నల్లమలలోగుప్తనిధుల వేట | Sakshi
Sakshi News home page

నల్లమలలోగుప్తనిధుల వేట

Published Wed, May 8 2024 3:35 AM

-

లింగాల: నల్లమల అటవీ ప్రాంతంలో గుప్తనిధుల వేట సాగుతోంది. పురాతన దేవాలయాలను లక్ష్యంగా చేసుకొని తవ్వకాలు చేపడుతున్నారు. తాజాగా అప్పాయపల్లి పరిధిలోని బెళ్లంతిప్ప పరిసర ప్రాంతంలో గుప్తనిధుల కోసం జేసీబీతో తవ్వకాలు జరిపారని స్థానికులు తెలిపారు. ఇటీవల గుర్తుతెలియని వ్యక్తులు వివిధ కారణాలు చూపుతూ, నల్లమల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు తెలిసింది. ఆధునిక యంత్రాలను ఉపయోగిస్తూ గుప్తనిధుల వేట సాగిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై ఎఫ్‌ఆర్‌ఓ వీరేశంను వివరణ కోరగా.. గుప్తనిధుల కోసం తవ్వకాల విషయం తన దృష్టికి రాలేదని తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, తగు జాగ్రత్తలు తీసుకుంటామని తెలిపారు.

Advertisement
Advertisement