సిరిసిల్లలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

సిరిసిల్లలో మరో నేత కార్మికుడి ఆత్మహత్య

Published Thu, Aug 8 2013 9:10 AM

Handloom weaver ends life in Sircilla

కరీంనగర్ : ఆర్థిక ఇబ్బందులు మరో నేతన్న ఉసురు తీశాయి. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవటంతో కుటుంబ పోషణ భారమై సిరిసిల్లలోని నెహ్రూ నగర్కు చెందిన చక్రధర్  ఉరి వేసుకుని ఈ ఘటనకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement