-
యూనిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా : భావోద్వేగం
2014 నుండి యూనిసెఫ్ ఇండియాతో అనుబంధం కలిగి ఉంది బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్. ఇద్దరు బిడ్డల తల్లిగా బాల్య అభివృద్ధి, ఆరోగ్యం, విద్య మరియు లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో సంస్థకు మద్దతు ఇస్తుంది. తాజాగా యునిసెఫ్ భారత జాతీయ అంబాసిడర్గా కరీనా కపూర్ ఎంపికైంది. ఈ సందర్బంగా ఆమె భావోద్వేగానికి లోనైంది.కరీనా కపూర్ అనగానే రంగుల ప్రపంచం కళ్ల ముందు ఆవిష్కారం అవుతుంది.అయితే ఈ అందాల నటికి మరో ప్రపంచం కూడా తెలుసు.స్త్రీ సాధికారత నుంచి మెన్స్ట్రువల్ హైజీన్ వరకు ఎన్నో అవగాహన కార్యక్రమాల్లో పాల్గొంటోంది. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలకు వెళుతోంది. పేదింటి బిడ్డలతో మాట్లాడుతోంది.తాజాగా యూనిసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా నియామకం అయిన కరీనా కపూర్లో ఫ్యాషన్ డిజైనర్, రైటర్, మోటివేషనల్ స్పీకర్, సోషల్ యాక్టివిస్ట్ ఉన్నారు...ఉత్తమనటిగా సుపరిచితమైన కరీనా కపూర్ సృజనాత్మకమైన డిజైనర్ కూడా. క్లాతింగ్ రిటైలర్ ‘గ్లోబస్’తో కలిసి పనిచేసింది. న్యూట్రిషనిస్ట్ రుజుత దివాకర్తో కలిసి తీసుకు వచ్చిన ‘డోంట్ లూజ్ యువర్ మైండ్, లూజ్ యువర్ వెయిట్’ పుస్తకం అమ్మకాల్లో రికార్డ్ సృష్టించింది. కరీనా కపూర్ వాయిస్తో ఈ పుస్తకం ఆడియో బుక్గా రావడం మరో విశేషం. ‘ది స్టైల్ డైరీ ఆఫ్ బాలీవుడ్ దివా’ పేరుతో తన జ్ఞాపకాల పుస్తకాన్ని తీసుకువచ్చింది. అదితి షా బీమ్జానీతో కలసి ప్రెగ్నెన్సీపై రాసిన పుస్తకం కమర్షియల్గా సక్సెస్ అయింది. రుజుత దివాకర్తో కలిసి న్యూట్రిషన్కు సంబంధించి ‘ది ఇండియన్ ఫుడ్ విజ్డమ్ అండ్ ది ఆర్ట్ ఆఫ్ ఈటింగ్ రైట్’ డాక్యుమెంటరీపై పనిచేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్పై వచ్చిన ‘గర్ల్ రైజింగ్’ అనే డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్కు వాయిస్–వోవర్ ఇచ్చింది.ఒకవైపు సినిమాల్లో బిజిగా ఉన్నప్పటికీ... పిల్లల విద్య, మహిళల భద్రతకు సంబంధించిన కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. మహిళలపై హింసను నిరో«ధించడానికి ఎన్డీ టీవి ప్రారంభించిన శక్తి క్యాంపెయిన్కు అంబాసిడర్గా పనిచేసింది. 2014 నుంచి బాలికల విద్యకు సంబంధించి యూనిసెఫ్తో కలిసి పనిచేయడం మొదలుపెట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని పాఠశాలలకు వెళ్లి అక్కడి విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకునేది. జాల్నా జిల్లాలో కస్తుర్బా గాంధీ బాలికల విద్యాలయం నిర్వహించిన నిధుల సేకరణ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంది.నిరుపేద పిల్లల చదువు కోసం షర్మిలా ఠాగుర్తో కలిసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించింది. చైల్డ్–ఫ్రెండ్లీ స్కూల్ అండ్ సిస్టమ్స్ (సీఎఫ్ఎస్ఎస్) యాకేజీని లాంచ్ చేసింది. చత్తీస్ఘడ్లో చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ వీక్ çసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో బాగా చదివే పిల్లలు, పాఠాలు బాగా చెప్పే టీచర్లకు పురస్కారాలు అందజేసింది. మెన్స్ట్రువల్ హైజీన్పై యూనిసెఫ్ లక్నోలో నిర్వహించిన సమావేశంలో ప్రసంగించింది. ‘నవజాత శిశువులను కాపాడుకుందాం’ పేరుతో కరీనా రాసిన వ్యాసానికి మంచి స్పందన వచ్చింది. నవజాత శిశువులు, తల్లుల క్వాలిటీ హెల్త్ కేర్కు సంబంధించి ‘ఎవ్రీ చైల్డ్ అలైవ్’ అనే క్యాంపెయిన్ను నిర్వహించింది. మదర్స్ డే సందర్భంగా యూనిసెఫ్ దిల్లీలో నిర్వహించిన సమావేశంలో కరీనా ప్రధాన వక్త.ప్రకృతి వైపరీత్య బాధితుల కోసం, ఎన్నో స్వచ్ఛంద సేవా సంస్థల కోసం నిధుల సేకరణ కార్యక్రమాల్లో పాల్గొంది కరీన. పిల్లల రోగనిరోధక శక్తి పెరుగుదలకు సంబంధించిన అంశాలపై పనిచేసే స్వస్థ్ ఇమ్యునైజేషన్ ఇండియాకు బ్రాండ్ అంబాసిడర్గా పనిచేసింది.తాజా విషయానికి వస్తే.. ‘నేషనల్ అంబాసిడర్గా యూనిసెఫ్తో నా అనుబంధం కొనసాగడం గౌరవంగా భావిస్తున్నాను. పిల్లల చదువు, హక్కుల కోసం నా గొంతు వినిపిస్తాను’ అంటుంది కరీనా కపూర్.‘కరీనా కపూర్ ఎక్స్లెంట్ కమ్యూనికేటర్’ అని కితాబు ఇచ్చింది యూనిసెఫ్. చిన్న విజయం చాలు... పెద్ద సంతోషానికిసోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ‘నేను ఎలా సాధించానంటే’లాంటి స్టోరీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేస్ మొదలైంది. ఆ రేస్లో భాగంగా యువతరం ఒత్తిడిని ఎదుర్కొంటుంది. ఈ రేసులో మెంటల్ హెల్త్ అనేది వెనక్కి వెళ్లిపోయింది. రేస్ అనేది శాంతి, సంతోషాల కోసం ఉండాలి. విద్యార్థులు తమ మానసిక శాంతిపై ఎక్కువ దృష్టి పెట్టాలి. చిన్న విజయాన్ని కూడా పెద్ద విజయంగా భావించుకోవాలి. ‘ఇదీ ఒక విజయమేనా!’ అనుకున్నప్పుడు అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి నుంచి అశాంతి జనిస్తుంది –కరీనా కపూర్ -
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
ఢిల్లీ: యూనీసెఫ్ ఇండియా (యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్) తన కొత్త జాతీయ అంబాసిడర్గా బాలీవుడ్ స్టార్ 'కరీనా కపూర్'ను ప్రకటించింది. 2014 నుంచి యునిసెఫ్ ఇండియాతో సంబంధం కలిగి ఉన్న ఈమె ఆరోగ్యం, విద్య, లింగ సమానత్వం కోసం ప్రతి పిల్లల హక్కును పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.కరీనా ఇంతకు ముందు యునిసెఫ్ ఇండియాకు సెలబ్రిటీ అడ్వకేట్గా పనిచేశారు. కాగా ఇప్పుడు నూతన బాధ్యతలు స్వీకరించారు. ఇప్పుడు భారత జాతీయ రాయబారిగా యునిసెఫ్తో నా అనుబంధాన్ని కొనసాగించడం నాకు గౌరవంగా ఉంది కరీనా పేర్కొన్నారు. ప్రతి బిడ్డకు బాల్యం, సమానమైన అవకాశం, భవిష్యత్తు అవసరం అని ఆమె పేర్కొన్నారు.#WATCH | Delhi: Actress Kareena Kapoor Khan appointed as UNICEF India's National Ambassador. pic.twitter.com/tglRjOtyPU— ANI (@ANI) May 4, 2024 -
సెలబ్రెటీలను సైతం పక్కకునెట్టి అంబాసిడర్ అయిన యువతి!
సాధారణంగా అంబాసిడర్గా సిని సెలబ్రెటీలు లేదా స్పోర్ట్స్ స్టార్లు, ప్రముఖులు ఉంటారు. ముఖ్యంగా కార్పొరేట్ కంపెనీలు, ప్రభుత్వ సంస్థలు కూడా వాళ్లనే పెట్టుకోవడం జరుగుతుంది. అలాంటి ఓ సాధారణ యువతి వాళ్లందర్నీ పక్కకు నెట్టి మరీ అంబాసిడర్ అయ్యింది. స్వయంగా మన భారత ప్రభుత్వమే ఆ యువతిని నియమించింది. ఎందుకని ఆమెనే అంబాసిడర్గా నియమించింది? ఆమె ప్రత్యేకత ఏంటీ అంటే.. అమ్మమ్మ స్పూర్తితోనే.. ఆ యువతి పేరు లహరీబాయి మధ్యప్రదేశ్లోని బైగా (వైద్యుడు) గిరిజన సంఘానికి చెందిన యువతి. ప్రత్యేకించి బలహీనమైన గిరిజన సమూహం. ఈ తెగకు చెందిన ప్రజలు తమ పర్యావరణం, దాని జీవవైవిధ్యంపై పూర్తి అవగాహన కలిగి ఉంటారు. వారు తమకుండే మౌఖిక సంప్రదాయాల ద్వారా తమ నైపుణ్యాలను ఒక తరం నుంచి మరొక తరానికి కొనసాగేలా ప్రొత్సహిస్తారు. ఇక లహరీ మధ్యప్రదేశ్లోని దిండోరి జిల్లాలోని సిల్పాడి అనే మారుమూల గ్రామానికి చెందింది. ఆమె తన బామ్మ మాటలతో స్ఫూర్తిపొందింది. కనుమరుగవుతున్న మిల్లెట్ ధాన్యంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి లహరీబాయి తన అమ్మమ్మ నుంచి పాఠాలు నేర్చుకుంది. తర్వాత దాని విత్తనాలను సంరక్షించడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. లమరీ 18 ఏళ్ల వయస్సు నుంచే విత్తనాలు సేకరించడం ప్రారంభించింది. ఆమె ఇప్పుడు కూడా సమీపంలోని గ్రామాలలో తిరుగుతూ అడవులు, పొలాల నుంచి విత్తనాలను సేకరిస్తూనే ఉండటం విశేషం. స్కూల్ ముఖమే చూడకపోయినా.. ఇక లహరీబాయి ఇల్లు మిల్లెట్స్తో అలంకరించినట్లుగా ఇంటిపైకప్పుడు వేలాడుతుంటాయి. అస్సలు పాఠశాల ముఖమే చూడని గిరిజన మహిళ ఈ విత్తనాల గొప్పతనం గురిచి తెలసుకుని వాటిని సంరక్షించాలని భావించడం నిజంగా స్ఫూర్తి దాయకం. ఇక ఈ మిల్లెట్ల్లో మాంసకృత్తులు, ఫైబర్, విటమిన్లు కలిగి ఉంటాయి. అవి మన ఆరోగ్యాన్ని కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా మధుమేహం, అధిక బరువు, వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడటంలో తోడ్పడుతుంది. ఏకంగా 150 రకాలకు పైనే.. ఇక లహరీబాయి ప్రస్తుత వయసు 27 ఏళ్లు. ఆమె 1ఆ ఏళ్ల నుంచి ఈ మిల్లెట్స్ సేకరణ ప్రారంభించింది. అలా ఇప్పటి వరకు దాదాపు 150 రకాలకుపైనే మిల్లెట్స్ సేకరించింది. కోడో, కుట్కి, సికియా, సల్హార్, సావా మరియు చేనాతో సహా 150కిపైగా ఎక్కువ రకాల అరుదైన మిల్లెట్స్ లహరీబాయి వద్ద ఉండటం విశేషం. ఐతే చాలా రకాల మిల్లెట్స్ అంతరించిపోతున్నాయని, వాటిని సంరక్షించుకోవాలని చెబుతుంది లహరీబాయి. విత్తనాల సేకరణ కోసం.. ఇక ఎవరైనా మిల్లెట్స్ సాగు చేస్తే.. లహరీ బాయి వారికి కిలో విత్తనాలు ఉచితంగా ఇస్తుందట. తిరిగి పంట చేతికి వచ్చిన తర్వాత ఆ రైతుల నుంచి కిలోన్నర తీసుకుంటుంది. మరి కొందరు మాత్రం ఆమెకు కొంతభాగం బహుమతిగా కూడా ఇస్తారు. డబ్బు సంపాదించడం కోసం ఇలా చేయడం లేదని, ఎక్కువ విత్తనాలు సేకరించడం కోసమేనని చెబుతున్న లహరీబాయిని చూస్తే నిజంగా వాటి ప్రాముఖ్యతను అందురు గుర్తించేలా, బావితరాలకు అందిచాలనే లక్ష్యం కనిపిస్తుంది ఆ ఆసక్తి ఆమెను అంబాసిడర్గా.. లహరీబాయి మిల్లెట్స్ సేకరణ, సంరక్షణ పట్ల ఆమె కనబరుస్తున్న ఆసక్తిన, కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను మిల్లెట్స్ అంబాసిడర్ గా నియమించింది. భారత ప్రభుత్వం దేశాన్నిమిల్లెట్సాగు, పరిశోధనలకు ప్రపంచ హబ్గా మార్చడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది . ఇలాంటి వాళ్లను ప్రోత్సహిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాల ఉన్న ఈ మిల్లెట్స్ అంతరించిపోకుండా సంరక్షింపబడతాయన్న ఉద్దేశ్యంతో సెలబ్రెటీలను కూడా కాదని, ఆ గిరిజ యువతిని అంబాసిడర్గా నియమించింది. పెద్ద పెద్ద చదువులతోనే కాదు, చేస్తున్న పట్ల సరైన అవగాహన నిబద్ధతతో కృషి చేస్తే దేశమే గుర్తించి మెచ్చుకునే మనిషిగా పేరుతెచ్చుకోవచ్చని ఈ గిరిజన యువతి ప్రూవ్ చేసింది కదూ..! (చదవండి: అత్యంత పిన్నవయస్కురాలైన మహిళా పైలట్!) -
కమెడియన్ శ్రద్ధా జైన్పై ప్రధాని మోదీ ప్రశంసలు
శ్రద్ధగా నవ్విస్తుంది! శ్రద్ధా జైన్.‘శ్రద్ధా జైన్ తెలుసా?’ అని అడిగితే – ‘తెలుసు’ అని చెప్పేవారి సంఖ్య తక్కువ కావచ్చుగానీ– ‘అయ్యో శ్రద్ధా తెలుసా’ అంటే ‘అయ్యో... తెలియకపోవడం ఏమిటి!’ అనే వాళ్ల సంఖ్య ఎక్కువే. బెంగళూరుకు చెందిన శ్రద్ధా జైన్ అలియాస్ ‘అయ్యో శ్రద్ధా’ ‘ఇంటర్నెట్ సెన్సేషన్’గా పేరు తెచ్చుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఇటీవల ‘నేషనల్ క్రియేటర్స్’ అవార్డ్ అందుకుంది హాయిగా నవ్వించే వీడియోలతో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయింది శ్రద్ధా జైన్. తులు, కన్నడ, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్ భాషలలో ఇన్స్టాగ్రామ్లో రెగ్యులర్గా వీడియోలు పోస్ట్ చేస్తుంటుంది. 2016లో కర్నాటకాలో జరిగిన ఒక ఫెస్టివల్కు సంబంధించి ఫేస్బుక్ వీడియోను పోస్ట్ చేసింది. వైరల్ అయిన ఈ వీడియో శ్రద్ధాకు వీర లెవెల్లో పేరు తెచ్చింది. ఒక డ్యాన్స్ రియాల్టీ షోకు హోస్ట్గా, కొన్ని టీవీ కార్యక్రమాలకు క్రియేటివ్ డైరెక్టర్గా అవకాశాలు తెచ్చింది. ఇక కామేడీ షోల సంగతి సరే సరి. కామెడీ డ్రామా సిరీస్ ‘పుష్పవల్లి’తో శ్రద్ధ పేరు హాస్యాభిమానుల అభిమాన పేరు అయింది. పెద్ద బ్రాండ్స్తో కలిసి పనిచేసిన శ్రద్ధ ఇలా అంటుంది... ‘కంటెంట్లో వెరైటీ ఉండేలా ప్రయత్నించేదాన్ని. ప్రేక్షకుల సంగతి ఏమిటోగానీ కంటెంట్లో వెరైటీ లేకపోతే ముందు నాకే బోర్ కొడుతుంది. అది ఎంత పెద్ద హిట్ అయినా సరే ఒకే అంశాన్ని పదేపదే చేయలేను. రియల్ ఎస్టేట్ రంగంలోకి ఉన్న వారికి ఎలాంటి ఇన్ఫ్లూయెన్సర్ను ఎంపిక చేసుకోవాలో తెలియదు. నేను సృష్టించిన రీనా దలాల్ క్యారెక్టర్ను చూసిన తరువాత... రీనా క్యారెక్టర్ పర్ఫెక్ట్ అనుకున్నారు. మొదట్లో రియల్ ఎస్టేట్ కోసం కంటెంట్ క్రియేట్ చేసిన అతి కొద్దిమందిలో నేను ఒకరిని’ అంటుంది శ్రద్ధ. ఏ బ్రాండ్ వారు వచ్చినా తమది ఏ బ్రాండ్ అనేది మాత్రమే చెబుతారు. వారికి ‘ఐడియా’ గురించి బొత్తిగా ఐడియా ఉండదు. ఈ నేపథ్యంలో ఐడియా జెనరేట్ చేయడం నుంచి స్క్రీన్ప్లే వరకు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో చేయాల్సి ఉంటుంది. ఇలాంటి అన్ని విద్యల్లో ఆరితేరింది శ్రద్ధ.పని పట్టాలెక్కడానికి అట్టే టైమ్ పట్టదు. కాన్సెప్ట్ డిస్కషన్ మీటింగ్ తరువాత పని పరుగులు తీస్తుంది. సాధారణంగా పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ఫిక్స్డ్ స్టైల్కే పరిమితం అవుతారు. అది దాటి బయటికి రావడాన్ని రిస్క్ అనుకుంటారు. అయితే ఎప్పటికప్పుడూ కొత్తగా ఆలోచిస్తూ ‘ఫిక్స్డ్ స్టైల్’ అనేది లేకుండా జాగ్రత్త పడింది శ్రద్ధ. రేడియా జాకీ, డ్యాన్స్ షో హోస్ట్, కమెడియన్, రైటర్, అయిదు లక్షల ఫాలోవర్లు ఉన్న ఇన్స్టాగ్రామ్ కంటెంట్ క్రియేటర్... ఇలా శ్రద్ధా జైన్ సృజనాత్మక రూ΄ాలు ఎన్నో ఉన్నాయి. ‘డాక్టర్ జీ’ సినిమాతో బాలీవుడ్లోకి కూడా అడుగు పెట్టింది. ‘నా నటన, రచనలకు సోషల్ మీడియాలో మంచి గుర్తింపు లభించింది. ఈ గుర్తింపు ద్వారా ఏదైనా సౌత్ ఫిల్మ్లో నటించే అవకాశం వస్తుంది అనుకున్నాను. అయితే ఏకంగా బాలీవుడ్ నుంచే పిలుపు రావడం ఆనందంగా అనిపించింది’ అంటున్న శ్రద్ధ పోస్ట్–గ్రాడ్యుయేట్ స్టూడెంట్గా నటించింది. ‘పెర్ఫర్మర్, కంటెంట్ క్రియేటర్లకు ఇది మంచి టైమ్. ఏమాత్రం టాలెంట్ ఉన్నా మన స్థాయి ఎక్కడికో వెళ్లిపోతుంది’ అంటుంది -
Poonam Pandey కాంట్రోవర్సీ క్వీన్ పూనమ్ పాండేకు మరో భారీ షాక్
ప్రముఖ మోడల్, బాలీవుడ్ నటి పూనమ్ పాండేకు మరో ఎదురు దెబ్బ తగిలింది. గర్భాశయ ముఖద్వార కేన్సర్పై అవగాహన కల్పించేందుకు పూనం పాండేను ప్రచార కర్తగా నియమించనుందన్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. సర్వైకల్ కేన్సర్పై అవగాహనకు గాను ఆమెను బ్రాండ్ అంబాసిడర్గా పరిగణించే అవకాశం లేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు స్పష్టం చేశారు. పాండే సర్వైకల్ కేన్సర్పై అవగాహనకు సంబంధించిన బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యే అవకాశం ఉందని, ఈమేరకు చర్చలు జరుగుతున్నాయన్న ఆమె, ఆమె టీం చేస్తున్న ప్రచారం నేపథ్యంలో మంత్రిత్వ శాఖ అధికారులతో చర్చలు జరుపుతున్నాయని వర్గాలు స్పష్టత నిచ్చాయి. ఇది ఇలా ఉంటే సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి కేన్సర్ రోగులు, వారి బంధువులతో పాటు ఇతరులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేసిందంటూ కోల్కతాకు చెందిన అమిత్ రాయ్ పూనమ్ పాండేకు లీగల్ నోటీసులు పంపారు. చనిపోయానని ప్రకటించడం ఎంతో తీవ్రమైన అంశం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా సర్వైకల్ కేన్సర్తో బాధపడుతూ నటి పూనం పాండే చనిపోయిందంటూ ఆమె అధికారిక ఇన్స్టాలో చేసిన పోస్ట్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు, పలువురిని దిగ్బ్రాంతికి గురి చేసింది. అయితే ఆ మరునాడే తాను బతికే ఉన్నానని, సర్వైకల్ కేన్సర్ ప్రమాదకరంగా మారుతున్న నేపత్యంలో కేవలం దీనిపై అవగాహన కల్పించేందుకే ఈ ప్రకటన అంటూ ఒక వీడియో రిలీజ్ చేయండం వివాదాన్ని రేపిన సంగతి తెలిసిందే. -
కచోరీ, జిలేబీ సూపర్: జపాన్ రాయబారి!
భారతదేశంలోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తాజాగా వారణాసిలో స్ట్రీట్ఫుడ్ టేస్ట్ చేశారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వివరాలను పంచుకున్నారు. కూరగాయలతో చేసిన కచోరీతోపాటు జిలేబీలను ఆయన ఆరగించారు. సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్లో దీనికి సంబంధించిన రెండు క్లిప్లను షేర్ చేశారు. వీడియోను పోస్ట్ చేసిన ఆయన.. ‘వారణాసిలో స్ట్రీట్ ఫుడ్ను ఆస్వాదిస్తున్నాను’అని రాశారు. కచోరీ చాలా బాగుందని, జలేబీ మరింత బ్రహ్మాండంగా ఉందంటూ కొనియాడారు. జపాన్ రాయబారికి చెందిన ఈ వీడియో వైరల్ అయ్యింది. జపాన్ రాయబారి వారణాసిని సందర్శించడం ఇదేమీ తొలిసారి కాదు. గత మే నెలలోనూ ఈ నగరాన్ని సందర్శించారు. అప్పుడు గోల్ గప్పా, బాటి చోఖా,బనారసి థాలీ లాంటి పలు వంటకాలను రుచి చూశారు. Enjoying street food in Varanasi! pic.twitter.com/xVmNvcOJuw — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 30, 2023 -
భారతీయ వంటకాలకు జపాన్ అంబాసిడర్ ఫిదా!
భారత వంటకాలను ఇష్టపడే విదేశీయలు ఎందరో ఉన్నారు. ఇప్పుడూ ఆ లిస్ట్లోకి జపాన్ వచ్చింది. సాక్షాత్తు జపాన్ అంబాసిడర్ మన భారతీయ వంటకాలను రుచి చుడటమే గాక వాటిని వండిని చెఫ్ని కూడా ప్రశంసలతో ముంచెత్తాడు. కచ్చితంగా అంతర్జాతీయ స్థాయిలో మీరు వంటకాలను ప్రదర్శించగలరని కితాబు కూడా ఇచ్చేశాడు. ఇంతకీ ఆయన రుచిన చూసిన వంటకం ఏంటీ? ఆ అదృష్టాన్ని దక్కించుకున్న చెఫ్ ఎవరంటే..? భారత్లోని జపాన్ రాయబారి హిరోషి సుజుకి తన సతీమణితో కలిసి ఢిల్లీలోని ప్రముఖ సరోజినీ నగర్ మార్కెట్ని సందర్శించారు. అక్కడ ఆలు టిక్కాను ఆస్వాదించినప్పుడూ ఈ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. దీని రుచి జపాన్ రాయబారి హిరోషికి ఎంతగానో నచ్చింది. దీంతో దాన్ని తయారు చేసిన నాగాలాండ్ చెఫ్ జోయెల్ బసుమతారిని పొగడ్తలతో ముంచెత్తాడు. అంతేగాదు అతడి చేతితో తయారు చేసిన భోజనాన్ని కూడా ఆస్వాదించాడు. చాలా రుచికరంగా ఉందని మెచ్చుకోవడమే గాక భవిష్యత్తులో మంచి పాక నిపుణుడిగా పేరొస్తుందని ప్రశంసించారు. అందుకు సంబంధించిన విషయాన్ని ట్విట్టర్లో షేర్ చేశారు. పైగా ఆ చెఫ్ని కూడా తన వంటకాల గురించి మాట్లాడమని కూడా చెప్పారు. ఆ చెఫ్ తాను భారత్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈశాన్య వంటకాలను ఎలా ప్రచారం చేయాలనుకుంటున్నారో వివరించారు. మీరు చేసిన ఈశాన్య వంటకాలు చాలా రుచిగా ఉన్నాయి. కచ్చితం మీరు ఈ విషయంలో సక్సెస్ అవుతారని మెచ్చుకున్నారు జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి . అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది చూడండి. Enjoyed wonderful dinner prepared by Nagaland’s star chef Mr. Joel Basumatari. Chef Joel promotes North Eastern cuisine around the world. Wish him great success in the future !! pic.twitter.com/FLNHWvcoex — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) December 7, 2023 (చదవండి: 'సైంటిస్ట్గా ఓ భార్యగా గెలిచింది'!..భర్త ప్రాణాలను కాపాడిన నవయుగ సావిత్రి ఆమె!) -
చైనా విదేశాంగ మంత్రి అదృశ్యం.. హత్యా? ఆత్మహత్యా?
వాషింగ్టన్: ఒకప్పుడు అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసి వెంటనే అత్యున్నత పదవి పొంది చైనా విదేశాంగ మంత్రిగా సేవలందించిన క్విన్ గాంగ్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారనే విషయంపై అంతర్జాతీయ మీడియా కొత్త అంశాలను మోసుకొచి్చంది. చివరిసారిగా జూన్ నెలలో కనిపించిన ఆయన ప్రస్తుతం జీవించి లేరని మీడియాలో వార్తలొచ్చాయి. ఆత్మహత్య చేసుకున్నారని కొన్ని పత్రికల్లో, చైనా ప్రభుత్వమే హింసించి చంపిందని మరి కొన్నింటిలో భిన్న కథనాలు వెలువడ్డాయి. ఈ ఏడాది జూన్లో చివరిసారిగా కనిపించి అప్పటి నుంచి కనిపించకుండా పోయిన క్విన్గాంగ్ ఉదంతం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. జూలై నెలలో బీజింగ్లోని మిలటరీ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారని చైనా ప్రభుత్వంలోని ఇద్దరు అత్యున్నత స్థాయి అధికారులు చెప్పినట్లు ‘పొలిటికో’ వార్తాసంస్థ ఒక కథనం వెలువరిచింది. క్విన్ అమెరికాలో చైనా రాయబారిగా కొనసాగిన కాలంలో ఆయన నెరిపిన ఒక వివాహేతర సంబంధమే ఈ అదృశ్యం ఘటనకు అసలు కారణమని గతంలో వాల్స్ట్రీట్ జర్నల్ తన కథనంలో పేర్కొంది. ఈ విషయంలో చైనా ప్రభుత్వం చేపట్టిన దర్యాప్తునకు ఆయన సహకరించారట. ‘‘అమెరికా పౌరసత్వమున్న చైనా అధికారిక ఫీనిక్స్ టీవీ మహిళా రిపోర్టర్ ఫ్యూ గ్జియోíÙయాన్తో వివాహేతర సంబంధం కారణంగా చైనా జాతీయ భద్రత ప్రమాదంలో పడిందని జిన్పింగ్ సర్కార్ బలంగా నమ్మింది. ఆ మహిళ సరోగసీ పద్ధతిలో ఒక బిడ్డకు జన్మనిచి్చంది. ఇప్పుడా తల్లీబిడ్డల ఆచూకీ సైతం గల్లంతైంది. క్విన్గాంగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుని జిన్పింగ్ వెంటనే ఆయనను జూన్లో చైనా విదేశాంగ శాఖ మంత్రి పదవి నుంచి తొలగించారు. ఆయన స్థానంలో మాజీ దౌత్యవేత్త వాంగ్ యీను పదవిలో కూర్చోబెట్టారు’’ అని ఆ కథనం పేర్కొంది. కేవలం ఆరునెలలు పదవిలో ఉన్న క్విన్గాంగ్ ఆ తర్వాత కనిపించకుండా పోయారు. 2014–2018 కాలంలో దేశాధ్యక్షుడు జిన్పింగ్కు చీఫ్ ప్రోటోకాల్ ఆఫీసర్గా పనిచేసి క్విన్ ఆయనకు అత్యంత ఆప్తుడయ్యాడు. అందుకే అత్యంత నమ్మకస్తులకు మాత్రమే దక్కే ‘అమెరికాలో చైనా రాయబారి’ పదవిని క్విన్కు జిన్పింగ్ కట్టబెట్టారు. వివాహేతర బంధమే క్విన్గాంగ్ మరణానికి కారణమన్న అంతర్జాతీయ మీడియా -
కీర్తి సురేష్: కేరళలో మహిళల క్రికెట్కు గుడ్విల్ అంబాసిడర్గా (ఫోటోలు)
-
ఇండోనేషియా రాయబారిగా ఇండో-అమెరికన్.. బైడెన్ కీలక నిర్ణయం
న్యూయార్క్: అమెరికాలో భారత సంతతి మహిళకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఇండోనేషియాలో అమెరికా రాయబారిగా భారత సంతతి మహిళ కమలా షిరిన్ లఖ్ధీర్ను అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. లఖ్ధీర్కు దాదాపు 30 సంవత్సరాలు విదేశాంగ శాఖలో పనిచేసిన అనుభవం ఉంది. ఇటీవల ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా కూడా పనిచేశారు. 2017 నుంచి 2021 వరకు మలేషియాలో అమెరికా అంబాసిడర్గా పనిచేయడానికి ముందు, ఆమె రాజకీయ వ్యవహారాల అండర్ సెక్రటరీకి ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్గా కొనసాగారు. 2009 నుంచి 2011 వరకు ఉత్తర ఐర్లాండ్లో అమెరికా కాన్సుల్ జనరల్గా ఆమె పనిచేశారు. 1991లో ఫారిన్ సర్వీస్లో చేరిన లఖ్దీర్.. సౌదీ అరేబియాలోని అమెరికా ఎంబసీలో మొదట పనిచేశారు. మారిటైమ్ ఆగ్నేయాసియా వ్యవహారాల కార్యాలయానికి డైరెక్టర్గా కూడా పనిచేశారు. ఆమె కెరీర్ ప్రారంభంలో, తూర్పు ఆసియా పసిఫిక్ వ్యవహారాల బ్యూరోలో తైవాన్ కోఆర్డినేషన్ స్టాఫ్కు డిప్యూటీ కోఆర్డినేటర్గా పనిచేశారు. భారతీయ తండ్రి, అమెరికన్ తల్లికి జన్మించిన లఖ్ధీర్.. హార్వర్డ్ కళాశాల నుంచి బీఏ, నేషనల్ వార్ కళాశాల నుంచి ఎమ్ఎస్ పట్టా పొందారు. చైనీస్, ఇండోనేషియాతో సహా పలు భాషలపై ఆమెకు పట్టు ఉంది. ఇదీ చదవండి: శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం.. భారత్తో సహా ఏడు దేశాలకు ఉచిత వీసాలు -
సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసిన మిల్కీ బ్యూటీ తమన్నా.. భారత్లోనే
ఈ భూమ్మీదచాలా మందికి అందంగా కనపడాలనే ఆశ ఉంటుంది. పురుషుల కంటే మగువల్లో ఈ అందంగా కనిపించాలనే తపన ఎక్కువగా ఉంటుంది. కురుల నిగారింపు కోసం షాంపూలు, ఆయిల్లు.. చర్మ సౌందర్యానికి సబ్బులు, లోషన్లు, మాయిశ్చరైజర్లు.. పెదాలకు లిప్ కేర్లు.. కాళ్లు చేతులకు మెహందీలు.. గోర్లకు నెయిల్ పాలిష్లు.. కనులకు, కనుబొమ్మలకు ఐ లైనర్లు.. అంటూ మహిళలు నిత్యం అందం కోసం ఆరాటపడుతుంటారు. కాబట్టే భారత్ కాస్మోటిక్ రంగం గణనీయంగా వృద్ది సాధిస్తోంది. ఇటీవల కాంటార్ వరల్డ్ ప్యానెల్ నివేదిక ప్రకారం..ఈ ఏడాది భారతీయ మహిళలు తొలి ఆరు నెలల కాలంలో లిప్స్టిక్, నెయిల్ పాలిష్ నుండి ఐలైనర్ వరకు 100 మిలియన్లకు పైగా కాస్మెటిక్ ఉత్పత్తులను కొనుగోలు చేశారు. ఫలితంగా కాస్మోటిక్ సంస్థలు రూ. 5,000 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయి. వీటిలో బ్యూటీ ప్రొడక్ట్ల కోసం మహిళలు సగటున రూ.1,214 ఖర్చు చేయగా.. దాదాపు 40 శాతం కొనుగోళ్లు ఆన్లైన్లో జరిగాయని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది. ఈ తరుణంలో అంతర్జాతీయ కాస్మోటిక్ సంస్థలు భారతీయ మహిళల్ని ఆకట్టుకునేలా స్టార్ హీరోయిన్లను తమ బ్రాండ్ ప్రచారకర్తలుగా నియమించుకుంటున్నాయి. ఇక జీ కర్దా, లస్ట్ స్టోరీస్ 2, భోళా శంకర్, జైలర్ సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించిన ముద్దుగుమ్మ మిల్కీ బ్యూటీ తమన్నాను జపాన్ కాస్మోటిక్ దిగ్గజం షిసిడో (Shiseido) భారత్ బ్రాండ్ అంబాసీడర్గా నియమించింది. షిసిడో బ్రాండ్ అంబాసీడర్గా నియాకం ఆశ్చర్యానికి గురి చేసిందన్న మిల్కిబ్యూటీ.. దాదాపూ 100 ఏళ్లకు పైగా కాస్మోటిక్ విభాగంలో అగ్రగామిగా కొనసాగుతున్న షిసిడో బ్రాండ్ అంబాసీడర్గా ఎంపికవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. కాగా, తమన్నా - షిసిడో మధ్య ఒప్పందం భారత్ ఎంటర్టైన్ మెంట్ పాటు కాస్మోటిక్ రంగంలో రాణించేందుకు దోహదం చేస్తుందని షిసిడో యాజమాన్యం భావిస్తుంది. -
WC 2023: టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ చేతుల మీదుగా..(ఫొటోలు)
-
క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్కు అరుదైన గౌరవం
క్రికెట్ దిగ్గజం, భారతరత్న సచిన్ టెండూల్కర్కు అరుదైన గౌరవం దక్కింది. మరో రెండు రోజుల్లో ప్రారంభంకానున్న పురుషుల వన్డే ప్రపంచకప్ 2023కు గ్లోబల్ అంబాసిడర్గా సచిన్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ కొద్దిసేపటి కిందట ప్రకటించింది. గ్లోబల్ అంబాసిడర్గా హోదాలో సచిన్ అక్టోబర్ 5న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే వరల్డ్కప్ ప్రారంభ మ్యాచ్కు ముందు ప్రపంచ కప్ ట్రోఫీతో పాటు మైదానంలోకి వస్తాడు. ఈ సందర్భంగా సచిన్ వరల్డ్కప్ ప్రారంభాన్ని అధికారికంగా ప్రకటిస్తాడు. ఐసీసీ ప్రకటించిన వరల్డ్కప్ ఐసీసీ అంబాసిడర్ల జాబితాలో విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, సౌతాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్, ఇంగ్లండ్ వరల్డ్కప్ విన్నింగ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆస్ట్రేలియా మాజీ సారథి అరోన్ ఫించ్, శ్రీలంక స్పిన్ గ్రేట్ ముత్తయ్య మురళీథరన్, న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ రాస్ టేలర్, టీమిండియా మాజీ స్టార్ బ్యాటర్ సురేశ్ రైనా, భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ సారథి మిథాలీ రాజ్, పాకిస్తాన్ ఆల్రౌండర్ మొహమ్మద్ హఫీజ్ ఉన్నారు. -
అమెరికాలో వివాహేతర సంబంధం.. అందుకే పదవి ఊడింది..
న్యూయార్క్: చైనా మాజీ విదేశాంగ మంత్రి క్విన్ గ్యాంగ్ అమెరికా రాయబారిగా పనిచేస్తున్న కాలంలో వివాహేతర సంబంధాన్ని కొనసాగించారని చైనా దర్యాప్తులో తేలినట్లు వాల్స్ట్రీట్ జర్నల్ వెల్లడించింది. ఈ కారణంగానే చైనా ఆయన్ను పదవి నుంచి తొలగించినట్లు స్పష్టం చేసింది. క్విన్ గ్యాంగ్ వివాహేతర సంబంధంతో అమెరికాలో ఓ బిడ్డకు తండ్రి అయ్యాడని వాల్ స్ట్రీట్ పేర్కొంది. అమెరికాలో వివాహేతర సంబంధంతో ఓ బిడ్డకు క్విన్ గ్యాంగ్ తండ్రి అయ్యాడని ఆయన సన్నిహితులు వెల్లడించారు. అయితే.. ఈ వ్యవహారంలో క్విన్ గ్యాంగ్ దేశ భద్రతను పణంగా పెట్టారా..?లేదా..? అనే అంశంపై చైనా దర్యాప్తు చేపట్టింది. ఇప్పటికే చైనా, అమెరికాల మధ్య ఆర్థిక, రాజకీయ, భౌగోళిక పరమైన పోటీ నడుస్తున్న క్రమంలో ఈ అంశం చైనాకు పెను సవాలుగా మారింది. క్విన్ గ్యాంగ్ను నియమించిన ఏడు నెలలకే చైనా అయన్ని పదవి నుంచి తొలగించింది. ఇంత తక్కువ సమయంలో పదవి నుంచి తొలగించడానికి గల కారణాలను కూడా చైనా ప్రభుత్వం వెల్లడించలేదు. ఇలాంటి అస్థిరమైన నిర్ణయాలతో జిన్పింగ్ ప్రభుత్వం కూడుకుని ఉందని వాల్స్ట్రీట్ పేర్కొంది. చైనా ప్రభుత్వంలోని ఉన్నతాధికారులకు విదేశాల్లో ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే కోణంలోను దర్యాప్తులు జరుగుతున్నట్లు వెల్లడించింది. ఇదీ చదవండి: భారత్పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే! -
గ్రీన్ప్లై బ్రాండ్ అంబాసిడర్గా జూనియర్ ఎన్టీఆర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హానికారక ఉద్గారాలను తగ్గించే జీరో ఎమిషన్ ప్లైవుడ్ ఉత్పత్తులకు ప్రచారకర్తగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ను నియమించుకున్నట్లు గ్రీన్ప్లై ఇండస్ట్రీస్ (జీఐఎల్) సీఈవో మనోజ్ తుల్సియాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో కొత్త వాణిజ్య ప్రచార ప్రకటనలను రూపొందించినట్లు చెప్పారు. ప్రస్తుతం దేశీయంగా ప్లైవుడ్ పరిశ్రమ 4.5 బిలియన్ డాలర్ల స్థాయిలో ఉండగా, అందులో సంఘటిత రంగం వాటా 30 శాతం వరకు ఉంటుందని సోమవారమిక్కడ విలేకరుల సమావేశంలో తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో తమ ఆదాయం రూ. 1,800 కోట్లుగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,200 కోట్ల వరకు అంచనా వేస్తున్నట్లు మనోజ్ చెప్పారు. ప్రస్తుతం తమకు గుజరాత్, ఉత్తర్ప్రదేశ్లో ఎండీఎఫ్, ప్లైవుడ్ తయారీ ప్లాంట్లు ఉన్నాయని తెలిపారు. టర్కీకి చెందిన సంస్థతో జాయింట్ వెంచర్గా ఏర్పాటు చేస్తున్న ప్లాంటు వచ్చే ఏడాది వ్యవధిలో అందుబాటులోకి రాగలదని మనోజ్ చెప్పారు. -
అమ్మవారిని దర్శించుకున్న 'మాజీ మిస్ ఇండియా'..!
ఆదిలాబాద్: మాజీ మిస్ ఇండియా, తెలంగాణ ఐటీ హబ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాగూర్ బుధవారం కుటుంబసమేతంగా బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు, అధికారులు ఆలయ మర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. తీర్థ ప్రసాదాలు అందజేసి, అమ్మవారి శేష వస్త్రంతో ఆశీర్వచనాలు అందజేశారు. -
'జైలర్' సినిమా.. జపాన్ ఫ్యాన్స్ రచ్చ ఓ రేంజులో!
రజనీకాంత్ ‘జైలర్’ రిలీజ్ సందర్భంగా మన దేశంలో ఉన్న జపాన్ అంబాసిడర్ రజనీలా స్టయిల్గా కళ్లద్దాలు ధరించి ‘బెస్ట్ విషెస్’ చెప్పాడు. ఇక ‘ముత్తు’ నాటి నుంచి రజనీకి ఫ్యాన్స్గా ఉన్న ఒక జంట ఏకంగా జపాన్ నుంచి చెన్నైకి వచ్చింది సినిమా చూడటానికి!రజనీ హవా అలా ఉంది. ‘హుకుమ్... టైగర్ కా హుకుమ్’ అని రజనీకాంత్ చెప్పిన డైలాగ్ సినిమా హాల్లో విజిల్స్ను మోతెక్కిస్తోంది. ప్రపంచాన్ని ఇప్పుడు రజనీ చుట్టుముట్టి ఉన్నాడు– జైలర్ సినిమాతో. అసలే రజనీ అనుకుంటే అతనికి తోడు మోహన్లాల్, జాకీష్రాఫ్, శివ రాజ్కుమార్ కూడా సినిమాలో ఉండేసరికి మాస్ ఆడియెన్స్ పోటెత్తుతున్నారు. అయితే ఈ సంబరంలో ఇండియన్స్ మాత్రమే లేరు... జపనీయులు కూడా ఉన్నారు. ‘ముత్తు’ కాలం నుంచి ఇండియాలో రజనీ ఎంతో జపాన్లో కూడా అంతే. అంత ఫాలోయింగ్ ఉంది అక్కడ. అందుకే ఇండియాలో ఉన్న జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకీ ఒక వీడియో రిలీజ్ చేసి అందులో రజనీలా స్టయిల్గా కళ్లద్దాలు ధరించి ‘రజనీ యూ ఆర్ జస్ట్ సూపర్.. విష్ యూ గ్రేట్ సక్సెస్’ అని చెప్పాడు. ఇలాంటి మర్యాద ఏ స్టార్కూ దక్కలేదు. ఇక జపాన్లోని ఒకాసా నుంచి యసుదా హిదెతోషి అనే ఆసామి తన భార్యతో ఏకంగా చెన్నైలో ల్యాండ్ అయ్యాడు ‘జైలర్’ చూసేందుకు. అతను జపాన్లో ఆల్ జపాన్ రజనీ ఫ్యాన్స్ అసోసియేషన్ లీడర్ అట. నెల్సన్ డైరెక్ట్ చేసిన ‘జైలర్’ ప్రస్తుతం కలెక్షన్ల హవా సృష్టిస్తోంది. -
ఎందరో సహకారంతో ఈ స్థాయికి చేరా: దినేష్ కార్తిక్
సాక్షి, చైన్నె: తన క్రికెట్ పయనంలో ఎందరో సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరినట్టు క్రికెటర్, స్టైలిష్ వికెట్ కీపర్ దినేష్ కార్తిక్ తెలిపారు. పరిమ్యాచ్ స్పోర్ట్స్ అంబాసిడర్గా ఆయన నియమితులయ్యారు. శనివారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో దినేష్ కార్తిక్ స్ఫూర్తితో కొత్త స్పోర్ట్స్ వేర్ లైన్ను పరిమ్యాచ్ స్పోర్ట్స్ ప్రారంభించింది. ఈ సందర్భంగా తన క్రికెట్ పయనం, పరిమ్యాచ్ స్పోర్ట్స్, ఐపీఎల్ అనుభవాలను గురించి దినేష్ కార్తిక్ మీడియాకు వివరించారు. పరిమ్యాచ్ స్పోర్ట్స్ అనేది అసమానమైన శైలి, అసాధారణమైన సౌలభ్యం, బలమైన విజేత స్ఫూర్తిని సూచించే బ్రాండ్గా వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్న తనం నుంచి ఎన్నో ఆశలు ఉండేవని, ఇవి ప్రస్తుతం సాకారం అవుతున్నట్టు వివరించారు. ఎందరో సహకారంతో తాను ఈ స్థాయికి చేరానని తెలిపారు. తన బ్యాట్, జెర్సీ, క్యాప్, ఇలా అన్నింటా ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ముందుకెళుతున్నట్టు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే తాను ఈ వ్యవహారంలో నడుచుకుంటానని వ్యాఖ్యానించారు. -
జపాన్ జంట మెచ్చిన వంట.. ప్రధాని ట్వీట్ వైరల్
పూణే: భారతదేశంలోని జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి తన భార్యతో కలిసి పూణే వీధుల్లో విహరించి అక్కడి వీధుల్లో వడాపావ్, మిసాల్ పావ్ తిన్నారు. ఆ రుచికి ఫిదా అయిపోయిన సుజుకి ట్విట్టర్లో నాకు భారతీయ స్ట్రీట్ ఫుడ్ అంటే చాలా ఇష్టం.. కానీ పోటీలో నా భార్య నన్ను ఓడించింది. చాలామంది మిసాల్ పావ్ తినమని నన్ను రికమెండ్ చేశారు. చాలా రుచిగా ఉంది కానీ కొద్దిగా ఘాటు తగ్గించాలని రాసి వీడియోని కూడా జతపరిచారు. దీనికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ తనదైన శైలిలో చమత్కరించారు. జపాన్ రాయబారి చేసిన ట్వీట్ కు సమాధానమిస్తూ ప్రధాని.. ఓడిపోయినా పర్వాలేదనిపించే పోటీ ఏదైనా ఉందంటే, అది ఇదొక్కటే.. అంబాసిడర్ గారు. భారతదేశ పాక వైవిధ్యాన్ని ఆస్వాదిస్తూ, దాన్ని వినూత్న రీతిలో ప్రచారం చేస్తున్నందుకు సంతోషం. మరిన్ని వీడియోలు చెయ్యండి. అని రాశారు. భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా భారీ సంఖ్యలోనే అభిమానులున్నారు. అందులోనూ వడాపావ్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామందే ఉన్నారు. వారిలో ఇప్పుడు జపాన్ అంబాసిడర్ హిరోషి సుజుకి జంట కూడా చేరిపోయారు. I love street food of India🇮🇳 ...but thoda teekha kam please!🌶️#Pune #Maharashtra #VadaPav pic.twitter.com/3GurNcwVyV — Hiroshi Suzuki, Ambassador of Japan (@HiroSuzukiAmbJP) June 9, 2023 This is one contest you may not mind losing, Mr. Ambassador. Good to see you enjoying India’s culinary diversity and also presenting it in such an innovative manner. Keep the videos coming! https://t.co/TSwXqH1BYJ — Narendra Modi (@narendramodi) June 11, 2023 ఇది కూడా చదవండి: అలిగిన అజిత్ పవార్.. మరోసారి అసంతృప్తి? -
సీఎం జగన్తో యూఏఈ రాయబారి సమావేశం.. ఏపీలో పెట్టుబడులపై చర్చ
సాక్షి, తాడేపల్లి: క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ను కలిశారు భారత్లో యూఏఈ రాయబారి అబ్ధుల్ నాసర్ అల్షాలి. ఏపీలో పెట్టుబడులు, అవకాశాలపై చర్చించారు. ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికైనా సిద్దంగా ఉన్నామని అబ్దుల్ నాసర్కు సీఎం హామీ ఇచ్చారు. రాష్ట్రంలో పారిశ్రామికంగా అనుసరిస్తున్న పారదర్శక విధానాలను యూఏఈ రాయబారికి సీఎం వివరించారు. సుశిక్షితులైన మానవ వనరులు, మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఫుడ్ పార్క్లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, టూరిజం, హాస్పిటాలిటీ, గ్రీన్ హైడ్రోజన్, పోర్ట్లు, పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు, మౌలిక సదుపాయాల కల్పన వంటి వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్దంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి యూఏఈ రాయబారి తెలిపారు. ఏపీని పెట్టుబడులకు లీడ్ స్టేట్గా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే పెట్టుబడుల సదస్సులో చర్చించిన అంశాలపై మున్ముందు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చ జరిగింది. ఈ భేటీలో సీఎం స్పెషల్ సీఎస్ డాక్టర్ పూనం మాలకొండయ్య, యూఏఈ రాయబార కార్యాలయ అధికారులు పాల్గొన్నారు. చదవండి: గర్వంగా ఉంది: సాత్విక్- చిరాగ్లకు సీఎం జగన్ అభినందనలు -
విజయ్ దేవరకొండ ఖాతాలో మరో కంపెనీ
హైదరాబాద్: టీఎంటీ బార్ల తయారీలోని శ్యామ్ స్టీల్ నటుడు విజయ్దేవరకొండతో కలసి నూతన డిజిటల్ ప్రచారాన్ని ప్రారంభించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బ్రాండ్ అంబాసిడర్గా విజయ్ దేవరకొండ వ్యవహరించనున్నారు. టెలివిజన్ ప్రచార చిత్రాన్ని ఇగ్నిషన్ ఫిల్మ్స్కు చెందిన రెన్సిల్ డిసిల్వ, పార్థో సర్కార్ దర్శకత్వం వహించనున్నారు. ఈ టెలివిజన్ ప్రచారం ద్వారా ఏపీ, తెలంగాణలో కస్టమర్లకు తన ఉత్పత్తులను మరింత చేరువ చేయాలన్నది శ్యామ్ స్టీల్ ప్రణాళికగా ఉంది. -
1964లో అంబాసిడర్ ధర అంతేనా? వైరల్ అవుతున్న ఫోటోలు!
మనం కంప్యూటర్ యుగంలో జీవిస్తున్నప్పటికీ అంబాసిడర్ వంటి అద్భుతమైన కార్లను ఎవ్వరూ మరచిపోలేరు. ఎందుకంటే ఒకప్పుడు భారతీయ మార్కెట్లో తిరుగులేని ఖ్యాతిని పొందిన ఈ బ్రాండ్ కారు ఇప్పుడు మార్కెట్లో విక్రయానికి లేనప్పటికీ, అప్పుడప్పుడూ రోడ్లమీద కనిపిస్తూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాలను ముందు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు మొదలైనవారు ఈ కార్లను తెగ ఉపయోగించారు. అంతే కాకుండా అప్పట్లో రాయల సీమలో ఈ కార్లను ఉన్న క్రేజు అంతా ఇంతా కాదు. అయితే ఆ రోజుల్లో అంబాసిడర్ కారు ధర ఎంత అనే విషయాన్నీ ఈ కథనంలో చదివేద్దాం. 1964లో అంబాసిడర్ కారు ధర ఎంత అనేదానికి సంబంధించిన ఒక ఇన్ వాయిస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో దీని ధర కేవలం రూ. 16,495 కావడం గమనార్హం. వినటానికి కొంత వింతగా ఉన్నా.. అప్పట్లో ఈ కారు ధర అంతే అనటానికి కొన్ని ఆధారాలు కూడా అందుబాటులో ఉన్నాయి. 1990 దశకంలో ఒక మెరుపు మెరిసిన అంబాసిడర్ కార్లను 1957లో హిందూస్థాన్ మోటార్స్ రిలీజ్ చేసింది. ఆ తరువాత మారుతి కార్లు మార్కెట్లో విడుదలకావడం వల్ల వీటి ఆదరణ కొంత తగ్గింది, అయినప్పటికీ కొంత మంది అంబాసిడర్ అభిమానులు వీటిని కొనుగోలు చేస్తూనే ఉన్నారు. క్రమంగా వీటి అమ్మకాలు తగ్గడం వల్ల 2014లో వీటి ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. (ఇదీ చదవండి: Odysse EV Bike: ఒక్క ఛార్జ్తో 125 కిమీ రేంజ్.. రూ. 999తో బుక్ చేసుకోండి!) ఇక తాజాగా బయటపడిన అంబాసిడర్ కార్ ఇన్వాయిస్ బిల్ ప్రకారం, ఇది 1964లో మద్రాసు గుప్తాస్ స్టేట్స్ హోటల్ అంబాసిడర్ కార్ ను కొన్నట్లుగా తెలుస్తోంది. దీని ధర అప్పుడు రూ. 16.495 మాత్రమే. దీనిని రిలయన్స్ మోటార్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ జారీ చేసింది. ఇందులో అకౌంటంట్, బ్రాంచ్ మేనేజర్ సంతకాలు కూడా చూడవచ్చు. -
భారత్ నాటోలో చేరనుందా? యూఎస్ నాటో రాయబారి షాకింగ్ వ్యాఖ్యలు
భారత్తో సంబంధాల కోసం నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో) తలుపులు తెరిచే ఉంచింది అని నాటోలోని యూఎస్ శాశ్వత ప్రతినిధి జూలియన్నే స్మిత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అలాగే భారత్తో సాన్నిహిత్యంగా ఉండటం తమకు చాలా సంతోషంగా అనిపిస్తుందన్నారు. అంతేగాదు భారత్ కోరుకుంటే ఏ సమయంలోనైనా దీని గురించి చర్చిండానికి నాటో సిద్ధంగా ఉందని కూడా స్మిత్ చెప్పారు. దీంతో ఒకరకంగా నాటోలో భారత్ చేరేలా యూఎస్ ప్రత్యక్ష సంకేతాలిస్తునట్లుగా ఉంది. ఈ మేరకు భారత్, యూఎస్ల మధ్య సన్నిహిత సంబంధాలు గురించి మాట్లాడుతూ..రెండు దేశాల మధ్య భాగస్వామ్యం అత్యంత దృఢంగా ఉన్నాయని చెప్పారు. ఇరు పక్షాలు ప్రజాస్వామ్యం, నియమాల ఆధారిత క్రమం, వాతావరణ మార్పు, హైబ్రిడ్ బెదిరింపులు, సైబర్ భద్రత, సాంకేతికత, విఘాతం కలిగించడం తదితర అంశాలపై కలిసి పనిచేయడంపై నిమగ్నమయ్యాయని అన్నారు. సోవియట్ యూనియన్ కోసం ఏర్పడ్డ నాటో తొలిసారిగా ఇండో పసిఫిక్తో తన విస్తరణను పెంచుకుందని తెలిపారు. అలాగే చైనాను నాటో వ్యవస్థాగత సవాలుగా గుర్తించిందని చెప్పారు. అయితే ఆయా ప్రాంతాలలోని భాగస్వామ్యుల వ్యూహాత్మక విధానాల తోపాటు ముఖ్యంగా చైనా దూకుడు విధానానికి సంబంధించి వ్యూహాల గురించి తెలుసుకునేందుకు నాటో ఆసక్తి కనబరుస్తున్నట్లు వెల్లడించారు. అలాగే నాలుగు ఇడో పసిఫిక్ దేశాలు జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, లిథువేనియాలో జరగనున్న అత్యున్నత స్థాయి నాటో సమావేశానికి ఆహ్వానం అందినట్లు ఆమె తెలిపారు. ఈ దేశాలతో తమ భాగస్వామ్యం మరింతగా అభివృద్ధి చెందుతుంది. మొత్తం మీద నాటో ఏ ఇండో పసిఫిక్ దేశంతోనూ పొత్తుల పెట్టుకునే యోచన చేయడం లేదని, పైగా విస్తృత కూటమిగా విస్తరించే ఆలోచన కూడా లేదని కూడా స్పష్టం చేశారు. ఈ మేరకు ఉక్రెయిన్ యుద్ధం గురించి మాట్లాడుతూ..రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కేవలం ఒక్క రోజులో యుద్ధాన్ని ముగించగలరని అన్నారు. పశ్చిమ దేశాలు కేవలం ఉక్రెయిన్కు అవసరమైన వాటిని అందించడమే కాకుండా భవిష్యత్తులో రష్యన్లు చేసిన పనిని ఇతర దేశాలు చేసే ప్రమాదం ఉందని స్మిత్ హెచ్చరించారు. అలాగే ఈ యుద్ధంలో ఉక్రెయిన్కి భారత్ అందించిన మానవతా సాయాన్ని నాటో ప్రశంసించింది. యుద్ధాన్ని ముగించాలని పిలుపునివ్వడమే గాక ఇతర దేశాల యూఎన్ నిబంధనలకు కట్టుబడి ఉందన్నారు. ఏదీఏమైనా ఈ ఉక్రెయిన్ యుద్ధం అన్ని దేశాలను ఏకతాటిపైకి తెచ్చిందని స్మిత్ అన్నారు. ఈ యుద్ధంలో రష్యా గనుక అణ్వాయుధాలను ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని గట్టిగా హెచ్చరించారు. దీని గురించి నాటో నిఘా ఉంచినట్లు కూడా యూఎస్ నాటో ప్రతినిధి స్మిత్ వెల్లడించారు. (చదవండి: పంజాబ్ సీఎం కూతురు సహా.. విదేశాల్లోని భారతీయ విద్యార్థులకు ఖలీస్తానీ గ్రూపుల బెదిరింపులు) -
నాటు నాటు పాటకి జర్మన్ అంబాసిడర్ స్టెప్పులు..వీడియో వైరల్
నాటు నాటు పాట యావత్ దేశాన్ని ఊర్రూతలు ఊగించడమే గాక ప్రపంచ దేశాల ప్రజల చేత కూడా స్పెప్పులు వేయించింది. ఆ పాటకు వచ్చిన క్రేజ్ మాములుగా లేదు. అందుకు తగ్గట్టుగానే రాజమైళి దర్శకత్వం వహించిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని ఈ నాటు నాటు పాట ఆస్కార్ అవార్డుతో గొప్ప విజయాన్ని దక్కించుకుంది. దీంతో యావత్తు భారతదేశం సంతోషంతో సంబరాలు జరపుకుంది. అంతేగాదు అందులోనూ ఒక తెలుగ సినిమాకు తొలిసారిగా దక్కడం అంబరాన్నంటేలా సంబరాలు జరుపుకుంది భారత్. ఐతే ఇప్పుడూ పాట దేశ రాయబారుల చేత కూడ స్పెప్పులు వేయిచింది. ఈ మేరకు భారత్లోని జర్మన్ రాయబారి డాక్టర్ ఫిలిఫ్ అకెర్మాన్ ఓల్డ్ ఢిల్లీలోని తన బృందంతో కలిసి డాన్య్లు చేసి ఆ విజయాన్ని వారు కూడా సెలబ్రేట్ చేసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోను నెటిజన్లతో పంచుకున్నారు కూడా.ఆ వీడియోలో జర్మన్ రాయబారి చాందినీ రిక్షాలో దిగుతూ.. ఒక దుకాణదారుని వద్దకు వచ్చాడు. అతను అక్కడ బాగా ఫేమస్ అయిన జిలేబితో పాటు దక్షిణ కొరియ జెండా తోపాటు నాటు నాటు పాట ముద్రించిన లాఠీని అందిస్తాడు. ఆ తర్వాత అకెర్మాన్ తన బృందంతో రహదారిపై నాటు నాటు పాటకు డ్యాన్స్లు చేస్తూ కనిపించారు. ఆ వీడియోలో వారిని ఉత్సాహపరిచేలా చుట్టూ పెద్ద సంఖ్యలో ప్రజలు కూడా గుమిగూడారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా.. జర్మన్లు డ్యాన్సులు చేయలేరనుకుంటున్నారా? అని అన్నారు.పైగా తాను తన ఇండో బృందంతో ఆస్కార్ అవార్డుని గెలుచుకున్న నాటు నాటు విజయాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఐతే అంత పరెఫెక్ట్గా రాలేదు కానీ ఏదో సరదాగా ఇలా చేశాం అని ట్వీట్ చేశారు. అంతేగాదు ఆయన ట్విట్టర్లో మాకు స్ఫూర్తినిచ్చిన భారత్లోని కొరియన్ ఎబసీకి ధన్యావాదాలు. అలాగే ఆర్ఆర్ఆర్ మూవీ బృందానికి అభినందనలు. ఐతే ఇప్పుడూ నెక్స్ట్ ఎవరూ? అంటూ ఎంబసీ ఛాలెంజ్ విసురుతుంది. అని అన్నారు. కాగా, ఇంతకు మునుపు కొరియా రాయబారి చాంగ్ జే బోక్ తన సిబ్బందితో కలిసి ఈ పాటకు డ్యాన్స్ చేశారు. ఐతే నెటిజన్లు ఈ వీడియను చూసి..వావ్ చాల బాగా చేసింది బృందం అంటూ జర్నన్ రాయబారిని మెచ్చుకుంటూ ట్వీట్ చేశారు. ఈ వీడియోపై భారత్లోని బ్రిటీష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ కూడా స్పందిస్తూ చాలా బాగుందని తెగ మెచ్చుకున్నారు. Germans can't dance? Me & my Indo-German team celebrated #NaatuNaatu’s victory at #Oscar95 in Old Delhi. Ok, far from perfect. But fun! Thanks @rokEmbIndia for inspiring us. Congratulations & welcome back @alwaysRamCharan & @RRRMovie team! #embassychallange is open. Who's next? pic.twitter.com/uthQq9Ez3V — Dr Philipp Ackermann (@AmbAckermann) March 18, 2023 (చదవండి: చైనాతో పరిస్థితి డేంజర్గానే ఉంది! జైశంకర్) -
గార్సెటీ సాధించేదేమిటి?
దౌత్యం గురించీ, దౌత్యవేత్తల గురించీ వ్యంగ్య వ్యాఖ్యలు ఎంతగా ప్రచారంలో ఉన్నా దేశాల మధ్య సంబంధాల్లో దౌత్యవేత్త పోషించే పాత్ర అత్యంత విలువైనది. అలా చూస్తే అమెరికా వంటి అగ్ర రాజ్యానికి మన దేశంలో గత 26 నెలలుగా పూర్తికాలం పనిచేసే రాయబారి లేరంటే ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని అవరోధాలూ అధిగమించి ఎరిక్ గార్సెటీ ఎట్టకేలకు ఈ పదవి స్వీకరించ బోతున్నారు. ఆయన విషయంలో సెనేట్లో అధికార, విపక్షాలమధ్య ఏకాభిప్రాయం కుదరక పోవటమే ఇంత జాప్యం చోటుచేసుకోవటానికి కారణం. సుదీర్ఘమైన ఈ ప్రక్రియ పొడవునా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పట్టుదలగా వ్యవహరించటం గార్సెటీకి కలిసొచ్చింది. స్వపక్షమైన డెమాక్రాటిక్ పార్టీనుంచి ముగ్గురు కట్టుదాటినా రిపబ్లికన్ పార్టీనుంచి ఏడుగురు ఆసరాగా నిలవడంతో 52–42 తేడాతో గార్సెటీ ఎంపిక ఆమోదం పొందింది. బైడెన్ తన మొండిపట్టు ద్వారా సెనేట్కు ఒక సందేశం పంపారు. తన ఎంపిక ఆమోదం పొందేవరకూ ఎంతకాలమైనా ఆ స్థానాన్ని ఖాళీగా ఉంచుతాన న్నది దాని సారాంశం. అమెరికాలో కీలక పదవుల ఎంపికంతా మనకు భిన్నం. అధికార పక్షం ఎంపిక చేసినవారిపై బహిరంగంగా చర్చ జరగటం, రకరకాల అభిప్రాయాలు వ్యక్తం కావటం సర్వసాధారణం. వచ్చిన ఆరోపణలకు అభ్యర్థి సంతృప్తికరంగా సమాధానాలివ్వలేకపోతే ఆ ఎంపిక వీగిపోతుంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా ఒకటే...రాయబారి అయినా ఒకటే. గార్సెటీపై వ్యక్తిగతంగా నేరుగా ఆరోపణలు లేవు. కానీ గతంలో ఒక పదవిలో ఉండగా తన సహాయకుడిగా ఉన్న వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఫిర్యాదు వచ్చినా దాన్ని ఆయన పట్టించుకోలేదన్నది ఆ ఆరోపణల సారాంశం. అప్పట్లో ఆ సంగతి తనకు తెలియనే తెలియదని గార్సెటీ వివరణనిచ్చారు. ఆయన గతంలో లాస్ ఏంజెలిస్ మేయర్గా పనిచేశారు. ఇప్పుడున్న అంతర్జాతీయ పరిస్థితుల్లో రాగల రోజులు దౌత్యపరంగా ఎంతో కీలకమైనవి. చైనాను కట్టడి చేయటం కోసం అమెరికా రూపకల్పన చేసిన ఇండో పసిఫిక్ దేశాల కూటమి క్వాడ్లో మన పాత్ర ప్రధానమైనది. ఒకపక్క ఉక్రెయిన్లో రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం రోజురోజుకూ ముదురుతోంది. అక్కడ ఏ క్షణంలో ఏమవుతుందోనన్న ఉత్కంఠ అందరిలోనూఉంది. రష్యానుంచి ముడి చమురుతోసహా దేన్నీ కొనుగోలు చేయొద్దని అమెరికా కోరినా మన దేశం దాన్ని పాటించటం లేదు. దీర్ఘకాల మిత్రదేశమైన రష్యాను కాదనటం మనకంత సులభమేమీ కాదు. రష్యాను ఆర్థికంగా కట్టడి చేయాలన్న అమెరికాకు ఇది మింగుడుపడటం లేదు. భారత్ను తన దారికి తెచ్చుకోవటం ఎలాగన్నదే దాని ఆత్రుత. గార్సెటీ రాయబారిగా ఉంటే ఇది సులభమవుతుందని ఆ దేశం భావిస్తోంది. అదీగాక ఈ వేసవిలో ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటించబోతున్నారు. అలాగే సెప్టెంబర్లో ఇక్కడ జరగబోయే జీ–20 శిఖరాగ్ర సదస్సుకు బైడెన్ హాజరవుతున్నారు. ఇలాంటి తరుణంలో రాయబారి పదవి ఖాళీగా ఉండటం అమెరికా ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తుంది. వాస్తవానికి గార్సెటీకి దౌత్యరంగంలో పెద్దగా అనుభవం, నిపుణత లేవు. భారత్ వంటి కీలక దేశానికి అటువంటి వ్యక్తిని పంపటం సరైందికాదన్న విమర్శలు రిపబ్లికన్ శిబిరం నుంచి వినిపించాయి. అయితే బైడెన్కు ఆయన అత్యంత విశ్వసనీయుడు. ఉపాధ్యక్ష పదవికి పార్టీ అభ్యర్థిగా కమలా హారిస్ను ఎంపిక చేసిన కమిటీకి నేతృత్వంవహించింది గార్సెటీయే. ఆ ఎంపిక అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ ఘన విజయం సాధించటానికి బాటలు పరిచిందని చెప్పాలి. రాయబారిగా తన ప్రాధాన్యతలేమిటో 2021 డిసెంబర్లోనే సెనేట్ ముందు గార్సెటీ వివరించారు. ఇతర దేశాలతో పోలిస్తే అమెరికా భద్రతకూ, కలిమికీ భారత్ తోడ్పాటు ఎంతో అవసరమని, దాన్ని తాను సాధించగలనని హామీ ఇచ్చారు. ఇండో పసిఫిక్ ప్రాంతం స్వేచ్ఛాయుతంగా ఉండాలన్న అమెరికా భావనతో భారత్కు ఏకీభావం ఉన్నదని, ఈ విషయంలో ద్వైపాక్షిక సంబంధాలు దృఢతరం కావటానికి అవసరమైన చొరవ తీసుకుంటానని గార్సెటీ వివరించారు. అలాగే భారత్కు బలమైన పొరుగుదేశంనుంచి ముప్పు ఉన్నందున దానికి అమెరికా అండగా నిలవటం ముఖ్యమని, ఈ విషయంలో తాను గట్టిగా కృషి చేస్తానన్నారు. పైగా 1990లో భారత్ పర్యటన తర్వాత హిందీ, ఉర్దూ అధ్యయనం చేయటం, ఇక్కడి సాంస్కృతిక, మత సంబంధ చరిత్ర గురించిన అవగాహన పెంచుకోవటం గార్సెటీకి అనుకూలాంశాలు. అమెరికాలో 40 లక్షలమంది భారతీయు లున్నారు. రెండు లక్షలమంది అమెరికా విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్నారు. మరిన్ని లక్షల మంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల ప్రజల మధ్యా సాన్నిహిత్యం అవసరమని, దాన్ని తాను సాధించగలనని హామీ ఇచ్చారు. వీటితోపాటు మానవహక్కుల్ని గౌరవించటం, పటిష్ట ప్రజాస్వామిక సంస్థలు ఇరు దేశాల సంబంధాల్లో కీలకాంశాలని, భారత్తో వీటిపై తరచు చర్చిస్తానని కూడా చెప్పారు. ఇది సహజంగానే వివాదాస్పదం కావొచ్చు. ఈ పరిధిలోకి వచ్చే అంశాలేమిటో ఆయన చెప్పకపోయినా 370వ అధికరణ, నిఘా సంస్థల వ్యవహార శైలివంటివి అందులో భాగం కావొచ్చునన్న అనుమానాలున్నాయి. అదే జరిగితే మోదీ సర్కారు మౌనంగా ఏమీ ఉండకపోవచ్చు. కనుక బాధ్యతల నిర్వహణ గార్సెటీకి అంత సులభమేమీ కాదనే చెప్పాలి. ఏదేమైనా అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడైన వ్యక్తి మన దేశానికి రాయబారిగా రావటం శుభసూచకం. ఇప్పుడున్న ద్వైపాక్షిక సంబంధాలు మరింత ఉన్నత స్థితికి చేరుకోవటానికి దోహద పడగల పరిణామం.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ఓటెత్తిన జనం!
వెనుదిరిగిన ఓటర్లు
సీపీ సుడిగాలి పర్యటన
ఓటేసిన ప్రముఖులు
● ఈవీఎంల్లో అభ్యర్థుల భవితవ్యం ● ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ● జిల్లాలో 66.53శాతం ఓటింగ్ నమోదు ● అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే తగ్గిన ఓటింగ్
లెక్కలేస్తున్న అభ్యర్థులు
సంతోషంగా ఉంది
ప్రశాంత వాతావరణంలో పోలింగ్
తొలిసారి ఓటేసిన యువత
ఓటేసిన ట్రాన్స్జెండర్లు
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- పచ్చ ముఠాల విధ్వంస కాండ
Advertisement