-
అనపర్తిలో అయోమయం
సాక్షి, రాజమహేంద్రవరం: అనపర్తి అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి వ్యవహారం రోజురోజుకూ ఉత్కంఠ రేపుతోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై ముగింపు దశకు చేరుకుంటున్నా ఎన్నికల బరిలోకి ఎవరు దిగుతారనే విషయంపై సస్పెన్స్ వీడటం లేదు. ఫలితంగా బీజేపీ, టీడీపీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా సీటు తమకంటే తమకంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ పరిణామం ఆయా పార్టీల శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరి స్వప్రయోజనాల కోసం, మరిది చంద్రబాబుకు మంచి చేసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నాల్లో టీడీపీ, బీజేపీ నేతలు నలిగిపోతున్నారు. చంద్రబాబు వ్యూహంతో.. అనపర్తి అభ్యరి్థగా మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును టీడీపీ తొలుత ప్రకటించింది. అనంతరం కుదిరిన పొత్తుల్లో ఈ సీటును బీజేపీకి వదిలేసింది. దీంతో హతాశులైన నల్లమిల్లి వర్గీయులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేశారు. చంద్రబాబు దిగి రాకపోవడంతో రామకృష్ణారెడ్డి రెబల్గా బరిలోకి దిగి, ప్రచారం చేసుకుంటున్నారు. ఈలోగా ఇక్కడ బీజేపీ అభ్యరి్థగా మాజీ సైనికుడు ములగపాటి శివరామ కృష్ణంరాజు పేరును ఆ పార్టీ ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన విపక్ష కూటమి అభ్యరి్థగా బీజేపీతో పాటు టీడీపీ, జనసేన కండువాలు వేసుకుని ప్రచారం చేసుకుంటూంటే టీడీపీ నేతలు బిక్కవోలులో అడ్డుకున్నారు. టీడీపీ కండువాలతో ప్రచారం చేయడానికి వీల్లేదని హుకుం జారీ చేశారు. ఇదిలా ఉండగా.. తదనంతర పరిణామాల్లో చంద్రబాబు వ్యూహం మేరకు బీజేపీ అభ్యరి్థగా శివరామ కృష్ణంరాజును తప్పించి, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కమలం పార్టీ అధికారిక అభ్యర్థిగా ప్రకటించేందుకు పురందేశ్వరి ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనపర్తిలో బీజేపీ అభ్యర్థి ఎవరనే అంశంపై సస్పెన్స్ ఏర్పడింది. దీనిపై బీజేపీ అధిష్టానం ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. పోటాపోటీగా నామినేషన్లు నామినేషన్ల దాఖలుకు మరో రెండు రోజులు మాత్రమే గడువు ఉంది. అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే తరువాత చూద్దాంలే అనే భావనతో ఎవరికి వారు ఇప్పటికే నామినేషన్లు వేస్తున్నారు. తొలుత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి భార్య మహాలక్ష్మి టీడీపీ తరఫున ఒక సెట్ నామినేషన్ వేశారు. బీజేపీ నుంచి తానే ఎన్నికల బరిలోకి దిగుతానని సంకేతాలు ఇచ్చేలా ఆ పార్టీ అభ్యర్థి శివరామ కృష్ణంరాజు తరఫున ఆయన భార్య దుర్గా దేవిక నామినేషన్ దాఖలు చేసి అందరినీ షాక్కు గురి చేశారు. ఒకవైపు సీటుపై నెలకొన్న పీటముడి వీడకముందే బీజేపీ తరఫున నామినేషన్ దాఖలు కావడంతో దీనిని బీజేపీకే కట్టబెడతారేమోననే ఆందోళనతో నల్లమిల్లి వర్గం పునరాలోచనలో పడింది. ముందు జాగ్రత్తగా రామకృష్ణారెడ్డి తరఫున తేతలి అబ్బుస్రెడ్డి కూడా బీజేపీ అభ్యరి్థగా మంగళవారం నామినేషన్ వేశారు. ఈ పరిణామం బీజేపీ నేతల్లో మరింతగా అగ్గి రాజేస్తోంది. పారీ్టలో చేరకుండానే బీజేపీ అభ్యరి్థగా ఎలా నామినేషన్ వేస్తారంటూ కమలనాథులు మండిపడుతున్నారు. ఇంత జరుగుతున్నా పురందేశ్వరి మౌనంగా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ గూటికి నల్లమిల్లి? తాజా పరిణామాల్లో అనపర్తిలో సరికొత్త రాజకీయానికి తెర లేస్తోంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి వ్యూహాత్మకంగా ఆ పార్టీకి గుడ్బై చెప్పి కమలం గూటికి చేరుకోనున్నారు. పార్టీ తీర్థం పుచ్చుకునే ప్రక్రియ లాంఛనమన్న సంకేతాలు టీడీపీ నేతల నుంచే వెలువడుతున్నాయి. ఈ విషయాన్ని నేడో రేపో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. చంద్రబాబు, పురందేశ్వరి డైరెక్షన్లోనే ఈ వ్యవహారం జరుగుతున్నట్లు కమలనాథులే చెబుతున్నారు. కమలం గుర్తు పైనే అనపర్తి బరిలో నల్లమిల్లి పోటీ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆయన బీజేపీ అభ్యర్థిగా తన తరఫున వేరే వ్యక్తితో నామినేషన్ వేయించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బీజేపీ బీఫామ్ సైతం తనకే దక్కుతుందన్న ధీమా నల్లమిల్లిలో కనిపిస్తోంది. సెంటిమెంటుతోనేనా.. అనపర్తిపై పురందేశ్వరి ఇంతగా పట్టు పట్టడానికి ఈ నియోజకవర్గ సెంటిమెంటే కారణమని చెబుతున్నారు. అనపర్తి నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీకి ఓటు వేయాలని భావిస్తే.. ఏక మొత్తంగా అదే పార్టీకి పట్టం కడతారు. ఆ పారీ్టకి భారీ మెజార్టీ అందిస్తారన్న ఖ్యాతి మూటగట్టుకున్నారు. ఏ పారీ్టకి మొగ్గు చూపినా 50 వేలకు పైగా మెజార్టీ ఇచ్చేస్తారు. గత ఎన్నికల గణాంకాలే దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. 2009లో రాజమండ్రి నుంచి టీడీపీ ఎంపీ అభ్యరి్థగా మురళీమోహన్ పోటీ చేశారు. ఈ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఆరు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆయనకు 50 వేల మెజార్టీ దక్కింది. కేవలం అనపర్తిలో మాత్రమే భంగపాటు ఎదురైంది. ఆ ఎన్నికల్లో అనపర్తి ప్రజలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపడంతో ఆ పార్టీ అభ్యర్థి ఉండవల్లి అరుణ్కుమార్కు ఒక్క ఈ నియోజకవర్గం నుంచే 60 వేల ఓట్ల మెజార్టీ లభించింది. అనపర్తి దెబ్బకు టీడీపీ అభ్యర్థి మురళీమోహన్ 10 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఈ పరిణామం పునరావృతం కాకుండా, తాను గెలవాలంటే నల్లమిల్లిని బీజేపీ నుంచి పోటీ చేయించాలన్నది చిన్నమ్మ ఆకాంక్ష. అందుకోసమే తీవ్ర విమర్శలు వస్తున్నా లెక్క చేయకుండా పురందేశ్వరి అభ్యర్థి మార్పుపై పట్టుబడుతున్నారని అంటున్నారు. నల్లమిల్లికే చిన్నమ్మ ఆశీస్సులు! రాజమండ్రి ఎంపీ అభ్యరి్థగా పోటీ చేస్తున్న చిన్న మ్మ పురందేశ్వరి.. తన ప్రయోజనాల కోసం, మరిది, టీడీపీ అధినేత చంద్రబాబు మేలు కోసం సొంత పారీ్టకి నమ్మకద్రోహం చేసేందుకు సైతం వెనుకాడటం లేదనే విమర్శలు వస్తున్నాయి. బీజే పీ అధికారికంగా ప్రకటించిన అభ్యర్థి కృష్ణంరాజును కాదని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి ఆమె అండగా నిలుస్తున్నారని చెబుతున్నారు. ఎలాగైనా నల్లమిల్లిని బీజేపీ నుంచి అనపర్తి ఎమ్మెల్యేగా పోటీ చేయించేందుకు ఆమె తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే మాజీ సైనికుడు, కృష్ణంరాజును పోటీ నుంచి తప్పుకోవాల్సిందిగా ఆమె అలి్టమేటం జారీ చేసినట్లు సమాచారం. రాష్ట్ర అధ్యక్షురాలి ఆదేశాలను పట్టించుకోని కృష్ణంరాజు తన భార్యతో నామినేషన్ దాఖలు చేయించారని తెలిసింది. మాజీ సైనికుడికి అన్యాయం? అనపర్తి అసెంబ్లీ అభ్యరి్థగా బీజేపీ ప్రకటించిన శివరామ కృష్ణంరాజు ఆ పారీ్టకి వీర విధేయుడు. ఆయనది ఆర్ఎస్ఎస్ కుటుంబం. తండ్రి బీజేపీ బలోపేతానికి పాటు పడ్డారు. తన తండ్రి వైద్యం కోసం ఆర్మీ నుంచి వలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వచ్చిన కృష్ణంరాజు బీజేపీలో క్రియాశీలక కార్యకర్తగా పేరు సంపాదించారు. పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు నాలుగేళ్లుగా అహరి్నశలూ కష్టపడ్డారు. ఏడాది నుంచి బీజేపీ అనపర్తి నియోజకవర్గ కనీ్వనర్గా కొనసాగుతున్నారు. ఈ మాజీ సైనికుడిని గుర్తించిన బీజేపీ కేంద్ర పెద్దలు అనపర్తి సీటు కేటాయించారు. ఈ పరిణామం పురందేశ్వరికి మింగుడు పడని అంశంగా మారింది. స్వపక్ష అభ్యరి్థకి మద్దతు ఇవ్వాల్సింది పోయి.. చంద్రబాబు డైరెక్షన్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లికి అండగా నిలవడం ప్రారంభించారు. అనపర్తి అసెంబ్లీ సెగ్మెంట్లో లోక్సభ ఓట్లు తనకు రావాలంటే అక్కడ ఎమ్మెల్యే అభ్యరి్థగా నల్లమిల్లి ఉండాలని భావించారు. ఈ నేపథ్యంలోనే ఆయనకు బీజేపీ సీటు ఇప్పించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దీనికోసం చివరకు అధిష్టాన నిర్ణయాన్ని సైతం ధిక్కరించేందుకు సిద్ధపడుతున్నారు. పురందేశ్వరి వ్యవహార శైలి కమలనాథులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో సీనియర్ నేత సోము వీర్రాజు బీజేపీకి దూరమయ్యే పరిస్థితి తలెత్తింది. -
బీజేపీకి పురందేశ్వరి వెన్నుపోటు!
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో మిత్రపక్షమైన బీజేపీపట్ల తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న తీరు.. ఇందుకు తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వ్యవహారశైలితో కమలనాథులు తీవ్రంగా రగిలిపోతున్నారు. చంద్రబాబు తమ పార్టీని ఇష్టానుసారం ఆడిస్తున్నా ఆమె ఏమాత్రం పట్టించుకోకుండా లోలోపల టీడీపీకి వత్తాసు పలికేలా ప్రేక్షకపాత్ర వహిస్తూ బీజేపీకి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని వారు మండిపడుతున్నారు. 2014లోనూ టీడీపీ అధినేత పొత్తు ధర్మాన్ని విస్మరించి తమ పార్టీ పోటీచేసిన పలు స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను నిలబెట్టి దొంగదెబ్బ తీశారని వారు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు కూడా చంద్రబాబు తన వదినతో కలిసి ఇలాంటి డ్రామానే ఆడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇందుకు బలం చేకూర్చేలా వారు అనపర్తి నియోజకవర్గాన్ని ఉదహరిస్తున్నారు. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆ నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించినప్పటికీ అక్కడ బీజేపీ, టీడీపీ అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించుకుంటున్నారు. పొత్తులో బీజేపీకి కేటాయించిన ఆ స్థానంలో చంద్రబాబు రాజకీయ డ్రామాలు అడుతుంటే, ఆ నియోజకవర్గం ఉన్న రాజమండ్రి లోకసభ స్థానం నుంచి బీజేపీ తరఫున పురందేశ్వరి పోటీచేస్తూ కూడా అక్కడి పరిణామాలపై కిమ్మనకుండా ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. ఇది బీజేపీని వెన్నుపోటు పొడవడమేనని వారు స్పష్టంచేస్తున్నారు. పురందేశ్వరి ప్రేక్షకపాత్ర.. ఇక ఈ సీట్ల విషయంలో చంద్రబాబు ఆడుతున్న డ్రామాలను బీజేపీ రాష్ట్ర పార్టీ అ«ధ్యక్షురాలిగా ఉన్న పురందేశ్వరి ఏమాత్రం పట్టించుకోవడంలేదని కమలనాథుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. నిజానికి.. పురందేశ్వరి రాజమండ్రి లోక్సభ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. అనపర్తిలో బీజేపీ అభ్యర్థి కన్నా చంద్రబాబు తొలుత ప్రకటించిన టీడీపీ అభ్యర్ధి పోటీలో ఉంటే పురందేశ్వరికి అక్కడ ఎక్కువ ఓట్లు పడతాయని చెప్పి టీడీపీ నాయకత్వం ఆమెను ఒప్పించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. తన సొంత రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో బీజేపీకి, పారీ్టనే నమ్ముకున్న నాయకులకు టీడీపీవల్ల అన్యాయం జరుగుతున్నా ఆమె మౌనంగా ఉంటున్నారని వారంటున్నారు. అవసరమైతే, బీజేపీ ఆ స్థానాన్ని వదులుకునేందుకు కూడా పురందేశ్వరి సిద్ధంగా ఉన్నట్లు ఆ పారీ్టలో ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. అప్పట్లో మోదీపై బాబు విమర్శలను ఖండించడంవల్లే.. వాస్తవానికి.. 2019 ఎన్నికలకు ముందు బీజేపీని, ప్రధాని మోదీని చంద్రబాబు టార్గెట్ చేసి వ్యక్తిగత విమర్శలు చేశారు. వీటిని అప్పట్లో ప్రస్తుత అనపర్తి బీజేపీ అభ్యర్థి ఎం. శివరామకృష్ణంరాజు ఖండించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడీయన అభ్యర్థిగా కొనసాగితే టీడీపీ ఓట్లు బదలాయించడం కష్టమని కొత్త ప్రచారం మొదలుపెట్టినట్లు బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో మోదీపై చంద్రబాబు చేసిన విమర్శలను వదిలేసి వాటిని ఖండించినందుకు శివరామకృష్ణంరాజును బలిపశువును చేయాలని టీడీపీ ప్రయతి్నస్తోందని.. కానీ, పురందేశ్వరి టీడీపీ కుట్రను ఏమాత్రం అడ్డుకోకపోవడం ద్వారా బీజేపీకి వెన్నుపోటు పొడవడాన్ని కమలం శ్రేణులు జీరి్ణంచుకోలేకపోతున్నారు. 2014లో మాదిరిగానే ఇప్పుడూ వెన్నుపోటు మరోవైపు.. చంద్రబాబు–పురందేశ్వరి తమ రాజకీయ డ్రామాను రక్తికట్టించేందుకు శివరామకృష్ణంరాజు బలమైన అభ్యర్థి కాదని ఇంకో కొత్త ప్రచారం చేస్తున్నారని బీజేపీ నేతలు చెబుతున్నారు. 2014 ఎన్నికల్లో ఇలాంటి ప్రచారాలే చేసి చంద్రబాబు బీజేపీకి వెన్నుపోటు పోడిచారని.. ఇప్పుడు పురందేశ్వరి ఆయనకు తోడైందని వారంటున్నారు. అప్పట్లో బీజేపీకి ఐదు లోక్సభ, 15 అసెంబ్లీ స్థానాలు కేటాయిస్తున్నట్లు చంద్రబాబు ముందు చెప్పి ఆ తర్వాత నాలుగు లోక్సభ 14 అసెంబ్లీ స్థానాలకు పరిమితం చేశారు. ఆ అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులను ప్రకటించిన తర్వాత వారు బలమైన వారు కాదంటూ సంతనూతలపాడు, గుంతకల్లు, కడప అసెంబ్లీ స్థానాల్లో చంద్రబాబు పోటీగా టీడీపీ వారికి సైతం బి–ఫారాలిచ్చారు. ఆ తరహాలోనే చంద్రబాబు ఇప్పుడు కూడా బీజేపీకి వెన్నుపోటు పొడిచే ప్రయత్నంలో పురందేశ్వరి భాగస్వామ్యం కావడంపట్ల కమల దళంలో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాబు–పురందేశ్వరి కలిసి నాటకం బీజేపీతో పొత్తు కుదరక ముందే గత ఫిబ్రవరి 24న చంద్రబాబు 94 అసెంబ్లీ స్థానాలకు ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల జాబితాలో అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేరును ప్రకటించారు. ఆ తర్వాత మార్చిలో పొత్తులు ఖరారయ్యాక టీడీపీ ఆ స్థానాన్ని బీజేపీకి కేటాయించింది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం అక్కడ బీజేపీ అభ్యర్థిగా ఎం. శివరామకృష్ణంరాజు పేరును ప్రకటించింది. ఈ ప్రకటన తర్వాత కూడా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పొత్తు ధర్మానికి తూట్లు పొడుస్తున్నారు. రెండ్రోజుల క్రితం చంద్రబాబు నిర్వహించిన రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ప్రధాన నాయకుల సమావేశానికి నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని కూడా పిలిచారని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ సమావేశం తర్వాత కూడా అనపర్తి టీడీపీ అభ్యర్థిగా రామకృష్ణారెడ్డి పోటీచేస్తున్నట్లు టీడీపీ శ్రేణులు ప్రచారం చేస్తుండడంపై బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి. పురందేశ్వరి ఈ పరిణామాలను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడంతో చంద్రబాబు–పురందేశ్వరి ఇద్దరూ కలిసే ఈ డ్రామాను ఆడుతున్నారని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. -
నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి చంద్రబాబు ఝలక్
అనపర్తి: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆ పార్టీ నేతలకు వరుస షాక్ లు ఇస్తున్నారు. టికెట్ పై గతంలో హామీలు ఇచ్చి ఇప్పుడు వాటిని వెనక్కి తీసుకోవడం ఆ పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు తీరుతో భంగపడ్డ నేతల జాబితాలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చేరిపోయారు. తూర్పు గోదావరి జిల్లాలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించిన ఆయనకు చంద్రబాబు హ్యాండ్ ఇచ్చారు. అక్కడి టికెట్ ను రామకృష్ణారెడ్డికి కాకుండా వేరేవారికి ఇవ్వడంతో ఆయన ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆ టికెట్ ను రాష్ట్ర సర్పంచ్ లు మాజీ అధ్యక్షుడు పడాల రామారెడ్డి సతీమణి సునీతకు ఆ సీటును కేటాయించడంతో రామకృష్ణారెడ్డి వర్గీయులు అసంతృప్తి వ్యక్తం ఆందోళన బాటపట్టారు. పార్టీ కోసం కష్టపడే వారికి బాబు టికెట్లు ఇవ్వడం లేదని వారు ఆరోపిస్తున్నారు.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- In Time Review: బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement