-
అంత సులభం కాదు.. రెండున్నరేళ్లు పట్టింది: టాలీవుడ్ హీరోయిన్
టాలీవుడ్లో నువ్వు -నేను సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాల్లో నటించింది. 2003లో కుచ్ తో హై సినిమా ద్వారా బాలీవుడ్లోనూ ప్రవేశించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించిన అనిత.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైంది. ప్రస్తుతం రీ ఎంట్రీకి అనితా సిద్ధమవుతోంది. టాలీవుడ్ సినీ ప్రియులను త్వరలోనే అలరించనుంది. అయితే ఇటీవల తన వెయిట్ లాస్ గురించి ఆసక్తికర పోస్ట్ చేసింది. గతంలో బాబు పుట్టినప్పుడు 76 కిలోలు ఉన్న అనితా ప్రస్తుతం 58 కిలోలకు తగ్గింది. ఈ విషయాన్ని షేర్ చేస్తూ.. 'ఇలా మారడానికి నాకు రెండున్నరేళ్లు పట్టింది. మరో ఐదు కిలోలు తగ్గాలనుకుంటున్నా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇప్పుడు నా లక్ష్యం చాలా దూరంగా అనిపించడం లేదు. అంతా మనకు అనుకూలంగానే ఉందంటూ రాసుకొచ్చింది. కానీ ఇదంతా సులభం కాదని అనితా చెబుతోంది. అనితా మాట్లాడుతూ.. 'ఇది కచ్చితంగా కష్టమే. కానీ నేను మాత్రం తొందరపడలేదు. వెయిట్ లాస్ కోసం ఇంత సమయం తీసుకున్నందుకు సంతోషిస్తున్నా. నేను నా లక్ష్యానికి కొన్ని అడుగుల దూరంలో మాత్రమే ఉన్నా. నటులపై తీవ్రమైన ఒత్తిడి ఉంటుంది. గతంలో నేను నా ప్రెగ్నెన్సీని ఆస్వాదించా. మనం అన్నింటికీ మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఒకసారి బిడ్డ పుట్టాక శరీరం, హార్మోన్ల మార్పులు, మానసిక స్థితిలో చాలా మార్పులు వస్తాయని' వివరించింది. సోషల్ మీడియాలో మీరు చాలా బరువు పెరిగారంటూ మేసేజులు పంపేవారని తెలిపింది. కానీ వాటిని పెద్దగా పట్టించుకోలేదని వెల్లడించింది. కాగా. 2014లో వ్యాపారవేత్త రోహిత్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) -
సుహాస్ కొత్త సినిమా.. నువ్వు నేను హీరోయిన్ రీఎంట్రీ
వైవిధ్యమైన చిత్రాలతో నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక మార్క్ క్రియేట్ చేసుకున్న హీరో సుహాస్. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. తమిళ సూపర్ హిట్ మూవీ 'జో' ఫేమ్ మాళవిక మనోజ్ హీరోయిన్గా నటిస్తోంది. రామ్ గోదాల దర్శకుడు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శనివారం హైదరాబాద్లోని ఫిలింనగర్ దైవసన్నిధానంలో ప్రారంభమయ్యాయి. వి ఆర్ట్స్అండ్ చిత్రలహరి టాకీస్ పతాకంపై హరీష్ నల్లా, ప్రదీప్ తాళ్లపు రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో, హీరోయిన్పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నిచ్చారు. దర్శకుడు వశిష్ట కెమెరా స్విచ్చాన్ చేశారు. మరో దర్శకుడు కొలను శైలేష్ బౌండెడ్ స్క్రిప్ట్ను దర్శకుడికి అందజేశారు. టైటిల్ పోస్టర్ను దర్శకులు విజయ్ కనకమేడల, కిషోర్ తిరుమల, నిర్మాత సుదర్శన్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నువ్వు నేను ఫేం అనితా హస్సానందని మాట్లాడుతూ.. నా సెకండ్ ఇన్నింగ్స్కు ఫర్ఫెక్ట్గా కుదిరిన చిత్రమిదన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఆమె తెలుగు తెరపై కనిపించనుంది. దర్శకుడు రామ్ మాట్లాడుతూ ఇదొక బ్యూటిఫుల్ లవ్స్టోరీ, సుహాస్ కొత్తగా దర్శకత్వం చేసే వాళ్లకు దొరికిన వరం. ఎంతో కంఫర్టబుల్ ఆర్టిస్ట్ అన్నారు. చదవండి: పెళ్లైన ఏడాదికే విడాకులు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడీ.. ఇప్పుడేమో! -
Ekta-Anita: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉదయ్ కిరణ్ హీరోయిన్ (ఫొటోలు)
-
నా జీవితంలో మరిచిపోలేని విషాదం.. అయినా వెనక్కి తగ్గలేదు!
టాలీవుడ్లో నువ్వు నేను సినిమాతోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న హీరోయిన్ అనిత. ఈ చిత్రంలో ఉదయ్ కిరణ్ హీరోగా నటించారు. ఆ తర్వాత తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో సెకండ్ హీరోయిన్గా కనిపించింది. తొట్టిగ్యాంగ్, నేను పెళ్లికి రెడీ, ముసలోడికి దసరా పండుగ లాంటి సినిమాల్లో నటించింది. 2003లో కుచ్ తో హై సినిమా ద్వారా బాలీవుడ్లోనూ ప్రవేశించింది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లో నటించిన అనిత.. పెళ్లి తర్వాత వెండితెరకు దూరమైంది. (ఇది చదవండి: Bigg Boss 7: పల్లవి ప్రశాంత్ తలకు గాయం.. కుప్పకూలిపోయిన రైతు బిడ్డ!) అయితే సినిమాలకు దూరమైనప్పటికీ బుల్లితెరపై సందడి చేసింది. హిందీ సీరియల్స్, టీవీ షోలతో బీ టౌన్ ఆడియన్స్ మనసు దోచుకుంది. అంతే కాకుండా యాడ్స్లోనూ నటిస్తూ అభిమానులను అలరించింది. 2014లో వ్యాపారవేత్త రోహిత్ పెళ్లాడిన సంగతి తెలిసిందే. వీరిద్దరికీ ఓ బాబు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా అనిత సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరలవుతోంది. అదేంటో ఓ లుక్కేద్దాం. అనిత తన ఇన్స్టాలో రాస్తూ.. 'ఈ రోజు నేను చేసింది కేవలం ఒక పోస్ట్ మాత్రమే కాదు. నా కోసం, నేను చేసిన అద్భుతమైన ప్రయాణానికి గుర్తు ఇది. నాకు ఆ టీనేజ్ రోజులు ఇంకా గుర్తున్నాయి. అప్పుడు నా జీవితం ఎన్నో కలలు, గందరగోళాల మధ్య సుడిగుండంలా గడిచింది. ఒక సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా కేవలం ఒక డైరీలో నా ఆశలు గురించి రాసుకున్నా. కానీ నా జీవితంలో అప్పుడే ఓ విషాదం జరిగింది. నేను నా తండ్రి.. నా హీరోని కోల్పోయాను. ఆ సమయంలో నా దారులన్నీ మూసుకుపోయాయి. కానీ నేను వాటికి భయపడలేదు. కేవలం నా కోసమే కాదు.. నా కుటుంబానికి వెన్నెముకగా మారాను. అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నా. నా కుటుంబంతో గర్వంగా.. ఓ తల్లిగా, ప్రేమగల భర్త, నా బిడ్డే ఇప్పుడు నా ప్రపంచం. నా లైఫ్లో ప్రతిరోజును ఆస్వాదిస్తున్నా. అందుకే ఈ రోజు నుంచి నాకు నేనే కృతజ్ఞతలు చెప్పడానికి కొంత సమయం కేటాయించాలనుకుంటున్నా. నా లైఫ్ ఇంత హ్యాపీగా మారినందుకు నాకు నేనే రుణపడి ఉంటాను.' అంటూ పోస్ట్ చేసింది. తన జీవితంలో ఎన్నో బాధలు అధిగమించి ఈ స్థాయికి చేరుకున్నందుకు ఆనందంగా ఉందంటూ అనిత ఎమోషనలయ్యారు. (ఇది చదవండి: ఆస్కార్ బరిలో చిన్న సినిమా.. అవార్డ్ దక్కేనా?) View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) -
ముసలోడికి దసరా పండగ ట్రైలర్ వచ్చేసింది..
నాజర్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ముసలోడికి దసరా పండుగ’. డి. మనోహర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, అనిత, కోవై సరళ, శరణ్య, సత్య ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. రాజీనాయుడు, సీతమ్మ వాళ్లె ఆశీస్సులతో రమణ వాళ్లె నిర్మించారు. తెలుగు–తమిళ భాషల్లో రూపొందిన ఈ సినిమా పోస్టర్, ట్రైలర్ను నాజర్ విడుదల చేసి, మాట్లాడుతూ– ‘‘ఈ చిత్రంలో నా పాత్ర కొత్తగా ఉంటుంది’’ అన్నారు. రమణ వాళ్లె మాట్లాడుతూ– ‘‘రెండు గంటలపాటు హాయిగా నవ్వుకునేలా మా సినిమా ఉంటుంది. త్వరలో సినిమా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నాం. ఈ చిత్రాన్ని నాకు తండ్రి సమానులైన దివంగత దర్శకులు ఈవీవీ సత్యనారాయణగారికి అంకితం ఇస్తున్నాను’’ అన్నారు. చదవండి 👇 నటుడిని పెళ్లాడనున్న బాలీవుడ్ హీరోయిన్ Rakul Preet Singh: సౌత్, నార్త్ రెండూ కలిస్తే అద్భుతాలే.. -
నన్ను అందరికంటే ఎక్కువగా ఏడిపించే వ్యక్తి నా భర్త: నటి
‘నువ్వు నేను’ హీరోయిన్, నటి అనిత హసానందాని తరచూ తనకు సంబంధించిన విషయాలను, భర్త రోహిత్ రెడ్డిని సరదాగా ఆటపట్టించే వీడియోలు, తన ముద్దుల తనయుడి ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి తన భర్తను ఆటపట్టిస్తూ అనిత షేర్ చేసిన ఓ పోస్టు నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో అనిత తన భర్తతో క్లోజ్గా తీసుకున్న ఫొటోను షేర్ చేస్తూ.. ‘ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నన్ను ఏడిపించేది నువ్వే. అందుకే నీకు చిరాకు తెప్పించే ప్రతి మూమెంట్లో నేను నీతో ఉండాలనుకుంటాను’ అంటూ నవ్వుతున్న ఎమోజీలను జత చేసింది. కాగా బిజినెస్మేన్ రోహిత్రెడ్డిని ప్రేమించిన అనిత 2013లో అతడిని వివాహం చేసుకుని వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. ఇటీవల ఈ జంట పండంటి మగబిడ్డకు జన్మించిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) -
సంచలన నిర్ణయం తీసుకున్న 'నువ్వు నేను' హీరోయిన్ అనిత
ముంబై: బుల్లితెర సెలబ్రిటీ, 'నువ్వు నేను' హీరోయిన్ అనిత యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నట్లు పేర్కొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ప్రస్తుతం తన చిన్నారితోనే పూర్తి సమయం గడపాలనుకుంటున్నానని, ఇది చాలా కాలం క్రితమే తీసుకున్న నిర్ణయమని తెలిపింది. 'నేను తల్లినైతే యాక్టింగ్ కెరీర్ నుంచి తప్పుకోవాలని ముందే నిర్ణయించుకున్నాను. ఇది కరోనా పాండమిక్ వల్ల తీసుకున్న నిర్ణయం కాదు. నా దృష్టి మొత్తం నా పిల్లాడి భవిష్యత్తుపైనే. తల్లిగా నా పూర్తి బాధ్యతలు నిర్వహించాలనుకుంటున్నా అందుకే ఇండస్ర్టీ నుంచి తప్పుకుంటున్నా. ప్రస్తుతం నటన అనేది నా చివరి ప్రయారిటీ. తిరిగి ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తానో నాకే తెలియదు. ఇక ఇంతకుముందే కొన్ని బ్రాండ్లకు సైన్ చేసినందుకు ఇప్పుడు ఆ వర్క్ కంప్లీట్ చేస్తున్నా.. యాడ్ షూటింగ్స్ అన్నీ మా ఇంట్లోనే జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. షూట్ కోసం వచ్చిన వ్యక్తులకు ముందే కోవిడ్ టెస్ట్ నిర్వహించి నెగిటివ్ వచ్చాకే లోపలికి అనుమతిస్తున్నాం. ఇక నేను మళ్లీ నటిస్తానన్నది నాకే తెలియదు. ఒకవేళ మళ్లీ రీఎంట్రీ ఉంటే తప్పుకుండా చెబుతాను' అని వెల్లడించింది. ఇక 'నువ్వు నేను', 'శ్రీరామ్', 'నేనున్నాను' వంటి చిత్రాలతో ఆకట్టుకున్న అనితా టాలీవుడ్కు గుడ్బై చెప్పేసి బాలీవుడ్కు వెళ్లిపోయింది. అక్కడ ''తాళ్, కుచ్ తో హై, యే దిల్, కృష్ణా కాటేజ్, రాగిణి ఎంఎంఎస్, హీరో'' లాంటి చిత్రాల్లో నటించిన ఆమె ఆ తర్వాత యే హై మొహబ్బతే, నాగిన్ సీరియల్స్తో బుల్లితెర బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. 2013లో రోహిత్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్న అనిత.. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చదవండి : భార్యలకు నచ్చే ట్రిక్ అంటూ భర్తను చాచి కొట్టిన నటి -
వైరల్ వీడియో: భర్త చెంప పగలగొట్టిన నటి
-
వైరల్: భర్త చెంప పగలగొట్టిన నటి
బుల్లితెర సెలబ్రిటీ అనిత తన భర్త రోహిత్ రెడ్డిని ఓ ఆటాడుకుంది. జస్ట్ ప్రాంక్ అని చెప్తూ భర్త చెంప పగలగొట్టింది. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయగా అది కాస్తా వైరల్గా మారింది. ఈ వీడియోలో అనిత తన భర్తను కుర్చీలో కూర్చోబెట్టింది. అతడి వెనకాల నిలబడిన ఆమె తన చేతిలో ఓ దారాన్ని పట్టుకున్నట్లు నటించింది. దాన్ని అతడి చెవిలో నుంచి తీసినట్లు యాక్ట్ చేసింది. ఇంతలో ఫడేలుమని చెంప మీద ఒక్కటిచ్చింది. దీంతో షాకైన భర్త తనను ఏమీ అనలేక అక్కడ నుంచి వెళ్లిపోయాడు. భార్యలకు ఈ మ్యాజిక్ ట్రిక్ తప్పకుండా నచ్చుతుందన్న అనిత 'ఈ ట్రిక్ను తప్పకుండా ఇంట్లో ప్రయత్నించండి' అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. అయితే తనను ఇలా ఆడేసుకున్న భార్యను ఊరుకునేది లేదంటున్నాడు రోహిత్. త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటానని వార్నింగ్ ఇచ్చాడు. ఇక అనిత తన భర్తను ఈ రకంగా ఆటపట్టించడం చూసిన నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. పాపం, రోహిత్ ముఖం మాడిపోయిందని అంటున్నారు. అతడు ఎలా రివేంజ్ తీసుకుంటాడా అని ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు. 'నువ్వు నేను', 'శ్రీరామ్', 'నేనున్నాను' వంటి చిత్రాల్లో నటించిన అనిత 2013లో రోహిత్ను పెళ్లి చేసుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 9న పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇక వివాహం అనంతరం బాలీవుడ్లో పాగా వేసిన ఆమె ప్రస్తుతం బుల్లితెరపై సందడి చేస్తోంది. చదవండి: బాలీవుడ్లో హీరోయిన్ ప్రణీతకు చేదు అనుభవం! ఒంటిపై తేనెటీగలతో హీరోయిన్ ఫోటో షూట్.. వీడియో వైరల్ -
ముద్దులిచ్చుకుంటూ నటి బర్త్డే వేడుకలు
నువ్వు నేను, శ్రీరామ్, నేనున్నాను.. వంటి చిత్రాల్లో నటించిన అనితా హసానందాని పెళ్లి తర్వాత బాలీవుడ్కు వెళ్లిపోయింది. అక్కడ పలు హిందీ చిత్రాల్లో నటించిన ఆమె బుల్లితెర మీద కూడా తళుక్కున మెరిసింది. నేడు ఆమె బర్త్డే. దీంతో భార్య పుట్టినరోజును ఘనంగా జరపాలనుకున్నాడు రోహిత్ రెడ్డి. కానీ ముంబైలో లాక్డౌన్ ఉండటంతో ఇంట్లోనే ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ వేడుకలు జరిపాడు. ఈమేరకు ఓ వీడియోను అనిత తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇందులో బెలూన్లు ఎగరేస్తూ కేక్ ముందు కూర్చున్న అనితకు ప్రేమకు చిహ్నంగా పుష్పగుచ్చాలను అందించాడు ఆమె భర్త రోహిత్. ఇద్దరూ ఒకరొకరు ఆప్యాయంగా ముద్దులిచ్చుకుంటూ మురిపిస్తున్న ఈ వీడియో అభిమానులకు తెగ నచ్చింది. ఈ లాక్డౌన్ బర్త్డే భలే బాగుంది అంటూ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా అనిత, రోహిత్ 2013లో పెళ్లి చేసుకున్నారు. వీరు వైవాహిక బంధంలో అడుగుపెట్టిన ఏడేళ్ల తర్వాత ఈ ఏడాది ఫిబ్రవరి 9న తొలి సంతానానికి జన్మనిచ్చారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వారి కుటుంబంలోకి కొత్త అతిథి రావడంతో ఈ దంపతులు ఆనందంలో తేలియాడుతున్నారు. View this post on Instagram A post shared by Anita H Reddy (@anitahassanandani) చదవండి: నా కొడుకుతో సహా బిగ్బాస్కు వెళ్తా!: నటి ఎన్టీఆర్ 30: హీరోయిన్గా ముంబై బ్యూటీ! -
బిగ్బాస్ షోలో పాల్గొంటా, కానీ: నటి
బుల్లితెర బాస్ బిగ్బాస్ రియాలిటీ షోలో ఒక్కసారిగా అడుగు పెట్టారంటే వారికి ఎక్కడలేని పాపులారిటీ వస్తుంది. మారుమూల పల్లె నుంచి పట్నం వరకు ప్రతి ఒక్కరికీ అందులోని కంటెస్టెంట్లు సుపరిచితులుగా మారిపోతుంటారు. ఇక హౌస్లో వారి వేషధారణ, నడత, మాట తీరు అన్నింటి ఆధారంగా ప్రేక్షకులు అభిమానులుగా మారిపోతుంటారు. ఇష్టమైన కంటెస్టెంట్ను గెలిపించుకునేందుకు నెలల తరబడి కష్టపడుతుంటారు. ఇక షో నుంచి వచ్చిన వారు సైతం సినిమా అవకాశాలను చేజిక్కించుకుని కెరీర్లో దూసుకుపోతుంటారు. అయితే బిగ్బాస్లో పాల్గొనేందుకు టీవీ తారలు చూపించినంత శ్రద్ధాసక్తులు సినీ సెలబ్రిటీలు చూపించరు. తాజాగా నటి అనిత హసానందాని బిగ్బాస్ షోలో పాల్గొననున్నట్లు పేర్కొంది. కానీ అందులో ఏమాత్రం నిజం లేదు, ఆమె ఊరికే జోక్ చేసింది. ఇంతకీ ఏమైందంటే హిందీ బిగ్బాస్ 13 విజేత సిద్దార్థ్ శుక్లా అనిత భర్త రోహిత్ రెడ్డిని కలిశాడు. సిద్దార్థ్ కండలు చూసి రోహిత్ స్టన్న్ అయిపోయాడు. దీనికి సంబంధించిన వీడియోను రోహిత్ తన ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాడు. అది చూసిన నెటిజన్లు సిద్దార్థ్ను పొగుడుతూ కామెంట్ల వర్షం కురిపించారు. ఇది చూసిన అనిత కూడా ఓ ఫన్నీ కామెంట్ చేసింది. "బోలెడన్ని కామెంట్లు వస్తూనే ఉన్నాయి. నా కొడుకు అరవ్ను తీసుకుని నేను కూడా తర్వాతి సీజన్లో పాల్గొంటాను. బై రోహిత్" అంటూ జోక్ చేసింది. కాగా ‘నువ్వు- నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన అనిత తర్వాత హిందీ బుల్లితెరపై దృష్టి సారించింది. యే మొహబ్బతే, నాగిని వంటి హిట్ సీరియల్స్లో నటించింది. గత నెలలో ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇదిలా వుంటే హిందీ బిగ్బాస్ 14వ సీజన్లో రుబీనా దిలైక్ విజేతగా అవతరించిన విషయం తెలిసిందే. చదవండి: ఏడేళ్ల తర్వాత తొలి సంతానం.. బుడ్డోడి పేరేమిటంటే! -
‘30 ఏళ్లు దాటితే సంతానం కష్టమన్నారు’
ముంబై: నటి అనిత హసానందాని మాతృత్వపు మధురిమలను ఆస్వాదిస్తున్నారు. తన బుజ్జాయిని చూసి మురిసిపోతూ ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. గర్భం దాల్చిన నాటి నుంచి ప్రసవం వరకు గల సంతోషకర క్షణాలను వీడియోలో బంధిస్తూ అనిత అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే. తాజాగా తన కొడుకు పేరిట స్నేహితులకు బహుమతులు పంపించారు. ఈ కానుక అందుకున్న వారిలో బాలీవుడ్ కామెడీ క్వీన్ భారతీ సింగ్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో అనిత- రోహిత్రెడ్డి దంపతుల తనయుడి పేరు బహిర్గతమైంది. ‘‘ఆరవ్రెడ్డి.. ఇప్పుడు ఫ్రెండ్ రిక్వెస్టులు ఆక్సెప్ట్ చేస్తున్నాడు’’అని రాసి ఉన్న గిఫ్ట్ప్యాక్ను భారతీ ఇన్స్టా స్టోరీలో రివీల్ చేశారు. దీంతో చిన్నారి పేరు ఎంతో బాగుందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇక ఆరవ్ పేరిట అతడి తల్లిదండ్రులు ఇప్పటికే ఓ ఇన్స్టా పేజ్ను క్రియేట్ చేశారు. కాగా ‘‘నువ్వు- నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో స్థానం సంపాదించుకున్న అనిత తర్వాత హిందీ బుల్లితెరపై దృష్టి సారించారు. యే హై మొహబ్బతే, నాగిని వంటి హిట్ సీరియల్స్లో మెరిశారు. రోహిత్రెడ్డి అనే వ్యాపారవేత్తను ప్రేమించిన ఆమె.. 2013లో ఆయనను వివాహం చేసుకున్నారు. పెళ్లైన దాదాపు ఏడేళ్ల తర్వాత, ఫిబ్రవరి 9న మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయం గురించి అనిత మాట్లాడుతూ.. ‘‘ఇరు కుటుంబాల నుంచి సంతానం కోసం మాపై ఎలాంటి ఒత్తిడి రాలేదు. నాచ్ బలియే షో తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకున్నాం. లాక్డౌన్లో గర్భం దాల్చాను. ముప్పై ఏళ్లు దాటిన తర్వాత సహజ పద్ధతిలో బిడ్డకు జన్మనివ్వడం కాస్త కష్టమైన పని అన్నారు. కానీ నా విషయంలో ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. తల్లిదండ్రులుగా మారిన తర్వాత రోహిత్, నేను ఆనందంలో తేలిపోతున్నాం. నిజానికి వయసు అనేది కేవలం ఒక సంఖ్య మాత్రమే. సరైన ఆహారపుటలవాట్లు, జీవనశైలి పాటిస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు’’ అని స్ఫూర్తి నింపారు. కాగా అనిత ఏప్రిల్ 14, 1981లో జన్మించారు. ఆమె వయసు ప్రస్తుతం 39 ఏళ్లు. చదవండి: ‘అమ్మ పొట్టలో ఎవరున్నారు జాకీ.. చెల్లెలు’ -
అబ్బాయి పుట్టాడు: నటి
ముంబై: నటి అనిత హసానందాని, రోహిత్ రెడ్డి దంపతులు తల్లిదండ్రులయ్యారు. మంగళవారం అనిత పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. భార్యను ఆత్మీయంగా ముద్దాడుతున్న ఫొటోను షేర్ చేసిన రోహిత్రెడ్డి ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ‘‘లవ్ యూ బేబీ.. మన జీవితంలోని అత్యంత మధురు క్షణాలు ఇవే’’ అంటూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ సెలబ్రిటీలు ఏక్తా కపూర్, సమీరారెడ్డి, హీనా ఖాన్, నకుల్ మెహతా, కరణ్ వీర్ వోహ్రా తదితరులు విషెస్ తెలిపారు. ఇక.. ‘‘రెడ్డి కోసం వేచి చూస్తున్నాం’’ అంటూ తాను తల్లికాబోతున్న విషయాన్ని అనిత క్యూట్ వీడియో ద్వారా వెల్లడించిన సంగతి తెలిసిందే. డిసెంబరులో ముంబైలో నిర్వహించిన అనిత సీమంతంలో ఏక్తా కపూర్ సహా పలువురు సెలబ్రిటీలు హాజరై సందడి చేసిన ఫొటోలు కూడా ఆమె షేర్ చేశారు. కాగా ‘నువ్వు- నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన అనిత తర్వాత హిందీ బుల్లితెరపై దృష్టి సారించారు. యే మొహబ్బతే, నాగిని వంటి హిట్ సీరియల్స్లో నటించారు. ఇక వ్యక్తిగత జీవితం విషయానికొస్తే... బిజినెస్మేన్ రోహిత్రెడ్డిని ప్రేమించిన ఆమె.. 2013లో ఆయనను పెళ్లాడారు. ఇక వైవాహిక బంధంలో అడుగుపెట్టిన ఏడేళ్ల తర్వాత వీరు ఫిబ్రవరి 9న తమ తొలి సంతానానికి జన్మనిచ్చారు. సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తమ జీవితాల్లోకి చిన్నారి రావడంతో ఆనందడోలికల్లో తేలియాడుతున్నారు. కాగా భార్యను ఎల్లప్పుడూ ప్రోత్సహించే రోహిత్ రెడ్డి, డాన్స్ రియాలిటీ షో "నాచ్ బలియే 9" సీజన్లో ఆమెతో కలిసి పాల్గొన్నారు. చదవండి: ‘అమ్మ పొట్టలో ఎవరున్నారు జాకీ.. చెల్లెలు’ View this post on Instagram A post shared by Rohit Reddy (@rohitreddygoa) -
తల్లి కాబోతున్న నటి అనిత
నటి అనిత హసానందాని తన అభిమానులకు తీపికబురు వినిపించారు. తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ మేరకు ఓ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. రోహిత్ రెడ్డితో పరిచయం, ప్రేమ, అతడు ప్రపోజ్ చేయడం, పెళ్లి చేసుకోవడం, ఇప్పుడు గర్భం దాల్చడం వంటి అన్ని విషయాలను చూపిస్తూ ఈ వీడియో రూపొందించారు. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ సందర్భంగా అభిమానుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ అనితకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. (చదవండి: ఆర్ఆర్ఆర్ టీం : రాజమౌళిపై ఇన్ని ఆరోపణలా! ) అనిత పారిశ్రామికవేత్త రోహిత్ రెడ్డిని ప్రేమించారు. 2013లో ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు. సుమారు ఏడేళ్ల తర్వాత వీరు తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ చిన్న కుటుంబంలోకి విచ్చేయనున్న కొత్త అతిథి కోసం వీరు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈ జంట "నాచ్ బలియే 9" సీజన్లో పాల్గొని సందడి చేసింది. అనిత విషయానికి వస్తే తెలుగులో ఉదయకిరణ్ 'నువ్వు నేను', అల్లరి నరేష్ 'తొట్టిగ్యాంగ్'తో పాటు పలు సినిమాల్లో హీరోయిన్గా నటించారు. తన ప్రతిభను టాలీవుడ్కే పరిమితం చేయకుండా హిందీ, తమిళ, కన్నడ భాషల్లోనూ నటిస్తున్నారు. బుల్లితెరపై నాగిని సీరియల్లో కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. (చదవండి: పాలిటిక్స్పై విజయ్ సంచలన వ్యాఖ్యలు) -
నేను ప్రెగ్నెంట్ కాలేదు!
తేజ నువ్వు-నేను' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించిన హీరోయిన్ అనిత గుర్తుంది కదా.. ఆ తర్వాత తెలుగులో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో తిరిగి ఉత్తరాదికి వెళ్లిపోయింది ఈ భామ. అనంతరం కొన్ని హిందీ సీరియళ్లలో నటించింది. ప్రస్తుతం వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న అనితా హస్సనందానీ త్వరలో తల్లి కాబోతున్నదని, ఆమె గర్భవతి అయిందని మీడియాలో కథనాలు వచ్చాయి. ఒకదాని వెంట ఒకటిగా వరుసకట్టిన ఈ కథనాలపై అనిత తాజాగా ఇన్స్టాగ్రామ్లో స్పందించింది. తాను ప్రెగ్నెంట్ అయినట్టు వస్తున్న వార్తలను తోసిపుచ్చిన ఆమె.. తాను బరువు పెరగడానికి చాక్లెట్లు, పిజ్జాలే కారణమని చెప్పుకొచ్చింది. 'ప్రతి మీడియా సంస్థ నుంచీ నాకు కాల్స్ వస్తున్నాయి. ఏమైనా 'గుడ్ న్యూస్' ఉందా అని అడుగుతున్నారు. ఔను శుభవార్త ఉంది. అదేమిటంటే నేను డైటింగ్ చేయడం లేదు. నేను చాక్లెట్లు, పిజ్జాలు, ఐస్క్రీమ్లు బాగా తింటున్నాను. నేను అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తున్నానంటే అందుకు కారణం మా ఆయనతో ప్రేమలో ఉండటమే. నేను గర్భవతిని అయితే ఆ విషయాన్ని మీ అందరికీ గర్వంగా తెలియజేస్తాను' అని అనిత తనదైన స్టైల్లో వివరణ ఇచ్చింది.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
సీఎం జగన్ ఎంట్రీతో దద్దరిల్లిన కడప
రెండు ఎన్నికలకు ఒక్కరే రిటర్నింగ్ అధికారి !
దేశం కోసం పనిచేసే నాయకుడు మోదీ
అవగాహన లేమి.. తగ్గుతున్న దిగుబడి!
గుణాత్మక బోధనతో మంచి ఫలితాలు
సూర్యాపేట
భీంరెడ్డి పోరాట చరిత్ర మరువలేనిది
పుత్తూరులో సీఎం జగన్ రోడ్ షో: పోటెత్తిన అభిమానం (ఫొటోలు)
వాతావరణం చల్లబడింది
మట్టపల్లిలో నిత్యకల్యాణం
తప్పక చదవండి
- ఫోటో తీస్తే కవిత రాసే కెమెరా.. ఇది కదా టెక్నాలజీ అంటే!
- అయ్యయ్యో సేతిలో డబ్బులు పోయెనే.. జేబులు ఖాళీ ఆయనే
- పాపం బ్రెజిల్.. ఎటు చూసినా వరదలే..
- కష్టాల్లో 'పద్మ శ్రీ మొగిలయ్య'.. సాయం చేసిన బుల్లితెర నటి
- నవ్వుతారేమో అనుకున్నా: లాపతా లేడీస్ ప్రతిభ ఇంట్రస్టింగ్ జర్నీ
- రెడ్ లిప్స్టిక్ను ఉత్తరకొరియా ఎందుకు బ్యాన్ చేసిందో తెలుసా!
- డాగ్ లవర్స్ బీ అలర్ట్ : ప్రమాదకరమైన కుక్కలపై తమిళనాడు నిషేధం
- ఆదాయాలు రెట్టింపైనా ఉద్యోగాల్లో కోత!
- కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement