-
స్వాతి మలివాల్ ‘ఆప్’ను వీడతారా..?
న్యూఢిల్లీ: ఆమ్ఆద్మీపార్టీ(ఆప్)కి రాజీనామా చేసే విషయమై ఆ పార్టీ ఎంపీ స్వాతిమలివాల్ స్పందించారు. తాను ఆప్ను వీడటం లేదని క్లారిటీ ఇచ్చారు. ఓ వార్తాసంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మలివాల్ ఈ విషయాన్ని వెల్లడించారు.మే13న సీఎం కేజ్రీవాల్ ఇంట్లో ఆయన అనుచరుడు బిభవ్కుమార్ చేతిలో మలివాల్ దాడికి గురైన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆమెను బీజేపీ నేతలు తమ పార్టీలోకి ఆహ్వానించారని, ఆమె త్వరలో పార్టీ మారనున్నట్లు ప్రచారం జోరందుకుంది. అయితే ఈ ప్రచారాన్ని ఆమె తాజాగా ఖండించారు. బీజేపీ నేతలు తనతో టచ్లోకి రాలేదని చెప్పారు.తాను ఆప్లోనే కొనసాగుతానని, ఆ పార్టీ ఏ ఒకరిదో ఇద్దరిదో కాదన్నారు. పార్టీ కోసం తన చెమట, రక్తాన్ని ధారపోశానన్నారు. నిజానికి తనపై దాడి తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా మాత్రమే తనతో మాట్లాడారని, ఆయన ఏ పార్టీకి సంబంధం లేని వ్యక్తని మలివాల్ చెప్పుకొచ్చారు. -
మాకంటే ఎక్కువ ఉద్యోగాలిచ్చుంటే రాజీనామా చేస్తా
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ రంగంలో గత పదేళ్లలో 2.36 లక్షల ఉద్యోగాలు తెలంగాణ మినహా దేశంలోని ఏదైనా రాష్ట్రంలో ఇచ్చినట్లు కాంగ్రెస్, బీజేపీ రుజువు చేస్తే తెల్లారే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ చేశారు. తమ పాలనలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో కలిపి 26.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 2004–14 మధ్యకాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదికి వేయి చొప్పున కేవలం 10 వేల పోస్టులు భర్తీ చేసిందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం కంటే 19 రెట్లు ఉద్యోగాలిచి్చనా ప్రజలకు చెప్పుకోలేకపోవడం తనతో సహా తమ పార్టీ నేతల వైఫల్యం అని చెప్పారు. కేటీఆర్ తెలంగాణ భవన్లో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘సోషల్ మీడియా ద్వారా తెలంగాణ యువత మెదడు నిండా అబద్ధాలను నింపి పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 30 వేల ఉద్యోగాలు ఇచి్చనట్లు ఊదరగొడుతూ సిగ్గు లేకుండా అబద్ధాలు చెబుతోంది. ఆరు నెలల్లో కొత్త ప్రభుత్వం ఒక్క నోటిఫికేషన్ అయినా ఇచ్చిందా? సీఎం స్థాయిలో రేవంత్ ప్రజలకు చెప్తున్న అబద్ధాలు, చేస్తున్న మోసాలు చూస్తే బాధ అనిపిస్తోంది’అని కేటీఆర్ అన్నారు. 95 శాతం రిజర్వేషన్ల ఘనత కేసీఆర్దే.. ‘రాష్ట్రపతి ఉత్తర్వుల ఉల్లంఘన, నాన్ లోకల్ కేటగిరీ పేరిట నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ యువతకు అన్యాయం చేసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కొత్త జోనల్ విధానంతో అటెండర్ నుంచి గ్రూప్–1 దాకా స్థానికులకు 95 శాతం ఉద్యోగాలు వచ్చేలా చేసిన ఘనత కేసీఆర్దే. పదేళ్లలో 2.32 లక్షల ఉద్యోగాలకు అనుమతులు ఇచ్చాం. అందులో 2.02 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చి 1.60 లక్షల పోస్టులు భర్తీ చేశాం. మరో 42,652 ఉద్యోగాలు భర్తీ దశలో ఉన్నాయి.విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు ఇది అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చి పరీక్షలు నిర్వహించిన 32,517 ఉద్యోగాలను రేవంత్ దుర్మార్గంగా తన ఖాతాలో వేసుకుంటున్నాడు. గ్రూప్–1, డీఎస్సీ నోటిఫికేషన్లు రద్దు చేసి పోస్టులు పెంచకుండానే కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. సీఎం ప్రకటించిన జాబ్ క్యాలెండర్కు అతీగతి లేదు. నిరుద్యోగ భృతి అంటూ ప్రియాంక గాంధీ నోట కూడా అబద్ధాలు చెప్పించారు’అని కేటీఆర్ ధ్వజమెత్తారు.రాష్ట్రంలో ‘బ్రూ’ట్యాక్స్ మొదలైంది ‘రాష్ట్రంలో కాంగ్రెస్ నేతలు అందిన కాడికి దోచుకుంటున్నారు. భట్టి, రేవంత్, ఉత్తమ్ ఎవరి దుకాణం వాళ్లదే అన్నట్లు మొత్తంగా ‘బ్రూ (బీఆర్యూ)’ట్యాక్స్ మొదలైంది. బిల్డర్ల పైనా కూడా ట్యాక్స్ వేస్తూ దోచుకుంటున్నారు. త్వరలో జూపల్లి కృష్ణారావు కూడా కొత్త దుకాణం స్టార్ట్ చేస్తాడు. ఢిల్లీకి కప్పం కట్టేందుకు సామంత రాజులు ట్యాక్స్లు వసూలు చేస్తున్నారు. మంత్రి కోమటిరెడ్డి మూర్ఖుడు, జోకర్లా తయారయ్యాడు. ప్రైవేటు సెక్టార్లో కష్టపడి తెచ్చిన పరిశ్రమలకు కూడా రేవంత్ పాతర వేస్తున్నారు.5 లక్షల ఉద్యోగాలు వచ్చే ఫార్మాసిటీని రద్దు చేసి రియల్ ఎస్టేట్ చేస్తారట. రూ.3 వేల కోట్ల పెట్టుబడితో 15 వేల ఉద్యోగాల కల్పనకు ముందుకు వచి్చన కేన్స్ టెక్నాలజీ వెళ్లిపోయింది. రూ.వేయి కోట్ల పెట్టుబడికి ఆసక్తి చూపిన కేన్స్ గుజరాత్కు వెళ్లింది. వరంగల్ నుంచి టెక్ మహీంద్రా అనే సంస్థ వెళ్లిపోయే పరిస్థితి వచ్చింది’అని కేటీఆర్ అన్నారు. వరంగల్– ఖమ్మం– నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యరి్థకి మద్దతు ఇవ్వాలని కేటీఆర్ కోరారు. కార్యకర్తల సంక్షేమానికి కట్టుబడే పార్టీ బీఆర్ఎస్ సాక్షి, హైదరాబాద్: కార్యకర్తల సంక్షేమం కోసం కట్టుబడి ఉండే పార్టీ బీఆర్ఎస్ అని, మీరంతా కేసీఆర్ కుటుంబంలో సభ్యులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన 200 మంది బీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబ సభ్యులకు శనివారం తెలంగాణ భవన్లో ఇన్సూరెన్స్ చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఇన్సూరెన్స్ ఇవ్వాలనే ఆలోచన కేసీఆర్ మదిలో నుంచి పుట్టిందని చెప్పారు.బీఆర్ఎస్ సభ్యత్వం తీసుకునే ప్రతి కార్యకర్తకు ప్రమాద బీమా కల్పిస్తున్నామని, ప్రమాదంలో మృతి చెందిన వారి కుంటుంబాలకు రూ.2 లక్షల చొప్పున బీమా మొత్తాన్ని అందిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. ఇప్పటి వరకు 5,522 మందికి రూ.118 కోట్లకుపైగా బీఆర్ఎస్ కార్యకర్తల బీమా కోసం వెచి్చంచామన్నారు. అధికారంలో లేనంత మాత్రన పార్టీ చేసే కార్యక్రమాలేవీ ఆగవని, భవిష్యత్లో కూడా కొనసాగుతాయని తెలిపారు. కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా పార్టీని సంప్రదించాలని కేటీఆర్ సూచించారు. -
Lok Sabha Election 2024: పంజాబ్లో చతుర్ముఖం
2019 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పెద్దగా రాణించని రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. 13 లోక్సభ స్థానాల్లో ఎనిమిది కాంగ్రెస్ హస్తగతం కాగా బీజేపీ రెండింటికే పరిమితమైంది. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ అద్భుత విజయంతో గద్దెనెక్కింది. దాన్ని లోక్సభ ఎన్నికల్లోనూ పునరావృతం చేయాలని ఆశ పడుతోంది. దాంతో కాంగ్రెస్తో పొత్తు లేకుండా ఒంటరిగానే బరిలో దిగింది. అకాలీదళ్ దూరమవడంతో బీజేపీ కూడా సొంతంగానే పోటీ చేస్తోంది. దాంతో రాష్ట్రంలో చతుర్ముఖ పోరు నెలకొంది. ఆప్, బీజేపీ పోటీని తట్టుకుని సిట్టింగ్ స్థానాలను కాపాడుకోవడం కాంగ్రెస్కు సవాలే... జలంధర్కాంగ్రెస్కే గాక ఆ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగిన మాజీ సీఎం చరణ్సింగ్ చన్నీకి సైతం ఇక్కడ గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. 2009, 2014, 2019ల్లో ఇక్కడ కాంగ్రెస్ వరుసగా గెలిచింది. 2023 ఉప ఎన్నికలో ఆప్ నేత సుశీల్కుమార్ రింకు నెగ్గారు. ఇప్పుడాయన బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దిగడం విశేషం! ఆప్ నుంచి పవన్కుమార్ టిను, అకాలీదళ్ నుంచి మోహింద్ సింగ్ బరిలో ఉన్నారు. బీఎస్పీ, సీపీఎం, అకాలీదళ్ (అమృత్సర్) కూడా పోటీ చేస్తున్నాయి. జలంధర్లో కాంగ్రెస్ ఏకంగా 13సార్లు ఇక్కడ గెలవడం విశేషం!గురుదాస్పూర్ఇక్కడా ప్రధాన పోటీ కాంగ్రెస్, బీజేపీ మధ్యే! సిట్టింగ్ ఎంపీ, బాలీవుడ్ నటుడు సన్నీడియోల్ స్థానంలో దినేశ్ సింగ్ బబ్బుకు బీజేపీ టికెటిచ్చింది. అకాలీదళ్ అండ లేకపోవడం పారీ్టకి ప్రతికూలం. మోదీపైనే బీజేపీ భారం వేసింది. కాంగ్రెస్ నుంచి సుఖ్జిందర్ సింగ్ రాండ్వ, ఆప్ నుంచి అమన్õÙర్ సింగ్ కల్సి, అకాలీదళ్ తరఫున దల్జీత్సింగ్ చీమ పోటీలో ఉన్నారు. అకాలీదళ్ (అమృత్సర్) సైతం అభ్యరి్థని పోటీకి పెట్టింది. ఆనంద్పూర్ సాహిబ్కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ మనీశ్ తివారీ బదులు విజయ్ ఇందర్ సింగ్లా బరిలో ఉన్నారు. ఆప్ నుంచి మాలీ్వందర్ సింగ్, అకాలీదళ్ తరఫున ప్రేమ్సింగ్ చందూమజ్రా, బీజేపీ తరఫున సుభాష్ శర్మ పోటీ చేస్తున్నారు. బీఎస్పీ, అకాలీదళ్ (అమృత్సర్) సైతం పోటీలో ఉన్నాయి. ఇక్కడ 2014లో గెలిచిన అకాలీదళ్ నేత ప్రేమ్సింగ్ 2019లో ఓటమి పాలయ్యారు.పటియాలామాజీ సీఎం అమరిందర్సింగ్ భార్య ప్రణీత్ కౌర్ ఇక్కడ పోటీలో ఉన్నారు. 2019 ఇక్కడ కాంగ్రెస్ టికెట్పై గెలిచిన ప్రణీత్ ఈసారి బీజేపీ టికెట్పై బరిలో దిగడం విశేషం. ఆప్ నుంచి దల్బీర్ సింగ్, అకాలీదళ్ తరఫున నరీందర్ కుమార్ శర్మ, కాంగ్రెస్ నుంచి ధరంవీర్ గాంధీ పోటీ చేస్తున్నారు. ప్రధాన పోటీ ప్రణీత్, ధరంవీర్ మధ్యే నెలకొంది. సంప్రదాయంగా కాంగ్రెస్కే మద్దతిచ్చే ఇక్కడి ఓటర్లకు నచ్చజెప్పి బీజేపీకి ఓటేయించడం ప్రణీత్, అమరీందర్లకు సవాలుగా మారింది. ఆమె ఫిరాయింపుదారు అంటూ రైతులు నిరసన తెలుపుతుండటం తలనొప్పిగా మారింది. అయితే గణనీయంగా ఉన్న హిందూ ఓటర్లపై అమరీందర్ దంపతులు ఆశలు పెట్టుకున్నారు.లుధియానాపంజాబ్లో ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతం. ఒకప్పుడు కాంగ్రెస్–అకాలీదళ్ మధ్యే పోటీ ఉండేది. 2014, 2019ల్లో కాంగ్రెస్ నుంచి గెలిచిన మాజీ సీఎం బియాంత్సింగ్ కుమారుడు రవనీత్ సింగ్ భిట్టు ఈసారి బీజేపీ అభ్యరి్థగా బరిలో దిగారు! 65.96 శాతం మంది హిందువులుండటం బీజేపీకి అనుకూలిస్తుందని భావిస్తున్నారు. దాంతో కాంగ్రెస్ నుంచి పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ బరిలో దిగారు. ఆప్ నుంచి అశోక్ పరాశర్ పప్పీ, అకాలీదళ్ తరఫున రంజిత్సింగ్ ధిల్లాన్ బరిలో ఉన్నారు. అకాలీదళ్ (అమృత్సర్)తో పాటు పలువురు స్వతంత్రులూ గట్టి పోటీ ఇస్తున్నారు. అమృత్సర్ ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎంపీ గుర్జీత్ సింగ్ అజ్లా, బీజేపీ నుంచి తరణ్జిత్ సింగ్ సంధు బరిలో ఉన్నారు. మాజీ ఐఎఫ్ఎస్ అధికారి సంధు ఇటీవలే బీజేపీలో చేరారు. రాష్ట్రంలో 22 శాతం మేర ఉన్న జాట్ సిక్కు వర్గానికి చెందిన వ్యక్తి. ప్రచారంలోనూ దూసుకెళ్తున్నారు. కెపె్టన్ అమరిందర్ సింగ్ చేరిక బీజేపీకి సానుకూలాంశం. ఆప్ నుంచి మంత్రి కులదీప్సింగ్ దలైవాల్ రంగంలో ఉన్నారు.పోలింగ్ జరగనున్న లోక్సభ స్థానాలు... అమృత్సర్, గురుదాస్పూర్, ఖదూర్సాహిబ్, హోషియార్పూర్, జలంధర్, ఆనందపూర్ సాహిబ్, లుధియానా, ఫతేగఢ్ సాహిబ్, ఫరీద్కోట్, ఫిరోజ్పూర్, భటిండా, సంగ్రూర్, పాటియాలా. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Lok Sabha Election 2024: కాశీ చుట్టూ ప్రదక్షిణం!
దక్షిణాది రాష్ట్రాల బీజేపీ నేతలు పొలోమని కాశీ బాట పడుతున్నారు. ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానంలో మూడోసారి పోటీ చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. అక్కడ అధికంగా ఉండే దక్షిణాది ప్రజల ఓట్లే లక్ష్యంగా కలియదిరుగుతున్నారు. తెలుగు, తమిళ సంఘాలతో సమావేశమవుతున్నారు. నగరంలో పెద్ద సంఖ్యలో ఉన్న దక్షిణాది ఆశ్రమాల పెద్దలతో ఉదయం, సాయంత్రం బైఠక్లు నిర్వహిస్తున్నారు. దక్షిణాది వారే కీలకం.. వారణాసి నియోజకవర్గంలో 18.50 లక్షల ఓట్లున్నాయి. వీరిలో దక్షిణాది ఓటర్లు కనీసం 3 లక్షల పై చిలుకే ఉంటారు. తెలుగు, తమిళ ఓటర్లు 2 లక్షల దాకా ఉంటారు. కన్నడ, మలయాళీలు లక్ష మంది ఉన్నారు. కాశీలోనే దక్షిణాది రాష్ట్రాల నిర్వహణలో కనీసం 200 వరకు ఆశ్రమాలున్నాయి. ఇలా వారణాసిలో దక్షిణాది ఓటర్లు కీలకంగా మారారు. 2019 ఎన్నికల్లో మోదీ 6.74 లక్షల ఓట్లు (63.62 శాతం) సాధించారు. ఈసారి ఏకంగా 80 శాతం ఓట్లను బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగా దక్షిణాది వారి ఓట్లు అత్యధికంగా మోదీకే వచ్చేలా చూడాలని అధిష్టానం భావిస్తోంది. దాంతో ఆయా రాష్ట్రాల కీలక నేతలు ఇప్పటికే రంగంలోకి దిగి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి 50 మంది ఓటర్లకు ముగ్గురు, నలుగురితో కూడిన బృందం చొప్పున పని చేస్తోంది! అంతేగాక ఒక్కో బృందం రోజుకు 4 నుంచి 5 సమూహాలతో భేటీలు నిర్వహిస్తోంది. వారణాసిలో ఇలాంటి బృందాలు ఏకంగా 2,000 దాకా పనిచేస్తున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు! ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత డిసెంబర్ నుంచే తెలుగు, తమిళ సంగమం పేరుతో వారణాసిలో బీజేపీ పలు కార్యక్రమాలు నిర్వహించింది. మోదీ వర్చువల్గా వాటిలో పాల్గొన్నారు. దక్షిణ కాశీగా పేర్కొనే వేములవాడకు కాశీతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేస్తూ తెలుగు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. కాశీలో నివసించే దక్షిణాది వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకున్న చర్యల గురించి వివరించారు. వారణాసి రైల్వే స్టేషన్తో పాటు ప్రధాన దారులు, కూడళ్లలో దక్షిణాది పర్యాటకుల సౌలభ్యం కోసం తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో ప్రకటనలు తదితరాలు ఏర్పాటు చేయించడాన్నీ గుర్తు చేశారు. కీలక నేతలంతా అక్కడే.. వారణాసిలో చివరిదైన ఏడో విడతలో భాగంగా జూన్ 1న పోలింగ్ జరగనుంది. అక్కడి దక్షిణాది ఓటర్లతో సమన్వయ బాధ్యతలను తెలంగాణ బీజేపీ ఇన్చార్జి సునీల్ బన్సల్కు అధిష్టానం అప్పగించింది. ఆయన వారం రోజులుగా అక్కడే ఉంటూ పర్యవేక్షిస్తున్నారు. తెలంగాణ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్, నిజామాబాద్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బి.బి.పాటిల్, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్; ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపీ జీవీఎల్ నరసింహారావు, ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్రెడ్డి, తమిళనాడు నేతలు గాయత్రీ దేవి, ఆర్.రాజలక్షి్మ, సి.టి.పళనిస్వామి, తిరునల్వేలి బీజేపీ అభ్యర్థి నయనార్ నాగేంద్రన్, కె.గోపాలస్వామి, కేరళకు చెందిన పీకే కృష్ణదాస్, కుమ్మనం రాజశేఖర్ తదితరులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆదివారం నుంచి బీజేపీ తమిళనాడు, కర్ణాటక అధ్యక్షులు అన్నామలై, బి.వై.విజయేంద్ర కూడా వారణాసిలోనే వారం పాటు మకాం వేసి ప్రచారం చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ‘‘మోదీ కూడా ఆదివారం నుంచి వారణాసిలో సభలు, ర్యాలీల్లో పాల్గొంటారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజలతోనూ ఆయన మమేకమయ్యేలా కార్యక్రమం ఏర్పాటు చేసే యోచన ఉంది’’ అని బీజేపీ కీలక నేత ఒకరు వెల్లడించారు.– సాక్షి, న్యూఢిల్లీ -
బొటాబొటిగా జాతీయం!
చండీగఢ్ టూ పట్నా. జాతీయ రాజకీయాలకు ఆయువుపట్టు. సారవంతమైన గంగా–యమునల మైదాన ప్రాంతం ఇదే. కొద్దిగా సింధూ బేసిన్ కూడా ఇందులో చేరి ఉండవచ్చు. కాస్త విస్తరిస్తే ‘కౌబెల్ట్’ అని కూడా పిలుస్తాము. మనం ఏ రకమైన మాంసం తినాలో, ఏ రకమైనది తినకూడదో తెలియజెప్పే కౌబాయ్స్కు ఇది పరమ పూజనీయమైన ప్రాంతం. అనాదిగా పిలుచుకుంటున్నట్టు ‘ఆర్యావర్తం’ కూడా ఇదే! ఈ ప్రాంతం మీద పట్టు సాధించకుండా దేశంలో రాజ్యాధికారాన్ని సంపాదించడం చాలా కష్టం.మొదటి ఐదు సాధారణ ఎన్నికల్లో ఆర్యావర్తం, ద్రవిడదేశం అనే తేడాల్లేకుండా దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనబరిచింది. ఆరోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ జైత్రయాత్రకు కళ్లెం వేసిన జనతా పార్టీ మాత్రం అచ్చంగా ఉత్తరాది పార్టీయే! అప్పుడు జనతా పార్టీకి 295 లోక్సభ స్థానాలు దక్కాయి. ఇందులో వింధ్య పర్వతాలకు దిగువన గెలిచిన సీట్లు రెండు డజన్లు దాటలేదు. అవి కూడా ప్రధానంగా మహారాష్ట్రలో గెలిచినవే!భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి గడచిన పదేళ్లుగా అధికారంలో ఉన్నది. అయినప్పటికీ ఒక్క కర్ణాటక మినహా మిగిలిన దక్షిణాదిలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నది. ఈసారి అదనంగా తెలంగాణపై కూడా ఆశలు పెట్టుకున్నది. కానీ, మూడోసారి వరసగా అధికారాన్ని చేపట్టాలంటే కచ్చితంగా గోమాత ప్రాంతమే కాషాయ దళాన్ని కరుణించి కాపాడాలి. గత ఎన్నికల్లో భారీ సీట్లను ప్రసాదించిన ఈ ప్రాంతంలో బలమైన గండి పడితే మాత్రం ఇతర ప్రాంతాలు పూడ్చగలిగే పరిస్థితి కనిపించడం లేదు. మరి ఈసారి కూడా ఆర్యావర్తం బీజేపీని గట్టెక్కిస్తుందా లేదా అన్నదే ముఖ్యమైన ప్రశ్న.చండీగఢ్ నుంచి హర్యానా, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్ల మీదుగా బీహార్లోని పట్నా వరకు మొత్తం 157 స్థానాలను అప్పట్లో జనతా పార్టీ క్లీన్స్వీప్ చేసింది. ఇప్పటికీ అదే రికార్డు. ఇందిరాగాంధీ హత్యానంతరం వెల్లువెత్తిన సానుభూతి ప్రభంజనం (1984)లో కూడా ఈ రికార్డు చెక్కుచెదరలేదు. అప్పుడు యూపీ, బీహార్లలో ఎనిమిదిమంది ఇతర పార్టీల వారు గెలిచారు. కొత్త రాష్ట్రాలుగా అవతరించిన ఉత్తరాఖండ్, జార్ఖండ్లను కూడా కలుపుకొంటే ఇదే ప్రాంతంలో బీజేపీకి 2019లో 113 సీట్లు దక్కాయి. ఎన్డీఏ భాగస్వాములతో కలిసి 131 సీట్లలో గెలిచారు.ఇప్పుడా సంఖ్యను బీజేపీ నిలబట్టుకోగలదా? రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హిమాచల్లను కూడా కలిపి చూస్తే కౌబెల్ట్ పూర్తవుతుంది. ఇందులో రాజస్థాన్ (25), గుజరాత్ (26), హిమాచల్ (4)లో అప్పుడు బీజేపీ క్లీన్ స్వీప్ చేసింది. మధ్యప్రదేశ్ (29)లో 28, ఛత్తీస్గఢ్ (11)లో 9 సీట్లను గెలుచుకున్నది. ఈ దూకుడును ఇప్పుడు కూడా ప్రదర్శించగలుగుతుందా? దాదాపు 90 శాతం స్ట్రయిక్ రేట్తో విజృంభిస్తేనే కౌబెల్ట్లో బీజేపీ తన బలాన్ని నిలబెట్టుకోగలుగుతుంది.ఈ ప్రాంతంలో బలమైన సామాజిక వర్గాలుగా పేరున్న రాజ్పుత్, జాట్, యాదవ కులాలు బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఓబీసీ రిజర్వేషన్ల కోసం డిమాండ్ చేస్తున్న జాట్ నాయకులు రాజస్థాన్, హర్యానాల్లో ఇప్పటికే ‘ఇండియా’ కూటమికి మద్దతు ప్రకటించారు. పశ్చిమ యూపీలోని జాట్లు మాత్రం చరణ్సింగ్ పరివారానికి చెందిన ఆర్ఎల్డీతోనే ఉన్నట్టు కనిపిస్తున్నది. ఈ పార్టీ ఎన్డీఏలో చేరినందువల్ల యూపీ జాట్ల మద్దతు బీజేపీకి లభించవచ్చు.ఉత్తరాదిలో తొలి నుంచీ బీజేపీకి వెన్నుదన్నుగా ఉన్న రాజ్పుత్ల తాజా వైఖరి ఆ పార్టీని కొంత కలవరపరుస్తున్నది. ఈ వర్గానికి ప్రాతినిధ్యం వహించే కర్ణిసేన సభ్యులు బహిరంగ సభలు పెట్టి మరీ బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని పిలుపునిస్తున్నారు. రాజ్పుత్ వర్గం మీద వీరి పిలుపు ప్రభావం చూపితే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్లలోని కనీసం 30 నియోజకవర్గాల్లో బీజేపీకి నష్టం జరిగే అవకాశం ఉన్నది. రాజ్పుత్ వర్గానికి చెందిన యోగీ బాబానే యూపీ సీఎంగా ఉన్నందువలన ఆ రాష్ట్రంలో పెద్దగా భయపడవలసిన అవసరం లేదని బీజేపీ భావిస్తున్నది.యూపీ, బీహార్లలో గణనీయమైన సంఖ్యలో ఉన్న యాదవులు చాలాకాలంగా ఎస్పీ, ఆర్జేడీల వెనుకనే సమీకృతమై ఉన్నారు. ఇప్పుడీ సమీకరణ మరింత సంఘటితంగా ఉన్నట్టు సమాచారం. అఖిలేశ్, తేజస్వీ యాదవ్లను వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రులను చేయాలనే పట్టుదల యువతలో కనిపిస్తున్నది. యాదవ వర్గం వ్యతిరేకతకు విరుగుడుగా యాదవేతర ఓబీసీలను మచ్చిక చేసుకుంటూ బీజేపీ ఇన్నాళ్లుగా నెట్టుకొస్తున్నది. బీజేపీ అధికారంలోకి వస్తే ఈసారి రిజర్వేషన్లు ఎత్తివేస్తారని జరిగిన ప్రచారం వల్ల ఈ వర్గం మద్దతును కూడా ఎంతోకొంత బీజేపీ కోల్పోవచ్చనే అభిప్రాయం బలపడుతున్నది. రిజర్వేషన్లు ఎత్తివేసే ఆలోచన తమకు లేదని ప్రధాని సహా పలువురు నేతలు వివరణ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయిందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.వాజ్పేయి హయాంలోని ఎన్డీఏ సర్కార్ చేసుకున్న ‘షైనింగ్ ఇండియా’ ప్రచారం వికటించినట్టుగానే మోదీ సర్కార్ చేస్తున్న ‘వికసిత భారత్’ కూడా వికటిస్తున్నట్టుగానే కనిపిస్తున్నది. ఉపాధి రంగం దారుణంగా దెబ్బతిన్నది. పెద్దనోట్ల రద్దు, కోవిడ్ వరస దెబ్బలతో కుదేలైన చిన్న వర్తకులు ఇప్పటికీ కోలుకోలేదు. నిరుద్యోగిత రేటుపై నిన్ననే విడుదలైన పీరియాడిక్ లేబర్ శాంపుల్ సర్వే నివేదిక నిరాశాజనకంగానే ఉన్నది. ప్రతిష్ఠాత్మకమైన ఐఐటీల్లో చదువుకున్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లలో 38 శాతం మందికి క్యాంపస్ ప్లేస్మెంట్లు లభించలేదని వచ్చిన తాజా వార్త పరిస్థితికి అద్దం పడుతున్నది.ఉత్తరాది రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువతకు సైనిక బలగాల్లో చేరడం ఒక ప్రత్యామ్నాయం. అందులో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అగ్నివీర్’ పథకం ఈ యువతను తీవ్రంగా నిరాశపరిచింది. దేశంలో పెరుగుతున్న ఆర్థిక అసమానతలపై ప్రపంచస్థాయి ఆర్థికవేత్తలందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆక్స్ఫామ్ వంటి సంస్థలు క్రమం తప్పకుండా ఇచ్చే నివేదికల్లో ఈ అన్యాయాన్ని ఎత్తిచూపుతున్నాయి. ఒకే దేశంలోని మనుషుల మధ్య వంద రెట్లు, వేయి రెట్లు కాదు లక్షల రెట్ల ఆర్థిక తారతమ్యాలు వెక్కిరిస్తున్నాయి.2012 నుంచి 2021 మధ్యకాలంలో భారత జాతి సృష్టించిన సంపదలో నలభై శాతం సొత్తు జనాభాలోని ఒకే ఒక్క శాతం కుబేరుల జేబుల్లోకి వెళ్లింది. యాభై శాతం మంది అడుగు జనాభా దోసిళ్లలో ఎంగిలి మెతుకులు రాలిపడ్డట్టు ఒకే ఒక్క శాతం సొమ్ము ఉమ్మడిగా జారిపడింది. దీన్నే కొందరు ’ట్రికిల్ డౌన్ థియరీ’గా పిలుచుకుంటున్నారు. ఈ రకమైన ఆర్థిక విధానాలతో ఎన్డీఏ రాజ్యమేలుతున్నది.ఇటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే శామ్ పిట్రోడాతో సహా పలువురు ఆర్థికవేత్తలు కూడా దేశంలో వారసత్వ పన్ను విధించాలన్న ప్రతిపాదన చేస్తున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడానికి ఇటువంటి సూచనలపై విస్తృతమైన చర్చను ఆహ్వానించడం అవసరం. కానీ, పిట్రోడాకు ఉన్న కాంగ్రెస్ సంబంధాలను ఆసరా చేసుకొని స్వయంగా ప్రధానమంత్రే ఎదురుదాడికి పూనుకున్నారు. ‘ప్రతిపక్షం అధికారంలోకి వస్తే మీరు సంపాదించుకున్న సొమ్మును లాగేసుకుంటారట’ అంటూ రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేశారు. ఈ ప్రచారం బీజేపీకి మేలు చేసిందా... కీడు చేసిందా అనే విషయం ఓట్ల లెక్కింపు తర్వాత తేలిపోనున్నది.ఈ రకమైన సామాజిక – ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ తన కంచుకోటలను ఏ మేరకు కాపాడుకోగలదన్న చర్చ జరుగుతున్నది. ప్రభుత్వానికి అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఎటువంటి గాలి లేదని అభిప్రాయపడిన పక్షంలో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, ఢిల్లీ, యూపీ, బీహార్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కలిపి సుమారు 50 స్థానాలను బీజేపీ చేజార్చుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. వీటితోపాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా గత ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలనే సాధించింది. ఈసారి రెండు రాష్ట్రాల్లో కనీసం 15 స్థానాల వరకు ఆ పార్టీ పోగొట్టుకోవచ్చనే అంచనాలున్నాయి.శరద్ పవార్, బాల్ఠాక్రేలు స్థాపించిన పార్టీలను చీల్చడం బీజేపీకి కలిసివచ్చే అంశం కాదనే అభిప్రాయం మహారాష్ట్రలో ఉన్నది. ఎన్నికల హామీల అమలులో చతికిలబడ్డ కర్ణాటక కాంగ్రెస్కు బీజేపీ మిత్రపక్షం జేడీఎస్ మళ్లీ ఊపిరిపోసింది. దేవెగౌడ పౌత్రరత్నం చేసిన నిర్వాకంపై కన్నడిగులు మండిపడుతున్నారు. ఇక బెంగాల్, ఒడిషా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో ఓ పదిహేను స్థానాలను బీజేపీ అధికంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే కోల్పోయే అవకాశం ఉన్న సీట్లు 65 అనుకుంటే, అదనంగా తెచ్చుకునే సీట్లు పదిహేను వరకు ఉండవచ్చని అంచనా. అంటే కనీసం యాభై సీట్లను బీజేపీ నికరంగా కోల్పోతుంది.వ్యతిరేక గాలి బలంగా లేకపోతేనే గత ఎన్నికలతో పోలిస్తే యాభై స్థానాలను బీజేపీ కోల్పోవచ్చు. కూటమిలోని మిత్రపక్షాలన్నీ ఉమ్మడిగా మరో పాతిక, ముప్పయ్ సీట్లను గెలవచ్చు. ఇది దాదాపు తొంభై శాతం స్థానాలకు పోలింగ్ పూర్తయిన తర్వాత పరిశీలకుల్లో నెలకొని ఉన్న అభిప్రాయం. అంటే బొటాబొటి మెజారిటీతో ఎన్డీఏ మూడోసారి గద్దెనెక్కడానికి అవకాశాలు ఉన్నాయనుకోవాలి. బీజేపీకి సొంతంగా 370 సీట్లు కావాలనీ, కూటమికి 400 సీట్లు కావాలని ప్రధానమంత్రి చేసిన అభ్యర్థనను జనం పట్టించుకోలేదు. మూడింట రెండొంతుల మెజారిటీ లభిస్తే ఈ ప్రభుత్వం భారత రాజ్యాంగాన్ని మార్చడానికి వెనకాడదనే వాదనను జనం విశ్వసిస్తున్నారనే అనుకోవాలి.విశ్వసనీయమైన ప్రత్యామ్నాయం, సమర్థవంతమైన నాయకత్వం అందుబాటులో ఉండి ఉంటే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని ప్రజలు కచ్చితంగా ఓడించేవారే. ప్రజల ఆకాంక్షలకు, ప్రభుత్వ విధానాలకు మధ్యన ఓ పెద్ద అగాధమే ఉన్నది. కానీ, ఇండియా కూటమిలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలకే పరిమితమైన పార్టీగా మిగిలిపోయింది. సాధారణ మెజారిటీకి అవసరమైన 272 స్థానాల్లో కనీసం సగం సీట్లను కూడా కాంగ్రెస్ గెలవగలదన్న నమ్మకం ఎవరికీ లేదు. ఈ పరిస్థితుల్లో అతుకుల బొంతతో అస్థిర ప్రభుత్వ ప్రయోగాలకు మెజారిటీ ప్రజలు సిద్ధపడకపోవచ్చు. పార్టీ అధ్యక్షుడు ఖర్గేను ప్రధాని పదవికి ప్రతిపాదించి ఉంటే కూటమి సభ్యుల ఆమోదం లభించేది. సాహసోపేతమైన ఈ ప్రయోగాన్ని దేశ ప్రజలు స్వాగతించేవారు. కానీ రాహుల్గాంధీ మాటల్లో కనిపించేంత ఔదార్యం, అభ్యుదయం చేతల్లో కనిపించవు. అదే విషాదం. ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీకి లోక్సభలో సెంచరీ కొట్టే ఒక మంచి అవకాశం దొరికింది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం.వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
ఆరో విడత పోలింగ్.. బీజేపీ అభ్యర్థిపై రాళ్ల దాడి
కోల్కతా: ఆరో విడత ఎన్నికల పోలింగ్ సందర్భంగా బెంగాల్లోని ఝర్గ్రామ్లో బీజేపీ అభ్యర్థిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. గర్బెటాలోని పోలింగ్ బూత్లో కొందరు దుండగులు ఓటర్లను బెదిరిస్తున్నారనే సమాచారం అందుకున్న బీజేపీ అభ్యర్థి ప్రణత్టుడు ఆయన అనుచరులతో పోలింగ్ బూత్కు వెళ్లారు.వారు అక్కడికి చేరుకోగానే కొందరు వ్యక్తులు ఆయనపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ప్రణత్ టుడు, పలువురు బీజేపీ కార్యకర్తలు గాయపడ్డారు. భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ప్రణత్ను అక్కడినుంచి సురక్షితంగా తప్పించారు. ఈ ఘటనలో బీజేపీ నేత కారు ధ్వంసమైంది. కాగా తృణమూల్ కాంగ్రెస్ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ ఆరోపించింది. ప్రణత్ సెక్యూరిటీ గార్డు పోలింగ్ బూత్ వెలుపల ఓటు వేయడానికి క్యూలో నిల్చున్న మహిళపై దాడి చేశాడని టీఎంసీ నేతలు కౌంటర్ ఆరోపణలు చేశారు. -
TN: జయలలితపై అన్నామలై సంచలన వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాజీ సీఎం, దివంగత జయలలితపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళనాడు రాష్ట్రంలో జయలలిత ‘‘హిందుత్వ నాయకురాలి’గా ఉందని అన్నారు. ఆమె అందరికంటే ఉన్నతమైన హిందుత్వ నాయకురాలిగా అభివర్ణించారు. ఇటీవల ఆయన జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకే హిందుత్వ భావజాలానికి దూరమైందని అన్నారు. అనంతరం తమిళనాడులో ఏర్పడిన శూన్యతను పూరించడానికి బీజేపికీ మంచి అవకాశం ఉందని అన్నారు.‘జయలలిత జీవించి ఉన్నంత వరకు ఆమె తమిళనాడులో అందరికన్నా చాలా ఉన్నతమైన హిందుత్వ నాయకురాలు. 2014కి ముందు, బీజేపీతొ జయలలిత వంటి లీడర్లు కలిసి ఉన్నప్పుడు, హిందుత్వ భావజాలం ఉన్న ఓటర్ల సహజంగానే జయలలితను తమ ఛాయిస్గా ఎన్నుకుంటారు. ఆమె తన హిందూత్వ భావజాలాన్ని బహిరంగంగా ప్రదర్శించేవారు’ అని అన్నామలై పేర్కొన్నారు. బీజేపీ నేతలు కాకుండా అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మద్దతు పలికిన వారిలో దేశంలోనే తొలి రాజకీయ నాయకురాలు జయలలిత అని తెలిపారు. 2002-03లో తమిళనాడులో మతమార్పిడి నిరోధక చట్టాన్ని రూపొందించారని ప్రస్తావించారు. మరోవైపు అన్నామలై ప్రకటనపై జయలలిత సన్నిహితురాలు వీకే శశికళ ఘాటుగా స్పందించారు., అన్నామలై చేసిన ఈ వ్యాఖ్యలు జయలలితపై ఆయనకున్న అజ్ఞానాన్ని, అపార్థాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొంది. జయలలిత లాంటి ప్రజానాయకురానికి ఎవరూ ఇరుకున పెట్టలేరని శశికళ అన్నారు.జయలలిత తన చివరి శ్వాస వరకు ఎంజీఆర్ చూపిన బాటలోనే నిజమైన ద్రవిడ నాయకురాలిగా జీవించారని తెలిపారు. హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు ఇలా అన్ని వర్గాల వారు కీర్తించుకునే నాయకురాలని, అమ్మ కుల మత అడ్డంకుల్ని అధిగమించిన గొప్ప నాయకురాలని కొనియాడారు. ప్రజల జీవితాలను మెరుగుపరిచేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. జయలలితకు దేవుడిపై నమ్మకం ఉందనే విషయం అందరికీ తెలిసిందేనని, అయితే ఆమె ఎప్పుడూ ఒకే మతాన్ని నమ్మలేదని శశికళ అన్నారు. అందరినీ సమానంగా చూసే ఏకైక నాయకురాలు జయలలిత అని శశికళ అన్నారు. -
ఇండియా కూటమి ఎఫెక్ట్..! కన్ప్యూజన్లో ఎగ్జిట్ పోల్స్
సార్వత్రిక ఎన్నికల్లో ఆరు విడుతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. అసలు పోటీలో లేదనుకున్న ఇండియా కూటమి కొన్ని రాష్ట్రాల్లో గట్టిపోటీ ఇస్తోందనే వార్తలొస్తున్నాయి. దీంతో జూన్ ఒకటిన జోస్యం చెప్పబోయే ఎగ్జిట్ పోల్ సంస్థలు కన్ప్యూజన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ‘అబ్కీ బార్ చార్సౌ పార్’ నినాదంతో.. ఈసారి బీజేపీ ప్రచారంలో అందరికంటే ముందు నిలిచింది. మోదీ చరిష్మాతో మరోసారి అధికారం చేజిక్కించుకోవాలనే పక్కా ప్రణాళికతో బీజేపీ ఎన్నికల ప్రచారం కొనసాగించింది. ఓ వైపు మోదీ మరోవైపు అమిత్ షా దేశాన్ని చుట్టేశారు. నాలుగు వందల సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అయితే మొదటి రెండు విడతల పోలింగ్ ముగిసిన తరువాత ఇండియా కూటమి సైతం కాస్త పోటీపడినట్లు కనిపించింది. బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూటమి బలం పుంజుకుందనే వార్తలు వచ్చాయి. దీంతో ఎన్నికలు ఏకపక్షం కాదనే వాదనలు ప్రారంభమయ్యాయి. యూపీలో సైతం తాము చాలా సీట్లు గెలుస్తామని ఇండియా కూటమి ప్రకటించడంతో.. ఫలితాలపై ఆసక్తికరమైన చర్చ ప్రారంభమైంది. ఎలక్షన్ చివరి అంకానికి చేరుకున్న నేపధ్యంలో ఎన్నికలు నువ్వా.. నేనా.. అన్నట్లు జరిగాయనే అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. దీంతో అసలు దేశంలో ఏం జరగబోతుందనే కొత్త చర్చ ప్రారంభం అయింది. చాలామంది ఎలక్షన్ పండితులు బీజేపీ సీట్లు తగ్గుతాయనే అభిప్రాయం చెబుతున్నా.. ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందా అనే విషయంపై మాత్రం ఏ ఒక్కరూ కాన్ఫిడెంట్గా లేరు.400సీట్ల టార్గెట్తో రంగంలోకి దిగిన బీజేపీ.. నిజంగా తన లక్ష్యాన్ని సాధిస్తుందా అనే చర్చతో ఈ సారి సార్వత్రిక ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 2019లో సింగిల్గా 303సీట్లు సాధించిన బీజేపీ చరిత్రను తిరగరాసింది. ఇందిరాగాంధి మరణానంతంరం వచ్చిన సానుభూతితో 1984లో కాంగ్రెస్ పార్టీ 300 మార్కును దాటింది. ఆ తరువాత మళ్లీ ఏ పార్టీ కూడా సింగిల్గా 300మార్కు దాటలేదు. కూటమిగా ఎన్డీయే 2019లో ఏకంగా 353 స్థానాలు సాధించింది. ఇది నిజంగా భారీ రికార్డు. తన రికార్డునే తానే తిరగరాస్తానంటూ మోదీ 400 సీట్లు సాధిస్తామని ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ కూటమి ప్రచారం కంటే ముందే కుదేలైపోయింది. బీజేపీ ట్రాప్లో పడిపోయిన ఇండియా కూటమి నాయకులు.. బీజేపీ 400 సాధించలేదంటూ ప్రకటనలు చేసేశారు. కాని బీజేపీ మళ్లీ అధికారంలోకి రావడానికి 272 సీట్లు చాలన్న చిన్న లాజిక్ను కాంగ్రెస్ కూటమి మరిచిపోయింది. తప్పును ఆలస్యంగా తెలుసుకున్న ఇండియా కూటమి నాయకులు తరువాతి కాలంలో అసలు బీజేపి అధికారంలోకి రాలేదంటూ ప్రకటనలు చేయడం ప్రారంభించారు. అయితే అప్పటికే కీలకమైన రెండు విడతల పోలింగ్ పూర్తైపోయింది. ఈ రెండు విడతల్లో జాతీయ స్థాయిలో మోదీ ఉండాలా వద్దా అనే విషయంపై రెఫరెండంగా ఎన్నికలు జరిగినట్లు పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అందుకే మొదటి రెండు విడతల్లో.. పోలింగ్ జరిగిన 190 స్థానాల్లో బీజేపీ హవా కొనసాగినట్లు పోల్ పండిట్లు అంచనా వేస్తున్నారు. మోదీ హాట్రిక్ నినాదంతో ఎన్నికలు ప్రారంభం కావడానికి ముందే బీజేపీ గెలిచేసిందనే వాదనలు ప్రారంభమయ్యాయి. అయితే మూడు, నాలుగు విడతల పోలింగ్ జరిగే సరికి లోక్సభ ఎన్నికల్లో లోకల్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా ప్రభావితం చూపించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా 40 స్థానాలున్న బీహార్లో తేజస్వీ యాదవ్ తన ప్రచారంలో ఎక్కువగా నిరుద్యోగం అంశాన్ని హైలైట్ చేశారు. 2019లో బీహార్లో ఎన్డీయే కూటమి 39 స్థానాలు గెలుచుకుని క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి ఇక్కడ కాంగ్రెస్ కూటమి కొన్ని స్థానాలు గెలుస్తుందనే వార్తలు వస్తున్నాయి. యూపీలో అఖిలేష్ మీటింగ్లకు సైతం భారీగా జనం హాజరవడం ఎన్నికల సరళిపై కొత్త చర్చకు తెరలేపింది. 80 లోక్సభ స్థానాలున్న యూపీలో బీఎస్పీ ఈసారి తన ప్రాభవాన్ని కోల్పోతుందని.. దీనివల్ల లాభపడేది ఎవరనే దానిపై యూపీ రిజల్ట్స్ ఆధారపడి ఉంటాయనేది విశ్లేషకుల అంచనా. ఇక యూపీ తరువాత అతిపెద్ద రాష్ట్రం మహారాష్ట్రలో మరాఠా అస్మితా పేరుతో ఉద్ధవ్ ఠాక్రే తీసుకొచ్చిన ఆత్మగౌరవం నినాదంపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అటు కర్ణాటకలోనూ ప్రజ్వల్ రేవన్న అంశం బీజేపీ కూటమికి వ్యతిరేకంగా పనిచేసినట్లు తెలుస్తోంది. దీంతో మూడునాలుగు విడతల పోలింగ్ పూర్తయ్యేసరికి ఇండి కూటమి పోటీలోకి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బీజేపీ 400 సీట్ల నినాదం కేవలం ప్రతిపక్షాలను ట్రాప్ చేయడానికే అనేది స్పష్టమైపోయింది. అయితే బీజేపీ మాత్రం ఇప్పటికీ 400 సీట్లు సాధ్యమనే అంటోంది. 2019లో 353 సీట్లు సాధించిన ఎన్డీయే మరో 40 సీట్లు సాధించడం కష్టమేమి కాదని కొంతమంది ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా ప్రతిపక్షం బలహీనంగా ఉండటం వల్ల బీజేపీకి పోటీలేకుండా పోయిందని.. కొంతమంది పోల్స్టర్స్ విశ్లేషిస్తున్నారు. మోదీకి ప్రత్యామ్నాయం లేకపోవడం… విదేశీవిధానం, ఆర్ధిక పురోగతిలాంటి అంశాలు బీజేపీకి కలిసివచ్చే అంశాలనే వీరు వాదిస్తున్నారు. నాలుగు వందల సీట్లు సాధ్యమే అని… ఒకవేళ 400సాధ్యం కాకపోయినా… గతం కంటే బీజేపీ సీట్లు పెరుగుతాయని వీరు వాదిస్తున్నారు. ఇక బీజేపీ ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని… బీజేపీ సొంతంగా 300 సీట్లు గెలుస్తుందని సీఎస్డీఎస్ సంస్థకు చెందిన సంజీవ్ కుమార్ అంటున్నారు.అయితే బీజేపీ మిత్రపక్షాలు మాత్రం చాలా ఘోరంగా ఓడిపోతారని దీంతో నాలుగు వందల సీట్లు సాధ్యం కాదని సంజీవ్ అంచనా వేస్తున్నారు. రాక్ఫెల్లర్ ఇంటర్నేషనల్ చైర్మన్ రుచిర్ శర్మ ఇటీవల ఒక సమావేశంలో మాట్లాడుతూ… ఈసారి పోటీ నువ్వా నేనా అన్నట్లు ఉందని.. అయితే ఇప్పటికీ బీజేపీకే ఎక్కువ అవకాశాలున్నాయని స్పష్టం చేశారు. అమెరికాలో స్థిరపడ్డ రుచిర్ శర్మ గత పాతికేళ్లుగా భారత ఎన్నికల సరళిపై అధ్యయనం చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీకి కాస్త అనుకూలంగా వ్యవహరించే యోగేంద్రయాదవ్ లాంటి సెఫాలజిస్టులు కాస్త డిఫరెంట్ వాదన ముందుకు తెస్తున్నారు. ముఖ్యంగా యూపీ, బీహార్, కర్ణాటక, మహారాష్ట్రలో బీజేపీదాని మిత్రపక్షాలు గతంతో పోలిస్తే 60 నుంచి 70స్థానాలు కోల్పోతారని యాదవ్ అంటున్నారు. బీజేపీ సొంతంగా 250 సీట్లకు పరిమిత అవుతుందని యోగేంద్రయాదవ్ బాంబు పేలుస్తున్నారు. ఇదే నిజం అయితే బీజేపీ కూటమి మద్దతు లేకుండా ప్రభుత్వం నడపలేదని స్పష్టం అవుతోంది. ఎన్నికల చివరి అంకానికి చేరుకున్న నేపథ్యంలో ఇప్పుడు.. ఎగ్జిట్ పోల్స్పై చాలా సర్వే సంస్థలు గుంభనంగా ఉన్నాయి. డేటాను విశ్లేషించడంలో తలమునకలైన కీలక సంస్థలన్నీ ఈ సారి ఎన్నికల సరళిపై ఎగ్జిగ్ పోల్స్ ఇవ్వడం అంత ఆశామాషీ కాదనే అభిప్రాయానికి వచ్చాయి. 2019లో కొంత ఈజీగా అనిపించిన ఎగ్జిట్ పోల్స్ ఈసారి మాత్రం కత్తిమీద సాము అని పొలిటికల్ పండిట్లు అంటున్నారు.:::: ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి -
మోదీ కొత్త రాగం.. బీజేపీలో బిగ్ ట్విస్ట్!
ఢిల్లీ: భారత్ భవిష్యత్ కోసం ఎప్పుడో 18వ శతాబ్దంలో రూపొందించిన చట్టాలు, పద్దతులను తాను ఉపయోగించలేనన్నారు ప్రధాని మోదీ. కొత్త సంస్కరణలు, చట్టాలు తీసుకురావాలనే ఆలోచనలో తాను ఉన్నట్టు మనసులోకి మాటను కుండబద్దలు కొట్టారు. అలాగే, ఒక ముఖ్యమైన పని కోసం దేవుడు ఆయనను భూమి మీదకు పంపినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు హాట్ టాపిక్గా మారాయి.కాగా, ఎన్నికల నేపథ్యంలో ప్రధాని మోదీ ఎన్డీటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..‘వికసిత్ భారత్’ కల నెరవేర్చడం కోసం 2047 వరకు నిరంతరాయంగా పనిచేయాలనే బాధ్యతను దేవుడు నా మీద పెట్టాడు. ఆ పనిని పూర్తిచేయడానికే నన్ను భూమి మీదకు పంపించాడని నాకు అనిపిస్తున్నది. దీని కోసం దేవుడు నాకు దారిచూపించి, శక్తిని ఇచ్చాడు. ఇక, 2047 కల్లా వికసిత్ భారత్ లక్ష్యాన్ని నేను నెరవేరుస్తానన్న నమ్మకం నాకుంది. అది నెరవేర్చే వరకు దేవుడు నన్ను పైకి పిలువడు’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి.అయితే, బీజేపీ పార్టీ విషయానికి వస్తే కాషాయ పార్టీలో 75ఏళ్లకే రిటైర్మెంట్ అనే నిబంధన ఉంది. ఈ నిబంధన పార్టీలో ఉన్న ప్రతీ ఒక్కరికీ వర్తిస్తుంది. ఇక, ప్రస్తుతం మోదీ వయసు 74ఏళ్లు. మరో ఏడాదిలో మోదీ రిటైర్మెంట్ తీసుకోవాల్సి ఉంది. ఇలాంటి సమయంలో మోదీ.. వికసిత్ భారత్ నినాదం ఎత్తుకోవడంపై రాజకీయ విశ్లేషకులు, ప్రతిపక్ష నేతలు స్పందిస్తున్నారు.మోదీ మరికొన్నేళ్ల పాటు క్రియాశీల రాజకీయాల్లో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఇలా కామెంట్స్ చేశారని చెబుతున్నారు. 75 ఏళ్లకే రిటైర్మెంట్ నిబంధన అనేది తనకు వర్తించబోదని మోదీ చెప్పారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తన మనసులో దాచిపెట్టుకొన్న పదవీ ఆకాంక్షను ప్రధాని నరేంద్ర మోదీ ఎట్టకేలకు బయటపెట్టారని అంటున్నారు. ఇక, బీజేపీలో 75 ఏళ్లు దాటిన కారణంగానే సీనియర్లను పక్క పెట్టిన విషయం తెలిసిందే. -
హైదరాబాద్పై బీజేపీ, కాంగ్రెస్ కుట్ర
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘కాంగ్రెస్, బీజేపీలది రాజకీయం.. కానీ కేసీఆర్ది తెలంగాణతో పేగుబంధం. పోరాటాలు చేసి, చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిండు. ఇవ్వాళ బీజేపీ కొత్త కుట్ర చేస్తోంది. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతం చేస్తరట.. హైదరాబాద్ లేని తెలంగాణ ఉంటదా.. తల లేని మొండెం అయిపోతాం మనం. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కలిసి హైదరాబాద్ను యూటీ చేయాలని లేదా మరో పదేళ్లు ఉమ్మడి రాజధానిగా చేయాలని కుట్రలకు తెరతీస్తున్నారు.తెలంగాణ కోసం పుట్టిన బీఆర్ఎస్ను కాపాడుకునే బాధ్యత మీపై ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికను ఆషామాïÙగా తీసుకోకుండా బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డిని గెలిపించండి’అని మాజీ మంత్రి హరీశ్రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి, బోనకల్లో శుక్రవారం నిర్వహించిన పట్టభద్రుల సమావేశాల్లో ఆయన మాట్లా డారు. తెలంగాణ వచ్చి పదేళ్లు అవుతుండగా, ఇప్ప టి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను మరో పదేళ్లు కొనసాగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.రైతులను ఆ మంత్రి కుక్కలతో పోలుస్తారా? సత్తుపల్లిలో సమావేశం అనంతరం తల్లాడ మండలం నూతనకల్లో క్రాప్ హాలిడే ప్రకటించిన రైతులతో హరీశ్రావు మాట్లాడారు. వర్షాలు పడినా జీలుగు విత్తనాలు ఇవ్వడం లేదని, కల్యాణలక్ష్మి చెక్కులు రాలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సన్న ధాన్యంతోపాటు దొడ్డు ధాన్యానికి కూడా బోనస్ ఇప్పించాలని కోరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ ‘వడ్లకు బోనస్ ఇవ్వమంటే ఇవన్నీ వ్యవసాయం తెలియని వారి మాటలని.. రైతులు మొరుగుతున్నారని వ్యవసాయశాఖ మంత్రి అనడం ఏమిటని ప్రశ్నించారు. రైతులను వ్యవసాయ శాఖ మంత్రి కుక్కలతో పోలుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టభద్రులు ఓటు వృథా చేసుకోవద్దు జూలైలో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో ఆలోగా రైతుల సమస్యలు పరిష్కరించకపోతే రైతులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని హరీశ్రావు హెచ్చరించారు. ఈ సందర్భంగా విత్తనాలు అందడం లేదని రైతులు ఆయన దృష్టికి తీసుకురావడంతో మండల వ్యవసాయ శాఖా« దికారులతో మాట్లాడారు. నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ మాట్లాడు తూ పట్టభద్రులు తమ ఓటును వృథా చేసుకోవద్దని కోరారు.సమావేశంలో ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, జెడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజ్, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. టిమ్స్ ఆసుపత్రులపై కాంగ్రెస్ది రాజకీయం: హరీశ్ సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మాణ పనులు ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రులపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. ఐదు నెలలుగా నిర్మాణ పనుల పర్యవేక్షణను గాలికి వదిలిన మంత్రి కోమటిరెడ్డి.. గత ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో హరీశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రులపై కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయాలు చేస్తోందన్నారు. -
రేపు బీజేపీ కార్యకర్తలకు నడ్డా వేకప్ కాల్
న్యూఢిల్లీ: బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తలను శనివారం(మే25) ఉదయం 5 గంటలకు ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా నిద్ర లేపనున్నారు. అంత మంది ఇళ్లకు నడ్డా ఒకేసారి వెళ్లలేరు కాబట్టి వారి ఫోన్లకు ఆయన తెల్లవారుజామునే ఫోన్ చేయనున్నారు.ఫోన్ ఎత్తగానే నడ్డా ఇచ్చే ఒక్క నిమిషం సందేశాన్ని వారు విననున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లకుపైగా గెలవాలన్న నినాదాన్ని వారికి నడ్డా తన సందేశంలో గుర్తు చేయనున్నారు. ‘జన్జన్కీ యహీ పుకార్, ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్, ఇస్ బార్ 400 పార్’అని నడ్డా తన సందేశం వినిపించనున్నారు. శనివారం ఆరోవిడత లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే. -
సందేశ్ఖాళీ ఓ కట్టుకథ.. మాజీ బీజేపీ నేత సంచలన కామెంట్స్
కోల్కత్తా: లోక్సభ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్లో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ జనరల్ సెక్రటరీ, సీనియర్ నాయకురాలు సిరియా పర్విన్.. కాషాయ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం పర్విన్.. అధికార టీఎంసీలో చేరారు. ఈ సందర్భంగా బెంగాల్లో బీజేపీ నేతలపై ఆమె సంచలన ఆరోపణలు చేశారు.ఇక, బీజేపీకి రాజీనామా సందర్భంగా సిరియా పర్విన్ మీడియాతో మాట్లాడుతూ.. బెంగాల్లో సందేశ్ఖాళీ ఘటన అంతా బీజేపీ నేతల ప్లాన్ ప్రకారం జరిగింది. అదంతా ఓ కట్టుకథ(పొలిటికల్ డ్రామా). సందేశ్ఖాళీలో మహిళలతో మాట్లాడేందుకు బీజేపీ నేతలు వేరు వేరు సిమ్ కార్డ్స్, ఫోన్లు ఉపయోగిస్తున్నారు. ఇందులో భాగంగానే రేఖా పాత్రకు బీజేపీ నేతలు డబ్బులు ఇచ్చి డ్రామా నడిపారు. దీనికి సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. త్వరలోనే వాటిని బహిర్గతం చేస్తాను అంటూ సంచలన కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో టీఎంసీపై కీలక వ్యాఖ్యలు చేశారు. తృణముల్ కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ అనేక ఆరోపణలు చేస్తోంది. అవేవీ నిజం కాదు. టీఎంసీ నేతలు ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే నేను టీఎంసీలో చేరుతున్నానని కామెంట్స్ చేశారు. ఇక, సందేశ్ఖాళీ వ్యవహారాన్ని బయటకు తీసుకొచ్చిన వారిలో సిరియా పర్విన్ కూడా ఒకరు కావడం గమనార్హం.ఇదిలా ఉండగా.. సందేశ్ఖాళీ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. సందేశ్ఖాళీలో భూముల కబ్జాలకు పాల్పడి మహిళలపై లైంగిక దాడులు చేశారన్న కేసులో టీఎంసీ మాజీ నేత షేక్ షాజాహాన్ అరెస్ట్ అయ్యారు. ఈ నేపథ్యంలో టీఎంసీ షాజహాన్ను ఆరేళ్ల పాటు పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు.. సందేశ్ఖాళీ ఘటనపై ఉద్యమించిన కారణంగా రేఖా పాత్ర అనే మహిళకు బీజేపీ లోక్సభ టికెట్ను ఇచ్చింది. బసిర్హత్ లోక్సభ స్థానంలో టీఎంసీకి చెందిన హాజీ నూరుల్ ఇస్లాం, బీజేపీ అభ్యర్థి రేఖా పాత్ర మధ్య ద్వైపాక్షిక పోరు నెలకొంది. -
6 నెలల్లోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఏకైక సీఎం రేవంత్: ఈటల
సాక్షి, నల్గొండ: లోక్సభ ఎన్నికల సర్వేలను తలదన్నేలా ఫలితాలు రాబోతున్నాయని మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఆరు నెలల కాలంలోనే ప్రజలతో ఛీ కొట్టించుకున్న ఒకే ఒక సీఎం రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. రేవంత్ పెద్ద సిపాయి అనుకున్నా కానీ అంత ఉత్తదేనని అన్నారు. ప్రజలను దోచుకునే వాళ్లందరూ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని విమర్శించారు.వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉమ్మడి నియోజకవర్గ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగం దేవరకొండలో బీజేపీ నేతలు ఏలేటి మహేశ్వర రెడ్డి, ఈటల రాజేందర్ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. 10 సంవత్సరాల్లో మోదీ ప్రభుత్వం ఒక్క స్కాం కూడా చేయలేదని తెలిపారు. కాంగ్రెస్ హయాంలో అన్ని స్కామ్లేనని.. మంత్రులు జైలుకు కూడా పోయారని పేర్కొన్నారు.అబద్ధాల నిర్మాణం మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని మండిపడ్డారు జేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి. అవినీతికి,అన్యానికి, ధర్మానికి, ఆ ధర్మానికి జరుగుతున్న పోటీనే ఈ ఎన్నికలని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకు, మంత్రులకు మధ్య కుమ్ములాటలు తప్ప అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం రాబోతుందని పేర్కొన్నారు. -
షోకాజ్ నోటీసులపై స్పందించిన బీజేపీ ఎంపీ
రాంచీ: జార్ఖండ్ బీజేపీ తనకు షోకాజ్ నోటీసులు పంపించటం తనను చాలా ఆశ్చర్యానికి గురిచేసిందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ జయంత్ సిన్హా అన్నారు. ఇటీవల ఆయన లోక్సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోలేదని, పార్టీ క్షేత్రస్థాయి ఎన్నికల ప్రచారంలో సైతం పాల్గొనటంలేదని జార్ఖండ్ బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే వాటిపై బుధవారం జయంత్ సిన్హా స్పందిస్తూ జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరికి లేఖ రాశారు.‘‘జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరీ పంపిన షోకాజ్ నోటీసులు అందుకున్న నేను చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అసలు తనను పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు, ర్యాలీలు, సంస్థాగత సమావేశాలకు కనీస ఆహ్వానం పంపలేదు. పార్టీ హజారీబాగ్ స్థానంలో మనీష్ జైశ్వాల్ను బరిలోకి దించుతున్నట్ల ప్రకంటించిన సమయంలో నా పూర్తి మద్దతు తెలియజేశా. మనీష్కు అభినందనలు తెలియజేశా. పార్టీ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉంటూ కొత్త అభ్యర్తికి మద్దతు ఇస్తానని తెలిపా. అయితే నేను ప్రచారంలో పాల్గొనాలని పార్టీ భావించి ఉంటే నాకు కచ్చితంగా సమాచారం అందించేది. జార్ఖండ్కు సంబంధించిన ఓ సీనియర్ గాని, ఎంపీ, ఎమ్మెల్యే ఎవరూ నన్ను సంప్రదించలేదు. నాకు ఎటువంటి పార్టీ కార్యక్రమాలు, సభలు, సమావేశాలను పిలుపు రాలేదు’’ అని జార్ఖండ్ బీజేపీ జనరల్ సెక్రటరి ఆధిత్య సాహుకు లేఖ ద్వారా తెలిజేశారు.My response to Shri Aditya Sahu ji’s letter sent on May 20, 2024 pic.twitter.com/WfGIIyTvdz— Jayant Sinha (Modi Ka Parivar) (@jayantsinha) May 22, 2024 ఇక.. జయంత్ సిన్హా మార్చిలోనే తాను 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయనని, ఎన్నికల విధుల నుంచి తనను తప్పించాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. అనంతరమే తాను ప్రాతినిధ్యంలో వహిస్తున్న హజారీబాగ్ పార్లమెంట్ స్థానంలో మనీష్ జైశ్వాల్ను బీజేపీ బరిలోకి దించిన విషయం తెలిసిందే. -
కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీలు పాకిస్తాన్ సానుభూతిపరులు... ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఆగ్రహం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
సోనియాను ఏ ప్రాతిపదికన, ఎలా పిలుస్తారు? : జి.కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: జూన్ 2న జరగనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవానికి ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాందీని ముఖ్యఅతిథిగా ప్రభుత్వం ఆహ్వానిస్తుందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు జి.కిషన్రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో జాప్యం చేసి.. 1,500 మంది ఉద్యమకారులను పొట్టన పెట్టుకున్నందుకు ఆమెను పిలుస్తారా అని నిలదీశారు. సోనియాను ఆవిర్భావ ఉత్సవానికి పిలవడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. బుధవారం పార్టీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. సోనియాగాంధీ తెలంగాణ ఇవ్వలేదని, అప్పటి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి తెలంగాణ ప్రజలు తెచ్చుకున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో బీజేపీ పూర్తిస్థాయిలో పోరాటం చేసిందని, తమ పార్టీ పార్లమెంట్లో మద్దతు ఇచ్చింది కాబట్టే యూపీఏ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రస్తుతం సీఎంగా ఉన్న రేవంత్రెడ్డి సోనియాను దయ్యం అన్నారని, ఇప్పుడు ఆయనకు ఆమె దేవత అయ్యిందా అని ఎద్దేవా చేశారు. తమకు సోనియాగాంధీ అప్పుడూ ఇప్పుడూ దయ్యమేనని వ్యాఖ్యానించారు. రైతులకు రాష్ట్ర సర్కారు వెన్నుపోటు పొడిచే ప్రయత్నం రాష్ట్ర రైతాంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దగా చేసిందని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటేసినందుకు రైతులకు ‘చెయ్యి’ ఇస్తున్నారని కిషన్రెడ్డి మండిపడ్డారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి, అమలు చేయకుండా రైతాంగాన్ని నిలువునా ముంచిందని ధ్వజమెత్తారు. దొడ్డు, సన్న అనే తేడా లేకుండా ప్రతి రైతుకూ బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుభరోసా కింద రైతులు, కౌలు రైతులకు రూ. 15 వేల చొప్పున ఇవ్వలేదన్నారు. సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలని అనుకుంటే రూ.1000 బోనస్ ఇవ్వాలని, దొడ్డు రకానికి రూ.500 బోనస్ ఇవ్వాలని చెప్పారు. దొడ్డు బియ్యం కొనడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా, రైతులకు ఇచి్చన హామీ నుంచి తప్పించుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తో్తందన్నారు.తెలంగాణలో 90 శాతంమంది దొడ్డు రకం వడ్లు వేస్తుండగా, సన్నాలకే బోనస్ ఇస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో సకాలంలో ధాన్యం సేకరించలేకపోతున్నారు ‘2023–24 ఒప్పందం ప్రకారం కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన బియ్యం ఇంకా ఇవ్వలేదు. సకాలంలో ధాన్యం సేకరించలేకపోతోంది. అకాల వర్షాలతో ధాన్యం కల్లాలోనే తడిసిపోతోంది. కొనుగోలు కేంద్రాల్లో నెలల తరబడి రైతులు పడిగాపులు కాస్తున్నారు. నిన్న కేవలం 75 వేల టన్నుల మాత్రమే కొనుగోలు చేసింది. ఇలాగే కొనసాగితే ధాన్యం కొనుగోలు పూర్తి కావడానికి మరో రెండు నెలల సమయం పడుతోంది’ అని కిషన్రెడ్డి చెప్పారు. -
ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు.. ఈసీ సీరియస్
ఢిల్లీ: లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్లు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను హెచ్చరించింది. ప్రచార సమయంలో కులం, భాష, మతపరమైన అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయటం మానుకోవాలని ఇరు పార్టీలకు ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఈసీ ఒక ప్రకటన విడుదల చేసింది.ప్రధాని మోదీ, రాహుల్ గాంధీతో సహా.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన స్టార్ క్యాంపెయినర్లకు ఒక నోట్ జారీ చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మళ్లికార్జున్ ఖర్గే, బీజేపీ చీఫ్ జేపీ నడ్డాలను ఈసీ ఆదేశించింది. వారి ప్రసంగాలను సరి చేసుకొవటంతోపాటు, తగిన శ్రద్ధ వహించాలని తెలియజేయాలన్నారు. వారసత్వంగా వస్తున్న నాణ్యమైన ఎన్నికల ప్రక్రియను దిగజార్చడాన్ని ఊరుకోబోమని ఎన్నికల సంఘం తేల్చి చేప్పింది.ఎన్నికల ప్రచారంలో బీజేపీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు మతపరమైన వ్యాఖ్యలు చేయడాన్ని మానుకోవాలంది. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్లు సైతం ఎటువంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా చూసుకోవాలని ఈసీ సూచించింది. అగ్ని వీర్ వంటి పథకాలపై ప్రసంగించే సమయంలో సాయుధ బలగాలకు రాజకీయం చేవద్దని తెలిది. అలా చేస్తే సాయుధ బలగాల సామాజిక, సాంస్కృతిక ప్రతిష్టను దెబ్బతీయటం అవుతుందని కాంగ్రెస్పై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. -
‘‘ఢిల్లీలో నీటి సంక్షోభానికి బీజేపీ కుట్ర’’
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికల పోలింగ్కు మరో రెండు రోజుల గడువు ఉందనగా ఆమ్ఆద్మీపార్టీ(ఆప్) బీజేపీపై మరో సంచలన ఆరోపణ చేసింది. ఢిల్లీలో నీటి సంక్షోభం సృష్టించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఢిల్లీ జలవనరుల మంత్రి ఆతిషి ఆరోపించారు. ఈ కుట్రలో భాగంగానే పక్కన హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఢిల్లీకి నీటి సరఫరాను నిలిపివేసిందన్నారు.‘లోక్సభ ఎన్నికలు ప్రకటించగానే మా పార్టీ చీఫ్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. ఆయన ప్రచారం కోసం మధ్యంతర బెయిల్పై రాగానే వెంటనే స్వాతిమలివాల్పై దాడి అనే కుట్రకు తెర తీశారు. ఇది కూడా వర్కవుట్ కాకపోవడంతో విదేశీ నిధులు వచ్చాయన్న పాత ఆరోపణలను మళ్లీ తవ్వారు. ఇప్పుడు తాజాగా హర్యానాలో ఉన్న ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని పోలింగ్కు కొద్ది రోజుల ముందు ఢిల్లీకి యమునా నది నీళ్లు ఆపివేశారు’అని ఆతిషి ఫైర్ అయ్యారు. ఢిల్లీలో మే25న లోక్సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
మోసగాళ్ల కూటమి
మహారాజ్గంజ్/మోతిహరీ/ప్రయాగ్రాజ్: సార్వ త్రిక సమరంలో విపక్షాల ‘ఇండియా’ కూటమిపై ప్రధాని మోదీ విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. మంగళవారం బిహార్లోని మహారాజ్గంజ్, పూర్వీ చంపారన్ నియోజకవర్గాల్లో, ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఎన్నికల ప్రచారర్యాలీల్లో ప్రసంగించారు. ప్రసంగాల్లోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..విపక్షాల కూటమికి ఎదురుదెబ్బ తప్పదు‘‘ సనాతన ధర్మ వ్యతిరేక భావనలు ఆ కూటమిలో నిండిపోయాయి. అవినీతి, బుజ్జగింపు రాజకీయాల్లో మునిగిపోయిన విపక్షాల కూటమికి జూన్ 4న ఫలితాల సందర్భంగా పెద్ద ఎదురుదెబ్బ తగులుతుంది. వారసత్వంపై నాకు నమ్మకం లేదు. నాకు వారసులు అంటూ ఒకవేళ ఉంటే అది ప్రజలే. గతంలో ఆర్జేడీ–కాంగ్రెస్ ప్రభుత్వం బిహార్ను అస్తవ్యస్తంగా పాలించి తొలి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ పుట్టిన నేలకు అపకీర్తి తెచ్చారు. 1990లలో బిహార్లో బెదిరింపు పన్ను వ్యవస్థ రాజ్యమేలింది.దీంతో పరిశ్రమలు, ఉపాధిలేక వేలాదిగా బిహారీలు వలస బాటపట్టారు. ఎన్డీఏ ప్రభుత్వాలు వలస సంస్కృతికి చరమగీతం పాడేందుకు ఎంతో కృషిచేశాయి. పంజాబ్, తెలంగాణ, తమిళనాడులో బిహార్ కూలీలపై స్థానిక కాంగ్రెస్ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేస్తుంటే కాంగ్రెస్ రాజకుటుంబం మౌనంగా ఉండిపోయింది’’దశలు దాటే కొద్దీ దిగజారిపోయారు‘‘లోక్సభ ఎన్నికల తొలి దశలోనే విపక్షాల కూటమి డీలాపడింది. రెండో, మూడో, నాలుగో, ఐదో దశకొచ్చేసరికి మొత్తం నీరుగారిపోయారు. మిగిలిన రెండు దశల్లోనూ ఇదే వరస. జూన్ 4 వచ్చే ఫలితాలతో ఆ కూటమికి పెద్ద ఎదురుదెబ్బ తగలడం ఖాయం. అసలు ఆ కూట మికి ఒక రాజకీయ కూటమి లక్షణాలే ఉండవు. అందులో ని అన్ని పార్టీల నేతలంతా కలిసి రూ.20 లక్షల కోట్ల కుంభకోణాలు చేశారు. వందశాతం మోసగాళ్ల కూటమి అది. కూటమికి మూడు పెద్ద అవలక్షణాలున్నాయి. అది మతతత్వ, కులతత్వ, వారసత్వ కూటమి’’. -
మోదీజీ.. ఇక చాలు
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో హిందూ, ముస్లింల మధ్య విషం చిమ్ముతున్న మోదీ ప్రజాజీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే మీ దగ్గర ఉన్న పాడిఆవులు, గేదెలను లాక్కుంటారని, మీ రిజర్వేషన్ కోటా తగ్గించి ముస్లింలకు 15 శాతం ఇస్తారని మోదీ రోజూ అబద్దాలు ప్రచారంచేస్తూ సమాజంలో చీలిక తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం పీటీఐ ఇంటర్వ్యూ సందర్భంగా ఖర్గే వెల్లడించిన అభిప్రాయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే..ఆయనే వైదొలగుతానన్నారు‘హిందూ, ముస్లింల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా మాట్లాడితే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. మళ్లీ ఆయనే రోజూ హిందూ, ముస్లిం విద్వేష ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన మాటలకు ఆయనే కట్టుబ డట్లేరు. తప్పులు ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పరు. ఆయన ఎంతగా అబద్దాలడుతున్నారో తెలియాలంటే సొంత ప్రసంగాలు ఆయన ఒకసారి వింటే, చూస్తే మంచిది. ఎన్నికల ర్యాలీల్లో విష ప్రచారాన్ని దట్టించారు. ఇలా మాట్లాడే ఆయన ప్రజాజీవితానికి స్వస్తి పలకడమే అత్యుత్తమం’’అందుకే రాహుల్ ప్రేమ దుకాణాలు తెరుస్తానన్నారు‘‘ బీజేపీ నేతలు రాజ్యాంగం, ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మోదీ ఏనాడైనా ఖండించారా? గిరిజ నులపై మూత్ర విసర్జన ఘటనలను ఒక్కసారైనా తప్పుబట్టారా? కనీసం బీజేపీ నేతలను మందలిస్తూ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారా?. తానొక్కడినే నేత అన్నట్లు వన్మ్యాన్ షో చేస్తున్నారు. మొత్తం దేశాన్ని ఒక్కడినే పాలిస్తానని ప్రకటించుకుంటున్నారు. ప్రచారసభల్లో విద్వేష వ్యాఖ్యానాలే చేస్తున్నారు. అందుకే విద్వేషం సమసిపోయేలా ప్రేమ దుకాణాలు తెరుస్తానని రాహుల్ గాంధీ అన్నారు’’అవి బుజ్జగింపు రాజకీయాలు కావు‘‘అన్యాయమైపోతున్న వారిని పట్టించుకుంటే దానిని బుజ్జగింపు రాజకీయాలు అనరు. మేమేం చేసినా బుజ్జగింపు రాజకీయాలు అంటే ఎలా? పేదలకు ఏదైనా ఇవ్వడం, స్కాలర్షిప్ అందించడం, ముస్లింలకు ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యనందిస్తే వాటిని బుజ్జగింపు రాజకీయాల గాటన కట్టొద్దు’’బీజేపీలో కూర్చున్న అవినీతి నేతల సంగతేంటి?‘‘అవినీతి నేతల్ని జూన్ 4 తర్వాత జైల్లో వేస్తామని మోదీ అన్నారు. మరి అవినీతి మరకలున్న చాలా మంది నేతలను బీజేపీ లాగేసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వారిలో కొందరిని ఎంపీలను చేసింది. మరి కొందరు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మరి వారి సంగతేంటి?’’.బీజేపీ మెజారిటీని కచ్చితంగా అడ్డుకుంటాం‘‘కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన చాలా పెరిగింది. కూ టమి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈ బలంతో బీజేపీ మెజారిటీని ఖచ్చితంగా నిలు వరిస్తాం. మా కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుంది’’.ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?‘‘రామ మందిరం, హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్ అంశాలే దశాబ్దాలుగా చెబుతూ ప్రజల భావోద్వేగాలను ఓట్ల రూపంలో ఇన్నాళ్లూ ఒడిసిపట్టారు. ఇక ఆటలు సాగవని అర్థమైంది. అందుకే కొత్తగా కాంగ్రెస్ గెలిస్తే ఇంట్లో ఆవులు, గేదెలు తీసుకెళ్తుందని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందని, మంగళసూత్రం తెంపుకుపోతుందని, భూము లు లాక్కుంటారని ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. అసలు ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?’’‘400’ గొడవ మొదలెట్టిందే మీరు‘‘పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, 400 సీట్లు గెలవాలని అన్నది ఎవరు?. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదా? అసలు 400 సీట్ల గొడవ మొదలెట్టిందే మీరు. అర్హతలేని ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్యాంగబద్ధ సంస్థలను నింపేద్దామని బీజేపీ భావిస్తోంది. రిజర్వేషన్లు తెగ్గోసేందుకు రాజ్యాంగంలో మార్పులకు బీజేపీ సాహసిస్తోంది. రాజ్యాంగం ప్రకారం పాలించట్లేదు. అనైతికంగా గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు’’ అని ఖర్గే ఆరోపించారు. -
అలహాబాద్ టు అంబేడ్కర్నగర్... యూపీలో రసవత్తర పోరు!
ఉత్తరప్రదేశ్ సుదీర్ఘ ఎన్నికల షెడ్యూల్లో ఇప్పటిదాకా ఐదు విడతలకు 53 లోక్సభ స్థానాల్లో అభ్యర్థుల జాతకాలు ఈవీఎంలలోకి చేరిపోయాయి. ఆరో విడతలో 14 స్థానాలకు ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. వీటిలో 9 బీజేపీ సిట్టింగ్ స్థానాలు కాగా బీఎస్పీ 4, ఒకటి ఎస్పీ ఖాతాలో ఉన్నాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఎస్పీ–కాంగ్రెస్, బీజేపీ నడుమ హోరాహోరీ సాగుతోంది. బీఎస్పీ ఒంటరి పోరాటం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆరో విడతలో కీలక నియోజకవర్గాలపై ఫోకస్... – సాక్షి, నేషనల్ డెస్క్అలహాబాద్... త్రివేణి సంగమంలో హోరాహోరీ ఒకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వంటి ఉద్దండులైన ప్రధానులను దేశానికి అందించిన కాంగ్రెస్ కంచుకోట ఈ స్థానం. కానీ దాదాపు 4 దశాబ్దాలుగా పార్టీ ఇక్కడ గెలుపు ముఖం చూడలేదు. చివరిగా 1984లో బాలీవుడ్ సూపర్స్టార్ అమితాబ్ బచ్చన్ కాంగ్రెస్ నుంచి అలహాబాద్లో గెలుపొందారు. తర్వాత బీజేపీ అగ్రనేత మురళీ మనోహర్ జోషీ ఇక్కడ హ్యాట్రిక్ కొట్టారు. అనంతరం రెండుసార్లు సమాజ్వాదీ గెలిచినా తిరిగి కమలనాథులు పట్టుబిగించారు.2016లో బీజేపీ గూటికి చేరిన యూపీసీసీ మాజీ చీఫ్ రీటా బహుగుణ జోషి గత ఎన్నికల్లో గెలిచారు. ఈసారి బీజేపీ ఆమెను పక్కనపెట్టి మాజీ గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి కుమారుడు నీరజ్ త్రిపాఠికి టికెటిచ్చింది. ఇండియా కూటమి తరఫున ఎస్పీ సీనియర్ నేత కున్వర్ రియోతీ రమణ్ సింగ్ కుమారుడు ఉజ్వల్ రమణ్ సింగ్ కాంగ్రెస్ టికెట్పై పోటీ చేస్తున్నారు. ఇక్కడ పూర్వవైభవం కోసం ఎస్పీ దన్నుతో కాంగ్రెస్ తీవ్రంగా చెమటోడుస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.సుల్తాన్పూర్... త్రిముఖ పోరు గోమతి నదీ తీరంలో కొలువుదీరిన ఈ నియోజకవర్గం కూడా ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటే. తర్వాత కమలనాథులు పాగా వేశారు. బీజేపీ నుంచి 2014లో వరుణ్ గాంధీ గెలిచారు. 2019లో వరుణ్ పిలిభిత్కు మారగా ఇక్కడ ఆయన తల్లి మేనకా గాంధీ పోటీ చేశారు. కానీ బీఎస్పీ అభ్యర్థి చంద్రభద్ర సింగ్ ఆమెను ఓడించినంత పని చేశారు. కేవలం 14,500 ఓట్లతో మేనక గట్టెక్కారు. ఈసారి కూడా బీజేపీ నుంచి మేనకే రేసులో ఉన్నారు.ఇండియా కూటమి తరఫున ఎస్పీ అభ్యర్థి రామ్ భువల్ నిషాద్ బరిలో ఉన్నారు. ఇక బీఎస్పీ బలమైన ఓటు బ్యాంకున్న ఉద్రజ్ వర్మకు టెకెటిచి్చంది. బీఎస్పీ ఇక్కడ 1999, 2004ల్లో విజయం సాధించింది. బీజేపీ, ఎస్పీ, బీఎస్పీ మధ్య త్రిముఖ పోరు ఉత్కంఠ రేపుతోంది. అంబేడ్కర్నగర్... బీఎస్పీకి ప్రతిష్టాత్మకం! సోషలిస్ట్ దిగ్గజం రామ్ మనోహర్ లోహియా జన్మస్థలమిది. 2004 దాకా అక్బర్పూర్గా ఉండేది. బీఎస్పీ కంచుకోట అయిన ఈ స్థానం నుంచి పార్టీ చీఫ్ మాయవతి మూడుసార్లు గెలిచారు. 2008లో పునర్విభజన తర్వాత అంబేద్కర్నగర్గా మారింది. గత ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థి రితేశ్ పాండే గెలిచారు. ఇక్కడ దళిత, కుర్మి, బ్రాహ్మణ, ముస్లిం ఓటర్లు కీలకం. బీఎస్పీ సిట్టింగ్ ఎంపీ రితేశ్ పాండే ఈసారి బీజేపీలో చేరి ఆ పార్టీ టికెట్పై పోటీ చేస్తున్నారు. దాంతో బీఎస్పీ కవార్ హయత్ అన్సారీకి టికెటిచ్చింది. ఎస్పీ నుంచి లాల్జీ వర్మ బరిలో ఉన్నారు. త్రిముఖ పోరులో బీఎస్పీ ఎలా నెగ్గుకొస్తుందో చూడాలి.ప్రతాప్గఢ్... కుర్మి, బ్రాహ్మణ ఓట్లు కీలకం బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ సంగమ్ లాల్ గుప్తా, ఇండియా కూటమి నుంచి ఎస్పీ అభ్యర్థి ఎస్.పి.సింగ్ పటేల్ బరిలో ఉన్నారు. ఇక్కడ కురి్మ, బ్రాహ్మణ ఓట్లది కీలక పాత్ర. కుర్మి ఓటర్లు 11%, బ్రాహ్మణ ఓటర్లు 16 శాతం ఉంటారు. వరుసగా ఏడుసార్లు ఎమ్మెల్యే అయిన మాజీ మంత్రి రఘురాజ్ ప్రతాప్ సింగ్ (రాజా భయ్యా), సీనియర్ కాంగ్రెస్ నేత ప్రమోద్ తివారీ కూడా ప్రభావం చూపుతారు. జనసత్తా దళ్ లోక్తాంత్రిక్ పేరుతో కొత్త పార్టీ పెట్టి తనతో పాటు మరో ఎమ్మెల్యేనూ గెలిపించుకున్న రాజా భయ్యా మద్దతు ఈసారి ఎవరికన్నది ఆసక్తికరం.ఆజంగఢ్... ఎస్పీకి సవాల్ యూపీలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఆజంగఢ్ ఒకటి. ఓటర్లలో 21 శాతం యాదవులు, 17 శాతం ముస్లింలు, 19 శాతం దళితులున్నారు. భూమిహార్, ఠాకూర్, బ్రాహ్మణ, కాయస్థ ఓటర్లూ ప్రభావం చూపుతారు. 2014లో ములాయం సింగ్ యాదవ్, 2019లో ఆయన తనయుడు అఖిలేశ్ యాదవ్ విక్టరీ కొట్టారు. గత ఎన్నికల్లో మోదీ వేవ్లో సైతం ఇక్కడ కాషాయ జెండా ఎగరలేదు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన అఖిలేశ్ ఈ సీటును ఖాళీ చేయడంతో వచి్చన ఉప ఎన్నికలో ప్రముఖ భోజ్పురీ నటుడు దినేశ్ లాల్ యాదవ్ నిరాహువా ఇక్కడ బీజేపీకి తొలి విజయం అందించారు. ఈసారీ ఆయనే బరిలో ఉన్నారు. ఎస్పీ నుంచి ధర్మేంద్ర యాదవ్, బీఎస్పీ నుంచి భీమ్ రాజ్భర్ బరిలో ఉన్నారు.ఫూల్పూర్.. నెహ్రూ కోట ప్రయాగ్రాజ్ జిల్లాలో చరిత్రాత్మక నియోజకవర్గమిది. తొలి ప్రధాని నెహ్రూ తొలి ఎన్నికల్లో విజయం సాధించిన స్థానం. ఇక్కడి నుంచి హ్యట్రిక్ కొట్టారాయన. 1962 ఎన్నికల్లో సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా గట్టి పోటీ ఇచ్చినా విజయం నెహ్రూనే వరించింది. ఆయన మరణానంతరం సోదరి విజయలక్ష్మీ పండింట్ ఇక్కడ గెలిచారు. 1975 ఎమర్జెన్సీతో ఫూల్పూర్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. 1971లో వీపీ సింగ్ చివరిసారిగా కాంగ్రెస్ నుంచి గెలిచారు. తర్వాత ఇప్పటిదాకా ఇక్కడ హస్తానికి చాన్సే లేకుండా పోయింది! ఏళ్లుగా ఇక్కడ సమాజ్వాదీ పాగా వేసింది.2004లో మాఫియా డాన్ అతీఖ్ అహ్మద్ సమాజ్వాదీ తరఫున గెలుపొందడం విశేషం. 2014లో కేశవ్ ప్రసాద్ మౌర్య తొలిసారి ఇక్కడ కాషాయ జెండాను ఎగరేశారు. ఆయన రాష్ట్ర రాజకీయాల్లోకి మారడంతో వచి్చన ఉప ఎన్నికలో మళ్లీ ఎస్పీ గెలిచింది. 2019లో బీజేపీ నేత కేసరీదేవి పటేల్ విజయం సాధించారు. ఈసారి బీజేపీ నుంచి ప్రవీణ్ పటేల్, ఎస్పీ నుంచి అమర్నాథ్ మౌర్య, బీఎస్పీ నుంచి జగన్నాథ్ పాల్ బరిలో ఉన్నారు. ముగ్గురూ తొలిసారి లోక్సభకు పోటీ చేస్తుండటం విశేషం! -
వాళ్లందరూ పాకిస్థానీయులేనా.. అమిత్ షాపై కేజ్రీవాల్ ఫైర్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్.. కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై మండిపడ్డారు. ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులను పాకిస్థానీయులుగా అభివర్ణించడాన్ని తప్పుపట్టారు. నిన్న.. అమిత్ షా ఆప్ మద్దతుదారులు పాకిస్థానీలని అన్నారు. నేను ఆయన్ను ఒకటే అడగాలని అనుకుంటున్నాను. ఢిల్లీ, పంజాబ్, గుజరాత్, గోవా ప్రజలే మనకు ఓట్లు ఇచ్చారు? మున్సిపాలిటీ ఎన్నికలలో ఉత్తరప్రదేశ్, అస్సాం, మధ్యప్రదేశ్తో పాటు దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు తమ ప్రేమను, నమ్మకాన్ని మనకు (ఆప్) అందించారు. వాళ్లందరూ పాకిస్థానీయులేనా? అని ప్రశ్నించారు. అనంతరం.. ప్రధాని నరేంద్ర మోదీ 2025 డిసెంబర్లో పదవీ విరమణ చేయనుండగా, అమిత్ షా తదుపరి ప్రధాని అవుతారని అంటూనే.. జూన్ 4 ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఓడి పోతుంది కాబట్టి మీరు ప్రధాని కాలేరు అని అమిత్ షాను ఉద్దేశించి కేజ్రీవాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. సర్వే ఫలితాల ప్రకారం, ఇండియా కూటమికి 300 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు. -
బీజేపీలోకి ‘ఎన్కౌంటర్ స్పెషలిస్ట్’?
దేశంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో ఆరు, ఏడు దశల పోలింగ్ ఇంకా జరగాల్సి ఉంది. అయితే ఇంతలో యూపీకి సంబంధించిన ఒక వార్త హల్చల్ చేస్తోంది. నాటి బీఎస్పీ ప్రభుత్వంలో మాజీ సీఎం మాయావతికి అత్యంత సన్నిహితునిగా మెలిగిన అధికారులలో ఒకరైన రిటైర్డ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి ప్రేమ్ ప్రకాష్ బీజేపీలో చేరుతున్నట్లు సమాచారం.ప్రేమ్ ప్రకాష్ విధుల నిర్వహిస్తున్న సమయంలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పేరొందారు. కాన్పూర్ జోన్లో ఆయన విధులు నిర్వహిస్తున్న సమయంలో 67 మంది నిందితులను అరెస్టు చేశారు. 2019లో కాన్పూర్లో జరిగిన సీఏఏ వ్యతిరేక ఉద్యమంలో కూడా ప్రేమ్ ప్రకాష్ ముఖ్యమైన పాత్ర పోషించారు. మూడేళ్ల క్రితం గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీని పంజాబ్లోని రోపర్ జైలు నుంచి యూపీలోని బండా జైలుకు తీసుకురావాల్సి న బాధ్యతను ప్రభుత్వం ఆయనకు అప్పగించింది.ఢిల్లీ నివాసి అయిన ప్రేమ్ ప్రకాష్ 1993 బ్యాచ్ అధికారి. బీటెక్ తర్వాత పోలీస్ మేనేజ్మెంట్లో ఎండీ కోర్సు చేసిన ప్రేమ్ ప్రకాష్ ఆగ్రా, మొరాదాబాద్లలో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేశారు. ఆయన 2009లో లక్నో డీఐజీగా బాధ్యతలు స్వీకరించారు. ఉద్యోగ జీవితంలో ఆయన పలు అవార్డులు అందుకున్నారు. -
Hyderabad: ‘లోకల్’ అంత ఈజీ కాదు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగుతాయనే వార్తల నేపథ్యంలో క్షేత్రస్థాయిపై బీజేపీ దృష్టి సారించింది. తొలుత గ్రామపంచాయతీ, ఆ తర్వాత జిల్లా, మండల పరిషత్లకు, ఈ ఏడాది చివర్లోగా మున్సిపాలి టీలు, కార్పొరేషన్లకు వరుసగా ఎన్నికలు జరుగు తాయి. అయితే గ్రామస్థాయిలో వార్డు సభ్యులు, మొదలుకొని సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీ సీలు, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్లు ఇలా ప్రతి చోట అభ్యర్థి ఎంపికనే కీలకం. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో పార్టీకి పడిన ఓట్లు, ఆయా పోలింగ్ బూత్లలో బీజేపీకి పోలైన ఓట్ల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపుపై పూర్తిస్థాయి దృష్టి పెడతారని పార్టీవర్గాల సమాచారం. కొంతకాలంగా పార్టీ కోసం పనిచే స్తుండడంతోపాటు, ప్రజల్లో ఉన్న గుర్తింపు, వివిధ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం ప్రయత్నా లు, ఆయా ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు సాధించిన ఓట్లు ప్రామాణికంగా మారనున్నట్టు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి, వివిధ వర్గాల ఓట్ల సాధనకు ఏ మేరకు సఫలమయ్యా రనే దాని ప్రాతిపదికన స్థానిక సంస్థల టికెట్లు కేటాయిస్తామని పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ఇంతకాలంగా ఉన్నాం.. ఇంత పనిచేశాం..అంత పనిచేశామనే ప్రచారానికి పరిమితం కాకుండా గ్రౌండ్లెవల్లో పార్టీ ఫలితాల సాధన కు ఏ మేరకు వారి కృషి ఉందనే అంశాన్ని నాయ కత్వం బేరీజు వేయనున్నట్టు తెలుస్తోంది. వివిధ స్థాయిల్లో పార్టీ అభ్యర్థులు మంచి ప్రదర్శన కన బరచడంలో స్థానిక నేతల కృషి, సాధించిన ఫలి తాలు కొలమానం చేయడం ద్వారా నాయకులు, కార్యకర్తల్లో మరింత అంకితభావం పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. వచ్చే 2,3 నెలల్లో గ్రామీణ, ఆ తర్వాత మున్సిపాలిటీల ఎన్నికలు జరగొచ్చన్న అంచనాల మధ్య పార్టీలో స్థానికంగా వివిధస్థాయిలో అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేది కూడా త్వరలోనే మొదలు మొదలవుతుందని సమాచారం. జూన్ 4న లోక్సభ ఎన్నికల ఫలి తాలు వెలువడ్డాక, పార్లమెంట్ పరిధిలోని అసెంబ్మీ సెగ్మెంట్లు, పోలింగ్బూత్ల వారీగా పార్టీకి పడి న ఓట్ల వివరాలు వెల్లడయ్యాక ఈ ప్రక్రియ వేగం పుంజుకుంటుందని పార్టీనేతలు చెబుతున్నారు. -
దక్షిణాదిలో బీజేపీకే అత్యధిక లోక్సభ సీట్లు... ఇంటర్వ్యూలో ప్రధాని మోదీ విశ్వాసం.. ఇంకా ఇతర అప్డేట్స్
Pagination
కూటమి ఓటమి.. ఆర్కే నోట ఊహించని పలుకు!
మే 31న సిట్ విచారణకు హాజరవుతా: ప్రజ్వల్ రేవర్ణ
టార్గెట్ పిన్నెల్లి
గ్యాంగ్స్టర్తో పార్టీ? స్పందించిన కంగనా రనౌత్
ఈడీ కోర్టును ధిక్కరించింది.. లిక్కర్ కేసులో కవిత లాయర్ వాదనలు
Anant-Radhika Pre Wedding : ఇటలీకి పయనమైన సెలబ్రిటీలు, ఫోటోలు వైరల్
Kavya Maran: మంచి మనసు.. కానీ ఒంటరితనం? పర్సనల్ లైఫ్లో..
ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
400 బక్వాస్.. 200 సీట్లు రావడం కూడా కష్టమే: ఖర్గే ఎద్దేవా
చరిత్ర సృష్టించిన ఐపీఎల్ 2024
ఢిల్లీ హైకోర్టులో ఎలోన్ మస్క్ పిటిషన్.. ఎందుకంటే
ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
ఆమెతో పెళ్లి.. విడాకులు.. అసలు కారణం వెల్లడించిన హీరో!
విమానంలో నగ్నంగా పరుగెత్తిన ప్రయాణికుడు
11 ఏళ్ల క్రితం విడిపోయిన స్టార్ కపుల్.. కుమారుడి కోసం (ఫొటోలు)
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియా గాంధీ
కూరగాయల దగ్గర బేరాలు ఆడితే తిడుతున్నారు: బాలీవుడ్ నటుడు
తప్పక చదవండి
- ఆహార ప్రియులకు అలర్ట్.. హోటళ్లు, రెస్టారెంట్లలో బయటపడ్డ లోపాలు
- ఢిల్లీలో తగ్గిన పోలింగ్ శాతం
- ఓటీటీలో అదరగొడుతున్న టాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?
- నవీన్ పట్నాయక్పై అస్సాం సీఎం హిమంత సంచలన ట్వీట్
- స్కానింగ్ సెంటర్లో టెక్నీషియన్ వికృత చేష్టలు.. న్యూడ్ ఫొటోలు తీసి..
- T20 World Cup 2024: సెమీస్కు చేరే జట్లు ఇవే..!
- పన్ను చెల్లింపు దారులకు అలెర్ట్.. మరో 3 రోజుల్లో ముగియనున్న గడువు
- కవితకు బెయిల్ ఇవ్వొద్దు. . హైకోర్టులో ఈడీ, సీబీఐ వాదనలు
- రూ.1,323 కోట్లు పరిహారం కోరనున్న కళానిధిమారన్
- ఏపీ హైకోర్టులో ఎమ్మెల్యే పిన్నెల్లికి ఊరట
Advertisement