ్క్యాప్ ఇండెక్స్ (0.6 శాతం పెరుగుదల)తో బ్రాడర్ ఇండెక్స్లు తాజా రికార్డు గరిష్ట స్థాయిని తాకాయి. స్మాల్క్యాప్ ఇండెక్స్ 1 శాతం పెరిగింది. -
తాత చేసిన పని.. 30 ఏళ్ల తర్వాత ఎగిరి గంతేసిన మనువడు
మనలో చాలా మంది..నేను ఎప్పటికైనా లక్షాధికారిని కాకపోతానా? కోటీశ్వరుణ్ణి కాకపోతానా? అని ప్రతి ఒక్కరూ అనుకుంటూనే ఉంటారు. అయితే అలా ధనవంతులు కావాలంటే లక్షలు కావాల్సిన పనిలేదు. వందల్లో పొదుపు చేసినా అది ధనవంతుల్ని చేస్తుందని నిజం చేశారు ఓ పెద్దాయన. కేవలం రూ.500 పెట్టుబడి కాస్తా ఇప్పుడు రూ.3.75 లక్షలుగా మారడంతో మనవుడు తన తాతకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు అది వైరల్గా మారింది. చండీగఢ్కు చెందిన తన్మయ్ మోతీవాలా పీడియాట్రిక్ సర్జన్గా వైద్య సేవలందిస్తున్నారు. అయితే ఓ రోజు తన ఇంటిని సర్ధుతుండగా తాత వినియోగించిన ఓ ట్రంక్ పెట్ట మోతీవాలా కంటపడింది. అందులో ఏమున్నాయా? అని తెరిచి చూశాడు. అంతే అప్పుడే తాత పెట్టిన పెట్టుబడి చూసి ఎగిరి గంతేసినంత పనిచేశారు. అయితే ఆ ట్రంక్ పెట్టెలో 1994లో తన తాత రూ. 500 విలువైన ఎస్బీఐ షేర్లను కొనుగోలు చేసినట్లు, వాటికి సంబంధించిన సర్టిఫికెట్లను షేర్ చేశారు. తన తాత షేర్లను కొనుగోలు చేశారు. వాటిని అమ్మలేదని తర్వాత గుర్తించాడు. ఆ రూ.500 పెట్టబడితో వచ్చిన ప్రాఫిట్ ఎంత వచ్చిందో ఆరా తీశారు. 1994లో ఒక్కో షేర్ రూ.10 చొప్పున రూ.500కి మొత్తం 50 షేర్లను కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ మొత్తం షేర్ల విలువ రూ.3.75లక్షలకు చేరింది. అంటే దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టిన మొత్తం 750 శాతంతో రిటర్న్స్ వచ్చాయని డాక్టర్ మోతీవాలా వెల్లడించారు. The power of holding equity 😊 My Grand parents had purchased SBI shares worth 500 Rs in 1994. They had forgotten about it. Infact they had no idea why they purchased it and if they even hold it. I found some such certificates while consolidating family's holdings in a… pic.twitter.com/GdO7qAJXXL — Dr. Tanmay Motiwala (@Least_ordinary) March 28, 2024 -
25 షేర్లలో నేటి నుంచి కొత్త సెటిల్మెంట్.. టీప్లస్జీరో
స్టాక్ ఎక్సే్ఛంజీ దిగ్గజాలు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ నేటి(గురువారం) నుంచి టీప్లస్జీరో సెటిల్మెంట్కు తెరతీస్తున్నాయి. తొలుత 25 షేర్లలో ఆప్షనల్ పద్ధతిన అమలు చేయనున్నాయి. ఈక్విటీ నగదు మార్కెట్లో ప్రస్తుతం అమలవుతున్న టీప్లస్1 సెటిల్మెంట్కు జతగా పరిశీలన పద్ధతిలో టీప్లస్0కు శ్రీకారం చుడుతున్నాయి. కొద్దిమంది బ్రోకర్ల ద్వారా మాత్రమే ఇందుకు వీలు కలి్పస్తున్నాయి. వెరసి ఈ నెల 28 నుంచి లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్మెంట్ పూర్తికానుంది. ఈ జాబితాలో బజాజ్ ఆటో, వేదాంతా, హిందాల్కో, ఎస్బీఐ, ట్రెంట్, టాటా కమ్యూనికేషన్స్, నెస్లే, సిప్లా, ఎంఆర్ఎఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, అంబుజా సిమెంట్స్ తదితరాలున్నాయి. తాజా సెటిల్మెంట్తో సమయం, వ్యయాలు ఆదా అవుతాయని అంచనా. మార్కెట్ లావాదేవీల్లో ఈ వ్యవస్థ మరింత పారదర్శకత తీసుకువస్తుందని భావిస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ముగింపు పలికాయి. నిన్న నష్టాలతో ముగిసినా బుధవారం ఆటోమొబైల్, రియాలి, పవర్ అండ్ కేపిటల్ గూడ్స్ షేర్ల కొనుగోలుతో నేడు భారీ లాభాల బాట పట్టాయి. దీంతో బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 526 పాయింట్ల లాభంతో 72,996 వద్ద నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 22,123 వద్ద ముగిశాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజికీ, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటాన్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగియగా, హీరోమోటో కార్పో, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రోలో నష్టాలతో సరిపెట్టుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : సూచీల సరికొత్త రికార్డ్.. సెన్సెక్స్ 1,200+, నిఫ్టీ 300+
దేశీయ స్టాక్ సూచీలు సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. సెన్సెక్స్, నిఫ్టీ శుక్రవారం యూఎస్ మార్కెట్ల నుండి సానుకూల సంకేతాలతో నిపుణులు అంచనాల కంటే మెరుగ్గా ట్రేడ్ అయ్యాయి. రంగాల వారీగా ఎక్కువ శాతం సూచీలు సానుకూలంగా ట్రేడ్ అయ్యాయి. అందరి చూపు ఫిబ్రవరి ఆటోమొబైల్ సేల్స్ వైపే ఉండడంతో సంబంధిత స్టాక్స్ సైతం పుంజుకున్నాయి. ఇక శుక్రవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1245 పాయింట్లు లాభంతో 73745 వద్ద, నిఫ్టీ 355 పాయింట్ల లాభంతో 22338 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. టాటా స్టీల్,జేఎస్డ్ల్యూ స్టీల్,టైటాన్ కంపెనీ, బీపీసీఎల్, హిందాల్కో, మారుతి సుజికీ, గ్రాసిమ్, టాటా మోటార్స్, ఎస్బీఐ షేర్లు భారీ లాభాల్లో మూటగట్టుకోగా.. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్సీఎల్ టెక్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్, బ్రిటానియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, సిప్లా, ఎల్టీఐ మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్ను ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ నష్టాలతో ముగిసిన మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం ఇతర ఆసియా మార్కెట్ల మిక్స్డ్ ఫలితాల ప్రభావంతో దేశీయ స్టాక్ సూచీలు లాభనష్టాలతో ఊగిసలాడాయి. అదే ధోరణి కొనసాగడంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 790 పాయింట్ల నష్టంతో 72304 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు నష్టపోయి 21951 వద్ద ముగిశాయి. హెచ్యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎయిర్టెల్ షేర్లు లాభాల్ని గడించగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అపోలో హాస్పిటల్,ఎథేర్మోటార్స్, మారుతి సుజికి,బజాజ్ ఆటో, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మూడో త్రైమాసికం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి గణాంకాలు గురువారం(ఫ్రిబవరి 29న) విడుదల కానున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్పై ప్రతికూల ప్రభావం చూపిస్తున్నాయి. ఫలితంగా ఈ వారం తొలిరోజే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయానికి 144 పాయింట్ల నష్టంతో 72998 వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు నష్టపోయి 22174 వద్ద కొనసాగుతున్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, లార్సెన్, అదానీ ఎంటర్ ప్రైజెస్, సిప్లా, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, యూపీఎల్,అదానీ పోర్ట్స్, ఎం అండ్ ఎం, ఎస్బీఐ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, బీపీసీఎల్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్టీఐ మైండ్ ట్రీ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. -
ఈ వారం స్టాక్ మార్కెట్ ఎలా ఉండబోతుంది?
ముంబై: ప్రపంచ పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులు ఈ వారం స్టాక్ మార్కెట్కు దిశానిర్ధేశం చేస్తాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఎఫ్అండ్ఓ డెరివేటివ్స్ గడువు ముగింపు నేపథ్యంలో ఒడిదుడుకుల ట్రేడింగ్ ఉండొచ్చంటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2024 మూడో త్రైమాసికం భారత స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి గణాంకాలు గురువారం(ఫ్రిబవరి 29న) విడుదల కానున్నాయి. ప్రాథమిక మార్కెట్లో ఆరు కంపెనీలు పబ్లిక్ ఇష్యూలు ప్రారంభం కానున్నాయి. డాలర్ ఇండెక్స్, యూఎస్ బాండ్ ఈల్డ్స్, క్రూడాయిల్ ధరలు, రూపాయి విలువ తదితర అంశాలూ ట్రేడింగ్పై ప్రభావం చూపొచ్చంటున్నారు. ‘‘చివరి ట్రేడింగ్ సెషన్లో నిఫ్టీ జీవితకాల గరిష్ట స్థాయి(22,297)ని నమోదు చేసిన తర్వాత తీవ్ర ఊగిసలాటకు లోనైంది. కొనుగోళ్ల కొనసాగితే 22,300 – 22,500 స్థాయిని పరిక్షీణింవచ్చు. లాభాల స్వీకరణ జరిగితే దిగువ స్థాయిలో 22,000 వద్ద తక్షణ మద్దతు ఉంది. ఇన్వెస్టర్లు పతనమైన నాణ్యమైన షేర్లను కొనుగోలు చేయడం ఉత్తమం’’ అని రిలిగేర్ బ్రోకింగ్ సాంకేతిక నిపుణుడు అజిత్ మిశ్రా తెలిపారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, క్రూడాయిల్ ధరలు స్థిరంగా కొనసాగడంతో గతవారం సూచీలు దాదాపు ఒకశాతం పెరిగాయి. సెన్సెక్స్ 716 పాయింట్లు, నిఫ్టీ 172 పాయింట్లు లాభపడ్డాయి. ఐటీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇంధన షేర్లు మినహా అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. స్థూల ఆర్థిక గణాంకాలు అమెరికా జనవరి గృహ విక్రయాలు, జపాన్ జనవరి ద్రవ్యోల్బణ డేటా ఫిబ్రవరి 27న, అమెరికా నాలుగో త్రైమాసిక జీడీపీ వృద్ధి గణాంకాలు బుధవారం (28న) విడుదల కానున్నాయి. యూరోజోన్ ఫిబ్రవరి పారిశ్రామిక, సర్వీసెస్, కన్జూమన్ కాన్ఫిడెన్స్ డేటా బుధవారం వెల్లడి అవుతాయి. జపాన్ రిటైల్ అమ్మకాలు, నిర్మాణ ఆర్డర్లు, భారత క్యూ3 జీడీపీ వృద్ధి డేటా, అమెరికా నిరుద్యోగ, పీసీఈ ప్రైస్ ఇండెక్స్ గణాంకాలు గురువారం విడుదల కానున్నాయి. వారాంతాపు రోజైన శుక్రవారం చైనా కాగ్జిన్ మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, జపాన్ నిరుద్యోగ రేటు, యూరోజోన్ హెచ్సీఓబీ కాగ్జిన్ మానుఫ్యాక్చరింగ్ పీఎంఐ, భారత్ ఆటో అమ్మకాలు, పారెక్స్ నిల్వల డేటా వెల్లడి కానున్నాయి. బుధవారం ఎఫ్అండ్ఓ ఎక్స్పైరీ, జీడీపీ వృద్ధి డేటా ఈ గురువారం(ఫిబ్రవరి 29న) నిఫ్టీ సూచీకి చెందిన జనవరి సిరీస్ డెరివేటివ్స్ కాంట్రాక్టులు ముగియనున్నాయి. అదేరోజున బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ తేదీ కూడా ఉంది. ట్రేడర్లు తమ పొజిషన్లపై తీసుకొనే స్క్వేయర్ ఆఫ్ లేదా రోలోవర్ నిర్ణయానికి అనుగుణంగా మార్కెట్ స్పందించవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదేరోజున ప్రస్తుత ఆర్థి క సంవత్సరం భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి డేటా విడుదల కానుంది. ప్రభుత్వ వ్యయంలో మందగమనం కారణంగా క్యూ2 జీడీపీ వృద్ధి (7.60%)తో తక్కువగా నమోదు కావచ్చని ఆర్థికవేత్తలు భావిస్తున్నారు. అయితే వార్షిక ప్రాతిపదన గ త ఆర్థిక సంవత్సరం క్యూ3 జీడీపీ వృద్ధి(4.5%)తో పోలిస్తే అధికంగా ఉండొంచ్చంటున్నారు. డెట్ మార్కెట్లోకి రూ.18,500 కోట్లు భారత డెట్(రుణ) మార్కెట్లో ఫిబ్రవరి 2న నాటికి విదేశీ ఇన్వెస్టర్లు రూ.18,500 కోట్లకు పైగా పట్టుబడులు పెట్టారు. త్వరలో భారత ప్రభుత్వ బాండ్లను జేపీ మోర్గాన్ ఇండెక్స్లో చేర్చనున్న వార్తలు ఇందుకు కారణమని మార్కెట్ నిపుణులు తెలిపారు. జనవరిలో భారత డెట్ మార్కెట్లోకి రూ.19,836 కోట్ల పెట్టుబడులు రాగా, ఇది ఆరు సంవత్సరాల కంటే ఎక్కువ నెలవారీ ఇన్ఫ్లోగా నిలిచింది. గతంలో 2017 జూన్లో ఇన్ఫ్లో రూ. 25,685 కోట్లుగా నమోదైంది. సమీక్ష కాలంలో (ఫిబ్రవరి 1– 23 తేదీల మధ్య) విదేశీ ఇన్వెస్టర్లు ఈక్విటీల నుంచి రూ.424 కోట్లను వెనక్కి తీసుకున్నారు. జనవరిలో రూ.25,743 కోట్లను ఉపసంహరించుకున్నట్లు ఎన్సీడీఎల్ గణాంకాలు చెబుతున్నాయి. 3 ఐపీఓలు, 2 లిస్టింగులు ప్రాథమిక మార్కెట్ నుంచి ఆరు కంపెనీలు ఈ వారంలో రూ.3,330 కోట్ల సమీకరణకు సిద్ధమయ్యాయి. ప్లాటినం ఇండస్ట్రీస్, ఎక్సికం టెలీ–సిస్టమ్స్ పబ్లిక్ ఇష్యూలు ఫిబ్రవరి 27న మొదలై 29న ముగియనున్నాయి. భారత్ హైవేస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇన్వెస్ట్మెంట్ ఐపీఓ ఫిబ్రవరి 28– మార్చి 1 తేదీల మధ్య జరగనుంది. గతవారం ప్రారంభమైన జీపీటీ హెల్త్కేర్ ఐపీఓ ఫిబ్రవరి 26న(సోమవారం) ప్రారంభం కానుంది. ఇదేవారంలో ఫిబ్రవరి 28న జునియర్ హోటల్స్, మరుసటి రోజున జీపీటీ హెల్త్కేర్ షేర్లు ఎక్సే్చంజీల్లో లిస్ట్ కానున్నాయి. -
సాక్షి మనీ మంత్ర: వరుస లాభాల్లో స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ లో వరుస లాభాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం స్టాక్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.20గంటల సమయానికి సెన్సెక్స్ 103 పాయింట్ల లాభంతో 73261 వద్ద నిఫ్టీ 35 పాయింట్ల స్వల్ప లాభంతో 22253 వద్ద కొనసాగుతుంది. హీరోమోటో కార్ప్, టైటాన్ కంపెనీ, గ్రాసిం, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎల్ టీఐ మైండ్ ట్రీ, బజాజ్ ఫిన్ సర్వ్, విప్రో,సిప్లా షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. ఎయిర్ టెల్, యాక్సిస్ బ్యాంక్, ఏసియన్ పెయింట్స్, బ్రిటానియా,మారుతి సుజికి, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్ టీపీసీ, నెస్లే, హిందాల్కో, ఐటీసీ హేర్లు నష్టాల్లోకి జారుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : స్వల్ప లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటల సమయంలో సెన్సెక్స్ 76 పాయింట్ల స్వల్ప లాభంతో 73134 వద్ద నిఫ్టీ 21 పాయింట్ల స్వల్ప లాభంతో 22218 వద్ద ట్రేడింగ్ ను కొనసాగిస్తుంది. టాటా స్టీల్, హిందాల్కో, ఐసీఐసీఐ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఎథేర్ మోటార్స్,గ్రాసిమ్,ఓఎన్జీసీ,బజాజ్ ఫిన్ సర్వ్, అదానీ ఎంటర్ ప్రైజెస్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎస్బీఐ, టాటా మోటార్స్, ఆల్ట్రా టెక్ సిమెంట్, అదానీ పోర్ట్స్, ఐటీసీ షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. హీరో మోటోకార్ప్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, బీపీసీఎల్, లార్సెన్, బజాజ్ ఆటో, హెచ్ సీఎల్ టెక్, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర: నష్టాల్లో దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.30గంటలకు సెన్సెక్స్ 115 పాయింట్ల నష్టంతో 72592 వద్ద నిఫ్టీ43 పాయింట్ల స్వల్పంగా నష్టపోయి 22079 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, గ్రాసిమ్, ఓఎన్జీసీ, కొటక్ మహీంద్రా, ఎల్టీఐ మైండ్ ట్రీ, అపోలో హాస్పిటల్స్, హెచ్డీఎఫ్సీ ,యూపీఎల్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభపడగా...హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, ఎథేర్ మోటార్స్, బజాజ్ఆటో, బీపీసీఎల్, మారుతి సుజికి షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. నిఫ్టీ తాజా ఆల్ టైమ్ హైని తాకడంతో ఫిబ్రవరి 19న సూచీలు లాభాలతో ట్రేడింగ్ను ముగించాయి. ముగింపులో సెన్సెక్స్ 281 పాయింట్ల లాభంతో 72,708 వద్ద, నిఫ్టీ 81.60 పాయింట్ల లాభంతో 22,122 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. దాదాపు 2184 షేర్లు లాభాలు గడించగా... 1243 షేర్లు క్షీణించాయి. 123 షేర్లలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోలేదు. నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఆటో, ఐసీఐసీఐ బ్యాంక్, సిప్లా టాప్ లాభాలు గడించగా, కోల్ ఇండియా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్ అండ్ టీ, విప్రో హెచ్డీఎప్సీ లైఫ్ షేర్లు నష్టపోయాయి. -
సాక్షి మనీ మంత్ర : సూచీల్లో కొనసాగుతున్న లాభాల పరంపర
దేశీయ సూచీల్లో లాభాల పరంపర కొనసాగుతుంది. ఫిబ్రవరి 16న నిఫ్టీ 22,000 ఎగువన భారతీయ బెంచ్మార్క్ సూచీలు వరుసగా నాల్గవ సెషన్లో లాభాలతో ముగిశాయి. విప్రో, ఎం అండ్ ఎం, ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ పోర్ట్స్, ఎల్ అండ్ టి అత్యధికంగా లాభపడగా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఓఎన్జీసీ, ఎస్బీఐ, బ్రిటానియా ఇండస్ట్రీస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిశాయి. చమురు అండ్ గ్యాస్, పవర్ మినహా, ఇతర అన్ని సూచీలు ఆటో, క్యాపిటల్ గూడ్స్, ఫార్మా, ఐటీ, రియల్టీ 1-2 శాతం వరకు గ్రీన్లో ట్రేడ్ అవ్వగా బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు దాదాపు 1 శాతం పెరిగాయి. -
ఇన్వెస్టర్లకు అలర్ట్.. బీఎస్ఈ హెచ్చరికలు
న్యూఢిల్లీ: తప్పుదారి పట్టిస్తున్న నకిలీ(ఫేక్) సోషల్ మీడియా సంస్థలకు దూరంగా ఉండాలంటూ స్టాక్ ఎక్స్చేంజీ దిగ్గజం బీఎస్ఈ ఇన్వెస్టర్లను తాజాగా హెచ్చరించింది. లింక్డ్ఇన్, ట్విటర్, యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్ట్రాగామ్ తదితర ప్లాట్ఫామ్ల ద్వారా అనధికార, నకిలీ సంస్థలు బీఎస్ఈ అధికారిక గుర్తింపులను వినియోగిస్తున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా బీఎస్ఈతో సహచర్యం కలిగి ఉన్నట్లు తప్పుగా పేర్కొంటున్నాయని తెలియజేసింది. వెరసి ఇలాంటి సంస్థలు లేదా వ్యక్తులపట్ల అప్రమత్తతో వ్యవహరించవలసిందిగా ఇన్వెస్టర్లను హెచ్చరించింది. "తప్పుదోవ పట్టించే సోషల్ మీడియా హ్యాండిల్స్/ ఎంటిటీల బారిన పడకుండా ఇన్వెస్టర్లను బీఎస్ఈ అప్రమత్తం చేస్తోంది. బీఎస్ఈకి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు క్లెయిమ్ చేసే సోషల్ మీడియా హ్యాండిల్స్ ప్రామాణికతను నిర్ధారించుకోవాల్సిందిగా సూచిస్తోంది" బీఎస్ఈ ఒక ప్రకటనలో పేర్కొంది. బీఎస్ఈ అధికారికంగా ధ్రవీకరించబడిన సోషల్ మీడియా హ్యాండిల్స్ను విశ్వసించాలని ఇన్వెస్టర్లను కోరింది. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో ముగిసిన దేశీయ స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 277 పాయింట్ల లాభంతో 71,833.17 వద్ద, నిఫ్టీ స్వల్పంగా 96 పాయింట్లు పెరిగి 21,840 వద్ద ముగించింది. నిఫ్టీలో బీపీసీఎల్, ఎస్బిఐ, కోల్ ఇండియా, ఓఎన్జీసీ, యాక్సిస్ బ్యాంక్ టాప్ గెయినర్స్గా ఉండగా, టెక్ మహీంద్రా, సిప్లా, సన్ ఫార్మా, టీసీఎస్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. సెక్టోరల్లో, పీఎస్యూ బ్యాంక్, ఆయిల్ అండ్ గ్యాస్ సూచీలు ఒక్కొక్కటి 3 శాతం పెరిగాయి, ఆటో, బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, క్యాపిటల్ గూడ్స్, మెటల్, పవర్, రియల్టీ షేర్లు ఒక్కొక్కటి 1.2 శాతం పెరిగాయి. మరోవైపు ఐటీ, ఫార్మా సూచీలు 1 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్క్యాప్, స్మాల్క్యాప్ సూచీలు 1 శాతం చొప్పున పెరిగాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లకు జాతీయ, అంతర్జాతీయ అంశాలు కలిసొచ్చాయి. ప్రధానంగా అమెరికా ద్రవ్యోల్బణ డేటా విడుదల నేపథ్యంలో మదుపర్లు ఆసియా మార్కెట్లలో మదుపు చేసేందుకు మొగ్గు చూపారు. ఫలితంగా మంగళవారం ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికి.. మార్కెట్లు ముగిసే సమయానికి పుంజుకున్నాయి. మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 482 పాయింట్ల లాభంతో 71555 వద్ద, నిఫ్టీ 127 పాయింట్ల లాభంతో 21743 పాయింట్ల వద్ద ట్రేడింగ్ను ముగించాయి. ఇక, కోల్ ఇండియా, యూపీఎల్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డీఎఫ్సీ, విప్రో షేర్లు లాభాల్లో ముగియగా.. హిందాల్కో, గ్రాసిమ్, ఆల్ట్రాటెక్ సిమెంట్, దివిస్ ల్యాబ్స్, బీపీసీఎల్, ఎం అండ్ ఎం, టైటాన్ కంపెనీ, టాటా మోటార్స్ షేర్లు నష్టాలతో ట్రేడింగ్ను ముగించాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ నష్టాలతో ముగిసిన స్టాక్ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ సూచీలు.. తీవ్ర ఒడిదుడుకుల మధ్య మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 523 పాయింట్ల నష్టంతో 71072 వద్ద నిఫ్టీ 166 పాయింట్లు నష్టపోయి 21616 వద్ద ట్రేడింగ్ను ముగించాయి. డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, అపోలో హాస్పటిల్స్, దివీస్ ల్యాబ్స్, విప్రో, హెచ్సీఎల్ టెక్, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఎం అండ్ ఎం, ఎథేర్ మోటార్స్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా షేర్లు లాభాల్లో ముగియగా.. కోల్ ఇండియా, హీరోమోటో కార్ప్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు నష్టాలతో సరిపెట్టుకున్నాయి. ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్ధిక అనిశ్చితి, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలతో పాటు పలు అంశాలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. దీనికి తోడు మార్కెట్ ర్యాలీ విపరీంగా ఉన్న సమయంలో మదుపర్లలలో కొంత ఆందోళన నెలకొంది. ముఖ్యంగా షేర్లు కొనుగోలు జరిగే సమయంలో ప్రతికూల వార్తలు ఇబ్బందే పెట్టే అవకాశం ఉందని భావించే ఇన్వెస్టర్లు కొనుగోలు, అమ్మకాల సమయాల్లో ఆచితూచి వ్యవహిరస్తుంటారు. ఫలితంగా ఫిబ్రవరి 12న మార్కెట్లు నష్టాలతో ముగిశాయని స్టాక్ మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
సాక్షి మనీ మంత్ర : లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం సాయంత్రం లాభాలతో ముగింపు పలికాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైనప్పటికీ పలు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావం దేశీయ సూచీలపై పడింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి నిఫ్టీ 167 పాయింట్లు లాభపడి 71595 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల స్వల్ప లాభంతో 21782 వద్ద ముగించాయి. ఇక గ్రాసిం, ఎస్బీఐ, అపోలో హాస్పటిల్స్, సన్ ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్, బ్రిటానియా, హీరోమోటో కార్ప్, అదానీ పోర్ట్స్, సిఫ్లా, యాక్సిస్ బ్యాంక్ షేర్లు లాభాలతో ముగింపు పలకగా.. ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, ఎయిర్టెల్, ఎన్టీపీసీ, హిందాల్కో, టాటా స్టీల్, హిందాల్కో, యూపీఎల్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : ఫ్లాట్గా ముగిసిన దేశీయ సూచీలు
దేశీయ మార్కెట్ సూచీలు బుధవారం ఫ్లాట్గా ముగిశాయి. యూఎస్ మార్కెట్లతో పాటు ఆసియా మార్కెట్లు సైతం సానుకూల సంకేతాలు రావడం, విదేశీ మదుపరులు సైతం దేశీయ స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. అయితే దేశీయ సూచీలపై ఐటి షేర్లు ప్రభావం చూపినప్పటికీ, ఫైనాన్షియల్, రియల్టీ స్టాక్స్ పురోగతికి దారితీశాయి. బుధవారం మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 34 పాయింట్ల స్వల్ప నష్టంతో 72152 వద్ద, నిఫ్టీ అత్యల్పంగా ఒక పాయింట్ లాభంతో మార్కెట్కు ముగింపు పలికాయి. ఇక ఎస్బీఐ, గ్రాసిమ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, ఆల్ట్రాటెక్ సిమెంట్, నెస్లే, ఏసియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగియగా..టెక్ మహీంద్రా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, టీసీఎస్, బీపీసీఎల్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలతో మార్కెట్కు ముగింపు పలికాయి. -
సాక్షి మనీ మంత్ర : భారీ లాభాలతో ముగిసిన దేశీయ సూచీలు
యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపులో జాప్యం దేశీయ స్టాక్ సూచీలకు కలిసి వచ్చింది. ఫలితంగా మంగళవారం ఉదయం స్టాక్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమై.. మార్కెట్లు ముగిసే సమయానికి లాభాలు గరిష్టస్థాయికి చేరుకున్నాయి. చైనా, హాంకాంగ్ మినహా గ్లోబల్ మార్కెట్లు ఆశించిన స్థాయిలో రాణించ లేనప్పటికి భారత్ స్టాక్ మార్కెట్లు మరిన్ని లాభాల్ని పుంజుకున్నాయి. ఇక మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 454.67 పాయింట్లు లాభంతో 72,186 వద్ద, నిఫ్టీ 167 పాయింట్ల లాభంతో 21,939.20 వద్ద ముగిశాయి. బీపీసీఎల్, హెచ్డీఎఫ్సీ లైఫ్, హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, మారుతి సుజికి, విప్రో, ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఇన్ఫోసిస్, లార్సెన్ షేర్లు లాభాలు గడించగా.. పవర్ గ్రిడ్ కార్పొరేషన్, బ్రిటానియా, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐటీసీ, కొటక్ మహీంద్రా, గ్రాసిమ్, బజాజ్ ఫిన్ సర్వ్, యాక్సిస్ బ్యాంక్, రిలయన్స్ షేర్లు నష్టాల్ని మూటగట్టుకున్నాయి. -
సాక్షి మనీ మంత్ర : లాభాల్లో దేశీయ స్టాక్ సూచీలు
అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు ప్రారంభ సమయానికి బుధవారం స్వల్ప నష్టాలతో ప్రారంభ మయ్యాయి. కొద్ది సేపటికే లాభాల్లోకి జారుకున్నాయి. ఇలా ఒడిదుడుకుల మధ్య ఉదయం 9.50 గంటల సమయానికి స్టాక్ సూచీలు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 152 పాయింట్లతో 71292 వద్ద ట్రేడ్ అవుతుండగా నిఫ్టీ 54 పాయింట్ల లాభంతో 21576 వద్ద ట్రేడింగ్ను కొనసాగిస్తుంది. ఇక టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎథేర్ మోటార్స్, ఎం అండ్ ఎం, ఓఎన్జీసీ, రిలయన్స్, అదానీ పోర్ట్స్, సిప్లా షేర్లు లాభాల్లో కొనసాగుతుండగా.. లార్సెన్, టైటాన్ కంపెనీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, ఎయిర్టెల్, అపోలో హాస్పిటల్, ఎల్ టీఐ మైండ్ ట్రీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. (Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్ సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.) -
పెడితే రూపాయి రాదని తెలిసీ కోట్లు పెట్టుబడి..!
స్టాక్మార్కెట్ అంటేనే లాభాలకోసం ఎంచుకునే ఒక మార్గం. షేర్లు లేదా ఆఫ్షన్స్ కొనుగోలు చేసినా విక్రయించినా.. ఏదైనాసరే లాభాలే ప్రధానం. అయితే లాభం ఉండదనీ, మనం పెట్టిన డబ్బు తిరిగిరాదని తెలిసీ ఎవరైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడతారా..! కానీ అందరూ ప్రతిసారి స్వలాభం కోసమే ఆలోచించరు. కాసింత సామాజిక స్పృహ ఉన్నవాళ్లు మాత్రం రూపాయి రాకపోయినా సమాజానికి ఖర్చు చేసేవాళ్లున్నారు. అలాంటి వారికోసం స్టాక్మార్కెట్లో కొత్త విభాగాన్ని ప్రారంభించారు. అదే ‘సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్’. అందులో షేర్లు కొనడం ద్వారా ఎవరైనా విరాళాలు ఇవ్వచ్చు. దానిద్వారా ఇటీవల జెరోధా సంస్థ కోటి రూపాయలు పెట్టింది. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం. వ్యాపార సంస్థలు భవిష్యత్తులో కంపెనీ లాభాల కోసం పెట్టుబడులు సమీకరించేందుకు ఐపీఓకి వెళ్తూంటాయి. ఇప్పుడు సేవాసంస్థలు కూడా తమకు కావలసిన నిధుల కోసం స్టాక్ మార్కెట్కి వెళ్లొచ్చు. బెంగళూరులోని శ్రీ గురువాయూరప్పన్ భజన్ సమాజ్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఉన్నతి ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ యువతకు వృత్తి విద్యల్లో శిక్షణ ఇస్తుంటుంది. కొత్తగా ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న పదివేల మంది యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆ తర్వాత వాళ్లు ఉద్యోగాల్లో చేరేలా సహకరించేందుకు ఒక ప్రాజెక్టును సిద్ధం చేసింది. దానికి దాదాపు రెండు కోట్ల రూపాయల దాకా నిధులు అవసరం అయ్యాయి. దాంతో ఆ సంస్థ సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో నమోదుచేసుకుంది. ఎవరినీ నోరు తెరిచి అడగాల్సిన అవసరం లేకుండా ఇరవై రోజుల్లోనే దానికి రూ.కోటీ 80 లక్షలు సమకూరింది. జెరోధా సంస్థ కోటి రూపాయలు, స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారు ఆశిష్ కచోలియా రూ.30లక్షలు, మరో ఇద్దరు చెరో రూ.25 లక్షలు పెట్టుబడి పెట్టారు. ప్రత్యేకంగా ఎందుకంటే.. ప్రత్యక్షంగా దాతలను అభ్యర్థించో, సోషల్ క్రౌడ్ ఫండింగ్ ద్వారానో ప్రభుత్వేతర, లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థలు తమ సేవలకు అవసరమైన నిధులను సేకరిస్తుంటాయి. అలాంటప్పుడు ప్రత్యేకంగా ఈ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఎందుకనే అనుమానం రావొచ్చు. పైన తెలిపిన కార్యక్రమాలకు చాలా సమయం పట్టొచ్చు, ఆశించిన మొత్తం అందకపోవచ్చు. చాలామంది దాతలకు తాము ఇచ్చే డబ్బు దుర్వినియోగం అవుతుందేమోననే సందేహం ఉంటుంది. ఈ సమస్యలన్నిటికీ సమాధానంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ని ఎంచుకుంటున్నారు. ఇది దాతలకీ స్వచ్ఛంద సంస్థలకీ మధ్య వారధిలా పనిచేస్తుంది. తొలి సంస్థ ‘ఉన్నతి ఫౌండేషన్’.. మన దేశంలో 2019-20 సంవత్సరపు బడ్జెట్లో సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ప్రతిపాదన తెచ్చారు. సామాజిక అభివృద్ధికి పాటుపడే సంస్థలకు పెట్టుబడి మార్కెట్ అందుబాటులో ఉండాలన్నదే దీని ఆశయం. ఎన్ఎస్ఈ, బీఎస్ఈ ఎక్స్ఛేంజిల్లో అనుమతులు పొంది ఇటీవలే ఆచరణలోకి వచ్చింది. దీని ద్వారా నిధులు పొందిన తొలి సంస్థ ఉన్నతి ఫౌండేషన్. లాభాపేక్ష లేని సంస్థలూ(ఎన్పీఓ), లాభాపేక్ష ఉన్న సామాజిక సంస్థలూ(ఫర్ ప్రాఫిట్ సోషల్ ఎంటర్ప్రైజెస్) ఇందులో నమోదుచేసుకోవచ్చు. పేదరికం, పోషకాహారలోపం, నిరక్షరాస్యత, నిరుద్యోగం, పర్యావరణ సమస్యలు... తదితర రంగాల్లో సేవలు అందించే సంస్థలు దీన్ని ఉపయోగించుకోవచ్చు. డబ్బు ఇచ్చిన దాతల ఖాతాల్లో జీరోకూపన్ జీరో ప్రిన్సిపల్ పేరుతో బాండ్లను జమచేస్తారు. అవి రికార్డు కోసమే తప్ప మరే లాభమూ ఉండదు. వ్యాపార సంస్థలు ఐపీఓకి వెళ్లినట్లే సేవాసంస్థలు నిధుల సేకరణకు వెళ్తాయన్న మాట. లాభాలు ఇవే.. ఈ విధానం వల్ల అటు దాతలకీ ఇటు లబ్ధిదారులైన సంస్థలకీ ఎన్నో లాభాలున్నాయి. తెలిసిన దాతలనే మళ్లీ విరాళాల కోసం అడగలేక ఇబ్బంది పడే ఎన్జీఓలకు కొత్త దాతలు లభిస్తారు. బహిరంగంగా జరిగే లావాదేవీలు కాబట్టి ఒకరిని చూసి మరొకరు స్ఫూర్తి పొందుతారు. డబ్బు వినియోగంలో ఎక్కడికక్కడ లెక్కలు పక్కాగా ఉంటాయి. ఏ ప్రయోజనానికి ఖర్చు పెడుతున్నారో చెప్పాలి, గడువు లోపల ఖర్చు పెట్టాలి, ఏటా ఆడిట్ నివేదికలు సమర్పించాలి... కాబట్టి లావాదేవీలన్నీ పారదర్శకంగా ఉంటాయి. దాతలు తామిచ్చిన ప్రతి రూపాయీ సద్వినియోగమైందని నిర్ధారించుకోవచ్చు. సామాజిక మార్పులో భాగస్వాములమయ్యామన్న తృప్తి ఉంటుంది. స్వచ్ఛంద సంస్థల కార్యకలాపాల పట్ల నమ్మకమూ పెరుగుతుంది. ఆయా స్వచ్ఛంద సంస్థలూ మరింత బాధ్యతాయుతంగా పనిచేస్తాయి. నిధులకు ఇబ్బంది ఉండదు కాబట్టి సేవల పరిధినీ విస్తరించుకోవచ్చు. ఇదీ చదవండి: 2024 పారిశ్రామిక పద్మాలు.. వీరే! అయితే యాభై లక్షలు, అంతకన్నా ఎక్కువ మొత్తం అవసరమైనప్పుడే ఈ విధానాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. దాతలు కనిష్ఠంగా పదివేల నుంచి విరాళం ఇవ్వచ్చు. దాతలకు పన్ను మినహాయింపు వెసులుబాటు ఉంటుంది. -
ఐటీ షేర్ల అండ.. కొత్త శిఖరాలు
న్యూఢిల్లీ: ఐటీ షేర్లలో నెలకొన్న కొనుగోళ్ల అండతో స్టాక్ సూచీలు శుక్రవారం ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బలపడటమూ కలిసొచ్చింది. ఐటీతో పాటు అధిక వెయిటేజీ ప్రభుత్వ రంగ బ్యాంకులు, ఇంధన షేర్లు, అలాగే సర్వీసెస్, రియల్టీ, ఎఫ్ఎంసీజీ, మెటల్, వినిమయ షేర్లు రాణించి సూచీల రికార్డుల ర్యాలీకి దన్నుగా నిలిచాయి. ఫలితంగా సెన్సెక్స్ 847 పాయింట్లు పెరిగి 72,568 వద్ద, నిఫ్టీ 247 పాయింట్లు బలపడి 21,895 వద్ద స్థిరపడ్డాయి. ఈ ముగింపు ఇరు సూచీలకు సరికొత్త రికార్డు స్థాయిలు కావడం విశేషం. విస్తృత స్థాయి మార్కెట్లో చిన్న, మధ్య తరహా షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో బీఎస్ఈ స్మాల్, మిడ్ సూచీలు 0.41%, 0.36% లాభపడ్డాయి. రికార్డుల ర్యాలీలోనూ ఫార్మా, ఆటో, మీడియా షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అమెరికా డిసెంబర్ రిటైల్ ద్రవ్యోల్బణ, ఉపాధి కల్పన అంచనాలకు మించిన నమోదు కారణంగా ‘ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు వాయిదా’ ఆందోళనలతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు బలహీనంగా ట్రేడవుతున్నాయి.\ ఇంట్రాడేలో సెన్సెక్స్ 1,000 పాయింట్లు జంప్ ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలోని ప్రతికూలతలను విస్మరిస్తూ ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 72,148 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు పెరిగి 21,774 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఉత్సాహంగా మొదలైన సూచీలు రోజంతా అదే రోజు కనబరిచాయి. ట్రేడింగ్లో సెన్సెక్స్ 1000 పాయింట్లు ఎగసి 72,721 వద్ద, నిఫ్టీ 282 పాయింట్లు బలపడి 21,928 వద్ద కొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. ♦ సెన్సెక్స్ ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ 4 సెషన్లలో రూ.6.88 లక్షల కోట్లు పెరిగి ఆల్ టైం హై రూ.373.29 లక్షల కోట్లకు చేరింది. ♦ఐటీ రంగ షేర్లు 8% ర్యాలీ చేసి సూచీలను సరికొత్త శిఖరాల వైపు నడిపించాయి. ♦దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలైన ఇన్ఫోసిస్, టీసీఎస్ల క్యూ3 ఆర్థిక ఫలితాలు మెప్పించడంతో ఈ రంగ షేర్లకు డిమాండ్ పెంచింది. ♦కోఫోర్జ్ 6%, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్టెక్, ఎల్టీఐఎం షేర్లు 5%, విప్రో, ఎంఫసీస్లు 4%, పెర్సిస్టెంట్ 3.50%, ఎల్టీటీఎస్ 2% లాభపడ్డాయి. ♦ అంచనాలకు తగ్గట్టు డిసెంబర్ క్వార్టర్ ఆర్థిక ఫలితాలు ప్రకటిచడంతో ఇన్ఫోసిస్ షేరు 8% ఎగసి రూ.1612 వద్ద ముగిసింది. ♦ ఇదే క్యూ3లో మెరుగైన పనితీరుతో పటిష్టమైన ఆర్థిక ఫలితాలు సాధించిన టీసీఎస్ షేరు 4% లాభపడి రూ.3,882 వద్ద స్థిరపడింది. ♦ బ్యాంక్ ఆఫ్ ఇండియా 6%, యూనియన్ బ్యాంక్, మహారాష్ట్ర బ్యాంక్లు 5%, పీఎస్బీ, యూకో బ్యాంక్, పీఎస్బీ, సెంట్రల్ బ్యాంక్లు 3% పెరిగాయి. ఎస్బీఐ, ఐఓబీ, కెనరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్ షేర్లు 2–1% మధ్య లాభపడ్డాయి.
Pagination
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
మంగళగిరి మారుమోగింది.. ‘జై జగన్.. సీఎం జగన్’
వీళ్ళే మన అభ్యర్థులు.. గెలిపించాల్సిన బాధ్యత మీదే..
వివేకా కేసు..కోర్టులో సునీతకు ఎదురుదెబ్బ..
టాలీవుడ్లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త
లోకేష్ కి ఆళ్ల రామకృష్ణారెడ్డి సవాల్
రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
రూ.100 వరకు క్యాష్బ్యాక్ ప్రకటించిన పేటీఎం
టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్కు ఉహించని ప్రశ్న!
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మారుతీ స్విఫ్ట్ కొత్త మోడల్
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement