-
సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ 2024..తారల సందడి (ఫొటోలు)
-
సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్.. పాల్గొనాలంటే ఇలా చేయండి..
తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహా, ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో కలిసి సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్ను ఆవిష్కరించింది. ఈ సంచలనాత్మక ఉత్సవంలో సినిమాలను ప్రదర్శించటంతో పాటు గ్రూప్ డిస్కషన్స్, షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్, ప్యానెల్ డిస్కషన్స్ జరుగుతాయి. వర్ధమాన దర్శకులు తమ ప్రతిభను చాటిచెప్పుకోవడానికి ఇదొక వేదికగా పని చేయనుంది. ఈ వేడుకలో పాల్గొనాలనుకునే ఔత్సాహికులు https://blog.aha.video/entertainment/nominations-for-south-indian-film-festival/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మూడు విభాగాల్లో పోటీ ఈ ఫిలిం ఫెస్టివల్లో పాల్గొనేవారిని మూడు భాగాలుగా విభజించారు. షార్ట్ ఫిలిం విభాగంలో 3-15 నిమిషాల వ్యవధి ఉన్న షార్ట్ ఫిలిం పంపాలి. రెండో విభాగం షార్ట్స్ షార్ట్.. దీని కోసం మూడు నిమిషాల కంటే తక్కువగా ఉన్న షార్ట్స్ షార్ట్ను పంపాల్సి ఉంటుంది. అలాగే మ్యూజిక్ వీడియో విభాగం కోసం ఐదు నిమిషాల కంటే తక్కువగా ఉన్న వీడియోను చిత్రీకరించి పంపాలి. 2020లో జనవరి 1వ తేదీ నుంచి 2023 డిసెంబర్ 10 మధ్య వచ్చిన సినిమాల కంటెంట్తో వీడియోలను చిత్రీకరించి పంపాల్సి ఉంటుంది. డిసెంబర్ 20న తెలుగు ఫిలిం ఫెస్టివల్.. ప్రస్తుతం తెలుగులో ఈ ఫిలిం ఫెస్టివల్ను నిర్వహించనున్నారు. భవిష్యత్తులో తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లోనూ ఈ ఫెస్టివల్ నిర్వహించనున్నారు. టాలీవుడ్కి చెందిన స్టార్ మేకర్స్ ఈ ఫిలిం ఫెస్టివల్ జ్యూరీ మెంబర్స్గా పని చేయనున్నారు. నటి, నిర్మాత జీవితా రాజశేఖర్, డైరెక్టర్స్ హరీష్ శంకర్, వి.ఎన్.ఆదిత్య, చందు మొండేటి.. నిర్మాత, దర్శకుడు సాయి రాజేష్.. ఇండియన్ టెలివిజన్ చీఫ్ ఎడిటర్గా పని చేసిన అనీల్ వాన్వరి ఈ ఫిలిం ఫెస్టివల్లో జ్యూరీ మెంబర్స్గా ఉన్నారు. డిసెంబర్ 20 నుంచి ఈ తెలుగు ఫిలిం ఫెస్టివల్ ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో సౌత్ ఇండియాలోని ప్రముఖ సినీ సెలబ్రిటీలు పాల్గొననున్నారు. చదవండి: సినిమా షూటింగ్లో హీరో సూర్యకు ప్రమాదం.. -
14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన మామా మశ్చీంద్ర.. అక్కడే స్ట్రీమింగ్!
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం మామా మశ్చీంద్ర. మృణాలినీ రవి, ఈషా రెబ్బ హీరోయిన్లుగా నటించారు. హర్షవర్దన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ముఖ్య పాత్రలు పోషించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన చిత్రం జనాలను ఆకర్షించడంతో విఫలమైంది. దీంతో రెండువారాలకే బాక్సాఫీస్ దగ్గర తట్టాబుట్టా సర్దేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో సినిమా విడుదలైన 14 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్తో పాటు ఆహాలోనూ మామా మశ్చీంద్ర అందుబాటులో ఉంది. సినిమా కథేంటంటే? సుధీర్.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రల్లో నటించాడు. పరశురామ్కు స్వార్థమెక్కువ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నుతాడు. కానీ వాళ్లు బతికిపోతారు. పరశురామ్ కూతురు విశాలాక్షి(ఈషా రెబ్బ), పరశురామ్ దగ్గర పనిచేసే దాసు కూతురు మీనాక్షి(మృణాళిని రవి).. దుర్గ, డీజే అనే కుర్రాళ్లతో లవ్లో పడతారు. వీళ్లిద్దరూ పరశురామ్ పోలికలతో ఉండటంతో వాళ్లు తన మేనల్లుళే అని పరశురామ్కు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ముగ్గురి ప్రేమకు మంచి ముగింపు పడిందా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి.. చదవండి: లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని వందల కోట్లంటే? ఏ ఓటీటీలోకి రానుందంటే? -
OTT Releases: భోళాశంకర్, రామబాణం సహా బోలెడన్ని చిత్రాలు..
ప్రస్తుతం సినీ ప్రేక్షకులు ఎక్కువగా ఓటీటీలో సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పెద్ద సినిమాలు సైతం రిలీజైన నెలలోపే ఓటీటీకి వచ్చేస్తున్నాయి. ఈ వారంలో మిమ్మల్ని అలరించేందుకు సూపర్ హిట్ సినిమాలు వచ్చేస్తున్నాయి. ఏయే సినిమాలు ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలుసుకుందాం. ఈ వారంలో విడుదలయ్యే సినిమాలపై ఓ లుక్కేద్దాం పదండి. మెగాస్టార్ భోళాశంకర్ మెగాస్టార్ భోళాశంకర్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘భోళా శంకర్’. ఈ చిత్రాన్ని మెహర్ రమేశ్ తెరకెక్కించారు. ఈ సినిమాలో కీర్తి సురేశ్ కీలక పాత్ర పోషించగా... తమన్నా హీరోయిన్గా నటించింది. ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మిక్స్డ్ టాక్ను సొంతం చేసుుకుంది. ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ సెప్టెంబర్ 15 నుంచి తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. గోపీచంద్ రామబాణం గోపీచంద్, డింపుల్ హయాతి జంటగా నటించిన చిత్రం ‘రామబాణం. శ్రీవాస్ దర్శకత్వంలో.. టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. ఈ చిత్రంలో జగపతిబాబు, ఖుష్బూ ముఖ్యపాత్రలు పోషించారు. మే 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అంతంగా మెప్పించలేకపోయింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న ఈ చిత్రం సెప్టెంబరు 14వ తేదీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు నెట్ఫ్లిక్స్ తెలిపింది. మాయపేటిక విరాజ్ అశ్విన్, సిమ్రత్ కౌర్, పాయల్ రాజ్పుత్లు నటించిన చిత్రం మాయపేటిక. ఈ చిత్రానికి రమేష్ రాపర్తి దర్శకత్వం వహించారు. మొబైల్ ఫోన్ వల్ల చెడు, మంచి నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ ఫిక్స్ చేశారు. ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించారు. అనీతి వసంతబాలన్ దర్శకత్వం వహించిన తమిళ రొమాంటిక్ మూవీ అనేతి. ఈ చిత్రంలో అర్జున్ దాస్, దుషార విజయన్ ప్రధాన పాత్రల్లో నటించారు. హౌస్ కీపర్తో ప్రేమలో పడే ఫుడ్ డెలివరీ ఏజెంట్ ప్రేమకథను తెరకెక్కించారు. ఈ చిత్రం ఈనెల 15 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ముగ్గురు యువకుల డిజిటల్ విలేజ్ ఫహద్ నందు, ఉల్సవ్ రాజీవ్ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం డిజిటల్ విలేజ్. ఇందులో హృషికేష్, ఇందిర, ఎంసీ మోహనన్, సురేష్ బాబు కన్నోమ్ నటించారు. తమ గ్రామంలోని ప్రజలకు డిజిటల్ పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ముగ్గురు స్నేహితుల స్టోరీనే కథాంశంగా చూపించారు. ఈ సినిమా ఈనెల 15 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ తెలిపారు. జర్నీ ఆఫ్ లవ్ 18+ నాస్లెన్ గఫూర్, మీనాక్షి దినేష్, మాథ్యూ థామస్, నిఖిలా విమల్ నటించిన మలయాళ రొమాంటిక్ కామెడీ చిత్రం జర్నీ ఆఫ్ లవ్ 18 ప్లస్ . అరుణ్ డి జోస్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ ఈనెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీలివ్లో స్ట్రీమింగ్ కానుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ హేలీ లు రిచర్డ్సన్, బెన్ హార్డీ, రాబ్ డెలానీ, సాలీ ఫిలిప్స్, జమీలా నటించిన చిత్రం లవ్ ఎట్ ఫస్ట్ సైట్. దీనికి వెనెస్సా కాస్విల్ దర్శకత్వం వహించారు. ఈ రొమాంటికి డ్రామాను ఓ విమానంలో చిగురించిన ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కించారు. ఈ మూవీ ఈ నెల 15 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో ఈనెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. హాలీవుడ్ చిత్రాలు వైఫ్ లైక్- నెట్ఫ్లిక్స్- 11 సెప్టెంబర్ 2023 ఎలిమెంటల్- డిస్నీ ప్లస్ హాట్స్టార్- 13 సెప్టెంబర్ 2023 ఎ మిలియన్ మైల్స్ అవే- అమెజాన్ ప్రైమ్ వీడియో- 15 సెప్టెంబర్ 2023 -
ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న మాస్ కా దాస్ హీరో..
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తొలిసారి వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్న కొత్త షో "ఫ్యామిలీ ధమాకా". ఈ షో ఆహాలో రాబోతోంది. ఈ షో ద్వారా విశ్వక్ సేన్ ఓటీటీ ప్రపంచంలోకి అడుగుపెట్టడమే కాకుండా ప్రేక్షకులని అలరించేందుకు రెడీ అయ్యాడు. "ఫ్యామిలీ ధమాకా" సెప్టెంబర్ 8న రాత్రి 8 గంటలకు ప్రీమియర్ కానుంది. ఈ షో కుటుంబ మొత్తానికి వినోదాన్ని అందిస్తుంది. అయితే, ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లకు మాత్రం ఈ షో ఒకరోజు ముందే అందుబాటులోకి రానుంది. ఆహా గోల్డ్ సబ్స్క్రైబర్లు సెప్టెంబర్ 7న మొదటి ఎపిసోడ్ని వీక్షించవచ్చు. ఇకపోతే ఈ షో ప్రీ లాంచ్ ఈవెంట్ కాకినాడలోని SRMT INOX మాల్లో జరిగింది. కాకినాడలోని కుటుంబాలతో కలిసి ఆహా ఫ్యామిలీ ధమాకా గేమ్ ఆడించారు. ఆ తర్వాత షో థీమ్ సాంగ్ మీద అందరూ డ్యాన్స్ చేసి ఆనందించారు. మరి విశ్వక్ సేన్ హోస్టింగ్ ఎలా ఉండబోతుంది? ఫ్యామిలీ ధమాకా షో ఏ రేంజ్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వనుందనేది తెలియాలంటే మరో మూడు, నాలుగు రోజులు ఆగాల్సిందే! చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు, సిరీస్ల జాబితా ఇదిగో! -
సామజవరగమన ఓటీటీ విడుదల తేదీ వచ్చేసింది
శ్రీవిష్ణు, నరేశ్ తండ్రీకుమారులుగా నటించి ప్రేక్షకులందరిని కడుపుబ్బా నవ్వించిన కామెడీ ఎంటర్టైనర్ ‘సామజవరగమన’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఇందులో రామ్ అబ్బరాజు దర్శకుడు. రెబా మోనికా జాన్ కథానాయిక. శ్రీకాంత్ అయ్యంగార్, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటించారు. (ఇదీ చదవండి: సినీ నటిపై రేప్.. ఇంటర్వ్యూ పేరుతో హోటల్కు తీసుకెళ్లి ఆపై) మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీ ఆఫ్ ది ఇయర్గా నిలిచిన సామజవరగమన ఓటీటీ రిలీజ్కు ముహూర్తం ఖరారైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన ఆహాలో జులై 28న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ను సొంతం చేసుకున్న ఆహా ఈమేరకు అధికారికంగానే ప్రకటించింది. ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా జూన్ 29న విడుదలైన ‘సామజవరగమన సినిమా భారీ విజయం సాధించింది. ఈ సినిమా విడుదలకు ముందు కేవలం మూడు కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ మాత్రమే జరిగింది. తర్వాత సినిమాపై పాజిటివ్ టాక్ రావడంతో దాని బిజినెస్ లెక్కలు మారిపోయాయి. కేవలం రూ. 7కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా సుమారు రూ. 50 కోట్లకు పైగానే రాబట్టింది. ఇంత సూపర్ హిట్ అయిన సినిమాను జులై 28న 'ఆహా' ఓటీటీలో చూసేయండి. View this post on Instagram A post shared by ahavideoin (@ahavideoin) -
పట్టణాల్లో ‘ఆహా’ క్యాంటీన్లు
సాక్షి, అమరావతి: పట్టణాల్లోని ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చేవారు, మార్కెట్లకు సరుకులు తెచ్చే రైతులు, వ్యాపారుల ఆకలి తీర్చేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) నడుంబిగించింది. ఇప్పటికే జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మహిళా మార్కెట్లను ఏర్పాటు చేసి సమాఖ్య సభ్యులతో దిగ్విజయంగా నడిపిస్తున్న ఈ సంస్థ ఇప్పుడు మరింత మంది పట్టణ మహిళా సమాఖ్య సభ్యులకు ఉపాధిని చూపించాలనే లక్ష్యంతో ‘ఆహా’ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. యూనిట్ల ఏర్పాటుపై ఆసక్తి ఉండి ముందుకు వచ్చిన మహిళా సమాఖ్య సభ్యులతో ఏర్పాటు చేయిస్తోంది. ఇప్పటికే ఐదు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్లు విజయవంతం కావడం, సమాఖ్య సభ్యులు ఆదాయం సముపార్జించడంతో పాటు ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో రాష్ట్రంలోని 110 యూఎల్బీల్లో 140 యూనిట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా సాధారణ ప్రజలు అధికంగా సంచరించే ప్రభుత్వ ఆస్పత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ పరిసరాలు, మార్కెట్లు, మున్సిపల్ కార్యాలయాల ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తోంది. రూ.13 వేల చొప్పున ప్రభుత్వ సాయం పట్టణ మహిళా స్వయం సహాయక సంఘాల్లోని సభ్యుల్లో సాధ్యమైనంత ఎక్కువ మందికి ఉపాధి చూపాలన్న లక్ష్యంగా మెప్మా కృషి చేస్తోంది. ‘ఆహా’ క్యాంటీన్ల యూనిట్ ఏర్పాటుకు ముందుకు వచ్చే సంఘ సభ్యులకు రూ. 13 వేల చొప్పున ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. క్యాంటీన్ల ఏర్పాటుకు ఆస్పత్రులు, ఆర్టీసీ, రైల్వే, మార్కెటింగ్ అధికారులతో మెప్మా అధికారులు మాట్లాడి అనుమతులు తీసుకున్నారు. క్యాంటీన్ల నిర్వాహకులు ప్రతినెలా రూ. 500 చొప్పున స్థానిక టౌన్ లెవెల్ ఫెడరేషన్ (పట్టణ మహిళా సమాఖ్యల సొసైటీ)లో జమ చేసి మరింత మందికి ఆ ర్థిక సాయం అందేలా ఏర్పాట్లు చేశారు. ఆహారాన్ని రుచి, శుచిగా ఇంటి వద్దే వండి ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ఏర్పాటు చేసిన కియోస్్కల్లో విక్రయిస్తారు. ఆయా ప్రాంతాల్లోని డిమాండ్, అవసరాలను బట్టి ఉదయం అల్పాహారం నుంచి మధ్యాహ్నం, రాత్రి భోజనాల వరకు విక్రయించేలా అవకాశం కల్పించారు. గరిష్టంగా రూ. 40కే విక్రయించేలా చర్యలు తీసుకున్నారు. మహిళలకు అండగా ప్రభుత్వం రాష్ట్రంలోని పట్టణాల్లో గల ఎస్హెచ్జీల్లోని మహిళలను స్వయం ఉపాధి వైపు ప్రోత్సహించేందుకు మెప్మా కృషి చేస్తోంది. ప్రభుత్వం సైతం వారికి అండగా నిలిచి ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే విజయవంతమైన జగనన్న మహిళా మార్టులు, అర్బన్ మార్టుల తరహాలో మహిళలకు ఉపాధి కల్పించనున్నాం. ప్రజలకు తక్కువ ధరలో మంచి ఆహారం అందించేందుకు 140 క్యాంటీన్లను ఏర్పాటు చేస్తున్నాం. అవసరాన్ని బట్టి మరిన్ని ఏర్పాటు చేస్తాం. లాభాలను నిర్వాహకులే తీసుకుంటారు. టౌన్ లెవెల్ ఫెడరేషన్ అకౌంట్లో జమచేసే నగదును సంఘ సభ్యులు రుణాలుగా తీసుకుంటారు. అంటే ప్రతి రూపాయి ఆ పట్టణంలోని సంఘ సభ్యులే తీసుకుంటారు. నిర్వహణ పర్యవేక్షణను మెప్మా సిబ్బంది చూస్తారు. – వి. విజయలక్ష్మి, మెప్మా ఎండీ ఒక్కపూట రూ. 3 వేల వ్యాపారం పదిహేను రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి ప్రాంగణంలో మెప్మా సహకారంతో ఆహా క్యాంటీన్ ప్రారంభించాం. ముగ్గురం సభ్యులం కలిసి సాయంత్రం వేళ జొన్న, సజ్జ రొట్టెలు, భోజనం పెట్టాం. కేవలం 2.30 గంటలు మాత్రమే ఇక్కడ ఉంటాం. పూటకు రూ. 3 వేలకు పైగా అమ్మకాలు జరుగుతున్నాయి. ఉదయం టిఫిన్లు కూడా పెట్టాలని నిర్ణయించాం. అప్పుడు ఇంకా ఎక్కువ వ్యాపారం, ఆదాయం వస్తుంది. పదార్థాలు మా ఇళ్లల్లోనే తయారు చేసి తెస్తున్నాం. ఆహా క్యాంటీన్తో మాకు ఉపాధి లభించింది. – పి.జయలక్ష్మి, ఆహా క్యాంటీన్ నిర్వాహకురాలు, కర్నూలు -
'బేబి' ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ అప్పుడే!
Baby Movie OTT Details: సాధారణంగా చిన్న సినిమాలకు బజ్ తక్కువ. థియేటర్లలోకి వచ్చినాసరే జనాలు పెద్దగా పట్టించుకోరు. అలాంటిది అసలు స్టార్ నటీనటులు, డైరెక్టర్, నిర్మాత లేని ఓ సినిమా కోసం కొన్నాళ్ల నుంచి అందరూ తెగ వెయిట్ చేశారు. అదే 'బేబి'. ఇప్పుడు ఇది థియేటర్లలోకి వచ్చేసింది. అలానే ఓటీటీ స్ట్రీమింగ్ పార్ట్నర్ని కూడా ఫిక్స్ చేసుకుంది. ఒక్క పాట వల్ల గత కొన్ని నెలల నుంచి ఓ పాట తెలుగు మ్యూజిక్ లవర్స్ పదే పదే వింటున్నారు. 'ఓ రెండు ప్రేమ మేఘాలిలా..' అనే ఒక్క సాంగ్.. 'బేబి' సినిమాపై అంచనాలని పెంచేసింది. ఇప్పుడు దానికి తగ్గట్లే సినిమా ఉందని చూసిన ప్రతిఒక్కరూ చెబుతున్నారు. తెలిసిన ప్రేమకథలానే ఉన్నప్పటికీ, దాన్ని డీల్ చేసిన విధానం, టేకింగ్, డైలాగ్స్ బాగున్నాయని అంటున్నారు. (ఇదీ చదవండి: Baby Movie Review: ‘బేబీ’ మూవీ రివ్యూ) ఆ ఓటీటీలో ఇకపోతే ఈ మూవీ ఓటీటీ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. అయితే థియేటర్లలోకి వచ్చిన ఆరు వారాల తర్వాత స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. అంటే ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ కావొచ్చని సమాచారం. కొన్నాళ్లు ఆగితే ఈ విషయమై క్లారిటీ వస్తుంది. 'బేబి' కథేంటి? వైష్ణవి(వైష్ణవి చైతన్య) బస్తీ అమ్మాయి. ఎదురింట్లో ఉండే ఆనంద్(ఆనంద్ దేవరకొండ)తో లవ్లో పడుతుంది. స్కూల్లోనే వీళ్ల ప్రేమ ముదిరిపోతుంది. అయితే పది పాస్ అయిన వైష్ణవి ఇంజినీరింగ్ వరకు వెళ్తుంది. ఆనంద్ మాత్రం ఫెయిలై ఆటో డ్రైవర్గా మారతాడు. ఇక కాలేజీకి వెళ్లి వైషూ లైఫ్లోకి విరాజ్(విరాజ్ అశ్విన్) వస్తాడు. మరి చివరకు ఏమైంది? ఆనంద్-వైషూ ఒక్కటయ్యారా లేదా అనేది మెయిన్ స్టోరీ. (ఇదీ చదవండి: హీరోయిన్ రష్మికపై కుట్ర జరుగుతోందా?) -
ఆహాలో `నేను సూపర్ వుమెన్`షో: రూ.1.35 కోట్ల పెట్టుబడి: కమింగ్ సూన్!
హైదరాబాద్: 100 శాతం లోకల్ తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా మహిళా పారిశ్రామికవేత్తల కోసం ‘నేను సూపర్ వుమెన్’ అనే బిజినెస్ రియాలిటీ షోను తీసుకొస్తోంది. జూలై 21 నుంచి ప్రతి శుక్ర, శనివారాల్లో ఈ రియాలిటీ షో ప్రసారం కానుంది. ఈ రియాలిటీ షోకు శ్రీరామచంద్ర హోస్ట్ గా వ్యవహరిస్తారు. Our tributes to the incredible Soundarya garu.. Truly a Real Super Woman for the ages…!!#NenuSuperWoman coming soon!! @rsbrothersindia @ShaadiDotCom @continentalkofi @WEHubHyderabad pic.twitter.com/B1Z0f6LHsc — ahavideoin (@ahavideoIN) July 11, 2023 తొలివారంలోనే ‘నేను సూపర్ వుమెన్’ఏంజెల్స్ మహిళా స్టార్ట్ అప్ కంపెనీస్ లో రూ.1.35 కోట్లు పెట్టుబడులను పెట్టారు. ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాకుండా. ఏంజెల్స్ మెంటార్ షిప్ అండ్ కార్పస్ ఫండ్ కూడా అందించనుంది. షో కి వచ్చే 40 కంటెస్టెంట్స్ కూడా ఈ అవకాశాన్ని దక్కించుకోవచ్చు. ఈ ఏంజెల్స్ కమిటీలో డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని, క్వాంటేలా కంపెనీ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ శ్రీధర్ గాంధి, సిల్వర్ నీడిల్ వెంచర్స్ రేణుక బొడ్ల, అభి బస్ సీఈఓ, వ్యవస్థాపకుడు సుధాకర్ రెడ్డి, దొడ్ల డైరీ ఫౌండర్ దొడ్ల దీపా రెడ్డి, బజాజ్ ఎలక్ట్రానిక్ కరణ్ బజాజ్, నారాయణ గ్రూప్ సింధూర పొంగూరు ఉన్నారు. వ్యాపార రంగంలో రాణించాలనుకునే మహిళలకు ‘నేను సూపర్ వుమెన్’ ఓ గేమ్ చేంజర్ షో అని డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు రోహిత్ చెన్నమనేని తెలిపారు. కొత్త ఆలోచనలతో సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించటానికి ఇదొక వేదిక అన్నారు. దశాబ్దాల అనుభవాన్ని పంచుకోవటానికి వారికి గైడెన్స్ ఇవ్వటానికి తాను సిద్ధంగా ఉన్నానంటూ కరణ్ బజాజ్ (బజాజ్ ఎలక్ట్రానిక్స్) సూపర్ ఉమెన్ ఎంటైర్ టీమ్ని అభినందించారు. Only one-word 'Checkmate'..!♟ గెలుపోటముల చదరంగంలో బలంగా నిలిచింది.. చెక్ మేట్ చెప్పి మరీ తన జైత్రయాత్రను సాగిస్తోంది... ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది....! Our nation pride @HarikaDronavali ...👩🏻💼#NenuSuperWoman coming soon!! @rsbrothersindia @ShaadiDotCom… pic.twitter.com/V1Kqe9I6db — ahavideoin (@ahavideoIN) July 12, 2023 మహిళవ్యాపారవేత్త ధైర్యంగా నిలబడగలగుతుందో, వ్యాపార నమూనాలను, ఆలోచనలను గొప్పగా ప్రదర్శిస్తుందో, అప్పుడే తనకు సంతోషంగా అనిపిస్తుందని సిల్వర్ నీడెల్ వెంచర్స్ పార్ట్నర్ రేణుక బొడ్ల అన్నారు. మహిళల్లోనే వ్యాపార స్ఫూర్తిని పెంపొందించే ఈ ప్రయాణంలో తాను భాగమవుతున్నందుకు థ్రిల్లింగ్గా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్త శకానికి ఇదొక నాంది. నేను సూపర్ వుమెన్, స్త్రీ సాధికారతను పెంపెందించే అసాధారణమైన వేదిక ఆని డైరెక్టర్ ఆఫ్ నారాయణ కాలేజెస్ సింధూర పొంగూరు కొనియాడారు. To create a history in Telugu reality shows 🔥 The show called 'Nenu Super Woman' coming on aha...!#NenuSuperWoman coming soon!! @renukabodla @sridhargadhi #sindhuranarayana @sudhakar_chirra @chennamaneni #deepadodla @Sreeram_singer @rsbrothersindia @ShaadiDotCom… pic.twitter.com/R4SeZ8brIt — ahavideoin (@ahavideoIN) July 12, 2023 క్వాంటెలా ఇన్క్ ఫౌండర్ చైర్మన్ శ్రీధర్ గాంధీ మాట్లాడుతూ, ‘‘నేను సూపర్ ఉమెన్ ప్రోగ్రాం వల్ల వ్యాపారంలో రాణించాలనుకుంటున్న మహిళలు, వారి ఆలోచనలు గురించి తెలుసుకునే గొప్ప అవకాశం దక్కిందనీ, మహిళా వ్యాపారవేత్తల సామర్థ్యానికి, సృజనాత్మకతతో ఓ సరికొత్త అర్థవంతమైన మార్పుని తీసుకు రావటంతో పాటు మరిన్ని కొత్త అవకాశాలకు మార్గాలను ఏర్పరుచుకున్నట్లే అన్నారు. వి-హబ్ సీఇఓ దీప్తి రావు, ఆహా కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని ‘నేను సూపర్ ఉమెన్’ అనేది అందరిలోనూ ఓ సానుకూలా దృక్పథాన్ని ఏర్పరుస్తుందని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ‘ఓ వ్యాపారవేత్తగా మరీ ముఖ్యంగా మహిళా వ్యాపారవేత్తగా ఉండటానికి ధైర్యంతో పాటు పట్టుదల, సంకల్పం అవసరమన్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవతో వి-హబ్ రూపుదాల్చిందని దీప్తి రావుల తెలిపారు. వాసుదేవ్ మాట్లాడుతూ ఆహా ఈ షో చేస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. దీని ద్వారా మహిళల సామర్థ్యాన్ని బయట పెట్టటానికి ఓ వేదికను అందిస్తున్నామని పేర్కొన్నారు. -
ఓటీటీలోకి 'సామజవరగమన'.. ఆ రోజే రిలీజ్!
ఎప్పుడు ఏ సినిమా హిట్ అవుతుందనేది ఎవరూ చెప్పలేరు. ఈ మధ్య కాలంలో అలా అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి, సూపర్హిట్ అయిన మూవీ 'సామజవరగమన'. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఈ చిత్రం.. ఇప్పటికి రెండు వారాలకు అవుతున్నా విజయవంతంగా ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉంది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. (ఇదీ చదవండి: తెలుగు హీరోతో ధోనీ కొత్త సినిమా?) సినిమాల్లో మిగతా వాటి సంగతేమో గానీ కామెడీ జానర్ అనేది ఎవర్గ్రీన్. కరెక్ట్ గా వర్కౌట్ అయితే రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇంకా బాగుంటే కలెక్షన్స్ గట్టిగా వస్తాయి. అలానే జస్ట్ రూ.7 కోట్లతో తీసిన సినిమా 'సామజవరగమన'.. పెద్దగా పబ్లిసిటీ లేకుండానే థియేటర్లలో రిలీజ్ చేశారు. తొలి రెండు రోజుల అంతంతమాత్రంగా ఉన్న ఈ సినిమా శనివారం నుంచి రయ్ మని దూసుకెళ్లింది. ప్రస్తుతం మూడు-నాలుగు రెట్ల లాభాలని సొంతం చేసుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్ఫుల్గా 'సామజవరగమన'.. డిజిటల్ హక్కుల్ని ఆహా సొంతం చేసుకుంది. జూలై 28 నుంచి ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. ఆల్రెడీ చూసినవాళ్లు కూడా మళ్లీ చూస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. (ఇదీ చదవండి: పెళ్లయిన నటితో తెలుగు యాక్టర్ డేటింగ్?) నవ్వడం ఒక భోగం....😄 నవ్వించడం ఒక యోగం💁🏻♀️ సామజవరగమన దానికి చక్కటి రూపం.😉 ఇక నో ఆలస్యం...ఈ నెల 28 న ఆహాలో కలుద్దాం..!#SamajavaragamanaOnAHA@sreevishnuoffl @Reba_Monica @ItsActorNaresh @RamAbbaraju @AnilSunkara1 @RajeshDanda_ @HasyaMovies @AKentsOfficial pic.twitter.com/P5TcmbR87O — ahavideoin (@ahavideoIN) July 21, 2023 -
అఫీషియల్: ఓటీటీకి వచ్చేస్తోన్న 'నేను స్టూడెంట్ సర్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
బెల్లంకొండ గణేశ్, అవంతిక దస్సాని జంటగా నటించిన చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’. రాకేష్ ఉప్పలపాటి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. నాంది సతీష్ వర్మ నిర్మించిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: టచ్ చేసేందుకు ఒప్పుకోలేదు.. హీరోయిన్ తీరుపై నటుడు కామెంట్స్!) ఈ మూవీ ఈనెల 14నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ఆహా ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సినిమాలో సునీల్, సముద్రఖని, శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్రలు పోషించారు. నేను స్టూడెంట్ సార్ బెల్లంకొండ గణేష్ నటించిన రెండో చిత్రం కాగా.. అలనాటి ప్రముఖ నటి భాగ్యశ్రీ కుమార్తె అవంతిక దాసాని ఈ మూవీతోనే సినిమా ఇండస్ట్రీకి పరిచయమైంది. థియేటర్లలో పెద్దగా ఆకట్టుతోని ఈ మూవీ ఓటీటీలో అలరించేందుకు సిద్ధమైంది. (ఇది చదవండి: ఈ ఏడాది ఆస్కార్ బరిలో.. ఆ చిత్రంపైనే భారీ అంచనాలు!) Ee Student vachesthunnadu...!🙋♂️ Get ready for a thrilling experience..😯 Premieres July 14 🥳#GaneshBellamkonda@NaandhiSATISH#rakhiuppalapati@avantikadassani @suneeltollywood@thondankani pic.twitter.com/0xNtW4wn65 — ahavideoin (@ahavideoIN) July 3, 2023 -
'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' సిరీస్ రివ్యూ
టైటిల్: అర్ధమయ్యిందా అరుణ్ కుమార్ నటీనటులు: హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ తదితరులు నిర్మాణ సంస్థ: అర్రే స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్ నిర్మాత: బి.సాయికుమార్, శరణ్ సాయికుమార్ దర్శకత్వం: జొనాథన్ ఎడ్వర్డ్స్ సంగీతం: అజయ్ అరసాడ సినిమాటోగ్రఫీ: అమర్ దీప్ గుత్తుల ఎడిటర్: నాగేశ్వర్ రెడ్డి బొంతల విడుదల తేదీ: 30 జూన్ 2023 తెలుగులో ఓటీటీ అంటే అందరికీ గుర్తొచ్చేది 'ఆహా'నే. మిగతా వాటిల్లో తెలుగు సినిమాలు, సిరీసులు అప్పుడప్పుడు వస్తుంటాయి కానీ దీనిలో మాత్రం ప్రతివారం ఓ సినిమా లేదంటే వెబ్ సిరీస్ రిలీజ్ చేస్తుంటారు. వాటి రిజల్ట్ సంగతి పక్కనబెడితే ప్రేక్షకుల్ని మాత్రం అలరిస్తుంటాయి. అలా ఈసారి 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' అనే వెబ్ సిరీస్ తీసుకొచ్చారు. హర్షిత్ రెడ్డి, అనన్య, తేజస్వి మదివాడ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ ఎలా ఉంది? ఏంటనేది ఇప్పుడు రివ్యూలో చూద్దాం. కథేంటి? అరుణ్ కుమార్ (హర్షిత్ రెడ్డి)ది అమలాపురం. కార్పొరేట్ కంపెనీలో ఉద్యోగం చేయాలని హైదరాబాద్కి వస్తాడు. ఓ స్టార్టప్ కంపెనీలో ఇంటర్న్గా చేరుతాడు. ఇతడి టీమ్ లీడ్ జై మాత్రం అరుణ్ని బానిసలా చూస్తుంటాడు. ఓ పందెం వల్ల అరుణ్.. షాలినీ(తేజస్వి మదివాడ) టీమ్లోకి వచ్చిపడతాడు. కొన్నిరోజుల్లోనే ఆమె దగ్గర మంచి మార్కులు కొట్టేస్తాడు. ఏకంగా ఆమెతో పర్సనల్ రిలేషన్లోకి వెళ్లిపోతాడు. తర్వాత ఏం జరిగింది? ఈ కథలో పల్లవి(అనన్య) పాత్ర ఏంటి? ఫైనల్గా అరుణ్ ఏం తెలుసుకున్నాడు? అనేది 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' స్టోరీ. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) ఎలా ఉందంటే? ఓ ప్రాజెక్ట్ సక్సెస్ అయినందుకు టీమ్ లీడర్ షాలినీ అందరికీ పార్టీ ఇస్తుంది. అరుణ్ కూడా ఆ పార్టీకి వస్తాడు. డ్రింక్ చేస్తాడు. ఈవెంట్ అయిపోయిన తర్వాత సెల్లార్ లోని కారులో అరుణ్-షాలినీ కాస్త అడ్వాన్స్ అవుతారు. అదే సమయంలో వీళ్లిద్దరిని మరో ఇద్దరు చూస్తారు. అసలు వీళ్లెందుకు కారులో ముద్దుముచ్చట వరకు వెళ్లారు. అరుణ్-షాలినీని చూసిన ఆ ఇద్దరూ ఎవరో తెలియాలంటే సిరీస్ చూడండి. 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్'.. 2016లో హిందీలో వచ్చిన 'అఫీషియల్ చుక్యాగిరి' అనే వెబ్ సిరీస్కు అధికారిక రీమేక్. ఓటీటీలో ఎపిసోడ్స్ తర్వాత చాలామందికి ఇది క్లియర్ అయిపోయింది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచే నేరుగా స్టోరీలోకి వెళ్లిపోయారు. అరుణ్ కుమార్ హైదరాబాద్ లో ఓ బ్యాచిలర్ రూమ్లో ఉంటాడు. ఉదయమే లేచి ఆఫీస్ కి వెళ్తాడు. కానీ అక్కడేమో టీలు చేసే పని అప్పగిస్తారు. ఆ తర్వాత ఒక్కో పాత్రని పరిచయం చేస్తూ వెళ్లారు. కార్పొరేట్ వరల్డ్ లో ఓ సాధారణ పల్లెటూరి కుర్రాడు.. ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడు? పని వల్ల ఎలాంటి సంఘర్షణ అనుభవించాడు? చివరకు అనుకున్నది సాధించాడా లేదా అనేది తొలి సీజన్ లోని ఐదు ఎపిసోడ్లలో చూపించారు. ఇందులో అరుణ్ కుమార్ కి ఓ ట్రాయాంగిల్ లవ్స్టోరీ కూడా ఉంటుందండోయ్. ఒక్కో ఎపిసోడ్ 20-25 నిమిషాలే ఉంటుంది. అలా ఆడుతూ పాడుతూ సిరీస్ ని చూసేయొచ్చు. 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' లో చెప్పుకోవడానికి పెద్దగా కొత్తగా ఏం లేదు. అలా సాఫ్ట్ గా వెళ్లిపోతూ ఉంటుంది. బాగాలేదు అని చెప్పలేం అలా అని బాగుందని కూడా చెప్పలేం. ఈ సీజన్ అంతా కూడా అరుణ్ కుమార్ చుట్టూనే నడుస్తుంది. అనన్య, తేజస్వి పాత్రలని పెద్దగా ఎక్స్ప్లోర్ చేయలేదు. బహుశా తర్వాత సీజన్లలో వీళ్లకు ప్రాధాన్యం దక్కుతుందేమో? ఎవరెలా చేశారు? అరుణ్ కుమార్ గా నటించిన హర్షిత్ రెడ్డి.. ఇంటర్న్ పాత్రలో సెట్ అయిపోయాడు. అమాయకంగా కనిపిస్తూ, అందరు చెప్పిన పనులు చేస్తూ బాగానే మెప్పించాడు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ బాగుంది. పల్లవిగా నటించిన అనన్య బాగానే నటించింది. ఈమె పాత్రకి ఇంకాస్త ఎమోషనల్ సీన్స్ పడుంటే బాగుండేది. డామినేషన్, స్వార్థం కలగలిపిన టీమ్ లీడర్ షాలినీ పాత్రలో తేజస్వి ఓకే. ఆఫీస్ బాయ్ పాత్రలో వాసు ఇంటూరి కాస్త నవ్వించే ప్రయత్నం చేశారు. మిగతా వాళ్లంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. టెక్నికల్ విషయాలకొస్తే.. స్టోరీకి తగ్గట్లు డైలాగ్స్ సింపుల్ గా ఉన్నాయి. సినిమాటోగ్రఫీ ఓకే అనిపించింది. చాలావరకు ఆఫీస్ లో ఒకే చోట సీన్లన్నీ తెరకెక్కించారు. కాబట్టి పెద్దగా ఖర్చు అయ్యిండకపోవచ్చు. నిర్మాణ విలువులు డీసెంట్ గా ఉన్నాయి. డైరెక్టర్ పర్వాలేదనిపించాడు. సిరీస్ ని ఇంకాస్త ఎమోషనల్ గా తీసుంటే బాగుండేది. ప్రేక్షకులు కనెక్ట్ అయ్యేలోపే సీన్లన్నీ చకచకా పరుగెడుతుంటాయి! ఈ వీకెండ్ ఏదైనా సిరీస్ తో టైమ్పాస్ చేద్దామంటే 'అర్ధమయ్యిందా అరుణ్ కుమార్' ట్రై చేయొచ్చు! -చందు, సాక్షి వెబ్ డెస్క్ (ఇదీ చదవండి: ‘సామజవరగమన’ మూవీ రివ్యూ) -
'ఆహా'లో మరో రియాలిటీ షో.. ఈసారి మహిళల కోసం
ఓటీటీల్లో ఆహా ఇప్పటికే దూసుకెళ్తోంది. అద్భుతమైన సినిమాలు, వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఇప్పుడు స్త్రీ సాధికారతకు పెద్దపీట వేస్తూ మహిళలను వ్యాపార రంగంలోనూ దూసుకెళ్లేలా చేయటానికి బిజినెస్ రియాలిటీ షోని ప్రారంభించింది. అదే 'నేను సూపర్ ఉమెన్'. కొత్త పరిశ్రమలను స్థాపించేలా మహిళలని ప్రేరేపించడమే ఈ షో ప్రధాన లక్ష్యం. దీని కారణంగా పారిశ్రామిక రంగంలో మహిళల ప్రాధాన్యత పెరగడంతో పాటు వారిలో ఆర్థిక స్వాతంత్య్ర భావన పెంపొందుతుంది. (ఇదీ చదవండి: జెట్ స్పీడ్లో శ్రీలీల కెరీర్.. ఆ అంశాలే కలిసొచ్చాయా?) 'నేను సూపర్ ఉమెన్' ప్రోగ్రామ్ వినూత్న మార్గాలను చూపిస్తూ, మహిళలకు మార్గదర్శకం చేస్తూ వారికి ప్రత్యక్ష అనుభవం ఏర్పడేలా ఉపయోగపడుతుంది. 'తెలుగు ఇండియన్ ఐడల్'కి హోస్ట్ గా చేసి ఆకట్టుకున్న శ్రీరామ్ చంద్ర.. ఈ షోకి కూడా హోస్టింగ్ చేయబోతున్నాడు. ఈ కార్యక్రమంలో ఏంజెల్స్ అనే ప్యానెల్ ఉంటుంది. ఇందులో పాల్గొనే ఔత్సాహిక మహిళా వ్యాపారులు వారి ఆలోచనలను ఈ ఏంజెల్స్ తో పంచుకోవచ్చు. 40 మంది అసాధారణ అభ్యర్థులు ఈ 'సూపర్ ఉమెన్'కు ఎంపికయ్యారు. వీరందరూ ఏంజెల్స్ ప్యానెల్ సమక్షంలో తమ ఆలోచనలను ముఖాముఖిగా బయటపెడతారు. ప్రతి ఆలోచన చాలా జాగ్రత్తగా మూల్యాంకనం చేయబడుతుంది. తుది ప్రదర్శన తర్వాత ప్యానెల్ ఆఫర్స్ను పొడిగిస్తుంది. ఏంజెల్స్ ప్యానెల్ లో రోహిత్ చెన్నమనేని (డార్విన్ బాక్స్ సహ వ్యవస్థాపకుడు), శ్రీధర్ గాది (క్వాంటెలా ఇన్క్ యొక్క వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్), రేణుకా బొడ్లా (సిల్వర్ నీడెల్ వెంచర్స్ భాగస్వామి), సుధాకర్ రెడ్డి (అభి బస్ వ్యవస్థాపకుడు, సీఇఓ), దొడ్ల దీపా రెడ్డి (దొడ్ల డెయిరీ), సింధూర పొంగూరు (నారాయణ గ్రూప్) ఉన్నారు. వీళ్లంతా మహిళలను పారిశ్రామికవేత్తలుగా ప్రోత్సహించటానికి సిద్ధంగా ఉన్నారు. Introducing the awe-inspiring 'Angels' of #NenuSuperWoman! 👼🏼💼 They go beyond just empowering women entrepreneurs with valuable business insights. These incredible Angels actually invest in their ambitions and nurture them to soar to new heights of success! 🚀 Get ready for a… pic.twitter.com/WE5k7Wgdnz — ahavideoin (@ahavideoIN) June 27, 2023 (ఇదీ చదవండి: ఒక్కో పాట కోసం రూ.3 కోట్లు.. ఆ సింగర్ ఎవరో తెలుసా?) -
ఓటీటీలో దూసుకెళ్తున్న 'మళ్లీ పెళ్లి'.. ఆ లిస్ట్లో ట్రెండింగ్!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న రిలీజైన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: 'కాంతార' హీరో రిషబ్ శెట్టి ఎమోషనల్.. ఎందుకో తెలుసా?) అయితే ఇటీవలే ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఊహించని రీతిలో స్పందన వస్తోంది. ఈనెల 23 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ టాప్ టెన్లో ట్రెండింగ్లో నిలిచింది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న మూవీస్లోనే టాప్-2లో నిలిచింది. మొదటిస్థానంలో ఇంటింటి రామాయణం కొనసాగుతుండగా.. రెండోస్థానంలో నరేశ్, పవిత్రల 'మళ్లీ పెళ్లి' ట్రెండ్ అవుతోంది. ఇటీవల కొన్ని సినిమాలు థియేటర్లలో కంటే ఓటీటీలోనే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాయి. థియేటర్లలో ఆదరణ దక్కని చిత్రాలకు ఓటీటీలో ఊహించని రీతిలో దూసుకెళ్తున్నాయి. (ఇది చదవండి: మరో సినిమా తీసేందుకు రెడీ అయిన 'ది కేరళ స్టోరీ' డైరెక్టర్!) Thank you everyone 🙏#MALLIPELLI ranked #10 among @Binged_ OTT Top 10 Most watched movies this weekend🤩 ▶️ https://t.co/bfLWwB1Hdk#MalliPelliOnAha#PavitraLokesh @MSRajuOfficial @vanithavijayku1 @VKMovies_ @ahavideoIN pic.twitter.com/0AmYZLX8Jv — H.E Dr Naresh VK actor (@ItsActorNaresh) June 25, 2023 -
మరో కొత్త సినిమా ట్రైలర్ విడుదల చేసిన ‘ఆహా’
ఇండియాలో నెంబర్ వన్ తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’లో ‘అర్థమైందా అరుణ్ కుమార్’ అనే వెబ్ సిరీస్ జూన్ 30న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ వెబ్ సిరీస్కు సంబంధించిన ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. ప్రేక్షకులకు నచ్చేలా, ఆలోచింపచేసేలా ఈ సిరీస్ రూపొందింది. ఓ యువకుడు కార్పొరేట్ ప్రపంచంలో తనకు ఎదురయ్యే అనేక అనుభవాలను ఇందులో చూపించే ప్రయత్నం చేశారు. అందులో ప్రేమ, కష్టనష్టాలతో పాటు ఏదో సాధించాలనుకునే ఆ యువకుడు సవాళ్లను ఎదుర్కొని తనదైన స్థానాన్ని ఎలా సంపాదించుకున్నాడనే విషయాలను ఇందులో చక్కగా చూపించారు. (ఇదీ చదవండి: పాన్ ఇండియా స్థాయిలో ‘ఓ సాథియా’) ఇన్ని అంశాల మేళవింపుగా రూపొందిన ‘అర్థమైందా అరుణ్ కుమార్’ సిరీస్ జూన్ 30 నుంచి ప్రేక్షకులను మెప్పించనుంది. అర్రె స్టూడియో, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్స్పై రూపొందింది. హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ తదితరులు తమదైన నటనతో పాత్రలకు ప్రాణం పోశారు. ‘అఫిషియల్ చౌక్యాగిరి’ స్ఫూర్తితో దీన్ని రూపొందించారు. దీని కారణంగా ఈ కార్పొరేట్ డ్రామాలో ఓ కొత్త అనుభూతి కలుగుతుంది. ట్రైలర్ లాంచ్ ముఖ్య అతిథి, యాక్టర్ ప్రియదర్శి, మాట్లాడుతూ 'ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొనటం చాలా ఆనందంగా ఉంది. ఇదొక వైవిధ్యమైన కథాంశం. బయటకు ఎంతో అందంగా కనిపించే కార్పొరేట్ ప్రపంచం ఎలా ఉంటుంది. ఏదో సాధించాలనే లక్ష్యంతో ఎంతో మంది యువకులు ఈ కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెడతారు. అయితే వారికి ఎదురయ్యే సవాళ్లు.. వాటిని ఎలా అధిగమించాలనే విషయాలను సిరీస్లో ఆవిష్కరించారు. ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తప్పకుండా వెబ్ సిరీస్పై మరింత ఆసక్తిని పెంచుతుందని' అన్నారు. ఆహా కంటెంట్, నాన్ సబ్స్ రెవెన్యూ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ.. 'కార్పొరేట్ ప్రపంచంలో ఉండే ఇబ్బందులను ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్లో చూపించే ప్రయత్నం చేశాం. అరుణ్ కుమార్ అనే యువకుడు తన జీవితంలో ఏదో సాధించాలనే లక్ష్యంతో సిటీలోని కార్పొరేట్ కంపెనీలోకి ఇంటర్న్ ఎంప్లాయ్గా జాయిన్ అవుతారు. తన ప్రయాణంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులను, సాధించిన ఉన్నతి అన్నింటినీ ఇందులో చూపిస్తున్నాం. ప్రస్తుతం ఉన్న కార్పొరేట్ ప్రపంచంలోని ఉద్యోగులందరూ ఈ కథకు కనెక్ట్ అవుతారు. అంతే కాకుండా వారిని వారి లక్ష్యం వైపు అడుగులు వేసేలా ఈ ఒరిజినల్ ప్రేరేపిస్తుంది' అని అన్నారు. (ఇదీ చదవండి: టాప్ లేకుండా వెళ్తేనే నిర్మాతలకు నచ్చుతారు: అర్చన) అర్రె స్టూడియోస్ ప్రతినిధి మాట్లాడుతూ 'మాకెంతో ఇష్టమైన షోస్లో ‘అఫిషియల్ చౌక్యాగిరి’ ఒకటి. ఈ షో మూడు సీజన్స్గా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. దాన్ని తెలుగులో అర్థమైందా అరుణ్ కుమార్ పేరుతో రూపొందించంటం చాలా ఆనందంగా ఉంది. రీమేక్ కంటెంట్లో కథ, పాత్రలు చాలా బలమైన ప్రభావాన్ని చూపిస్తాయి. ఇతర భాషలోకి మా కంటెంట్ రావటం మాకెంతో ఆనందంగా ఉంది. అహాతో పాటు లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్తో కలిసి పనిచేయటం ఈ ఫ్రాంచైజీకి ఓ కొత్త ఎనర్జీనిచ్చింది' అని అన్నారు. -
ఓటీటీకి మళ్లీ పెళ్లి.. స్ట్రీమింగ్ ఆరోజు నుంచే!
సీనియర్ నటుడు నరేశ్, పవిత్రా లోకేశ్ జంటగా నటించిన చిత్రం 'మళ్లీ పెళ్లి'. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు నరేష్ నిర్మాతగా వ్యవహరించారు. లేటు వయసులో ప్రేమ, పెళ్లి నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. విజయకృష్ణ మూవీస్ బ్యానర్పై నిర్మితమైన ఈ చిత్రం మే 26న రిలీజైన ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. (ఇది చదవండి: మళ్లీ పెళ్లి ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన నరేశ్ మూడో భార్య) అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ఈనెల 23 నుంచి ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. అయితే ఈ చిత్రాన్ని నరేశ్ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగానే తెరకెక్కించారు. (ఇది చదవండి: నరేశ్, పవిత్ర గొప్ప నటులు.. ‘మళ్లీ పెళ్లి’ ఎవరి కథో తెలిసేది అప్పుడే!) #MalliPelli streaming on @ahavideoIN from June 23rd. pic.twitter.com/UrBrXK475m — Vamsi Kaka (@vamsikaka) June 19, 2023 -
'ఇంటింటి రామాయణం' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాల్లో తెలంగాణ కల్చర్ ని బాగా హైలైట్ చేస్తున్నారు. ఈ తరహా కాన్సెప్ట్ తో తీసిన 'బలగం' ఎంత పెద్ద హిట్ అయిందో స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. అలా ఈ జానర్ లో వచ్చిన మరో మూవీ 'ఇంటింటి రామాయణం'. ఈ చిత్రం ఇప్పుడు ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంది. ఆహా ఓటీటీ, సితార ఎంటర్ టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీని తొలుత ఓటీటీ రిలీజ్ కోసమే రెడీ చేశారు. గతేడాది డిసెంబరు ఆ టైంలోనే విడుదలైపోవాల్సింది. కానీ ఎందుకో లేట్ చేస్తూ చేస్తూ ఫైనల్ గా ఈ జూన్ 9న థియేటర్లలోకి తీసుకొచ్చారు. ప్రేక్షకులకు పెద్దగా రీచ్ కాలేదు. దీంతో ఇప్పుడు రెండు వారాల్లోనే అంటే జూన్ 23న ఆహా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. 'ఇంటింటి రామాయణం' కథేంటి? తెలంగాణలోని ఓ మారుమూల గ్రామంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఈ కుటుంబానికి అనుకోని సమస్య ఎదురవుతుంది. ఓ ముఖ్యమైన వస్తువు మిస్ అవుతుంది. ఒకరిపై మరొకరికి అనుమానం పుట్టుకొస్తుంది. దీంతో వాళ్లలో దాగున్న అసలు రూపాలన్నీ బయటకొస్తాయి. మరి ఈ సమస్య నుంచి బయట పడేందుకు ఆ కుటుంబం ఏం చేసింది? చివరకు ఏం జరిగింది? అనేదే 'ఇంటింటి రామాయణం' కథ. సురేష్ నారెడ్ల దర్శకత్వం వహించగా, కల్యాణి మాలిక్ సంగీతం అందించారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'అన్నీ మంచి శకునములే'..స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడ?) ఇంటి దొంగను ఈశ్వరుడు అయిన పట్టలేడు... #IntintiRamayanamOnAHA మీరు చూడకుండా ఉండలేరు 😉 Premieres June 23 ✌🏻@SitharaEnts @DirectorMaruthi @vamsi84 @IVYProductions9 @ItsActorNaresh @eyrahul @Sureshflms @Venkatupputuri @innamuri8888 #NavyaSwamy @GangavvaMilkuri #AnjiMama… pic.twitter.com/6SOA6LUi3j — ahavideoin (@ahavideoIN) June 15, 2023 -
కొత్త వెబ్ సిరీస్ ప్రకటించిన ఆహా, పోస్టర్ చూశారా?
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహా మరో కొత్త వెబ్ సిరీస్ను తీసుకు వస్తోంది. అరుణ్ కుమార్ ముందా అనే వ్యక్తి జీవితంలో.. ఆఫీసులో జరిగిన ఆకర్షణీయమైన అంశాలతో ‘అర్థమైందా అరుణ్ కుమార్’ అనే వెబ్ సిరీస్ తెరకెక్కించింది. ఈ మేరకు బుధవారం నాడు పోస్టర్ విడుదల చేసింది. చిన్న పట్టణ ప్రాంతంలో నివసించే యువకుడు అరుణ్ కుమార్, జీవితంలో ఏదో సాధించాలనే కలలతో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెడతాడు. హైదరాబాద్ మహా నగరంలో కొత్త జర్నీని ప్రారంభించిన తనకు ఎదురైన ఆటుపోట్లు ఏంటి? వాటి వల్ల అతను ఏం నేర్చుకున్నాడనే కథాంశంతో ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ త్వరలోనే ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ‘అర్థమైందా అరుణ్ కుమార్’ వెబ్ సిరీస్ను ఆరె స్టూడియోస్, లాఫింగ్ కౌ ప్రొడక్షన్స్ బ్యానర్స్ రూపొందిస్తున్నాయి. హర్షిత్ రెడ్డి, అనన్య శర్మ, తేజస్వి మదివాడ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. కార్పొరేట్ ఉద్యోగులు వారి ప్రయాణంలో పడే బాధలు, వారి కలలను సాధించే క్రమంలో ఎదురయ్యే ఇబ్బందులు, సాధించే విజయాలు వంటి వాటిని ఈ సిరీస్లో మనం చూడొచ్చు. Corporate Samrajyam... Asmakam..Ajeyam..! Arunkumar ki suffocation 🤯 Here is the first look of Ardham Ayinda Arun kumar #AAKOnAHA Coming Soon ✌🏻@HarshithReddyM @TejaswiMadivada @ananyaontweet #JonathanEdwards @Tanvi1908 @ArreTweets @polasaninaresh1 @bnreddystar pic.twitter.com/27LM5TpcfB — ahavideoin (@ahavideoIN) June 7, 2023 -
సిద్దిపేట ముద్దు బిడ్డ లాస్యకు హరీశ్ రావు అభినందన
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ 2 షో విజయవంతంగా ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ విశాఖపట్నానికి సౌజన్య భాగవతులను విజేతగా ప్రకటిస్తూ ఆమెకు ట్రోఫీ అందించాడు. హైదరాబాద్కు చెందిన జయరాం ఫస్ట్ రన్నరప్గా, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ సెకండ్ రన్నరప్గా నిలిచింది. ఎంతోమంది యువ గాయకులతో పోటీ పడి రెండో రన్నరప్ స్థానాన్ని సాధించిన లాస్యప్రియను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అభినందించారు. 'సింగింగ్ కాంపిటీషన్లో రన్నరప్గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియకు హృదయ పూర్వక అభినందనలు. భవిష్యత్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. కాగా తెలుగు ఇండియన్ ఐడల్ 2 షో మొత్తం 25 ఎపిపోడ్లకు గాను 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. సౌజన్య, జయరాం, లాస్యప్రియతో పాటు న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్కు చెందిన కార్తికేయ టాప్-5లో నిలిచారు. ఇండియన్ ఐడల్ తెలుగు -2023 సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియ కు హృదయ పూర్వక అభినందనలు 💐 భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్… pic.twitter.com/MgL1iOPV36 — Harish Rao Thanneeru (@BRSHarish) June 5, 2023 Blockbuster season comes to an end… Happy to present Top 3 of #teluguindianidol2😍 Many congratulations and all the best for your singing careers!#Soujanya #Jayaram #LasyaPriya pic.twitter.com/CVV8hXCT1p — ahavideoin (@ahavideoIN) June 5, 2023 చదవండి: -
బన్నీ విషయంలో లెక్క తప్పిన అల్లు రామలింగయ్య
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ఫామ్ ఆహాలో ప్రసారం అయిన తెలుగు ఇండియన్ ఐడల్- 2 గ్రాండ్ ఫినాలే కోసం ముఖ్య అతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హాజరు అయ్యారు. సంగీత ప్రియుల మనుసు దోచుకుంది ఈ షో. ముఖ్య అతిథిగా వచ్చిన బన్నీ.. తన చిన్ననాటి సంగతులను పంచుకున్నారు. (ఇదీ చదవండి: త్రిషకు అతనితో పెళ్లి చేయడమే పెద్ద మైనస్.. డైరెక్టర్ కామెంట్స్ వైరల్) ''తాత (అల్లు రామలింగయ్య) గ్రాండ్ చిల్డ్రన్లలో నేను చాలా క్వయిట్గా ఉండేవాడిని... మిగిలిన వారితో పోలిస్తే వీడు మొద్దు, భవిష్యత్త్ ఎలా ఉంటుందో ఏమిటో అనుకున్నాడేమో..! ఆ రోజుల్లోనే నా పేరుతో ఒక ఇన్స్యూరెన్స్ చేయించాడు. నేను నామినీగా ఉంటడంతో రూ.10 లక్షలు నాచేతికి వచ్చాయి. పిల్లలు క్వయిట్గా ఉంటే వారి భవిష్యత్పై తల్లిదండ్రులకు కూడా సందేహాలు ఉంటాయి. కానీ వారిలో దాగి ఉన్న హిడెన్ టాలెంట్ను గుర్తించి బయటకు తీస్తే వారి భవిష్యత్కు ఎదురే ఉండదు. అల్లు రామలింగయ్య గారికి 8 మంది మనమలు, మనమరాళ్లు.. వారందరిలో మొదట సంపాదించింది నేనే'' అని అల్లు అర్జున్ తెలిపారు. (ఇదీ చదవండి: రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెళ్లిసందడి.. ఫోటోలు వైరల్!) తాత బీమా గురించి చెబుతూనే.. తండ్రి (అల్లు అరవింద్) గురించి కూడా మరో ఆసక్తికరమైన విషయాన్ని తెలిపాడు బన్నీ. ''మేం చెన్నై నుంచి హైదరాబాద్కు షిఫ్ట్ అయిన రోజుల్లో ఒకేసారి మా లైఫ్ టర్న్ తీసుకుంది. హైదరాబాద్కు మాకన్నా ముందే నాన్న షిఫ్టయిపోయారు… తర్వాత మేం ఇక్కడికి చేరుకున్నాం. ఓ రోజు మేం ఇద్దరమే ఉన్నప్పుడు హఠాత్తుగా నన్ను హగ్ చేసుకుని, నువ్వు రాబోయే రోజుల్లో హీరోగా మంచి పేరు తెచ్చుకుంటావు అన్నాడు ప్రేమగా… తన గురించి చెబుతూ పోతే ఒక రాత్రి సరిపోదు… నాకు దేవుడు అంటే మా నాన్నే.. నేను ఏమీ అడగకుండానే అన్నీ నాన్నే ఇచ్చాడు'' అంటూ ఎమోషనల్గా చెబుతూ పోయాడు బన్నీ. తన మాటల్లో హిపోక్రసీ ఏమీ కనిపించలేదు, వినిపించలేదని… చాలా నేచురల్ ఫ్లోతో చెప్పారని బన్నీ ఫ్యాన్స్ అంటున్నారు. -
విడుదలైన రెండు వారాల్లోనే ఓటీటీకి.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నరేష్ అగస్త్య, కౌశిక్, మౌర్య సిద్ధవరం, వైవా హర్ష, ప్రియాంక శర్మ, బ్రహ్మాజి, సుదర్శన్, రియా సుమన్, ప్రియాంక శర్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం మెన్టూ (#MenToo). బీయింగ్ ఏ మ్యాన్ ఈజ్ నాట్ ఈజీ. అనేది ఉపశీర్షిక. శ్రీకాంత్ జి.రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. హీరోగా నటించిన మౌర్య సిద్ధవరం నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రం మే 26న ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీకి రానుంది. (ఇది చదవండి: Mentoo Movie: #మెన్టూ మూవీ రివ్యూ) ఈ మూవీ జూన్ 9 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో స్ట్రీమింగ్ కానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సినిమా స్టిల్ని షేర్ చేస్తూ.. ప్రపంచ పురుషోత్తములారా.. ఈ బిగ్ అనౌన్స్మెంట్ మీ కోసమే అంటూ క్యాప్షన్ పెట్టింది. పురుషుల కష్టాలు ఎలా ఉంటాయో చూపించే కథతో ఈ సినిమా తెరకెక్కించారు. ఈ చిత్రం కామెడీతో మిమ్మల్ని కడుపుబ్బా నవ్వించేందుకు వచ్చేస్తోంది. థియేటర్లలో చూడలేనివారు ఎంచక్కా ఓటీటీలో చూసేయండి. (ఇది చదవండి: టీవీ షోలో నాపై చవకబారు కామెంట్లు.. యాంకర్ విరగబడి నవ్వింది) Prapancha Purushothhamulaara...!🙋♂️ A Big Announcement for you....👉#MENTOO Antu vachesthunnaru ee frustrated front uu...!😛#MenTooOnAHA Premiers June 9th!@nareshagastya @kaushikghan @PriyankaOffl @IRiyaSuman @MouryaSIddavar1 @SrizTweets @harshachemudu pic.twitter.com/fQHDbnvosK — ahavideoin (@ahavideoIN) June 2, 2023 -
సత్తిగాని రెండెకరాలు మూవీ రివ్యూ
టైటిల్: సత్తిగాని రెండెకరాలు నటీనటులు: జగదీష్ ప్రతాప్ బండారి, వెన్నెల కిశోర్, మోహన శ్రీ, రాజ్ తిరందాసు, అనీషా దామా, బిత్తిరి సత్తి, మురళీదర్ గౌడ్, రియాజ్ తదితరులు రచన, దర్శకత్వం: అభినవ్ రెడ్డి దండ సినిమాటోగ్రఫీ: విశ్వనాథ్ రెడ్డి సీహెచ్ సంగీతం: జై క్రిష్ నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ విడుదల తేదీ: మే 26, 2023 ఓటీటీ వేదిక: ఆహా పుష్ప సినిమాలో చిత్తూరు కుర్రాడిగా నటించిన జగదీష్ ప్రతాప్ బండారికి మంచి మార్కులు పడ్డాయి. అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా కామెడీ పండించిన ఆయనకు సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే సత్తిగాని రెండెకరాలు చిత్రంతో హీరోగా మారాడు జగదీష్. పుష్ప సినిమా నిర్మించిన మైత్రీ మూవీ మేకర్సే ఈ చిత్రాన్ని నిర్మించింది. శుక్రవారం ఓటీటీ వేదిక ఆహాలో రిలీజైన సత్తిగాని రెండెకరాలు సినిమా ఎలా ఉందో చూద్దాం.. కథ కొల్లూరు అనే గ్రామంలో నివసించే సత్తి(జగదీష్ ప్రతాప్ బండారి)కి భార్య, ఇద్దరు పిల్లలు. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తాడు. ఎంత కష్టం వచ్చినా సరే ఉన్న రెండు ఎకరాలు అమ్మవద్దని సత్తికి చిన్నప్పుడే అతడి తాత చెప్తాడు. మీ నాన్న ఉన్నదంతా అమ్మేసి చివరకు రెండు ఎకారలు మాత్రమే మిగిల్చాడని దాన్ని కాపాడుకోమని సెలవిస్తాడు. ఆ మాటలను బుర్రకు ఎక్కించుకుంటాడు సత్తి. పెద్దయ్యాక అతడికో పెద్ద కష్టం వస్తుంది. తన కుమార్తె గుండెలో రంధ్రం ఉందని, ఆపరేషన్ చేయడానికి రూ.30 లక్షలు ఖర్చవుతుందని డాక్టర్స్ చెప్తారు. అప్పటికే సమయం కోసం వేచి చూస్తున్న సత్తి బంధువు, ఊరి సర్పంచ్ తన స్వలాభం కోసం సత్తితో రెండెకరాలు అమ్మించేయాలని కుట్ర పన్నుతాడు. ఓ రోజు సత్తి సైకిల్ మీద వెళ్తుండగా అక్కడ ఓ కారు చెట్టును ఢీ కొడుతుంది. అందులో వ్యక్తికి తీవ్ర గాయాలైనా పట్టించుకోని సత్తి ఆ కారులో ఉన్న సూట్కేసును మాత్రం ఇంటికి తీసుకొస్తాడు. అందులో డబ్బులుంటే కూతురికి ఆపరేషన్ చేయించవచ్చని అతడి ఐడియా. కానీ ఆ సూట్కేస్ ఎలా తెరవాలో తెలియక స్నేహితుడు అంజి(రాజ్ తిరందాసు) సాయం కోరుతాడు. వీళ్లు అప్పటికే ఊర్లో చిన్నచిన్న దొంగతనాలు చేయడంతో దాన్ని ఎలాగైనా ఓపెన్ చేసేందుకు రకరకాలుగా ప్రయత్నిస్తారు. మరోవైపు సూట్కేస్ ఓనర్ లలిత్(రియాజ్) తన అనుచరుడు వెన్నెల కిశోర్ను యాక్సిడెంట్ అయిన ప్రదేశానికి పంపిస్తాడు. అతడు కారుతో పాటు అందులో ఉన్న వ్యక్తిని కూడా కాల్చేసి సూట్కేసు కోసం గాలిస్తాడు. మరోపక్క కారు ప్రమాదం గురించి ఎస్సై(బిత్తిరి సత్తి) విచారణ చేస్తూ ఉంటాడు. తీరా ఒక రోజు సూట్కేస్ తెరుచుకుంటుంది. అందులో ఏముంది? వెన్నెల కిశోర్ ఆ సూట్కేస్ సొంతం చేసుకున్నాడా? ఎస్సై విచారణ ఎలా సాగింది? సత్తి తన కూతురికి ఆపరేషన్ చేయించాడా? అన్నది మిగతా కథ. విశ్లేషణ ఈ మధ్యకాలంలో ప్రాంతీయ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇదే కోవలో సత్తిగాని రెండెకరాలు కూడా వచ్చింది. ఈ సినిమాను కామెడీగా లేదంటే క్రైమ్ థ్రిల్లర్ తరహాలో తీయవచ్చు. కానీ దర్శకుడు అభినవ్ రెడ్డి దండ కామెడీకే జై కొట్టారు. అయితే సత్తిగాని రెండెకరాలు కథలో కొత్తదనం లేదు. కాకపోతే అల్లుకున్న క్యారెక్టర్లు కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. సూట్కేసు వచ్చిన తర్వాత సినిమాలో వేగం, బలం పుంజుకుంటుంది. క్లైమాక్స్ బాగుంది. ఎంత మంచివాడైనా కొన్ని సందర్భాల్లో చెడువైపు అడుగులు వేసేందుకు ఆస్కారం ఉంది. అవసరం మనతో ఏ పనయినా చేయిస్తుందని జగదీశ్ పాత్రతో తెరపై చూపించాడు డైరెక్టర్. కామెడీ బాగా పండింది కానీ కొంత సాగదీత ఉంది. కొన్ని సన్నివేశాలను ముందుగానే ఊహించే ఆస్కారం ఉండటం మైనస్. ఎవరెలా చేశారంటే? జగదీష్ ప్రతాప్ బండారి నటనకు వంక పెట్టే పని లేదు. అంత బాగా నటించాడు. ప్రతి సన్నివేశంలో లీనమైపోయాడు. అతడి స్నేహితుడు అంజిగా నటించిన రాజ్ తిరందాస్ యాక్టింగ్ కూడా బాగుంది. వెన్నెల కిశోర్కు మంచి పాత్ర పడితే ఎలా విజృంభిస్తాడో చూపించాడు. బిత్తిరి సత్తి నిడివి ఇంకాస్త పెంచితే బాగుండేది. నటీనటులందరూ తమ పాత్రల పరిధి మేర నటించారు. తెలంగాణ పల్లె అందాలను సినిమాటోగ్రాఫర్ విశ్వనాథ్ రెడ్డి చాలా సహజంగా, అద్భుతంగా ఆవిష్కరించారు. జై క్రిష్ నేపథ్య సంగీతం, పాటలు కథలో భాగంగానే ముందుకు సాగుతూ ప్రేక్షకులను లీనం చేసేందుకు దోహదపడ్డాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే.. కథ పక్కన పెడితే కామెడీ ఎంజాయ్ చేయవచ్చు -
ఈ వారం ఓటీటీలో అలరించే సినిమాలివే!
మీరు ఓటీటీ సినీ ప్రియులా? సినిమాలు ఎక్కువగా ఓటీటీల్లోనే చూస్తున్నారా? అయితే మీ లాంటి వారి కోసమే ఈ వారంలో పలు చిత్రాలు విడుదల అయ్యేందుకు సిద్ధమయ్యాయి. ఈవేసవిలో మీకు ఆనందాన్ని పంచేందుకు వస్తున్నాయి. ఈ వారం ఓటీటీలోకి వస్తున్న పలు ఆసక్తికర సినిమాలు, వెబ్సిరీస్లేవో ఓ లుక్కేయండి. హారర్ మూవీ 'బూ' విశ్వక్సేన్, రకుల్ ప్రీత్ సింగ్, మోనికా, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ మూవీ 'బూ'. ఈ చిత్రానికి విజయ్ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈనెల 27 నుంచి జియో సినిమాలోస్ట్రీమింగ్ కానుంది. సత్తిగాని రెండెకరాలు ఏమయ్యాయి? పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ స్నేహితుడు కేశవగా మెప్పించిన నటుడు జగదీష్ ప్రతాప్ భండారి. జగదీశ్ ప్రధాన పాత్రలో నూతన దర్శకుడు అభినవ్ తెరకెక్కించిన చిత్రం ‘సత్తిగాని రెండెకరాలు’. ఈ సినిమా ఈ నెల 26న నేరుగా ఆహాలో విడుదల కానుంది. కిసీ కా భాయ్.. కిసీ కి జాన్ సల్మాన్ఖాన్, పూజా హెగ్డే జంటగా ఫర్హద్ సమ్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్'. తెలుగు హీరో వెంకటేశ్ కీలక పాత్ర పోషించారు. ఇటీవల హిందీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను తమిళ సూపర్ హిట్ ‘వీరమ్’కు రీమేక్గా దీన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం మే 26వ తేదీ నుంచి జీ5 వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఎట్టకేలకు వస్తున్న తోడేలు వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటించిన హారర్ కామెడీ మూవీ భేడియా. ఈ చిత్రాన్ని తెలుగులో తోడేలు పేరుతో విడుదల చేశారు. అమర్ కౌశిక్ తెరకెక్కించారు. ఈ చిత్రం మే 26వ తేదీ నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది. సిటాడెల్ ఫైనల్ ఎపిసోడ్ ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో తెరకెక్కించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ సిటాడెల్. ఈ సిరీస్ఇటీవల అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ వెబ్ సిరీస్లో రిచర్డ్ మ్యాడన్, జోన్స్, స్టాన్లీ టక్కీ కీలక పాత్రలు పోషించారు. ఈ సిరిసీ చివరి ఎపిసోడ్ మే 26 స్ట్రీమింగ్ కానుంది. నెట్ఫ్లిక్స్ విక్టిమ్/సస్పెక్ట్- (హాలీవుడ్) స్ట్రీమింగ్ అవుతోంది. మదర్స్ డే -(హాలీవుడ్)- స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్యూబర్- (వెబ్సిరీస్) స్ట్రీమింగ్ అవుతోంది. దసరా -(హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది. ఆపరేషన్ మేఫెయిర్- (హిందీ) స్ట్రీమింగ్ అవుతోంది. బీడ్ (హిందీ) -స్ట్రీమింగ్ అవుతోంది. బ్లడ్ అండ్ గోల్డ్ -(జర్మన్) మే 26 టిన్ అండ్ టీనా- (స్పానిష్) మే 26 టర్న్ ఆఫ్ ది టైడ్ -(పోర్చుగీస్) నెట్ఫ్లిక్స్ సిరీస్-1 మే26 చోటా భీమ్- (హిందీ) సిరీస్-18 మే 26 బ్లడ్ అండ్ గోల్డ్- (హాలీవుడ్) మే 26 అమెజాన్ ప్రైమ్ మిస్సింగ్- ఒరిజినల్ మూవీ ‘పంచువమ్ అద్భుత విళక్కుమ్-మలయాళం/తెలుగు-మే 26 జియో సినిమా థగ్స్ -తెలుగు/తమిళ్/హిందీ క్రాక్ డౌన్ -వెబ్సిరీస్-సీజన్2 చిత్రకూట్ -హిందీ) మే 27 జీ5 సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై- ఒరిజినల్ మూవీ- మే 23 విడుదల: పార్ట్-1 -తెలుగు డిస్నీ+హాట్స్టార్ అమెరికన్ బోర్న్ చైనీస్- వెబ్సిరీస్- మే 24 సిటీ ఆఫ్ డ్రీమ్స్ -వెబ్సిరీస్ -3- మే 26 ఆహా గీతా సుబ్రహ్మణ్యం- తెలుగు సిరీస్-3 - మే 23 -
'ఇండియన్ ఐడల్ సీజన్ 2' ఫినాలేకు చీఫ్ గెస్ట్గా బన్నీ
సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తున్న ఆహా ‘ తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ముగింపు దశకు చేరుకుంది. మొత్తం 25 ఎపిపోడ్లకు గాను 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్కు చెందిన జయరామ్, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ, హైదరాబాద్కు చెందిన కార్తికేయ, విశాఖపట్నంకు చెందిన సౌజన్య టాప్-5 లిస్టులో ఉన్నారు. త్వరలోనే ఈ షో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఇక సీజన్ 1 ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఇక రెండో సీజన్ గ్రాండ్ ఫినాలేకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రాబోతున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ప్రోమోని విడుదల చేసింది ఆహా. ఆ ప్రోమోను బట్టి చూస్తే అల్లు అర్జున్ ఎంట్రీ మాములుగా లేదనిపిస్తుంది. తెలుగు ఇండియన్ ఐడల్ 2 వంటి అద్భుతమైన షో గ్రాండ్ ఫినాలేలో భాగమైనందుకు సంతోషిస్తున్నాను అని బన్నీ అన్నారు.జడ్జి హోదాలో ఉన్నాను కానీ ఇంత మంచి పాటకు లేచి డ్యాన్స్ చేయాలనిపిస్తోందని చెప్పాడు. అంతకుముందు ‘పుష్ప’ సినిమాలో ‘తగ్గేదేలే’ సాంగ్తో స్టేజిపైకి బన్నీ ఎంట్రీ సెలబ్రేషన్ను తలపించగా.. గాయని సౌజన్య ఆరాధ్య కుమార్తె మిహిరాతో హ్యాపీ మూమెంట్స్ కూడా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. -
ఆహాలో ‘ఏమి సేతురా లింగ’
ఓటీటీల పుణ్యమా అని ఢిపరెంట్ కంటెంట్తో సినిమాలు తెరకెక్కుతున్నాయి. యువ దర్శకులు సైతం ప్రయోగాలు చేస్తున్నారు. ట్రెండింగ్ పాయింట్తో కథ రాసి సినిమాలు తీస్తున్నారు. రెండున్నర గంటల్లో చెప్పలేని కథని వెబ్ సిరీస్లుగా మార్చి ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తున్నారు. ఇలా ప్రతి వారం కొత్త కొత్త సినిమాలు ఓటీటీలలో విడుదలవుతున్నాయి. అలా కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్, యూత్ను అట్రాక్ట్ చేసే కంటెంట్తో తెరకెక్కిన సినిమానే ‘ఏమి సేతురా లింగ’. ఈ చిత్రానికి కె.సందీప్ దర్శకత్వం వహించారు. వినోద్ వర్మ, జ్ఞానేశ్వరి కాండ్రేగుల, కేశవ్ దీపక్,ఆనంద చక్రపాణి , మేకా రామకృష్ణ, పవన్ రమేష్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. గత శుక్రవారం(మార్చి 19) నుంచే ప్రముఖ ఓటీటీ ఆహాలో ఈ చిత్రం స్ట్రీమింగ్ అవుతోంది. ‘ఏమి సేతురా లింగ’చిత్రం కథేంటంటే.. భాను(వినోద్ వర్మ) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఉద్యోగం.. జీతం.. జీవితం..ఇలానే బతికేస్తుంటాడు. ‘డబ్బు వల్లే తాను హ్యాపీగా ఉంటున్నాను’ అనుకొని ఇష్టం లేకపోయినా ఉద్యోగం చేస్తుంటాడు. కానీ బాస్ టార్చర్, పని ఒత్తిడి వల్ల.. చాలా ఒత్తిడికి లోనవుతాడు. ఇక పర్సనల్ లైఫ్ విషయంలో లవ్ లో కూడా కష్టాలే ఎదురవుతాయి. ప్రేమించానని చెప్పిన ఓ అమ్మాయి మోసం చేసి వెళ్లిపోతుంది. ప్రేమ మీద నమ్మకం కోల్పోయిన భాను లైఫ్ లోకి స్వేచ్ఛ(జ్ఞానేశ్వరి కాండ్రేగుల) వస్తుంది. ఈమె చాలా ప్రాక్టికల్ అమ్మాయి. స్వేచ్ఛ ఎంటరయ్యాక భాను జీవితంలో ఎలాంటి మార్పులు ఏర్పడ్డాయి అనేది మితగా కథ. (చదవండి: టిఫిన్లో చికెన్.. ఎన్టీఆర్ నాకు ఆప్యాయంగా వడ్డించారు: రామ్చరణ్) బానుగా వినోద్ వర్మ సహజంగా నటించాడు. సాఫ్ట్ వేర్ ఉద్యోగుల కష్టాలు ఎలా ఉంటాయో ఈయన పాత్ర ద్వారా చూపించారు. స్వేచ్ఛ పాత్ర కూడా బాగుంది. హీరోకి మేనేజర్ పాత్రలో చేసిన కేశవ్ దీపక్ నవ్వులు పూయించారు. ముఖ్యంగా క్యాస్ట్ పిచ్చితో అతడు చేసే అరాచకాలు అంతా ఇంతా కాదు. మిగిలిన నటీనటులు పర్వాలేదనిపించారు. దర్శకుడు కె.సందీప్ రియాలిటీకి చాలా దగ్గరగా ఉన్న పాయింట్ ఎంచుకొని చక్కగా తెరకెక్కించాడు. ఇలాంటి కథకు ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కు ఈజీగా కనెక్ట్ అవుతుంది. జెన్ మార్టిన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం పర్వాలేదు. తక్కువ బడ్జెట్ లో మంచి సినిమా తీశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
పరిపూర్ణం.. కోన సంబరం
ఉపాధికి మెండైన పాలి‘టెక్నిక్’
● ఢిల్లీ రోడ్డు ప్రమాదంలో చౌడేపల్లె యువకుడు మృతి ● ఒక్కగానొక్క కుమారుడి మృతితో కన్నీరుమున్నీరైన తల్లిదండ్రులు ● దుఃఖంలోనూ అవయవదానానికి అంగీకారం
షోకాజ్ నోటీసులను ఉపసంహరించండి
ట్రాన్స్కో వర్క్ ఆర్డర్లు పూర్తి చేయాలి
కౌంటింగ్పై అవగాహన తప్పనిసరి
● మగబిడ్డకు జన్మనిచ్చిన గంటలోపే బాలింత మృతి ● వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటున్న కుటుంబ సభ్యులు ● ఆస్పత్రి వద్ద ధర్నా.. పోలీసులకు ఫిర్యాదు
న్యాయమూర్తులకు ముగిసిన శిక్షణ
● మరో పదిరోజుల్లో ఓట్ల లెక్కింపు ● ఎన్నికల ఫలితాలపై పెరుగుతున్న ఉత్కంఠ ● జూన్ 4వ తేదీన తేలనున్న అభ్యర్థుల భవితవ్యం
వైభవం.. వసంతోత్సవం
తప్పక చదవండి
- అన్నమయ్య: YSRCP కార్యకర్త దారుణ హత్య
- Hyderabad: విమానం గాల్లో ఉండగా డోర్ తెరిచే ప్రయత్నం..
- నాగోలు: మద్యం తాగుతూ.. గొడవ పడుతూ యువతి హల్చల్
- జువెలర్ల ఆదాయమూ ‘బంగారమే’
- హైదరాబాద్పై బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
- మేడిన్ ఇండియా రేంజ్ రోవర్
- గిరికీలు కొట్టిన హెలికాప్టర్
- వలపు వల విసిరి.. చర్మం వలిచి.. ముక్కలుగా నరికి
- విస్తృతంగా పోలీసుల తనిఖీలు
- హింస పన్నాగంతోనే అధికారుల బదిలీ
Advertisement