-
వాటే స్కెచ్.. ప్రియుడి మోజులో పడి భర్తను కడతేర్చిన భార్య..
-
దారుణం : తల్లిపై కాల్పులు, భార్యా పిల్లల హత్య, ఆపై ఆత్మహత్య
ప్రపంచవ్యాప్తంగా మదర్స్ వేడుకలకు సిద్ధమవుతుండగా ఉత్తరప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. మత్తుమందులు, మద్యానికి అలవాటు పడిన వ్యక్తి మొత్తం కుటుంబాన్ని పొట్టనబెట్టుకున్నాడు. అనంతరం తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది.పోలీసుల సమాచారం ప్రకారం లక్నోకు దాదాపు 90 కిలోమీటర్ల దూరంలోని సీతాపూర్లోని రాంపూర్ మధురలోని పల్హాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. అనురాగ్ సింగ్ (45) మద్యానికి, మాదక ద్రవ్యాలకు బానిసయ్యాడు. మానసికంగా వికలాంగుడిగా మారిపోయాడు. దీంతో అతగాడిని డీ-అడిక్షన్ సెంటర్కి పంపాలని కుటుంబం భావించింది. కానీ విషయంలో సభ్యులతో తరచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే మరోసారి కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగాడు. మద్యం మత్తులో ఏమి చేస్తున్నాడో తెలియని స్థితిలో ఉన్మాదిలా మారి పోయాడు. తొలుత 65 ఏళ్ల తల్లి సావిత్రిని కాల్చి చంపాడు, తరువాత భార్య ప్రియాంక (40)ని సుత్తితో కొట్టి హత్య చేశాడు. అంతటితో ఆగలేదు ముగ్గురు పిల్లలను (కుమార్తె అశ్విని (12), చిన్న కుమార్తె అశ్విని (10)లను హత్య చేశాడు.ఆ తర్వాత అనురాగ్ తనను తాను కాల్చుకుని పోలీసులకు సమాచారం ఇచ్చాడని సీతాపూర్ ఎస్పీ చక్రేష్ మిశ్రా తెలిపారు. వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారుఈ వార్త దావానలంలా వ్యాపించడంతో సంఘటనా స్థలం వద్ద జనం పెద్ద ఎత్తున గుమి గూడటంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో భారీగా పోలీసు బలగాలను మోహరించి పరిస్థితిని సమీక్షించారు. -
‘ఓడితే.. చంపేస్తారు’
శాక్రమెంటో(కాలిఫోర్నియా): ప్రపంచ బిలీయనీర్ ఎలాన్ మస్క్.. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్పై మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఉక్రెయిన్తో జరుగుతున్న యుద్ధంలో రష్యా ఓడిపోయే ప్రసక్తే లేదని.. ఒకవేళ పుతిన్ ఓడితే గనుక ఆయన్ని హతమారుస్తారంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ‘ఎక్స్’ స్పేసెస్ వేదికపై పలువురు ప్రముఖ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధులతో జరిగిన చర్చలో సోమవారం ఎలాన్ మస్క మాట్లాడుతూ.. ఉక్రెయిన్ యుద్ధం విషయంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ వెనక్కి తగ్గరనే అనుకుంటున్న. ఒకవేళ ఓడితే మాత్రం.. కచ్చితంగా ఆయన్ని హతమార్చే అవకాశం ఉంది. కాబట్టే.. ఆయన ఈ యుద్ధాన్ని కొనసాగిస్తారు. ఆయనపై అంత ఒత్తిడి ఉంది అని మస్క్ చెప్పారు. అయితే మస్క్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ‘‘గతంలోనూ నేను ఇదే చెప్పా. ఆ సమయంలో నన్ను చాలామంది విమర్శించారు. కానీ, వాస్తవాలు వేరు. అవి అంతా తెలుసుకోవాలి. ఈ యుద్ధంలో ఉక్రెయిన్ గెలిచే అవకాశమే లేదు. గెలుస్తుందనుకోవడం ఆ దేశానికి మంచిది కాదు. పైగా ఇంకా ఎక్కువ రోజులు యుద్ధం జరిగితే వాళ్లకే( ఉక్రెయిన్)కే ప్రమాదం. యుద్ధంలో.. అమెరికా ప్రకటించే ఆర్థిక సాయం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు’’ అని మస్క్ తేల్చేశారు. అదే సమయంలో రష్యాతో స్పేస్ ఎక్స్ ఒప్పందం రద్దు అంశాన్ని ప్రస్తావించిన మస్క్.. ఈ యుద్ధంలో తన మరో కంపెనీ పోషిస్తున్న పాత్రపైనా వివరణ ఇచ్చారు. ‘‘రష్యాను అణచివేయడానికి మా కంపెనీల కంటే మరేవీ గొప్పగా పనిచేయలేదు. ఉక్రెయిన్కు ఇప్పటికే స్పేస్ఎక్స్ స్టార్లింక్ సేవలను అందిస్తోంది. రష్యాకు వ్యతిరేకంగా కీవ్ సమాచార వ్యవస్థలో ఇప్పుడు అది కీలకంగా మారింది. రెండువైపులా ప్రాణనష్టాన్ని నిలువరించడమే తన లక్ష్యమని అన్నారాయన. -
సింగోటం రాము హత్య కేసులో సంచలన నిజాలు
-
నటి జీవితం విషాదాంతం: మమకారం మరిచిన కన్న కొడుకే!
అమ్మను మించిన దైవం లేదని అందరమూ నమ్ముతాం. కానీ మద్యం, డబ్బు వ్యామోహం మనిషిని ఎంతకైనా దిగజార్చుతుంది. దీనికి ఉదారహణే తమిళ నటి హత్య. దిగ్భ్రాంతికరమైన ఈ సంఘటన వివరాలను పరిశిలిస్తే.. పోలీసులు అందించిన వివరాల ప్రకారం ‘కడైసి వివాసాయి’ సినిమాతో పాపులర్ తమిళ నటి కాసమ్మాళ్ హత్యకు గురైంది. అదీ కని పెంచిన సొంత కొడుకు నామకోడి ఆమెను కొట్టి దారుణంగా హత్య చేశాడు. నామకోడి 15 ఏళ్లుగా భార్యకు దూరంగా ఉంటూ, తల్లి వద్దే ఉంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తరచూ విబేధాలు, వాగ్వాదం జరుగుతుండేవి. గత ఆదివారం (ఫిబ్రవరి 4) రోజు కూడా మద్యం కోసం డబ్బులివ్వమని తల్లిని డిమాండ్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్యా వాగ్వాదం చోటు చేసుకుంది అంతే విచణక్ష మరిచిన అతగాడు చెక్కతో తల్లిపై దాడిచేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. తమిళనాడులోని మధురైకి సమీపంలోని అనయ్యూర్లోని కాసమ్మాళ్ స్వగృహంలో ఈ విషాదం చోటు చేసుకుంది. దీనిపై ప్రాథమిక విచారణ తరువాత,కేసు నమోదు చేసిన పోలీసులు నామకోడిని అరెస్ట్ చేశారు. కాసమ్మాళ్, ఆమె భర్త దివంగత బాలసామి దంపతుల నలుగురు పిల్లలలో నామకోడి ఒకరు. కాగా కాసమ్మాళ్ 2022లో విడుదలైన 'కడైసి వివాసాయి' చిత్రంలో విజయ్ సేతుపతి తల్లిగా నటించి మంచి పేరు సంపాదించుకుంది. ఎం మణికండాని దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నల్లంది, యోగి బాబు ఇతర ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ ఉత్తమ తమిళ చిత్రంగా జాతీయ అవార్డును కూడా గెలుచుకుంది. -
హత్య చేసిన నిందితుడిని గుర్తించాం: సీపీ రవిశంకర్
-
ఎమ్మార్వో రమణయ్య కేసులో బయటపడ్డ సంచలన నిజాలు
-
విశాఖ ఎమ్మార్వో హత్యకేసులో దర్యాప్తు ముమ్మరం
-
హైదరాబాద్ రామాంతాపూర్ లో దారుణం
-
పెళ్లైన మూడు రోజులకే దారుణం.. సొంత తండ్రే కిరాతకం
చెన్నై: తమిళనాడులో ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటను దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. కోటి కలలతో ఏడు అడుగులు వేసిన జంటను నిర్దాక్షిణ్యంగా కొట్టి చంపిన ఘటన సంచలనం సృష్టించింది. ఈ సందర్భంగా గతంలో జరిగిన అనేక పరువు హత్యలను గుర్తుకు తెచ్చింది. తమకంటే పేదవాడైన అబ్బాయిని పెళ్లి చేసుకుందన్న అక్కసుతో నవదంపతులను సొంత తండ్రే హత్య చేసినట్టు తెలుస్తోంది. తమిళనాడులోని తూత్తుకుడిలో గురువారం రాత్రి ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం..కోవిల్పట్టికి చెందిన మరిసెల్వం (24), ఎం కార్తీక (20) కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఇంటినుంచి పారిపోయారు. రక్షణ కోరుతూ కోవిల్పట్టి ఈస్ట్ పోలీస్ స్టేషన్ అధికారులను ఆశ్రయించారు. ఆ తర్వాత అదే రోజు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పెళ్లి చేసుకుని బుధవారం వరకు కోవిల్పట్టిలో ఉన్నారు. సంచలనం సృష్టించింది. ఇదిలావుండగా, వీరి పెళ్లి ముందు ఇరు కుటుంబాలు వ్యతిరేకించినప్పటికీ పెళ్లి తరువాత, సెల్వం కుటుంబం కొత్త జంటను ఆదరించింది. ఈ నేపథ్యంలో గత మూడు రోజులుగా సెల్వం తన భార్య కార్తీకతో కలిసి జిల్లాలోని మురుగేషన్ నగర్ ప్రాంతంలోని తన తల్లిదండ్రుల ఇంట్లో నివసిస్తున్నాడు. దీంతో అదను కోసం వేచి చూస్తున్న దుండగులు పథకాన్ని పక్కాగా అమలు చేశారు. మూడు బైక్లపై వచ్చిన ఆరుగురు గుర్తుతెలియని ముఠా మారణాయుధాలతో ఇంట్లోకి చొరబడి నవ దంపతులపై దాడి చేసి హత్య గావించింది ఆ తరువాత అక్కడినుంచి అక్కడి నుండి పారిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు బృందం మృతదేహాలను స్వాధీనం చేసుకుంది. పోస్టుమార్టం నిమిత్తం తూత్తుకుడి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు. హంతకుల ఆచూకీ కోసం గాలిస్తున్నామని తూత్తుకుడి ఎస్పీ ఎల్ బాలాజీ శరవణన్ తెలిపారు. అలాగే అమ్మాయి తండ్రి ముత్తు రామలింగం కిరాయి హంతకులతో వారిద్దరినీ హత్య చేయించినట్టు తమ ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. మూడు ప్రత్యేక బలగాలతో దర్యాప్తు కొనసాగుతోందన్నారు. -
అమెరికాలో దాడి.. విషమంగానే ఖమ్మం యువకుడి పరిస్థితి
చికాగో: అమెరికా చికాగోలో దుండగుడి చేతిలో కత్తిపోట్లకు గురైన ఖమ్మం యువకుడు వరుణ్ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. గత మూడు రోజులుగా ఆయనకు వెంటిలేటర్ మీదనే చికిత్స కొనసాగుతోందని వైద్యులు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి దృష్యా వరుణ్ని ఫోర్ట్ వేన్లోని లూథరన్ ఆసుపత్రికి తరలించారు. ఖమ్మంలోని బుర్హాన్పురంలో నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు పుచ్చా రామ్మూర్తి కుమారుడు వరుణ్ చికాగోలో ఉంటూ ఎంఎస్ చదువుతున్నాడు. ఈ నెల 29న జిమ్ నుంచి బయటకు వస్తున్న వరుణ్పై అకస్మాత్తుగా ఓ దుండగుడు కత్తితో దాడి చేశాడు. తీవ్రగాయాలపాలైన వరుణ్ రక్తపు మడుగులో పడిపోగా స్థానికుల సమాచారంతో పోలీసులు వచ్చి ఆస్ప త్రికి తరలించారు. ఈ కేసులో నిందితుడు ఆండ్రేడ్ జోర్డాన్ను పోలీసులు అరెస్టు చేశారు. వరుణ్ రాజ్పై జరిగిన దాడితో మేము దిగ్భ్రాంతి చెందామని వాల్పరైసో విశ్వవిద్యాలయం ప్రెసిడెంట్ జోస్ పాడిల్లా అన్నారు. అటు వరుణ్ చికిత్స ఖర్చుల కోసం ఉత్తర అమెరికా తెలుగు సంఘం (NATS) గో ఫండ్ మీ(GoFundme)లో నిధుల సమీకరణను ప్రారంభించింది. బుధవారం రాత్రికి 38,000 డాలర్లకు పైగా సమీకరించింది. అమెరికాలో నివసిస్తున్న వారి బంధువు సాయివర్ధన్ ఫోన్ చేసి వరుణ్ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. కాగా, తాము అమెరికా వెళ్లేందుకు సహకరించాలని మంత్రి పువ్వాడ అజయ్ను కోరినట్లు రామ్మూర్తి తెలిపారు. ఇదీ చదవండి: అమానవీయం: రక్తపు మడుగులో ఫిల్మ్మేకర్.. ఫోన్, కెమెరా దొంగతనం -
చంపాపేట్ లో స్వప్న హత్య కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరం
-
టీవీ మహిళా జర్నలిస్టు హత్యకేసు: ఆ దుర్మార్గులదే ఈ పని!
Justice for journalist Soumya Vishwanathan యువ మహిళా టీవీ జర్నలిస్టు సౌమ్య విశ్వనాథన్ హత్యకేసులో ఎట్టకేలకు న్యాయం జరిగింది. సంచలనం రేపిన ఈ కేసులో ఐదుగురు నిందితులను కోర్టు దోషిలుగా నిర్ధారించింది. రవికపూర్, అమిత్ శుక్లా, అజయ్ కుమార్, బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలను సాకేత్ కోర్టు దోషులుగా బుధవారం తేల్చి చెప్పింది. దాదాపు పదిహేనేళ్ల తర్వాత ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. జర్నలిస్ట్ సౌమ్యా విశ్వనాథన్ 2008 సెప్టెంబరు 30న ఢిల్లీలో తన కారులో గాయాలతో శవమై కనిపించారు. ఇది తొలుత యాక్సిడెంట్ కేసుగా నమోదుచేశారు. కానీ తలపై తుపాకీతో కాల్చినట్లు ఫోరెన్సిక్ నివేదికలో వెల్లడైంది. ఆ తరువాత సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. 2009 మార్చిలో నిందితులను పోలీసులు అదుపులోకి విచారించగా సౌమ్యాను తామే హత్య చేసినట్లు అంగీకరించారు. తుపాకితో కాల్చి ఆమెను అతి కిరాతకంగా హత్య చేసిన దుండుగులు.. మృతదేహాన్ని కారులో పడేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశారని పోలీసులు తేల్చారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్ కుమార్, అజయ్ సేథిలను దోషులుగా తేల్చింది. అంతేకాదు, మహారాష్ట్ర కంట్రోల్ ఆఫ్ ఆర్గనైజ్డ్ క్రైమ్ చట్టంలోని నిబంధనల ప్రకారం దోపిడి కేసులోనూ దోషులుగా పేర్కొంది. వీరిలో రవి కపూర్, అమిత్ శుక్లా, బల్జిత్ మాలిక్, అక్షయ్లను హత్య, దోపిడీ కేసులో దోషులుగా నిర్దారించిన కోర్టు.. వీరికి సహకరించినందుకు ఐదో నిందితుడు అజయ్ను కూడా దోషిగా ప్రకటించింది. పదిహేనేళ్ల సుదీర్ఘ విచారణను అక్టోబరు 13న పూర్తిచేసిన సాకేత్ కోర్టు అడిషినల్ సెషన్స్ జడ్జి రవీంద్ర కుమార్ పాండే.. తీర్పును రిజర్వులో ఉంచిన సంగతి తెలిసిందే. డిఫెన్స్, ప్రాసిక్యూషన్ ఈ నెల ప్రారంభంలో తమ వాదనలను పూర్తి చేయడంతో అదనపు వాదనలు లేదా వివరణల కోసం నాలుగు రోజులు సమయం ఇచ్చారు. ఎటువంటి అభ్యర్థనలు రాకపోవడంతో తీర్పును బుధవారం వెలువరించారు. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) పోయిన నా బిడ్డ ఎలాగూ తిరిగి రాదు,కానీ : తల్లి ఆవేదన కోర్టు తీర్పుపై సౌమ్యా విశ్వనాథన్ తల్లి మాధవి విశ్వనాథన్ భావోద్వేగానికి లోనయ్యారు. తన కూతురు ఎలాగూ చనిపోయింది.. ఆమె తిరిగి రాదు కానీ ఈ తీర్పు నేరస్థుల్లో భయాన్ని రేపుతుంది. లేదంటే వాళ్లు మరింత రెచ్చిపోతారని ఆమె వ్యాఖ్యానించారు. ఈ సందర్బంగా ఈ కేసును విచారించిన పోలీసు అధికారిని హత్తుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. కనీసం వారికి జీవిత ఖైదు విధించాలని కోరారు. (భీకర పోరు: సాహో ఇండియన్ సూపర్ విమెన్, వైరల్ వీడియో) #WATCH | Journalist Soumya Vishwanathan murder case: Soumya Vishwanathan's parents in Delhi's Saket court for verdict in the case pic.twitter.com/95wY7t6OBd — ANI (@ANI) October 18, 2023 జిగిషాను హత్యచేసిన వాళ్లే సౌమ్యాను కూడా ఇది ఇలా ఉంటే కాల్ సెంటర్ ఉద్యోగి జిగిషా ఘోష్ హత్యలో వీళ్లేనేరస్థులు కావడం గమనార్హం. జిగిషా హత్యలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకోవడంతోనే విశ్వనాథన్ హత్య కేసును కూడా ఛేదించినట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ కేసులో రవి కపూర్ అమిత్ శుక్లా లను తొలుత అరెస్టు చేశారు. అనంతర బల్జీత్ మాలిక్, అజయ్ సేథీలతో పాటు వారిపై ఛార్జ్ షీట్ (జూన్ 2010) దాఖలు చేశారు. నవంబర్ 2010లో విచారణ ప్రారంభమైంది. విచారణ జూలై 2016లో ముగిసింది. కపూర్, శుక్లాలకు మరణశిక్ష, మాలిక్కు ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది. అయితే, జనవరి 2018లో కపూర్, శుక్లాల మరణశిక్షను హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చింది. అయితే మాలిక్ జీవిత ఖైదును సమర్థించింది. -
వీడిన శంషాబాద్ మహిళ హత్య కేసు మిస్టరీ
-
వివేకా లేఖను పట్టించుకోరా? కీలక అంశాన్ని సీబీఐ ఎందుకు విస్మరించింది!
సాక్షి, అమరావతి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అత్యంత కీలకమైనదిగా భావిస్తున్న వివేకా లేఖపై CBI నిశితంగా దృష్టి సారించక పోవడం విస్మయపరుస్తోందని ప్రముఖ జాతీయ వార్త వెబ్సైట్ ‘ద వైర్’ The Wire పేర్కొంది. CBI ఛార్జ్ షీట్లో ఏముంది? ‘డ్రైవర్ ప్రసాద్ తనపై తీవ్రంగా దాడి చేసినట్టు వివేకా పేర్కొన్నట్టుగా ఆ లేఖలో ఉంది. ఆ లేఖను వంట మనిషి లక్ష్మమ్మ కుమారుడు ప్రకాశ్ చూసి పీఏ కృష్ణా రెడ్డికి ఇచ్చాడు. ఆయన వెంటనే అంటే ఉదయం 6.29 గంటలకు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఫోన్ చేసి ఆ లేఖలో ఉన్న సమాచారాన్ని చదివి వినిపించారు. తాము వచ్చే వరకు ఆ లేఖను గోప్యంగా ఉంచమని, ఎవ్వరికీ ఇవ్వొద్దని చెప్పారు. దాంతో కాసేపటి తర్వాత అక్కడకు చేరుకున్న సీఐ శంకరయ్యకు కూడా కృష్ణా రెడ్డి ఆ లేఖ విషయం చెప్పలేదు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరెడ్డి తదితరులు పులివెందులకు చేరుకున్నాక ఆ రోజు సాయంత్రం ఆ లేఖను వైఎస్సార్ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మకు అప్పగించారు’ అనే విషయాన్ని చార్జ్షీట్లో పేర్కొంది సిబిఐ. ఈ విషయాన్ని ప్రస్తావించడం మినహా ఇంత కీలకమైన విషయంపై సీబీఐ ఎందుకు లోతుగా దర్యాప్తు చేయలేదని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రాజకీయ, నేర సంబంధమైన పరిశోధనాత్మక పాత్రికేయంలో 20 ఏళ్ల అనుభవం ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ సరితా రాణి ‘ద వైర్’ వెబ్సైట్లో రాసిన కథనంలో ఎన్నో కీలక ప్రశ్నలను సంధించారు. తీవ్ర గాయాలతో లేఖ రాయగలిగారా? వివేకా లేఖపై ఇప్పటికీ సందిగ్ధత తొలగిపోలేదు. సీబీఐ దస్తగిరిని అప్రూవర్గా మార్చి వాంగ్మూలం ఇప్పించేంత వరకు ఆ లేఖ ఎప్పుడు రాశారన్న దానిపై స్పష్టత రాలేదు. వివేకాపై దాడి తర్వాత ఆయనతో బలవంతంగా ఆ లేఖను తాము ఎలా రాయించామని దస్తగిరి వెల్లడించాకే సందేహాలు మరింతగా పెరిగాయి. అప్రూవర్గా మారిన దస్తగిరి తన వాంగ్మూలంలో వెల్లడించిన ప్రకారం.. "మొదట సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి ముఖంపై గట్టిగా కొట్టాడు. దాంతో వివేకా కింద పడిపోయారు. ఉమాశంకర్ రెడ్డి గొడ్డలితో వివేకా నుదుటి మీద నరికాడు. వివేకా నుదుటి మీద 3.5 ఇంచ్ల వెడల్పు, 6 ఇంచ్ల లోతుగా పక్క పక్కనే రెండు గాయాలున్నాయని పోస్టువర్టం నివేదిక వెల్లడించింది." భూమి పత్రాల కోసం గాలింపు "సునీల్యాదవ్ వివేకా గుండెపై 15–16 సార్లు గట్టిగా పిడిగుద్దులు గుద్దాడు. ఉవశంకర్ రెడ్డి తన చేతిలో ఉన్న గొడ్డలిని దస్తగిరికి ఇచ్చి వివేకా లేవకుండా చూడమని చెప్పారు. తాము భూమి పత్రాలు ఎక్కడ ఉన్నాయో వెతుకుతామని చెప్పాడు. వివేకా అతి కష్టం మీద లేవడానికి ప్రయత్నించాడు. నా ఇంట్లో ఏం వెతుకుతున్నారని ప్రశ్నించారు. దాంతో దస్తగిరి గొడ్డలితో వివేకా కుడి చేతి మీద దాడి చేశాడు. వివేకా కుడి అరచేతిలో 2 ఇంచ్ల వెడల్పు, ఒక ఇంచి లోతున గాయం ఉందని పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది. కుడి చేతి మీద గొడ్డలితో గాయపరిచిన తర్వాత వివేకాతో నిందితులు లేఖ రాయించారు. కుడి చేతివాటం వ్యక్తి అయిన వివేకా ఆ లేఖ రాశారని" సీబీఐ పేర్కొంది. తీవ్రంగా గాయపడ్డ తర్వాత లేఖ రాయగలిగారా? గాయం వల్ల వివేకా మెదడు బయటకు వచ్చిందని దస్తగిరి పేర్కొనడం గమనార్హం. అంత తీవ్ర గాయమైన తర్వాత లేఖ రాసే స్థితిలో వివేకా ఉన్నారా అన్నది ప్రశ్నార్థకం. ఆ లేఖ వివేకానే రాసినట్టు హైదరాబాద్లోని సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (CFSL) నిర్ధారించింది. కాగా తీవ్రమైన ఒత్తిడి, అత్యంత సంక్లిష్ట ప్రక్రియ నడుమ ఆ లేఖ రాసినట్టుగా ఉందని ఢిల్లీలోని CFSL నివేదిక వెల్లడింంది. కానీ అంతటి తీవ్ర గాయాలు అయ్యాక.. మెదడు బయటకు వచ్చిన తర్వాత కూడా ఓ వ్యక్తి అలా లేఖ రాయడం సాధ్యమా? అని సీబీఐ వైద్య నిపుణులను సంప్రదించకపోవడం విడ్డూరం. ఆ వేలి ముద్రలు ఎవరివో? హత్య కేసు దర్యాప్తులో వేలి ముద్రలు అత్యంత కీలకం అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే వివేకా హత్యకు గురైన స్థలంలో గుర్తించిన మూడు గుర్తు తెలియని వేలి ముద్రలు ఎవరివనే విషయంపై సీబీఐ ఇప్పటి వరకు దృష్టి సారించకపోవడం విస్మయపరుస్తోంది. వివేకా నివాసంలోని బాత్రూం గోడల టైల్స్ మీద రెండు వేలి ముద్రలు, తలుపు వెనుక ఒక వేలి ముద్రను క్లూస్ టీమ్ గుర్తించింది. గోడల టైల్స్ మీద ఉన్న వేలి ముద్రలు రక్తంతో ఉండటం గమనార్హం. కాగా ఆ మూడు వేలి ముద్రలు నిందితులు నలుగురితోపాటు వివేకా నివాసానికి వచ్చిన బంధువులు, ఇతరుల వేలి ముద్రలతో సరిపోలలేదు. అంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు రాత్రి వివేకా నివాసంలో ఉన్నట్టుగా భావించాల్సి వస్తోంది. కానీ సీబీఐ ఇప్పటి వరకు ఆ వేలి ముద్రలు ఎవరివనే దిశగా దర్యాప్తు చేయనే లేదు. IPDR డేటా అహేతుకం ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్రెడ్డి మధ్య వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు ‘ఇంటర్నెట్ ప్రొటోకాల్ డీటైల్ రికార్డ్స్(IPDR) నివేదిక ఆధారంగా గుర్తించినట్టు సీబీఐ పేర్కొంది. కానీ ఐపీడీఆర్ డేటా అన్నది శాస్త్రీయంగా కచ్చితమైన ఆధారం కాదు. ఆ సమయంలో మొబైల్ ఫోన్లు ఆన్లో ఉన్నాయని మాత్రమే ఐపీడీఆర్ చెబుతుంది. సాధారంగా అర్ధరాత్రి దాటిన తర్వాత మొబైల్ నెట్వర్క్లు తమ డేటా బ్యాకప్ తీసుకుంటూ ఉంటాయి. దాంతో మొబైల్ డేటా ఆన్లో ఉన్నట్టు చూపిస్తుంది. అంత మాత్రాన ఆ మొబైల్ ఫోన్ల ద్వారా మాట్లాడుతున్నట్టుగానీ, మెసేజ్లు పంపిస్తున్నట్టుగానీ నిర్ధారింనట్టు కాదు. ఇక ఆ ఫోన్ల నుం ఇతర ఫోన్లకు మెసేజ్లు వెళ్లాయా.. లేదా అన్నది కూడా ఐపీడీఆర్ డేటా ద్వారా నిర్ధారించడం సాధ్యం కాదు. కాబట్టి ఎర్ర గంగిరెడ్డి, అవినాశ్ రెడ్డి మధ్య ఆ రోజు రాత్రి వాట్సాప్ చాటింగ్ జరిగినట్టు ఐపీడీఆర్ డేటా ద్వారా నిర్ధారించలేం. ఈ విషయంలో సీబీఐ వాదన పూర్తిగా అహేతుకమని స్పష్టమవుతోంది. గంగిరెడ్డి మొబైల్ ఫోన్ నుంచి వెళ్లిన మెసేజ్లను గుర్తించేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యపడలేదని సీబీఐ తెలిపింది. కాగా 2019 వర్చి 15నే ఎర్ర గంగిరెడ్డి మొబైల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డేటాను పరిశీలించినప్పటికీ అందులో అనుమానాస్పదమైన సమాచారం ఏమీ లభించలేదని పోలీసులు ప్రకటించిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. గూగుల్ టేక్ ఔట్పై మాట మారింది! నిందితులు 2019 మార్చి 14, 15 తేదీల్లో ఎక్కడ ఉన్నారనే విషయాన్ని గూగుల్ టేక్ అవుట్ ద్వారా నిర్ధారించామన్న సీబీఐ వాదన తప్పని తేలిపోయింది. ఎర్ర గంగిరెడ్డి, ఉవశంకర్ రెడ్డి ఫోన్లు వారి ఇళ్లలోనే ఉన్నట్టుగా సెల్ టవర్ల లోకేషన్ స్పష్టం చేస్తోంది. కాగా సునీల్ యాదవ్ మొబైల్ ఫోన్ గూగుల్ టేక్ అవుట్ డేటాపై సీబీఐ ఎక్కువగా దృష్టి సారించింది. 2019 మార్చి 14 అర్ధరాత్రి 2.42 గంటలకు సునీల్యాదవ్ వివేకా నివాసంలో ఉన్నట్టు.. 2.34 గంటలకు వివేకా నివాసానికి 15 మీటర్ల దూరంలో, 2.35 గంటలకు వివేకా నివాసానికి 10 మీటర్ల దూరంలో ఉన్నట్టు.. 2.42 గంటలకు వివేకా నివాసంలో ఉన్నట్టుగా పేర్కొంది. కాగా సునీల్ యాదవ్ నివాసం వివేకా నివాసానికి 160 మీటర్ల దూరంలోనే ఉంది. ఇది ఎంతో ముఖ్యమైన అంశం. ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లో గూగుల్ టేక్ ఔట్ డేటాకు, వాస్తవ లొకేషన్కు 500 మీటర్ల నుంచి 1,500 మీటర్ల వరకు వ్యత్యాసం ఉంటుందని నిపుణులే స్పష్టం చేస్తున్నారు. అందుకే ఈ కేసు విచారణ సమయంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఆ విషయాన్ని ప్రశ్నించారు. గూగుల్ టేక్ ఔట్ డేటాను బట్టి ఎలా నిర్ధారించగలుగుతారని అడిగారు. దాంతో CBI తన మూడో అనుబంధ చార్జ్షీట్లో మాట మార్చింది. యూనివర్సల్ కాలమానానికి (UTC), భారత కాలమానానికి (IST) మధ్య వ్యత్యాసాన్ని తాము గమనించక పొరపాటు చేశామని వెల్లడించడం గమనార్హం. గూగుల్ టేక్ ఔట్ డేటాను విశ్లేషిస్తే ఢిల్లీలోని CFSL పేర్కొన్న సమయం UTC కాలమానం ప్రకారం అని వెల్లడించింది. వాస్తవానికి యూటీసీ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందుంటుంది. అంటే సునీల్ యాదవ్ వివేకా నివాసంలో 2019 మార్చి 14 అర్ధరాత్రి దాటిన తర్వాత 2.42 గంటలకు ఉన్నట్టు తాము మొదటి చార్జ్షీట్లో పేర్కొంది వాస్తవం కాదని సీబీఐ అంగీకరింంది. సునీల్ యాదవ్ వివేకా నివాసంలో 2019 మార్చి 15న ఉదయం 8.12 గంటలకు ఉన్నారని తెలిపింది. అంటే వివేకా హత్యకు గురయ్యారని అందరికీ తెలిసిన తర్వాత కొన్ని వందల మంది అక్కడ గుమిగూడిన తర్వాత సునీల్ యాదవ్ చేరుకున్నారని చెప్పింది. ఆస్తి వివాదాన్ని ఎందుకు పట్టించుకోలేదు? రాజకీయ కారణాలతోనే వివేకాను హత్య చేశారని సీబీఐ చార్జ్షీట్లో పేర్కొంది. కానీ దస్తగిరి, రంగన్న వాంగ్మూలాలను పరిశీలిస్తే ఆస్తి కోసం ఈ హత్య చేసి ఉండొచ్చన్నది స్పష్టమవుతోంది. ఎందుకంటే వివేకాను హత్య చేసిన తర్వాత నిందితులు ఆస్తి పత్రాల కోసం ఆయన నివాసంలో వెతికారన్నది స్పష్టమవుతోంది. ఆ నివాసంలో అల్మారా (బీరువా) తలుపు బద్దలు గొట్టడానికి ప్రయత్నించినట్టు పోలీసులు గుర్తించారు కూడా. అంటే హత్యకు ఆస్తి వివాదం ప్రధాన కారణం కావచ్చు. నిందితులు ఏ పత్రాల కోసం వెతికారన్నది సీబీఐ ఇప్పటి వరకు గుర్తించలేకపోయింది. దొంగతనం, ఆస్తి వివాదం అనే కోణంలో సీబీఐ ఈ కేసును ఎందుకు దర్యాప్తు చేయడం లేదన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఒకే సమయంలో రెండు చోట్ల ఉండటం సాధ్యమా? సునీల్ యాదవ్ ఎక్కడ ఉన్నారనే దానిపై సీబీఐ వాదనలు మరింత అసంబద్ధంగా ఉన్నాయి. దస్తగిరిని అప్రూవర్గా వర్చి ఇప్పింన వాంగ్మూలం, రంగన్న వాంగ్మూలం ప్రకారం ఆ రోజు రాత్రి 1.30 గంటల నుంచి 3 గంటల వరకు సునీల్ యాదవ్ వివేకానందరెడ్డి నివాసం లోపల ఉన్నాడు. కానీ ఆ రోజు రాత్రి 1.58 గంటలకు సునీల్ యాదవ్.. వైఎస్ భాస్కర్రెడ్డి నివాసంలో ఉన్నట్టుగా గూగుల్ టేక్ అవుట్ డేటా చూపిస్తోందని కూడా సీబీఐ పేర్కొంది. ఒకే సమయంలో ఒక వ్యక్తి వేర్వేరు చోట్ల ఎలా ఉండగలరు? సునీల్ యాదవ్ ఆ సమయంలో వైఎస్ భాస్కర్ రెడ్డి నివాసంలో ఉంటే.. అదే సమయంలో అక్కడికి కిలోమీటర్ దరంలో ఉన్న వివేకా నివాసంలో కూడా ఉండి ఆయన్ను ఎలా హత్య చేయగలడు? మరి సీబీఐ ఇంత చిన్న అంశాన్ని విస్మరిస్తూ కేసు దర్యాప్తు చేస్తుండటం ఏమిటి? రూ.40 కోట్ల డీల్ కథ తేల్చలేదెందుకు? అసలు వివేకానందరెడ్డిని నిందితులు ఎందుకు హత్య చేశారనే అంశంపై సీబీఐ వాదన అసంబద్ధంగా ఉంది. దస్తగిరి వాంగ్మూలం ప్రకారం.. వివేకాను హత్య చేస్తే శివశంకర్ రెడ్డి 40 కోట్ల రూపాయలు ఇస్తారని ఎర్ర గంగిరెడ్డి తనతో చెప్పారని దస్తగిరి పేర్కొన్నాడు. అందుకు సునీల్ యాదవ్ ద్వారా దస్తగిరికి అడ్వాన్స్గా కోటి రూపాయలు పంపించారు. అందులో 25 లక్షలు సునీల్ యాదవ్ అప్పుగా తీసుకున్నాడు. ఆ డబ్బులతో పులివెందులలో విల్లా కొనుగోలు చేయాలని భావించినట్టు దస్తగిరి చెప్పాడన్నది సిబిఐ పేర్కొన్న విషయం. కాగా ఇక్కడ ప్రశ్నార్థకం ఏమిటంటే.. వివేకా హత్య కోసం కుదిరినట్టు చెబుతున్న డీల్ డబ్బును సీబీఐ ఇప్పటికీ రికవరీ చేయలేకపోయింది. కేసు విచారణ సందర్భంగా తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి కూడా సీబీఐని ఇదే విషయంపై ప్రశ్నించారు. నిందితుల మధ్య చేతులు మారినట్టు చెబుతున్న డబ్బును ఎందుకు రికవరీ చేయలేకపోయారంటే సీబీఐ సరైన సవధానం చెప్పలేకపోయింది. పులివెందులలో చెప్పుల దుకాణం నిర్వహిస్తున్న మున్నా బ్యాంక్ లాకర్ నుంచి రికవరీ చేసిన 46.70 లక్షల రూపాయలకు సంబంధించి సీబీఐ చెబుతున్న వాదన నమ్మదగ్గదిగా లేదని కూడా న్యాయస్థానం వ్యాఖ్యానించడం గమనార్హం. 2020 సెప్టెంబర్ 9న మున్నా బ్యాంకు లాకర్లో ఉన్న 46.70 లక్షల రూపాయలను సీబీఐ జప్తు చేసింది. ఈ జప్తు వ్యవహారం భారత సాక్ష్యాధారాల చట్టం సెక్షన్ 27 ప్రకారం లేదని న్యాయస్థానం స్పష్టం చేయడం గమనార్హం. -
విశాఖలోని కానిస్టేబుల్ రమేష్ హత్య కేసులో పురోగతి
-
సత్తెనపల్లి మండలం ధూళిపాళ్లలో ట్రిపుల్ మర్డర్
-
అప్సర కేసులో సంచలనం రేపుతున్న కార్తీక్ రాజా తల్లి ఆడియో
-
అప్సరకు గతంలోనే వివాహం ?
-
సరూర్ నగర్ అప్సర హత్య కేసులో బిగ్ ట్విస్ట్
-
అప్సర తలకు బలమైన గాయం: పోస్ట్ మార్టం రిపోర్ట్
-
మా కూతురుకు ఏ చెడు అలవాటు లేదు: అప్సర తల్లిదండ్రులు
-
గర్భవతిగా ఉన్న అప్సరను హత్య చేసిన సాయికృష్ణ
-
అప్సర హత్య కేసులో కీలకం కానున్న పోస్ట్ మార్టం రిపోర్ట్
-
శంషాబాద్ పరిధిలో మహిళ దారుణ హత్య
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
భారత్లో మరో బెంజ్ కారు లాంచ్ - ధర ఎంతో తెలుసా?
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (24-05-2024)
సాగని సంసారం.. రొమ్ము క్యాన్సర్తో పోరాటం.. తెలుగులో ఒకే ఒక్క మూవీ (ఫోటోలు)
టాలీవుడ్ డైరెక్టర్ భారీ యాక్షన్ థ్రిల్లర్.. 27 ఏళ్ల తర్వాత స్క్రీన్పై స్టార్ జోడీ..!
బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
ఈ సీఈవో జీతం 12 రూపాయలే.. నమ్మబుద్ధి కావడం లేదా?
#Glen Phillips: ఫిలిప్స్ ఏమైనా టూర్కు వచ్చాడా.. ? కనీసం ఒక్క ఛాన్స్ కూడా
ఎయిర్ ఇండియా సీఎఫ్ఓగా 'సంజయ్ శర్మ'
ఎప్పటిలాగే ఇంకో రెండ్రోజులు ఇలాగే నిగ్రహంగా ఉంటే సరిపోతుంది సార్!
రేపు బీజేపీ కార్యకర్తలకు నడ్డా వేకప్ కాల్
తప్పక చదవండి
- బాచుపల్లిలో దారుణం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ను హత్య చేసిన భర్త
- ఇషా అంబానీకి జియో బంపర్ డీల్! సక్సెస్ అయితే..
- భారత టాలెంట్ సరిహద్దులు దాటుతోంది: రాజమౌళి
- సీఎం నిర్ణయాలే ఫైనల్.. ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి మధ్య గ్యాప్?
- టీ20 వరల్డ్కప్-2024 అంబాసిడర్గా ఆఫ్రిది.. దిమ్మతిరిగేలా రైనా కౌంటర్
- 'అదర్ పూనావాలా' రూ.10.5 కోట్ల కారు ఇదే.. చూసారా!
- స్వాతి మలివాల్పై దాడి కేసు.. కేజ్రీవాల్ సహాయకుడికి రిమాండ్
- మలాన్ని డోనేట్ చేస్తే ఏడాదికి కోటి రూపాయలు : ఓ కంపెనీ ఆఫర్
- వామ్మో వీళ్లే.. పీఎస్! వీళ్లదే.. కోర్టు తీర్పు!!
- చారిత్రక విజయానికి ఐదేళ్లు...
Advertisement