-
నెల రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హారర్ మూవీ
హారర్ సినిమాలకు ఓటీటీలో మంచి గిరాకీ ఉంటుంది. డిజిటల్ ప్లాట్ఫామ్లోకి ఇలా ఎంటరవ్వగానే అలా ట్రెండయిపోతాయి. థియేటర్లలో పెద్దగా కలెక్షన్స్ రాబట్టని చిత్రాలు కూడా మినిమమ్ గ్యారెంటీ వ్యూస్ రాబడతాయి. తాజాగా ఓ తెలుగు హారర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చిత్రం అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది.గత నెలలో రిలీజ్తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీ గీతాంజలి అనే హిట్ చిత్రానికి సీక్వెల్గా తెరకెక్కింది. కోన వెంకట్ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, రవిశంకర్, సత్య, బ్రహ్మాజీ, అలీ తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. ఎన్నో అంచనాల మధ్య ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. సడన్గా ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చేసింది.కథ విషయానికి వస్తే..దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవుతాయి. మరో ఛాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి హైదరాబాద్లో తిరుగుతుంటాడు. సరిగ్గా అప్పుడే ఊటీకి చెందిన వ్యాపారవేత్త విష్ణు (రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా (శ్రీకాంత్ అయ్యంగార్) శ్రీనివాస్కు ఫోన్ చేసి తనతో సినిమా నిర్మిస్తానని చెపుతాడు. హీరోయిన్గా ఊటీలో కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అయితే షూటింగ్ అంతా సంగీత్ మహల్లోనే పూర్తి చేయాలని కండీషన్ పెడతాడు. అక్కడున్న దెయ్యాలతో శ్రీను టీమ్కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడే షూటింగ్ చేయాలని ఎందుకు కండీషన్ పెట్టాడు? గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా? ఎందుకు? వచ్చింది? అన్నది తెలియాలంటే ఓటీటీలో సినిమా చూడాల్సిందే! చదవండి: వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ -
Anjali: అంజలి సారీ లుక్.. తనకన్నీ అలా సెట్టవుతాయంతే! (ఫోటోలు)
-
ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హారర్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు చంపేస్తున్నాయి. అడుగు బయటపెట్టాలంటే భయమేస్తోంది. ఇలాంటి టైంలో థియేటర్కి వెళ్లి చూడటం కంటే ఓటీటీలో మూవీస్ చూడటానికే జనాలు ఆసక్తి చూపిస్తున్నారు. అందుకు తగ్గట్లే ప్రస్తుతం 'మంజుమ్మల్ బాయ్స్', 'సైతాన్' లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు తెలుగు హారర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఏడాది తర్వాత ఓటీటీలోకి హిట్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?)హీరోయిన్ అంజలి తెలుగమ్మాయి. అప్పట్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమాతో అద్భుతమైన క్రేజ్ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత పలు మూవీస్ చేసినప్పటికీ ఓ మాదిరి సక్సెస్ మాత్రమే అందుకుంది. తన 50వ సినిమాగా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' చేసింది. ఈ మధ్యే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో జనాలు అంతంత మాత్రంగానే వెళ్లారు.థియేటర్లలోకి ఏప్రిల్ 11న వచ్చిన 'గీతాంజలి మళ్లీ వచ్చింది' సినిమాని ఇప్పుడు నెల తిరిగిసరికల్లా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్నారట. మే 10 నుంచి అమెజాన్ ప్రైమ్లో అందుబాటులోకి రానుందని సమాచారం. హిట్ మూవీ కాదు కాబట్టి పెద్దగా హడావుడి లేకుండా రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. 2014లో వచ్చిన 'గీతాంజలి' మూవీకి దీన్ని సీక్వెల్గా తెరకెక్కించారు. కాకపోతే తొలి భాగంలా హిట్ కొట్టలేకపోయారు.(ఇదీ చదవండి: సమ్మర్ స్పెషల్.. ఓటీటీలో 100 సినిమాలు/ సిరీస్లు) -
లైట్ బ్లూ సారీ లో నటి అంజలి లుక్స్.. ఫోటోలు
-
మిక్స్డ్ టాక్.. రూ.50 కోట్లు కావాలంటున్న డైరెక్టర్
ఒకప్పుడు అరుదుగా సీక్వెల్స్ తీసేవారు.. ఇప్పుడు సీక్వెల్స్ అనేవి సర్వసాధారణమైపోయాయి. అలా పదేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్గా నిలిచిన మూవీ గీతాంజలి. దశాబ్దం తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్గా గీతాంజలి మళ్లీ వచ్చింది తెరకెక్కించారు. అంజలి హీరోయిన్గా నటించిన ఈ మూవీలో శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్, సత్య, సునీత్ ప్రధాన పాత్రలు పోషించారు. కోన వెంకట్ కథ అందించగా శివ తుర్లపాటి దర్శకత్వం వహించాడు. ఆ దేవుడిని ఒకటే అడిగా ఏప్రిల్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ తొలిరోజే మిక్స్డ్ టాక్ అందుకుంది. గురువారం నాడు కోన వెంకట్ మీడియా ముందు మాట్లాడుతూ.. 'తిరుపతిలో దేవుడి ముందు నిలబడ్డప్పుడు ఒకటే కోరుకున్నా.. 27 ఏళ్ల కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశాను. బ్లాక్బస్టర్లు, ఫ్లాపులు చూశాను. తొలిసారి సక్సెస్ కావాలని భగవంతుడిని వేడుకున్నాను. సక్సెస్ కావాలి సక్సెస్ అనేది మనకంటూ కొత్త శక్తినిస్తుంది. కొత్త కథలను, కొత్తవారిని పరిచయం చేసేందుకు బలాన్నిస్తుంది. నేను చూసింది చాలు.. నా ద్వారా పదిమంది పరిచయం కావాలి, ఇండస్ట్రీకి మేలు జరగాలని కోరుకున్నాను. ముఖ్యంగా ఇది అంజలి 50వ సినిమా కావడంతో ఈ చిత్రానికి కనీసం రూ.50 కోట్లు అయినా వచ్చేట్లు చూడమని అడిగాను. తప్పకుండా ఆ నెంబర్స్ వస్తాయని ఆశిస్తున్నాను. త్వరలోనే రూ.50 కోట్ల ఫంక్షన్లో కలుద్దాం' అని చెప్పుకొచ్చాడు. చదవండి: హీరోయిన్ను పెళ్లాడిన దర్శన్? ఫోటో వైరల్! -
‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ రివ్యూ
టైటిల్: గీతాంజలి మళ్ళీ వచ్చిందినటీనటులు: అంజలి, శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేష్, సత్య, షకలక శంకర్, అలీ, బ్రహ్మాజీ, రవిశంకర్, రాహుల్ మాధవ్ తదితరులు నిర్మాత: ఎంవీవీ సత్యనారాయణకథ, స్క్రీన్ప్లే: కోన వెంకట్దర్శకత్వం: శివ తుర్లపాటిసంగీతం: ప్రవీణ్ లక్కరాజుసినిమాటోగ్రఫీ: సుజాత సిద్ధార్థఎడిటర్: ఛోటా కె ప్రసాద్విడుదల తేది: ఏప్రిల్ 11, 2024తెలుగు బ్యూటీ అంజలి కెరీర్లో భారీ విజయం సాధించిన చిత్రాల్లో ‘గీతాంజలి’ సినిమా ఒకటి. పదేళ్ల క్రితం వచ్చిన ఈ కామెడీ హారర్ అప్పట్లో ఘన విజయం సాధించింది. దశాబ్దం తర్వాత మళ్లీ అదే టీమ్తో గీతాంజలికి సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ చిత్రాన్ని తెరకెక్కించారు. మంచి అంచనాలతో నేడు(ఏప్రిల్ 11) ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? గీతాంజలి తరహాలో సీక్వెల్ కూడా హిట్ అయినట్లేనా? లేదా? రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. దర్శకుడు శ్రీనివాస్(శ్రీనివాస్ రెడ్డి) తీసిన మూడు చిత్రాలు ఫ్లాప్ అవ్వడంతో మరో అవకాశం రాదు. సినిమా చాన్స్ కోసం ఫ్యామిలీని వదిలేసి స్నేహితులు ఆరుద్ర(షకలక శంకర్), ఆత్రేయ(సత్యం రాజేశ్)కలిసి హైదరాబాద్లో కష్టపడుతుంటాడు. మరోవైపు వైజాగ్లో ఫాస్ట్పుడ్ సెంటర్ నడుపుకునే అయాన్(సత్య) హీరో కావాలనని కలలు కంటుంటాడు. అయాన్ని హీరో చేస్తానని నమ్మించి అతని నుంచి డబ్బులు వసూలు చేస్తాడు శ్రీనివాస్. ఫ్రెండ్పై నమ్మకంతో హైదరాబాద్ వస్తాడు అయాన్. ఇక్కడకు వచ్చాక అసలు విషయం తెలుస్తుంది. మోస పోయానని తెలిసినా శ్రీనివాస్ పరిస్థితి చూసి ఏమి అనలేకపోతాడు.ఇక సినిమా ఇండస్ట్రీని వదిలేసి వేరే ఏదైనా పని చేసుకుందాని శ్రీనివాస్ గ్యాంగ్తో పాటు అయాన్ కూడా నిర్ణయం తీసుకుంటారు. సరిగ్గా అదే సమయంలో ఊటికి చెందిన పెద్ద వ్యాపారవేత్త విష్ణు( రాహుల్ మాధవ్) మేనేజర్ గోవిందా గోవిందా(శ్రీకాంత్ అయ్యంగార్) నుంచి శ్రీనివాస్కి ఫోన్ కాల్ వస్తుంది. అతనితో ఓ సినిమాను నిర్మిస్తానని విష్ణు చెబుతాడు. హీరోయిన్గా ఊటీలోనే కాఫీ కేఫ్ రన్ చేస్తున్న గీతాంజలి(అంజలి)ని తీసుకోవాలని విష్ణు సూచిస్తాడు. అలాగే షూటింగ్ అంతా సంగీత్ మహాల్లోనే చేయాలని కండీషన్ పెడతాడు. ఆ మహాల్ చరిత్ర ఏంటి? ఆ బంగ్లాలో ఉన్న దెయ్యాలలో శ్రీను టీమ్కి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి? సినిమా షూటింగ్ని అక్కడే చేయాలని విష్ణు ఎందుకు కండీషన్ పెట్టాడు? హ్యాట్రిప్ ఫ్లాపులు ఇచ్చిన డైరెక్టర్ శ్రీనుతో విష్ణు ఎందుకు సినిమా తీయాలనుకున్నాడు? హీరోయిన్గా అంజలినే ఎందుకు ఎంచుకున్నాడు? ఈ కథలోకి గీతాంజలి ఆత్మ మళ్లీ ఎలా వచ్చింది? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఎలా ఉందంటే.. హారర్ కామెడీ చిత్రాలు తెలుగు తెరకు కొత్తేమి కాదు. పదేళ్ల కిందట వచ్చిన గీతాంజలి ముందు కూడా ఈ జానర్లో సినిమాలు వచ్చాయి. కానీ గీతాంజలి తరహాలో అవి విజయం సాధించలేకపోయాయి. ఆ చిత్రం విజయానికి ప్రధాన కారణం కామెడీ, హారర్తో పాటు ఎమోషన్స్ కూడా చక్కగా కుదరడం. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’లో ఆ ఎమోషన్ మిస్ అయింది. కేవలం కామెడీ, హారర్ ఎలిమెంట్స్తో కథనాన్ని నడింపించారు దర్శకుడు. కథ- కథనంపై ఫోకస్ చేయకుండా కాన్సెప్ట్ని నమ్ముకొని సినిమాను తెరకెక్కించారు.వాస్తవానికి ఈ సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది. దెయ్యాలతో సినిమా షూటింగ్ అనేది కొత్త పాయింటే. ఆ ఎపిసోడ్ వరకు కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ మిగతా కథంతా అంతగా ఆకట్టుకునేలా సాగదు. ప్రేక్షకులను నవ్విస్తూనే..కొన్నిచోట్ల భయపెట్టే ప్రయత్నం చేశారు. కానీ అది పూర్తిగా సక్సెస్ కాలేదు. కొన్ని సన్నివేశాలు అయితే మరీ రొటీన్గా ఉంటాయి. ఇక ఇలాంటి సినిమాల్లో లాజిక్కులను వెతుకొద్దు. కానీ ఎమోషన్స్ని ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా చేయడంలో చిత్రబృందం పూర్తిగా విఫలం అయింది.ఎంతసేపు నవ్వించడం మీదనే ఫోకస్ పెట్టారు. పోనీ ఆ కామెడీ అయినా కొత్తగా ఉందంటే అదీ లేదు. ఫస్టాప్లో వచ్చే కామెడీ సీన్స్ అయితే జబర్దస్త్ షోని గుర్తు చేస్తాయి. ఇంటర్వెల్ వరకు కథంతా సోసోగానే సాగుతుంది. సెకండాఫ్ ప్రారంభంలో కథనం కాస్త ఆసక్తికరంగా, వినోదాత్మకంగా సాగుతుంది. దెయ్యాలను జూనియర్ ఆర్టిస్టులు అని శ్రీను నమ్మించడం.. ఆ తర్వాత సత్య, సునీల్ పాత్రలు ఆ దెయ్యాలతో జరిపే సంభాషణలు నవ్వులు పూయిస్తాయి. క్లైమాక్స్ పరమ రొటీన్గా ఉంటుంది. ఈ హారర్ కామెడీ చిత్రం ప్రేక్షకులను పూర్తిగా భయపెట్టలేదు.. కడుపుబ్బా నవ్వించనూ లేదు. ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్తే మాత్రం కాస్త ఎంటర్టైన్ అవుతారు. ఎవరెలా చేశారంటే.. గీతాంజలి పాత్రలో అంజలి ఒదిగిపోయింది. అల్రేడీ చేసిన పాత్రే కాబట్టి.. ఇంకాస్త చక్కగా నటించింది. ఇందులో ఆమెకు ఓ యాక్షన్ సీన్ ఉంది. ఆ సీన్లో అదరగొట్టేసింది. ఈ సినిమాకు సత్య పోషించిన పాత్ర హైలెట్ అని చెప్పాలి. అయాన్గా ఆయన పండించిన కామెడీ బాగా వర్కౌట్ అయింది. శ్రీనివాస్రెడ్డి, షకలక శంకర్, సత్యం రాజేశ్లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. సినిమాటోగ్రాఫర్ కిల్లర్ నానిగా సునీల్ పండించిన కామెడీ కొన్ని చోట్ల నవ్వులు పూయిస్తుంది. దెయ్యాలుగా రవిశంకర్, ప్రియ కొన్ని చోట్ల భయపెట్టారు. ఆ పాత్రలకు సరైన ముగింపు ఉండదు. రాహుల్ మహదేవ్ విలనిజం అంతగా పండలేదు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు.సాకేతికంగా ఈ సినిమా జస్ట్ ఓకే. హారర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా ముఖ్యం. బీజీఎంతోనే భయపెట్టాలి. కానీ ప్రవీణ్ లక్కరాజు ఆ స్థాయి నేపథ్య సంగీతాన్ని అందించలేకపోయాడు. పాటలు కూడా ఆకట్టుకోలేవు. సినిమాటోగ్రఫీ పర్వాలేదు. గ్రాఫిక్స్ విభాగం పనితీరు వీక్గా ఉంది. ఎడిటింగ్ పర్వాలేదు. సంభాషణలు కొన్నిచోట్ల ట్రెండ్కి తగ్గట్టుగా ఉన్నాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -
Anjali: అందం అభినయం కలబోసిన తెలుగమ్మాయి అంజలి (ఫొటోలు)
-
Ugadi2024 అంజలి ‘పాప’ ఎంత ముద్దుగుందో..! (ఫోటోలు)
-
హారర్... కామెడీ సమానంగా ఉంటాయి: అంజలి
‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా పాయింట్ను కోన వెంకట్గారు నాలుగేళ్ల ముందే చెప్పారు. అయితే అప్పుడు నేను బిజీగా ఉండటం, ఆ తర్వాత ఈ సినిమాలోని ఇతర నటీనటులు బిజీగా ఉండటంతో కుదరలేదు. మధ్యలో కరోనా వచ్చింది. హారర్, కామెడీని బ్యాలెన్స్ చేస్తూ చేసిన ఈ మూవీ ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు హీరోయిన్ అంజలి. ‘గీతాంజలి’కి సీక్వెల్గా రూపొందిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. శివ తుర్లపాటి దర్శకత్వంలో ఎంవీవీ సినిమాస్తో కలిసి కోన వెంకట్ నిర్మించిన ఈ మూవీ ఈ నెల 11న రిలీజవుతోంది. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి’కి ఇది సీక్వెల్ కాబట్టి పాత్రలని మార్చలేదు. కానీ, కొత్త క్యారెక్టర్స్ను (అలీ, సునీల్, సత్య) తీసుకొచ్చాం. రొటీన్గా చేస్తే నటిగా నాకు ఆసక్తి ఉండదు కాబట్టి ప్రతి సినిమాకి కొత్తగా ఉండాలనే చూస్తున్నాను. ఈ ఉగాదికి ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో వస్తుండటం హ్యాపీ’’ అన్నారు. -
'గీతాంజలి మళ్లీ వచ్చింది' మూవీ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
'గీతాంజలి మళ్లీ వచ్చింది' ట్రైలర్ చూసేయండి
థియేటర్లో ప్రేక్షకులను భయపెడుతూనే కడుపుబ్బా నవ్వించిన చిత్రం 'గీతాంజలి'. అంజలి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పటికి వచ్చి దాదాపు పదేళ్లు అవుతుంది. ఇన్నేళ్ల తర్వాత దానికి సీక్వెల్గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా విడుదలకు ఇప్పుడు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ను మేకర్స్ విడుదల చేశారు. శివ తుర్లపాటి తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కోన ఫిల్మ్ కార్పొరేషన్, ఎంవీవీ సినిమా సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 11న ఈ చిత్రం విడుదల కానుంది. ఇందులో టైటిల్ పాత్రలో అంజలి పోషిస్తుండగా.. శ్రీనివాస్ రెడ్డి, సత్యం రాజేశ్, అలీ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అంజలికి ఇది 50వ చిత్రం. ఈ చిత్రానికి కోన వెంకట్ కథ, స్క్రీన్ప్లే సమకూర్చడం విశేషం. అంచనాలతో వచ్చిన ప్రేక్షకులు అంతకుమించి ఆస్వాదించేలా ఈ సినిమా ఉంటుందని కోన వెంకట్ చెప్పారు. -
'ఇలాంటి టైటిల్ పెట్టకపోవడం ఆశ్చర్యంగా ఉంది'
మిర్చి విజయ్, అంజలి నాయర్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న తాజా చిత్రం వైఫ్. ఈ చిత్రం ద్వారా హేమంత్ నాదం దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఒలింపియ మూవీస్ సంస్థ అధినేత ఎస్.అంబేడ్కర్ నిర్మిస్తున్నారు. గతంలో జిప్సీ, డాడా, కలిగేత్తి మూర్కన్ వంటి వైవిధ్యభరిత కథా చిత్రాలను ఆయన నిర్మించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ రిలీజ్ చేశారు. దంపతుల మధ్య నవీన అనుబంధాలను ఆవిష్కరించే కథాచిత్రంగా ఇది ఉంటుందని డైరెక్టర్ హేమంత్ నాదం అన్నారు. అందుకే ఈ చిత్రానికి వైఫ్ అని పేరు పెట్టామని తెలిపారు. ఇలాంటి టైటిల్ను ఇప్పటివరకు ఎవరూ పెట్టకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందన్నారు. చదరంగంలో రాణికి అపార శక్తి ఉంటుందన్నారు. అదేవిధంగా ఒక ఇంటిని చక్కదిద్దడంలో భార్య పాత్ర ముఖ్యమన్నారు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య పెరిగే ప్రేమానుబంధాన్ని ఎమోషనల్గా ఆవిష్కరించే చిత్రమని చెప్పారు. ఈ చిత్రం ద్వారా మిర్చి విజయ్ను కథానాయకుడిగా పరిచయం చేస్తున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ చిత్రానికి కేఏ శక్తివేల్ చాయాగ్రహణం, జెన్ మార్టిన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో మైత్రేయన్, రెడిన్ కింగ్స్ లీ, కల్యాణి నటరాజన్, విజయ్బాబు, విల్లు, కదిర్ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. Super happy to present the First Look of my next Romcom #Wife with @RJVijayOfficial 👰🏻♀️🤵🏻 Directed by @dir_hemanathan Produced by @ambethkumarmla @olympiaMovis@Abishek_jg @shakthi_dop @JenMartinmusic @PMohan93 @gayathribala21@sharmaseenu11@VishnuEdavan1 @DoneChannel1 pic.twitter.com/fqnzgwDBaZ — Anjali (@ianjalinair) March 23, 2024 -
ఆమెను చూస్తే గర్వంగా ఉంది
‘‘అంజలిగారి కెరీర్లో ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ 50వ సినిమా. ఓ తెలుగమ్మాయి ఇన్ని సినిమాలు చేసి, విజయం సాధించడం గర్వంగా ఉంది. అంజలిగారు వందకుపైగా సినిమాలు చేయాలి. మార్చి 22న ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాతో పాటు నా మూవీ ‘ఓం భీం బుష్’ కూడా విడుదలవుతోంది. ఈ రెండు చిత్రాలు విజయం సాధించాలి’’ అని హీరో శ్రీ విష్ణు అన్నారు. హీరోయిన్ అంజలి టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’. 2014లో వచ్చిన ‘గీతాంజలి’ సినిమాకు ఈ చిత్రం సీక్వెల్. శివ తుర్లపాటి దర్శకత్వంలో కోన ఫిల్మ్స్ కార్పొరేషన్ , ఎంవీవీ సినిమాస్పై కోన వెంకట్ నిర్మించిన ఈ చిత్రం మార్చి 22న విడుదలకానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్కు హీరో శ్రీ విష్ణు, దర్శకులు గోపీచంద్ మలినేని, బాబీ, బుచ్చిబాబు సన అతిథులుగా హాజరయ్యారు. అంజలి మాట్లాడుతూ – ‘‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ నా కెరీర్లో ఓ ప్రత్యేకమైన చిత్రంగా నిలుస్తుంది. యాభై సినిమాలు చేయడం నాకు సంతోషాన్నిస్తోంది’’ అన్నారు అంజలి. ‘‘ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుంది’’ అన్నారు కోన వెంకట్. ‘‘ఓ మంచి చిత్రానికి దర్శకత్వం వహించాననే సంతృప్తి కలిగింది’’ అన్నారు శివ తుర్లపాటి. నటులు అలీ, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస రెడ్డి మాట్లాడారు. -
గీతాంజలి మళ్లీ వచ్చింది.. భయపెడుతోన్న టీజర్
రర్ సినిమాలకు ఎప్పుడూ మంచి గిరాకీయే ఉంటుంది. ఇక్కడ ఎవరు నటించారు? ఎవరు డైరెక్ట్ చేశారు? అనేదానికన్నా కథేంటి? కాన్సేప్ట్ ఏంటి? అనే చూస్తారు ప్రేక్షకులు. అలాంటిది ఆల్రెడీ హిట్ కొట్టిన హారర్ మూవీ గీతాంజలికి సీక్వెల్ తెరకెక్కుతోంది. దీంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. అంజలి ప్రధాన పాత్రలో నటించిన మూవీ గీతాంజలి మళ్లీ వచ్చింది. ఇది అంజలి కెరీర్లో 50వ చిత్రంగా తెరకెక్కింది. శివ దర్శకత్వం వహించిన ఈ మూవీని రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించారు. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ప్రధాన పాత్రలు పోషించారు. మొదట టీజర్ లాంచ్ ఈవెంట్ను స్మశానవాటికలో చేద్దామనుకున్నారు. తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు. హైదరాబాద్లోని ఓ కన్వెన్షన్ హాల్లో శనివారం సాయంత్రం టీజర్ లాంచ్ చేశారు. అంజలి క్లాసికల్ డ్యాన్స్తో టీజర్ మొదలైంది. దెయ్యాలను ఎలా నమ్మారు? అనే దగ్గరి నుంచి దెయ్యాలకు జడుసుకునేవరకు చూపించారు.హారర్తో పాటు కామెడీ కూడా పుష్కలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఇక ఈ సినిమాను మార్చి 22న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చదవండి: మీమర్ పిచ్చి ప్రశ్నలు.. హీరో వద్దని వారిస్తున్నా పదేపదే.. -
ముద్దు సన్నివేశాల్లో నటించడం పై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
-
ముద్దు సన్నివేశాల్లో నటించడంపై అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు
తెలుగమ్మాయి అంజలి వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. కేవలం టాలీవుడ్లో కాకుండా కోలీవుడ్, మాలీవుడ్ సినిమాల్లోనూ నటిస్తూ..బిజియెస్ట్ హీరోయిన్గా మారిపోయింది. తాజాగా ఈ బ్యూటీ ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సీన్స్పై తన అభిప్రాయాన్ని తెలియజేసింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాలు సహజంగా వస్తాయని, అందులో నటించక తప్పదన్నారు. అయితే అలాంటి సన్నివేశాల్లో నటించేటప్పుడు తనకు కాస్త ఇబ్బందిగానే ఉంటుందని, కానీ కథ డిమాండ్ చేస్తే చేయక తప్పదన్నారు. (చదవండి: రియల్ లైఫ్లో ఒక్కటి కానున్న రీల్ జంట!) ‘ కొన్ని సన్నివేశాల్లో నటించేటప్పుడు సహనటుడు నా గురించి ఏమనుకుంటాడోనని ఆందోళన కలుగుతుంది..ఇంటిమేట్ సన్నివేశాలు సినిమాకు అవసరం కాబట్టి వాటిని నిరాకరించలేను. అసౌకర్యంగానే వాటిల్లో నటిస్తాను నిజ జీవితంలో ఇద్దరు ప్రేమికుల మధ్య ఉండే కెమిస్ట్రీకి సినిమాలో ప్రేమికుల మధ్య ఉండే దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. అందుకే సహనటులతో ముద్దు సన్నివేశాల్లో నటించేటప్పుడు నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది’ అని అంజలి చెప్పారు. (చదవండి: తెలుగులో ఇదే నా చివరి సినిమా.. మళ్లీ ఆ చాన్స్ రాకపోవచ్చు: మహేశ్ బాబు) ఇక తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ గురించి స్పందిస్తూ.. ‘కొందరు నా పర్సనల్ విషయాల గురించి ఇష్టానుసారంగా రాసేస్తున్నారు. గతంలో జర్నీ నటుడు జైతో ప్రేమలో ఉన్నానని రూమర్స్ క్రియేట్ చేశారు. ఆ తర్వాత అమెరికాకు చెందిన వ్యక్తితో పెళ్లి అయిందని వార్తలు రాశారు. అవన్నీ రూమర్స్ మాత్రమే. వాటిని చూసి నవ్వుకుంటాను తప్ప సీరియస్గా తీసుకొను’అని అంజని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్లో సెకండ్ హీరోయిన్గా నటిస్తోంది. 2014లో ఆమె నటించిన గీతాంజలి సీక్వెల్ ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ మూవీ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. వీటితో పాటు పలు తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. -
'హీరోతో లవ్.. వ్యాపారవేత్తతో పెళ్లి'.. అంజలి ఆన్సరిదే!
పండ్లు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్న సామెత మాదిరిగా సెలబ్రిటీల గురించి ముఖ్యంగా సినీ హీరోయిన్ల గురించి సోషల్ మీడియాలో లేనిపోనివి రాసేస్తుంటారు. అంజలి విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఈ అచ్చ తెలుగమ్మాయి ఫొటో చిత్రం ద్వారా టాలీవుడ్లో హీరోయిన్గా పరిచయమైంది. రామ్ దర్శకత్వంలో 'కట్రదు తమిళ్' చిత్రం ద్వారా కోలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన అంజలి అక్కడ తొలి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తనకు తమిళంలో వరుసగా అవకాశాలు రావడం మొదలెట్టాయి. దీంతో అంజలి అక్కడ బిజీ హీరోయిన్గా మారింది. స్టార్ హీరోలతో జోడీ అలాంటి సమయంలోనే పిన్నితో మనస్పర్థలు తలెత్తడంతో హైదరాబాద్కు మకాం మార్చింది. ఇది ఈమెకు ప్లస్సే అయ్యిందని చెప్పవచ్చు. ఇక్కడ వెంకటేశ్, బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో జత కట్టే అవకాశాలు అందుకుంది. ఇకపోతే హీరో జైతో ప్రేమాయణం.. పెళ్లికి సిద్ధం అవుతున్న అంజలి అంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం సాగింది. దాన్ని అప్పట్లోనే అంజలి లైట్ తీసుకుంది. ఇప్పుడేమో.. ఒక వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయిందని ప్రచారం జరుగుతోంది. తెలియకుండానే పెళ్లి చేస్తున్నారు! దీనిపై ఒక ఇంటర్వ్యూలో స్పందించిన అంజలి సినిమా రంగంలో తనకు చాలా మంది స్నేహితులు ఉన్నారని చెప్పింది. దీంతో తనను ఎవరితో కలిపి రాయాలన్నది కొందరు వారే సొంతంగా నిర్ణయించుకుని రాసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. మొదట్లో హీరో జైను ప్రేమిస్తున్నట్లు రాశారని, ఇప్పుడు ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుని అమెరికాలో సెటిల్ అయినట్లు ప్రచారం జరుగుతోందని తెలిపింది. తనకు తెలియకుండానే తన పెళ్లి చేసేస్తుండడంతో నవ్వు వస్తోందని పేర్కొంది. తమిళంలో ఈమె నటించిన ఏళు కడల్ ఏళు మలై చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. మరోవైపు గీతాంజలి 2 కూడా త్వరలో రిలీజ్ కానుంది. చదవండి: షూటింగ్లో గాయపడ్డ హీరో నితిన్? -
శ్రీలీలతో పోల్చినందుకు రిపోర్టర్ కి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అంజలి
-
శ్రీలీల 6 సినిమాలు చేస్తోంది.. మీరేమో.. అంజలి రిప్లై ఇదే!
తెలుగు హీరోయిన్ అంజలి ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో గీతాంజలి(2014) ఒకటి. పదేళ్ల తర్వాత దీనికి సీక్వెల్గా 'గీతాంజలి మళ్లీ వచ్చింది' అనే సినిమా తెరకెక్కింది. అంజలితో పాటు సత్యం రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, షకలక శంకర్ ప్రధాన పాత్రలు పోషించారు. 'నిన్ను కోరి' సినిమాకు కొరియోగ్రాఫర్గా పని చేసిన శివ తుర్లపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. శ్రీలీలతో పోలిక.. అంజలి చిరాకు ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ అంజలిని ఉద్దేశిస్తూ ఓ ప్రశ్న అడిగింది. 'తెలుగువారికి మీరంటే చాలా అభిమానం. నేను కూడా మీకు పెద్ద అభిమానిని. అయితే మీకు ఇంతవరకు సరైన బ్రేక్ రాలేదని అనిపిస్తోంది. తెలుగమ్మాయి అవడం వల్ల బ్రేక్ రాలేదా? లేదా ఇతర కారణాలేమైనా ఉన్నాయా?' అని అడిగింది. దీనికి అంజలి బదులిస్తూ.. 'నాకు బ్రేక్ రాకపోతే మీకు ఫేవరెట్ హీరో అయ్యేదాన్నే కాదు' అని చెప్పింది. దీనికి సదరు జర్నలిస్టు స్పందిస్తూ.. అలా అని కాదు.. ఈ రోజు శ్రీలీల వరుసగా సినిమాలు చేస్తోంది. మీరేమో.. అని నసగడంతో అంజలి మధ్యలోనే అందుకుంది. కిక్ ఉంటేనే చేస్తా 'నేనెప్పుడూ ఒకటి, రెండు స్థానాల కోసం పోటీపడలేదు. ఒక్కొక్కరికి ఒక్కో హీరోయిన్ నచ్చుతారు. నాకు స్క్రిప్ట్ నచ్చితేనే, అందులోనూ నన్ను నేను ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటేనే ఆ సినిమా చేస్తాను. లేదంటే ఆ పాత్ర ఒప్పుకోను. నేను ఒకేసారి నాలుగు సినిమాలు చేయొచ్చు. కానీ నాలుగింటికి బదులు ఒక్క మంచి సినిమా చేయడమనేది నాకిష్టం. నేను తెలుగుతో పాటు ఇతర మూడు భాషల్లోనూ నటిస్తున్నాను. ఒకేసారి అన్ని చోట్లా నేను ఉండలేను. అక్కడో సినిమా, ఇక్కడో సినిమా చేస్తున్నాను. నాకు కిక్కిచ్చే పాత్రలే చేస్తున్నాను' అని చెప్పుకొచ్చింది అంజలి. చదవండి: సీరియల్ నటి ప్రియాంకకు ఆపరేషన్.. గతంలో ఆమె ప్రియుడికి కూడా! -
నవ్విస్తూ...భయపెడుతూ..
అంజలి టైటిల్ రోల్ చేసిన తాజా చిత్రం ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’. ‘గీతాంజలి’ సినిమాకు ఇది సీక్వెల్. శ్రీనివాస్ రెడ్డి, ‘సత్యం’ రాజేశ్, ‘షకలక’ శంకర్, అలీ, సునీల్, సత్య ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. రచయిత–నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సత్యనారాయణ, జీవీ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది ప్రథమార్ధంలో విడుదల కానుంది. శనివారం ఈ సినిమాలోని క్యారెక్టర్స్ను పరిచయం చేస్తూ విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజలి మాట్లాడుతూ– ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ అంతా ఒక ఎత్తైతే.. క్లైమాక్స్ మరో రేంజ్లో ఉంటుంది. ‘గీతాంజలి’ని ఫ్రాంచైజీగా చేస్తూ, కోనగారు ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ చేశారు. కోనగారి కామెడీ ట్రాక్, ఈ సినిమాను ఆయన డిజైన్ చేసిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. దర్శకుడు శివగారికి ఈ సినిమాతో పెద్ద బ్రేక్ వస్తుంది’’ అన్నారు. ‘‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’’ని అమెరికాలో చేద్దామనుకున్నాం. కొన్ని ్రపాక్టికల్ కారణాల వల్ల ఊటీ బ్యాక్డ్రాప్కి మార్చాం. ప్రేక్షకులు వారి అంచనాలకు మించి ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు కోన వెంకట్. ‘‘ప్రేక్షకులను భయపెడుతూ, నవ్విస్తూ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు శ్రీనివాస్ రెడ్డి. ‘‘బ్లాక్బస్టర్ మూవీ ‘గీతాంజలి’కి సీక్వెల్ చేసే అవకాశాన్ని కల్పించిన కోనగారికి, ఎంవీవీగారికి థాంక్స్’’ అన్నారు శివ తుర్లపాటి. నటుడు రవికృష్ణ, ఎడిటర్ చోటా కె. ప్రసాద్, సినిమాటోగ్రాఫర్ సుజాత సిద్ధార్థ్, మ్యూజిక్ డైరెక్టర్ ప్రవీణ్ లక్కరాజు మాట్లాడారు. -
ప్రేమికుల రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా 'రీ రిలీజ్'
దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన 'జర్నీ' సినిమా అప్పట్లో యూత్ను ఎంతగానో కట్టిపడేసింది. అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడిగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్లో టువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అనేంతగా సినిమా కథలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఇందులోని ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీ.సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 2011 సెప్టెంబర్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ప్రేమికులకు ఈ సినిమా మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
2023.. న్యూ ఇయర్ వేళ.. ఢిల్లీలో జరిగిన ఘోరమిదే!
అది 2023, జనవరి ఒకటి.. దేశమంతా నూతన సంవత్సర వేడుకల్లో మునిగితేలుతోంది. ఇంతలో దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. ఈ ఘటన యావత్ దేశప్రజలను కలచివేసింది. మర్నాటి ఉదయం వెలుగు చూసిన ఒక వీడియో సంచలనంగా మారింది. అదే.. ఢిల్లీలో నూతన సంవత్సరం వేళ కంఝావాలాలో చోటుచేసుకున్న హిట్ అండ్ రన్ ఘటన. ఒక హోటల్ జరిగిన న్యూ ఇయర్ పార్టీకి హాజరైన అంజలి(20) స్కూటీపై ఇంటికి తిరిగి వెళుతోంది. ఇంతలో అటుగా కారులో వచ్చిన యువకులు ఆమె వాహనాన్ని ఢీకొని, కారుని వేగంగా పోనిచ్చారు. అయితే ఆమె కారు కింద ఇరుక్కుపోయింది. కారు ఆమెను ఈడ్చుకుంటూ 12 కిలోమీటర్లు దూరం వరకూ వెళ్లింది. ఆమె తనను కాపాడాలని అరుస్తున్నా ఎవరూ పట్టించుకోలేదు. ఫలితంగా ఆమె మృతి చెందింది. ఈ ఘటన దేశ ప్రజల్లో ఆగ్రహాన్ని నింపింది. ఢిల్లీ పోలీసులు ఈ కేసులో అంజలి స్నేహితురాలు నిధిని కూడా విచారించారు. ఆ సమయంలో అంజలి మద్యం మత్తులో ఉందని నిధి పోలీసులకు తెలిపింది. కాగా వారి స్కూటీ కంఝావాలాలోని సుల్తాన్పురి ఏరియాకు చేరుకున్నంతలో మితిమీరిన వేగంతో వచ్చిన ఒక కారు వీరి స్కూటీని ఢీకొంది. దాంతో నిధి ఎగిరి పక్కన పడిపోగా, అంజలి కారు కింద ఇరుక్కుపోయింది. అయితే కారును ఆపకుండా.. కారులో ఉన్న అయిదుగురు నిందితులు 12 కిలోమీటర్ల దూరం వరకూ అంజలిని ఈడ్చుకుంటూ వెళ్లారు. తరువాత ఆమె మృతదేహాన్ని రోడ్డుపక్కన పడేసి పరారయ్యారు. పోలీసుల విచారణలో నిధి.. తమను కారు ఏవిధంగా ఢీకొన్నదో తెలిపింది. అయితే ఆ సమయంలో తాను భయాందోళనకు లోనైనందుకు పోలీసులకు వెంటనే ఈ విషయం చెప్పలేకపోయానని నిధి పేర్కొంది. కాగా తెల్లవారుజామున 3.24 గంటలకు ఒక మృతదేహాన్ని ఈడ్చుకుంటూ ఒక కారు కుతుబ్ మినార్ వైపు అతివేగంతో వెళుతున్నదని ఢిల్లీలోని కంఝావాలా పోలీస్ స్టేషన్కు సమాచారం అందింది. ఈ ఘటన దర్యాప్తు దరిమిలా విధులలో నిర్లక్ష్యం వహించారంటూ 11 మంది పోలీసులను సస్పెండ్ చేశారు. వీరిలో ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్లు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక కానిస్టేబుల్ ఉన్నారు. ఈ కేసులో ఢిల్లీ పోలీసులు 800 పేజీల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. పోలీసులు ఏడుగురిని నిందితులుగా కేసులో చేర్చారు. వీరిలో అమిత్ ఖన్నా, అశుతోష్లపై మోటారు వాహన చట్టం కింద కేసు కూడా నమోదైంది. బాధిత కుటుంబానికి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఇది కూడా చదవండి: 2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు? -
గీతాంజలి మళ్లీ వస్తోంది
అంజలి టైటిల్ రోల్లో, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్రల్లో నటించిన హారర్ కామెడీ ఫిల్మ్ ‘గీతాంజలి’ (2014) హిట్గా నిలిచింది. ఈ సినిమాకు సీక్వెల్గా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో అంజలి, ‘సత్యం’ రాజేష్, శ్రీనివాస్ రెడ్డి, ‘షకలక’ శంకర్ ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ‘నిన్నుకోరి’, ‘నిశ్శబ్దం’ సినిమాలకు వర్క్ చేసిన కొరియోగ్రాఫర్ శివ తుర్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రచయిత, నిర్మాత కోన వెంకట్ సమర్పణలో ఎంవీవీ సినిమా, కోన ఫిల్మ్ కార్పొరేషన్ సంస్థలపై ఎంవీవీ సత్యనారాయణ, జీవీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హైదరాబాద్, ఊటీ నేపథ్యాల్లో ఈ సినిమా కథనం సాగుతుంది. ‘‘ఇప్పటి వరకు 80 శాతం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో జరగనున్న ఊటీ షెడ్యూల్తో ఈ సినిమా షూటింగ్ పూర్తవుతుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
Anjali: కుక్కపిల్లకు ఓ రేంజ్లో బర్త్డే సెలబ్రేట్ చేసిన అంజలి (ఫోటోలు)
-
Anjali: వెకేషన్లో చిల్ అవుతున్న బ్యూటిఫుల్ అంజలి (ఫోటోలు)
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement