-
Updates: సభలో తీర్మానం పెట్టింది మేమే: సీఎం రేవంత్రెడ్డి
Telangana Assembly Budget Session 2024 Last Day Updates తీర్మానం ఫలవంతం కావాలంటే చట్టభద్దత తేవాలి: మాజీ మంత్రి కేటీఆర్ ఓబీసీ శాఖ, జస్టిస్ సచార్ కమిషన్ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర ఉంది. మేము ప్రయత్నం చేశాం.. న్యాయపరమైన చిక్కులు అడ్డు వచ్చాయి\ మీరు ఎన్నికల్లో ఇచ్చిన బీసీ డిక్లరేషన్ అమలు కావాలంటే సభ పొడిగించి బిల్లు పెట్టండి. మమ్మల్ని బీజేపీ బి-టీమ్ అంటున్నారు: అక్బరుద్దీన్ఓవైసీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు దేశ అభివృద్ధిలో మైనార్టీల పాత్ర ఉంది. ముస్లింలు ఇందిరా నుంచి సోనియా గాంధీ వరకు మద్దతు ఇస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్లకు సహకరించాము బీసీ, దళిత వర్గాల కోసం కొట్లాడితే లీడర్లు అంటారు. మేము మా మైనార్టీల కోసం కొట్లాడితే మమ్ములను బీజేపీ బి - టీమ్ అంటున్నారు. అసెంబ్లీ పనితీరుపై అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం 13వ తేదీ వరకు BAC పెట్టారు... తరువాత బిజినెస్ గురించి BAC పెట్టలేదు. కుల గణన పై ఎన్నికల హామీ ఇవ్వలేదు అయినా సభలో తీర్మానం చేస్తున్నారు. ఎన్నికల హామీలైన ఆరు గ్యారెంటీలపై తీర్మానం చేయండి. కుల గణన కంటే ముందు సమగ్ర కుటుంబ సర్వే రిపోర్ట్ సభలో పెట్టాలి. సమగ్ర కుటుంబ సర్వే వల్ల ఎవరికి లాభం జరిగింది? నేను ఈ తీర్మానంకు మద్దతు ఇస్తున్నాం కానీ క్లారిటీ, న్యాయమైన అంశాల పై జాగ్రతగా ఉండాలి. సభలో తీర్మానం పెట్టింది మేమే: సీఎం రేవంత్రెడ్డి కులగణన తీర్మానం పై అనుమానం ఉంటే సూచనలు సలహాలు ఇవ్వాలి. తీర్మానం పై ఏదైనా లీగల్ చిక్కుల పై అంశాలు ప్రతిపక్షాలకు తెలుస్తే తీర్మానం అమలు అయ్యే విధంగా సహకరించాలి. కులగణన వల్ల అరశాతం ఉన్న వాళ్లకు బాధ ఉంటుంది. కడియం శ్రీహరిని ఆయన పార్టీ నేతలే తప్పుదోవ పట్టిస్తున్నారు. కడియంను తప్పుదోవ పట్టించే వాళ్ళను బయటకు పంపాల్సిందే లేదంటే గాలి సోకుతుంది. ఆనాడు రిజర్వేషన్లు అయితేనే ఆయా సామాజిక నేతలు చట్ట సభల్లోకి వస్తున్నారు మేనిఫెస్టోలపై ఓరోజు చర్చ పెడదాం 2014, 2018, 2023లో పార్టీల మ్యానిఫెస్టో లపై ప్రత్యేకంగా చర్చిద్దాం ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల్లోపే మంత్రివర్గ ఆమోదంతో సభలో తీర్మానం పెడుతున్నాం. ఈ పదేళ్లు మీరేం చేశారు.. ఈ 60 రోజుల్లో మీరు ఏం చేశారన్నది చర్చిద్దాం సభలో తీర్మానం పెట్టింది మేమే ఈ తీర్మానం.. బలహీన వర్గాలను బలంగా తయారు చేయడమే మా ఉద్దేశం బాధితులుగా ఉన్నవాళ్లను పాలకులుగా చేయాలన్నదే మా ఆలోచన కులగణనపై అనుమానాలొద్దు: సీఎం రేవంత్రెడ్డి కులగణనపై.. ప్రజలకు అనుమానం లేవనెత్తేలా విపక్షాల వ్యాఖ్యలు చట్ట సభల్లో అన్నికులాలకు న్యాయం చేసేందుకే కులగణన గతంలో కాంగ్రెస్ హయాంలో జస్టిస్ కమిటీ ఏర్పాటు చేశాం సమగ్ర కుటుంబ సర్వే చేశామని బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకుంటుంది బీఆర్ఎస్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే సభలో ప్రవేశపెట్టారా? ఎన్నికల కోసమే బీఆర్ఎస్ అప్పుడు ఆ సర్వే వివరాలను వాడుకుంది మాకు రాజకీయ దురుద్దేశాలు లేవు కులగణనపై అనుమానాలొద్దు ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రశ్నకి మంత్రి పొన్నం ప్రభాకర్ సమాధానం మేము మీలాగా సకల జనుల సర్వే అని చెప్పి బొంబాయి నుండి బస్సుల రమ్మని.. ఎక్కడైకైనా రమ్మని చెప్పలేదు మీకున్న సందేహాలు నివృత్తి చేసే బాధ్యత మాది... మాజీ మంత్రి 10 ఏళ్లుగా మంత్రిగా ఉండి ఎమ్మెల్యే గా ఉండి అప్పుడు బలహీన వర్గాల గొంతు వినిపించలేదు కాబట్టి అపుడు చెప్పేలేదని ఇప్పుడు చెబుతున్నారు కావొచ్చు ఎవరు ఏమి చెప్పిన వింటాం..జవాబు చెబుతాం.. మా ప్రభుత్వం చిత్తశుద్ది తో ఉంది. మీరేమైనా సలహాలు ఇవ్వండి.. దానిపై ప్రత్యేక చర్చ చేయండి. పాత మేనిఫెస్టో లో ఉంటే చర్చ చేయండి.. మీరు 10 ఏళ్లుగా నియంత్రుత్వ ప్రభుత్వంలో మీరు ఎం చెప్పలేకపోయారు కాబట్టి ఇప్పుడు అన్నీ చెప్పుకుంటా అంటే నడవదు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం మాట్లాడుతూ.. కులగణనను మేం ఆహ్వానిస్తున్నాం కానీ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానంలో స్పష్టత లేదు కులగణనపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి జన, కులం అంటూ ద్వంద్వ వైఖరి కనిపిస్తోంది జనగణన చేసే హక్కు రాష్ట్రాలకు లేదు కులగణన మాత్రమే చేసే హక్కు ఉంటుంది తీర్మానంకు చట్ట బద్ధత అయిన కల్పించండి లేదంటే న్యాయ పరంగా అయినా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి చట్ట బద్ధత లేకుండా తీర్మానం పెడితే లాభం ఉండదు. కులగణన చేప్పట్టిన ఆయా రాష్ట్రాలు న్యాయపరంగా ఇబ్బందులు పడ్డాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన తీర్మాణం ప్రవేశపెట్టడం దేశ చరిత్రలోనే చారిత్రాత్మకం దేశంలో ఉన్న సంపద, రాజ్యాధికారం జనాభా ధమాషా ప్రకారం దక్కాలని మా పార్టీ అగ్రనేత రాహుల్ గాంధి గ ఆనేక సందర్భాల్లో చాలా స్పష్టంగా చెప్పారు. దేశ వ్యాప్తంగా కుల గణన జరుగాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నది. ఎన్నికల్లో చాలా స్పష్టంగా మేము అధికారంలోకి రాగానే కుల గణన చేస్తామని చెప్పాము. కులగణన తెలంగాణ నుంచి మొదలు పెడతామని చెప్పి క్యాబినెట్లో చాలా కులంకుశంగా చర్చించి నేడు అసెంబ్లీలో కుల గణనపై తీర్మాణం పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కులగణన తో పాటు సోషల్, ఎకానమిక్, ఎడ్యుకేషన్, పొల్టికల్, ఎంప్లాయిమెంట్ అంశాలపై సర్వే చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఇంటిని, అన్ని కులాలు, ఆర్ధిక స్థితిగతలపై సర్వే చేస్తాము. ఈ సర్వే ద్వారా సంపద ఎక్కడ కేంద్రీకృతమైంది. ఆ సంపదను అన్ని వర్గాలకు జనాభా దమాషా ప్రకారం ఏలా పంచాలన్నదానిపై అన్ని రకాల ప్రణాలికలు తయారు చేస్తాము. ప్రతిపక్ష సభ్యులు కుల గణనపై ఏలాంటి ఆందోలన గందరగోళం కావొద్దు. సామాజిక ఆర్ధిక రాజాకీయ మార్పునకు పునాధిగా తెలంగాణ మారబోతుంది. 10 సంవత్సరాలు అధికారంలోకి ఉన్న గత బిఆర్ఎస్ ప్రభుత్వం కుల గణన చేయలేదు. ఇప్పుడు కుల గణన చేయాలని ఈ ప్రభుత్వం తీసుకున్న మంచి కార్యాక్రమానికి మద్దతు ఇవ్వకుండ రన్నింగ్ కామెంట్రీ చేయడం సరికాదు ప్రతి ఇంటిని, కులాన్ని సర్వే చేస్తాం.. ఆర్థిక స్థితి గతులు కూడా సర్వే చేస్తాం సర్వేలో అన్ని వివరాలు పొందుపరుస్తాం.. సర్వరోగ నివారిణిలాగా సర్వే ఉంటుంది అసెంబ్లీలో కుల జనగణన తీర్మానంపై చర్చ బీసీ కుల గణనతో బీసీలే నష్టపోతారు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల 2017లోనే సమగ్ర సర్వే చేశాం.. మళ్లీ ఎందుకు?: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల తెలంగాణ శాసన సభలో కులగణన తీర్మానం బీసీ కుల గణన తీర్మానం శాసన సభలో ప్రవేశ పెట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంత్రి @అసెంబ్లీ గత ప్రభుత్వంలోనే 60 CMRF చెక్ లు పెండింగ్ లో ఉన్నాయి. పెండింగ్ ఉన్న CMRF నిదుల పై త్వరలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఎన్నికలకు ముందు 1లక్ష కోట్ల శాంక్షన్స్ ఇచ్చి పోయింది. గత ప్రభుత్వంలో శాంక్షన్స్ పై కీలకమైన అంశాల గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. మంత్రి జోన్ ల వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది జోన్ ల మార్పు పై చర్చిస్తాం సునితా లక్ష్మారెడ్డి.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సిరిసిల్ల జోన్ నుంచి మెదక్ ను చార్మినార్ జోన్ కు మార్చాలి. రాజ్ ఠాకూర్.. కాంగ్రెస్ ఎమ్మెల్యే బొగ్గు గని కార్మికుల కు మెరుగైన వసతులు కల్పించాలి సింగరేణి ఆసుపత్రికి తగినన్ని నిధులు వెంటనే విడుదల చేయాలి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి.. స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 2017 లో సైనిక్ స్కూల్ కు అనుమతి వచ్చింది.. దాన్ని సికింద్రాబాద్ కంటోన్మెంట్ కు తరలించాలనే ఆలోచన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నట్లు సమాచారం.. వర్దన్న పేట ,స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గం మధ్యలో ఉన్న డంపింగ్ యార్డ్ వల్ల రెండు నియోజకవర్గ ప్రజలకు ఇబ్బంది అవుతుంది.. దాన్ని మరో చోటు కు తరలించాలి.. రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుంచి కాకతీయ కళా తోరణం తొలగించకూడదని ప్రభుత్వం కు విజ్ఞప్తి జీరో అవర్ లో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పేరు పెట్టారు కానీ.. కల్వకుర్తి వరకు నీరు రాలేదు రైతులకు పరిహారం 40 కోట్లు పెండింగ్ ఉంది కల్వకుర్తి రైతులకు నీరు అందించాలి.. భూమి కోల్పోయిన రైతులకు పరిహారం వెంటనే అందించాలి జీరో అవర్ లో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కొండగట్టు దేవాలయం అభివృద్ధికి నిధులు కేటాయించాలి లెదర్ పార్క్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి నారాయణ పూర్ రిజర్వాయర్ కుడి, ఎడమ కాల్వల పనులు వెంటనే పూర్తి చేయాలి జీరో అవర్ లో షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ ఊసే లేకుండా పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ 80 శాతం పూర్తి అయ్యిందని చెప్పారు షాద్ నగర్ కు సాగు, తాగు నీరు రాలేదు మిషన్ భగీరథ లో లీకేజీలు జరుగుతున్నాయి.. ఇష్ట రాజ్యంగా తవ్వుతున్నారు డబుల్ బెడ్ రూం ఇల్లు పంపిణీ చేయకపోవడంతో కట్టిన ఇల్లు నిరుపయోగంగా ఉన్నాయి ►తెలంగాణ శాసనసభ లో జీరో అవర్ ప్రారంభం ►ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ నేడు అసెంబ్లీలో ఇరిగేషన్ పై శ్వేత పత్రం విడుదల చేయనున్న తెలంగాణ ప్రభుత్వం నేడు ఇరిగేషన్ పై స్వల్ప కాలిక చర్చ చేపట్టనున్నట్లు అసెంబ్లీ బిజినెస్ రూల్స్ లో ప్రస్తావన ఇరిగేషన్ పై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం నేడు ఇరిగేషన్ చర్చలో ప్రధాన అస్త్రంగా మారనున్న కాగ్ రిపోర్ట్ ప్రధాన అస్త్రంగా.. గురువారం నాటి సభలో కాగ్ రిపోర్టును పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కాగ్ రిపోర్టులో సైతం కాళేశ్వరం పై అనేక ఆరోపణలు కాళేశ్వరం ప్రాజెక్టులో అనేక అవకతవకలు జరిగినట్లు ప్రస్తావించిన కాగ్ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మేడిగడ్డ బ్యారేజ్ విజిట్ చేసిన మంత్రులు ఎమ్మెల్యేలు నేటితో ముగియనున్న అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఆఖరి రోజు నేడు మాజీ మంత్రి హరీష్ చిట్ చాట్ అసెంబ్లీ దెబ్బకే సీఎం రేవంత్ ఈ రోజు ప్రజాభవన్ కు వెళ్తానన్నారు రోజూ ప్రజాభవన్ కు వెళ్తానని చెప్పిన సీఎం తొలి రోజు మాత్రమే వెళ్లారు. ఇదే అంశాన్ని మొన్న అసెంబ్లీలో మేము ఆధారాలతో సహా నిలదీశాం. దీంతో ఈ రోజు హడావుడిగా కేవలం అరగంట ముందు సమాచారం ఇచ్చి అసెంబ్లీకి వెళ్లారు. సీఎం ప్రజాభవన్ కు వస్తారని నిన్ననే సమాచారం ఇస్తే ఈ రోజు చాలా మంది తమ బాధలు చెప్పుకునేందుకు వెళ్లేవారు -
తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
Telangana Assembly Budget 2024 Session Updates ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది: వేముల ప్రశాంత్ రెడ్డి నేను కూడా శాసన సభ వ్యవహారాల మంత్రి గా పనిచేశాను అసెంబ్లీ సమావేశం నడుస్తుండగా మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు మాట్లాడ వద్దనే నిబంధన ఏదీ లేదు ప్రభుత్వం కావాలనే మా గొంతు నొక్కుతోంది సీఎం రేవంత్ ఎన్ని రోజులైనా మాట్లాడండి అవకాశం ఇస్తామన్నారు ..మేము మాట్లాడితే తట్టుకోలేక పోతున్నారు సీఎం చెప్పేదొకటి చేసేదొకటి అసెంబ్లీ ఆవరణ సభ్యుల హక్కు ..నియంత్రణ ఎలా పెడతారు ఇలాంటి వాటిని తట్టుకుంటాం ..పోరాడతాం అసెంబ్లీ లో సీఎం రేవంత్ అనుచిత భాష ను ఖండిస్తున్నాం: కడియం శ్రీహరి చెప్పలేని భాషలో రేవంత్ మాట్లాడుతున్నారు.. అవి అసెంబ్లీ రికార్డులకు వెళ్తున్నాయి రికార్డుల నుంచి తొలగించాలని మేము కోరుదామంటే మాకు మాట్లాడే అవకాశం స్పీకర్ ఇవ్వడం లేదు సీఎం భాష కు ధీటుగా బదులు ఇవ్వగలం ..కానీ పార్లమెంటరీ సంప్రదాయాల మీద మాకు గౌరవం ఉంది ప్రతిపక్ష నేత కేసీఆర్పై సీఎం దిగజారి మాట్లాడుతున్నారు ఇదే విషయాన్ని అసెంబ్లీలో మాట్లాడతామంటే అవకాశం ఇవ్వలేదు బయట మీడియాతో మాట్లాడతామంటే నిబంధనల పేరిట అడ్డుకుంటున్నారు కంచెలు తొలగిస్తామని.. ఇదేమి కంచెల పాలనా? తెలంగాణ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత మీడియా పాయింట్ వద్దకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బారికేడ్లు అడ్డుపెట్టి మరీ ఆపిన పోలీసులు, మార్షల్స్ సభ జరుగుతున్న సమయంలో మాట్లాడ వద్దనే నిబంధన ఉందన్న పోలీసులు కొత్తగా ఈ రూల్స్ ఏంటని పోలీసులతో హరీష్రావు, కేటీఆర్ వాగ్వాదం మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు యత్నం స్పీకర్ నుంచి తమకు ఎలాంటి నోట్ రాలేదన్న బీఆర్ఎస్ కాంగ్రెస్ది ప్రజాపాలన కాదు.. పోలీస్ పాలన:బీఆర్ఎస్ సభలో మైక్ ఇవ్వరు.. బయట కూడా మాట్లాడనివ్వరా? ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేస్తోందని బీఆర్ఎస్ నిరసన తెలంగాణ అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల వాకౌట్ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం మీరు ఇష్టారాజ్యంగా మాట్లాడితే మేము ఊరుకోవాలా: మంత్రి శ్రీధర్రెడ్డి సీఎం రేవంత్ భాషపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ నేతలు.. కేసీఆర్ భాషపై ఎందుకు అభ్యంతరం చెప్పడం లేదు రాజగోపాల్ రెడ్డి, కడియం శ్రీహరి వాఖ్యలలో అభ్యంతరాలు ఉంటే రికార్డుల నుంచి తొలగించాలి రేపు సభలో ఇరిగేషన్పై శ్వేత పత్రం రిలీజ్ చేస్తాం.. అప్పుడు కాళేశ్వరంపై మాట్లాడండి. ముఖ్యమంత్రి బాష అభ్యంతరకరంగా ఉంది: కడియం శ్రీహరి పార్టీ అధ్యక్షుడిగా మాట్లాడడం వేరు.. సీఎం హోదాలో మాట్లాడటం వేరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలా సీఎం మాట్లాడటం సరైంది కాదు కాంగ్రెస్ పార్టీకి చీడ పురుగు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నాశనం చేసిందే రాజగోపాల్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా?: సీఎం రేవంత్ మేడిగడ్డకు వెళ్లి సమస్యను పరిశీలించాం: సీఎం రేవంత్ ప్రభుత్వం సరైన భాష మాట్లాడటం లేదంటున్నారు కేసీఆర్ మాట్లాడిన భాష సరిగా ఉందా? తప్పందా కొత్త ప్రభుత్వానిదే అన్నట్టు కేసీఆర్ మాట్లాడారు ఒక ముఖ్యమంత్రిని ఏం పీకడానికి పోయావ్ అంటారా? ఇప్పటికే కేసీఆర్ ప్యాంట్ ఊడదీశారు.. ఇప్పుడు చొక్కా లాగుతారు ప్రాజెక్టులపై చర్చిద్దాం ప్రతిపక్ష నాయకుడిని సభకు రమ్మనండి అవినీతి బయటపడుతుందని సభకు రాకుండా దాక్కుంటున్నారు సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వం శ్వేత పత్రం పెడుతుంది కాళేశ్వరంపై చర్చకైనా మేం సిద్ధంగా ఉన్నాం కడియం వ్యాఖ్యలను తప్పుబట్టిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఐటీలో లక్షల ఉద్యోగాలను సృష్టించినందుకు కేటీఆర్కు థాంక్స్: కడియం ఐటీని తారా స్థాయికి కేటీఆర్ తీసుకెళ్లారు గత ప్రభుత్వం చేసుకున్న ఎంవోయూలను మళ్లీ ఎంవోయూలు చేసుకున్నారు: కడియం. ఎంవోయూలపై కడియం వ్యాఖ్యలను ఖండించిన మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వంలో చేసుకున్న ఎంవోయూలు ఒక్కటి కూడా మొన్నటి ఒప్పందాల్లో లేవు: శ్రీధర్ బాబు టీసీఎస్ లాంటి ఒప్పందాలు గత ప్రభుత్వంలో లేవు: శ్రీధర్ బాబు కాంగ్రెస్ ప్రభుత్వఃపై బీఆర్ఎస్ బురదజల్లుతుంది. కాంగ్రెస్ మేడిగడ్డ టూర్పై సభలో స్పందించిన బీఆర్ఎస్ మేడిగడ్డపై ప్రభుత్వం పూర్తి విచారణ చేయాలి: కడియం శ్రీహరి విచారణలో ఎవరు దోషులని తెలితే వాళ్లకు శిక్ష పడుతుంది మేడిగడ్డ బ్యారేజీని వెంటనే రిపేరు చేయాలి మేడిగడ్డను రాజకీయం కోసమే కాకుండా ప్రజల కోసం ప్రభుత్వం ఆలోచన చేయాలి జూలై నెల వరకు మేడిగడ్డపై కాపర్ డ్యాం నిర్మించి ప్రజలకు నీళ్లు అందించేలాగా చర్యలు చేపట్టాలి. అసెంబ్లీలో మంత్రి పొన్నం ప్రభాకర్ వర్సెస్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి మంత్రి పున్నం ప్రభాకర్ మాట్లాడుతుండగా కూర్చో కూర్చో అంటూ కేటీఆర్ రన్నింగ్ కామెంట్స్ మాట్లాడేది వినబుద్ధి కాకపోతే సభలో నుంచి వెళ్ళిపోవచ్చు అంటూ కేటీఆర్ను సూచించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలకు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రన్నింగ్ కామెంట్స్ భార్య పిల్లలను అడ్డం పెట్టుకొని ఆత్మహత్య చేసుకుంటానని బ్లాక్ మెయిల్ చేసి ఎమ్మెల్యే అయిన వాళ్లు కూడా సభలో మాట్లాడుతున్నారు: మంత్రి పొన్నం కౌశిక్ రెడ్డి, కేటీఆర్ నన్ను భయపెడితే నేను భయపడను: మంత్రి పొన్నం భయపడితే భయపడడానికి నేను బానిసను కాదు: మంత్రి పొన్నం ఇరిగేషన్పై తెలంగాణ శాసనసభలో రసాభాస కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఖండించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పదేళ్లు మా యువరాజు సిరిసిల్లకు అన్యాయం చేశారు కుర్చీ వేసుకుని గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ఇప్పటికీ పూర్తి చేయలేదు గత కాంగ్రెస్ ప్రభుత్వం లోనే 80 శాతం పూర్తయిన గౌరవెల్లి ఇప్పటికీ నీలి ఇవ్వలేకపోతోంది: మంత్రి పొన్నం ప్రభాకర్ లోయర్ మానేరు ఎల్లంపల్లి శ్రీరాంసాగర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం కాలువలు తవ్వింది. శాసన సభలో ఆరు గ్యారెంటీల అమలుపై రసాభాస ఆరు గ్యారెంటీల అమలు కోసం 53వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు ఆరు గ్యారెంటీలతో పాటు డిక్లరేషనలు, 420 హామీలు కాంగ్రెస్ ఇచ్చింది ఆరు గ్యారెంటీలు, 13 హామీలు అమలు కావాలంటే 1లక్ష 36వేల కోట్లు కావాలి ఆరు గ్యారెంటీల అంశం పై కడియం శ్రీహరి వ్యాఖ్యలను తప్పు పట్టిన మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వం ఏర్పడి 60 రోజులే అవుతుంది.. తప్పకుండా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం:శ్రీధర్ బాబు. ఆరు గ్యారెంటీల హామీలను ప్రజలు నమ్మారు.. తీరా గెలిచిన తరువాత ప్రజల నెత్తిమీద భస్మాసుర హస్తం పెడుతున్నారు: కడియం వనరులు చూసుకోకుండా, లెక్కలు చెయ్యకుండా హామీలు ఇచ్చారా?: కడియం బడ్జెట్పై చర్చలో కడియం శ్రీహరి వర్సెస్ మంత్రులు పొన్నం, శ్రీధర్ బాబు ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ మాత్రమే ఎమర్జెన్సీ అనగానే కడియం ను అడ్డుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ దేశం ఏర్పడిన రోజు సూది తయారు చేసుకునే పరిస్థితి లేకుండే - మంత్రి పొన్నం కడియం బడ్జెట్ పై మాత్రమే మాట్లాడాలి పదేళ్లలో గత ప్రభుత్వం ఏమైనా చేసిందా? నేను బుక్ లో ఉన్నది మాత్రమే చర్చ చేస్తున్నా: కడియం శ్రీహరి ఎమ్మెల్యే మంత్రులకు ఏమైనా డౌట్ ఉంటే బడ్జెట్ పుస్తకం చదువుకోవాలి బడ్జెట్ పుస్తకం తయారు చేసేటప్పుడు సరిచేసుకోవాలి అందరి కోసం కాదు... కొందరి కోసం చేస్తుందే కాంగ్రెస్ పార్టీ ఒకవైపు లెక్కల్లో గత ప్రభుత్వాన్ని పొగుడుతూ... మరో వైపు బయట తిడుతున్నారు గత ప్రభుత్వం పాలన సరిగ్గా లేకపోతే తలసారి ఆదాయం ఎలా పెరుగుతుంది? అభివృద్ధి జరగకపోతే ఓటాన్ అకౌంట్ బడ్జెటే 2లక్షల 75వేలు ఎలా పెడతారు? తెలంగాణ శాసన సభలో బడ్జెట్ పై మొదలైన చర్చ బడ్జెట్ పై BRS నుంచి చర్చను మొదలు పెట్టిన కడియం శ్రీహరి రాష్ట్ర బడ్జెట్ను ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదు:కడియం శ్రీహరి. బడ్జెట్పై చర్చ జరుగుతుంటే ఆర్థిక మంత్రి, సీఎం రేవంత్ లేరు: కడియం శ్రీహరి బడ్జెట్పై చర్చలో ఒక్క అధికారి తప్ప ఎవ్వరూ లేరు అసెంబ్లీలో.. మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు ప్రసంగం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి ఇరిగేషన్పై సభలో మంత్రి ఉత్తమ్ శ్వేతపత్రం ప్రవేశపెట్టనున్నారు నేడు తెలంగాణ అసెంబ్లీలో.. కాసేపట్లో ఐదో రోజు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో నేడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్పై చర్చ సమాధానం ఇవ్వనున్న ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలపనున్న అసెంబ్లీ ఇరిగేషన్పై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల మేడిగడ్డ విజిలెన్స్ రిపోర్ట్, కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం ఇరిగేషన్పై చర్చకు రావాలని కేసీఆర్కు సీఎం రేవంత్రెడ్డి పిలుపు -
Live: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు
-
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఓవరాక్షన్
సాక్షి, అమరావతి: అసెంబ్లీలో టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. అసెంబ్లీ బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో భాగంగా రెండో రోజైన సోమవారంటీడీపీ సభ్యులు అనుచితంగా ప్రవర్తించారు. అసెంబ్లీ ప్రారంభమైన కాసేపటికే స్పీకర్ చాంబర్ వైపు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు.. స్పీకర్పై పేపర్లు విసిరారు. రెడ్లైన్ దాటి మరీ స్పీకర్ చాంబర్లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు.. దురుసుగా ప్రవర్తించారు. నినాదాలు చేస్తూ తమ చేతిల్లో ఉన్న పేపర్లను స్పీకర్పై విసిరారు. టీడీపీ సభ్యుల తీరుతో సభను వాయిదా వేశారు స్పీకర్ తమ్మినేని. -
బడ్జెట్ సమావేశాలు.. ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై సీఎం జగన్ పూర్తి ప్రసంగం విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుంది: సీఎం జగన్ చంద్రబాబు కేవలం వాగ్దానాలు మాత్రమే చేస్తారు వాగ్దానాలు అమలు చేసిన చరిత్ర చంద్రబాబుకి లేదు మనసు లేని నాయకుడు.. మోసం చేసే నాయకుడు చంద్రబాబు చేయలేనివి చెప్పకూడదు.. మాట ఇస్తే తప్పకూడదు ఒక్క అబద్ధం ఆడని కారణంగా ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చున్నా అలివి కానీ హామీలిచ్చి వాటి అమల్లో దారుణంగా విఫలమైనందుకు, అన్ని వర్గాల వారిని మోసం చేసినందుకు 2019లో 175 స్థానాల్లో కేవలం 23 స్థానాలు మాత్రమే బాబుకు దక్కాయి. మాట మీద నిలబడ్డాం కాబట్టే ప్రజలు 151 స్థానాలు కట్టబెట్టారు ఆ తర్వాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రజలు గెలిపించి గుండెల్లో పెట్టుకున్నారు విశ్వసనీయతకు అర్థం జగనే విశ్వసనీయత ఎప్పటికైనా గెలుస్తుంది 99 శాతం హామీలు అమలు చేశాం జరిగిన మంచిపై ప్రతి ఇంటా చర్చ జరగాలి అలా ఐదేళ్లు ప్రతిపక్షంలో ఉండాల్సి వచ్చింది.. సీఎం జగన్ ఐదేళ్లలో మ్యానిఫెస్టోలో 99 శాతం హామీలను నిబద్ధతతో అమలు చేశాం. హామీల అమలుపై ప్రజల చేతనే శెభాష్ అనిపించాం 2014లో చంద్రబాబు నాయుడు కూటమికి వచ్చిన ఓట్లు, మనకు వచ్చిన ఓట్లు ఎంతని పరిశీలిస్తే ఒక్క శాతం ఓట్లు మాత్రమే తేడా కనిపిస్తుంది. 46 శాతం వాళ్లకొచ్చాయి. మనకు 45 శాతం వరకూ వచ్చాయి. రైతులకు రుణమాఫీ చేస్తామని హామీ ఇద్దామని చాలామంది శ్రేయోభిలాషులే సలహా ఇచ్చారు. అయితే చేయలేదని చెప్పకూడదు. మాట ఇస్తే తప్పకూడదని వాళ్లందరికీ చెప్పా ఆ ఒక్క మాట నేను అబద్ధం చెప్పని కారణంగా.. ఆ ఒక్క రోజు అధర్మం చేయని కారణంగా ఒక్క శాతం ఓట్ల తేడాతో ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. బాబును నమ్మడం అంటే.. సీఎం జగన్ నోట మళ్లీ బంగారుకడియం-పులి ప్రస్తావన వాగ్దానాలు అమలు చేసే ఉద్దేశమే ఆయనకు లేదు అమలు చేసిన చరిత్ర అంతకన్నా లేదు రాష్ట్ర ప్రజలకు వినమ్రంగా తెలియజేసేది ఏమిటంటే.. బాబు మేనిఫెస్టోను నమ్మడం అంటే బంగారు కడియమిస్తానన్న పులిని నమ్మడమే సంపద సృష్టించారా.. ఎక్కడ? రూ.70 వేల కోట్లకే రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్న చంద్రబాబు రూ.1.26 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నిస్తే ఈనాడు వంటి గోబెల్స్ సంస్థలు ‘బాబు సంపద సృష్టిస్తాడు’’ అంటారు. మరి... పద్నాలుగేళ్లు సీఎంగా ఉన్న వ్యక్తి గతంలో ఏ మేరకు ఆయన సంపద సృష్టించాడో ఒకసారి చూద్దాం... సంపద సృష్టిలో బాబు ట్రాక్ రికార్డు... ఆయన ముఖ్యమంత్రి కాక మునుపు వరకూ 1993 వరకూ రాష్ట్రం రెవెన్యూ సర్ప్లస్ ఆ తరువాత ఏ ఏడాదిని తీసుకున్నా (మచ్చుకు పదేళ్లు చూపుతున్నాం) రాష్ట్రం రెవెన్యూ డెఫిషిట్ 2004లో దివంగత నేత, నాన్నగారు సీఎం అయిన తరువాత మళ్లీ రెవెన్యూ సర్ప్లస్ 2014లో బాబు మళ్లీ ముఖ్యమంత్రి అయినప్పుడు మళ్లీ రెవెన్యూ డెఫిషిట్లోకి వెళ్లిపోయింది,. నిజంగానే బాబు అంత గొప్ప విజనరీ అయితే ఆయన పాలనలో రాస్ట్రం మెరుగుపడి ఉంటే.. ఆయన హయాంలో దేశం జీడీపీలో మన వాటా 4.47 శాతం. గత ఐదేళ్లలో 4.82 శాతం భాగస్వామ్యం మనది. దీన్నిబట్టి చూస్తే ఎవరు సంపద సృష్టించారో స్పష్టంగా తెలుస్తుంది బాబు వాగ్దానాల ఖర్చెంతంటే.. : సీఎం జగన్ ప్రజలను మోసం చేసేందుకే చంద్రబాబు వాగ్ధానాలు ఉంటాయి మనం ఏడాదికి రూ.70 వేల కోట్లు ఖర్చు చేస్తే.. శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు ప్రచారం చేస్తన్నారు చంద్రబాబు కొత్త వాగ్ధానాలకు ఏడాదికి రూ.73 వేల కోట్లు ఖర్చు అవుతుంది ఇప్పటివరకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కలుపుకుంటే రూ.2 లక్షల 26 వేల 140 కోట్లు ఖర్చు అవుతుంది మరి అప్పుడు రాష్ట్రం ఏమవుతుంది? మనం రూ.70 వేల కోట్లకే చాలా కష్టాలు పడుతూంటే బాబు రూ.1.26 లక్షల కోట్లు ఖర్చు పెట్టడం సాధ్యమేనా? ఇలా మోసం చేయడం, కుట్రలు పన్నడం ధర్మమేనా బాబు! సంపద సృష్టించానని బాబు ప్రతీ మీటింగ్లో చెబుతున్నారు చంద్రబాబు సీఎంగా ఉన్నన్ని రోజులు రాష్ట్రంలో రెవెన్యూ లోటు బాబు సంపద సృష్టిస్తే.. రెవెన్యూ లోటు ఎందుకు వస్తుంది? చంద్రబాబు కంటే మన హయాంలోనే ఎక్కువ సంపద సృష్టించాం ఇదీ తేడా.. సీఎం జగన్ తల్లికి వందనం అంటూ చంద్రబాబు మరో కొత్త డ్రామా మొదలుపెట్టారు వేరే రాష్ట్రాల్లో ప్రజల్ని ఆకట్టుకున్న వాగ్ధానాల్ని తీసుకొచ్చారు మా హయాంలో ఎవరూ టచ్ చేయలని పథకాలు తీసుకొచ్చాం 8 పథకాలకే రూ. 52 వేల కోట్లు ఖర్చు చేశాం 650 వాగ్ధానాలతో గత మేనిఫెస్టో ఇచ్చారు చంద్రబాబు వాటిలో పదిశాతం హామీలే చేశారు చంద్రబాబు ఇప్పుడు తాజాగా చేస్తున్న ఆరు హామీలను కూడా కలిపితే మహిళా మహా శక్తికి రూ.36000 కోట్లు తల్లికి వందనం రూ.12450 కోట్లు యువ గళం రూ.7200 కోట్లు దీపం పథకం రూ.4600 కోట్లు అన్నదాత రూ.11000 కోట్లు అన్నీ కలిపితే రూ.73 వేల కోట్లు. వీటికి రద్దు చేయలేని ఎనిమిది పథకాలకు పెడుతున్న ఖర్చు కూడా కలుపు కుంటే మొత్తం 1,26140 వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు పెట్టాలి. డీబీటీ, నాన్ డీబీటీలు రెండింటినీ కలిపి తీసుకున్నా రాస్ట్ర ప్రభుత్వం పెట్టిన ఖర్చు మొత్తమ్మీద సంవత్సరానికి 77 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఏ ప్రభుత్వం వచ్చినా కొన్ని కొన్ని పథకాలు రద్దు చేయలేదు. పెన్షన్లకు అయ్యే రూ.23600 కోట్లు రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు రూ.11,000 ఖర్చు సబ్సిడీ బియ్యం రూ.4600 కోట్లు ఆరోగ్య శ్రీ, ఆరోగ్య ఆసరా రూ.4,400 కోట్లు ఫీజ్ రీయంబర్స్మెంట్ రూ.2,800 కోట్లు వసతి దీవెన రూ.2,200 కోట్లు సంపూర్ణ పోషణ కింద బాలింతలు, గర్భిణులు, ఆరేళ్ల లోపు చిన్నారులకు రూ.2,200 కోట్లు గోరుముద్ద కింద పోషకాహారం.. రోజుకో మోనూతో ఇస్తున్నాం - రూ.1,900 కోట్లు ఈ ఎనిమిది పథకాలకు 52,700 కోట్లు ఖర్చు అవుతోంది. వీటిని ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయలేవు బాబు ఏ మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలు: సీఎం జగన్ ప్రభుత్వం మంచి చేయలేదని నమ్మితే.. ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఏముంది? వీళ్లు ఏ ఒక్కరు కూడా అధికారం అన్నది ప్రజలకు మంచి చేసేందుకు ఉపయోగించుకోవాలని రావడం లేదు. ప్రజలను మోసం చేసేందుకు వీళ్లు దోచుకుని, పంచుకునేందుకు మాత్రమే వీళ్లకు అధికారం కావాలి మేనిఫెస్టోను వెబ్సైట్ నుంచి తొలగించిన ఘనత చంద్రబాబుది పేదలకు మళ్లీ మోసం చేసేందుకు చంద్రబాబు సిద్ధం అయ్యారు పక్క రాష్ట్రాల్లోని వాగ్ధాలను మేనిఫెస్టోలో పెడుతున్నాడు కనీసం పది శాతం హామీలను కూడా నెరవేర్చలేదు ఏ మేనిఫెస్టో తీసుకున్నా ఇవే మోసాలు కనిపిస్తాయి. 1994, 1999 -2014లో ఇచ్చిన మేనిఫెస్టోల్లోనూ ఇవే మోసాలు కనపడతాయి తొలి సంతకాలు, సామాజిక వర్గాలు, రైతులు, పిల్లలు, అక్కచెల్లెమ్మలు, నిరుద్యోగులకు ఇచ్చిన దాదాపు 655 వాగ్దానాలుచ్చి.. వాటిల్లో పది శాతం కూడా తీర్చకుండా.. మేనిఫెస్టోను మాయం చేశాడంటే పరిస్థితి ఏమిటన్నది ప్రజలు ఆలోచించుకోవాలి ఇలాంటి వ్యక్తిని 2024 ఎన్నికల్లో నమ్మడం కరెక్టేనా అన్నది ప్రజలు ఆలోచించాలి. ఎలాగూ ప్రజలు తమకు అధికారం ఇవ్వరని అనుకుంటన్న చంద్రబాబు గ్యాంబ్లింగ్ తరహాలో హామీలిస్తున్నాడు వేర్వేరు రాష్ట్రాల్లోని హామీలను పట్టుకుని పేకాట ఆడటం మొదలుపెట్టాడు చంద్రబాబు నమ్మే ఫిలాసఫీ ఇదే: సీఎం జగన్ నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు చంద్రబాబు ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవుతారు ఎన్నికల ముందు చంద్రబాబు మేనిఫెస్టో పేరుతో పెద్ద బుక్ తెస్తారు ఎన్నికలయ్యాక మేనిఫెస్టో చెత్తబుట్టలోకి వెళ్తుంది ఏ గ్రామానికి వెళ్లినా చంద్రబాబు చేసిందేమీ లేదు చంద్రబాబు పాలన అధ్వాన్నంగా సాగింది ప్రతీ ఒక్కరూ ఆలోచించాలి: సీఎం జగన్ బాబు వయసు 75. రాజకీయాల్లోకి వచ్చి 45 ఏళ్లు అయ్యింది. మొదటిసారి సీఎం అయి కూడా 30 ఏళ్లు అవుతోంది. మూడుసార్లు సీఎం అయిన తరువాత కూడా ఇప్పటికి కూడా.. ఫలానా పని చేశా కాబట్టి నాకు ఓటేయండి ఆయన అడగలేకపోతున్నాడు. మరోసారి ఛాన్స్ ఇస్తే అది చేస్తా.. ఇది చేస్తా అని మాత్రమే అంటున్నాడు ప్రతి ఒక్కరూ ఈ విషయమై ఆలోచన చేయాలి. బాబు మీ సామాజిక వర్గాలకు చేసిన మేలు ఏమైనా ఉందా? అన్నది కూడా ప్రతి సామాజిక వర్గం కూడా ఆలోచించాలి మేనిఫెస్టో అంటే లావు పుస్తకం పెడతారు వాళ్లు. ప్రతి సామాజిక వర్గానికీ బోలెడన్ని హామీలిస్తాడు. ఎన్నికల తరువాత ఆ మేనిఫెస్టో ఎక్కడికి వెళుతుందో ఎవరికీ తెలియదు. ఆన్లైన్లోనూ కనిపించదు. చంద్రబాబు పేరు చెప్తే గుర్తొచ్చేది.. : సీఎం జగన్ చంద్రబాబు పేరు చెబితే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకొస్తుందా? బాబు పేరు చెబితే.. ఈనాటికీ గుర్తుకొచ్చేది వెన్నుపోటే చంద్రబాబుకు ఒంటరిగా పోటీ చేసే దైర్యం లేదు చంద్రబాబు పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు చంద్రబాబు ప్రతీ సామాజిక వర్గాన్ని మోసం చేశారు చంద్రబాబు కొత్త కొత్త వాగ్ధానాలతో గారడీ చేస్తున్నారు ఇప్పటికీ చంద్రబాబు ఏం చేశాడో చెప్పి ఓట్లు అడగలేకపోతున్నారు ఇన్ని కుట్రలు, పొత్తులు, కుతంత్రాలు ఎందుకు? ఆ అవసరం ఏముంది?: సీఎం జగన్ మనం చేసిన 2,91,000 కోట్ల అప్పును ఒకరు 13 లక్షల కోట్లు అంటారు.. 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు కుటుంబాలకు ఏ మంచి చేయలేదు. ఎక్కడా ఈ విషయాన్ని చెప్పుకోనూ లేడు. ఇటీవలి కాలంలో నేను చేస్తున్న ప్రసంగాల్లోనూ ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నా. పది సంవత్సరాల బ్యాంక్ అకౌంట్లో బాబు హయాంలో ఒక్క రూపాయి అయినా వారికి చేరిందా అని వాళ్లనే చూసుకోమంటున్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్ ఉన్నా.. కేవలం ముఖ్యమంత్రి మాత్రమే మారినా ఎందుకు బాబు హయాంలో ఎక్కువ అప్పులు చేసినా ఎవరికీ లబ్ధి ఎందుకు చేకూర్చలేకపోయారు? ఆడబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి చేరాయో ప్రజలు ఆలోచన చేయాలి? ప్రతికూల పరిస్థితుల్లోనూ చిత్తశుద్ధి, పట్టుదల, నిబద్ధతలతో రాష్ట్రంలో రైతన్నలకు, పిల్లలకు, అక్కచెల్లెమ్మలకు, అవ్వాతాతలకు, సామాజిక వర్గాల సంక్షేమం కోసం ఎలా అడుగులు ముందుకేసామో చరిత్ర మనల్ని గుర్తుంచుకుంటుంది. కేంద్రం నుంచి ఆశించినంత మేరకు నిధులు రాకపోయినా బాబు చేసిన అప్పులకు వల్లమాలిన వడ్డీ కట్టుకుంటూ.. కోవిడ్ కారణంగా ఆదాయం తగ్గి, ఖర్చులు పెరిగినా ఎన్ని కారణాలున్నా.. ఇబ్బందులన్నా ప్రతి పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్న లక్ష్యంతో పనిచేశామని, మేనిఫెస్టోలో 97 శాతం హామీలను నెరవేర్చిన పార్టీగా అవతరించాం. ఏ ప్రభుత్వమైనా ఐదేళ్ల పాలనలో ప్రజలకు చెడు చేసిందని కానీ.. మంచి చేయలేదని కానీ, మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్ధానాలు అమలు చేయలేదని కానీ ప్రతిపక్షం నమ్మితే.. అధికార పార్టీని ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది? జాతీయ పార్టీతో, ప్రత్యక్షంగా ఒకరితో, పరోక్షంగా ఇంకొకరితో అవగాహన కుదుర్చుకుని, కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ప్రతిపక్షం ఉందంటే దాని అర్థమేమిటో ఆలోచన చేయాల్సిన అవసరముంది? ఇంటింటి ఆర్థిక స్థితిని మార్చాం: సీఎం జగన్ చంద్రబాబు హయాంలో ఏ కుటుంబానికి మంచి జరగలేదు ఆయన హయంలో సంక్షేమ పథకాలు లేవు 14 ఏళ్లు సీఎంగా అనుభవం ఉందని చంద్రబాబు అంటున్నారు రాష్ట్రానికి ప్రజలకు పనికిరాని అనుభవం ఎందుకు? తాను చేయని అభివృద్ధిన తానే చేశానని చంద్రబాబు మాట్లాడడం విడ్డూరం మాకు అనుభవం లేకపోయినా పరిపాలన ఎలా చేయాలో చేసి చూపించాం మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చాం రూ.2 లక్షల 55 వేల కోట్లు పేదలకు ఇచ్చాం ప్రతీ పేదవాడి ముఖంలో చిరునవ్వు చూడాలన్నదే మా తాపత్రయం ఆ ప్రయత్నంలో భాగంగానే ఇంటింటి ఆర్థిక స్థితిని మార్చాం.. పేదలకు అండగా నిలిచాం చంద్రబాబు ఏనాడూ మంచి చేసింది లేదు: సీఎం జగన్ కేంద్రం కంటే రెట్టింపు స్థాయిలో బాబు అప్పులు తెచ్చాడు కానీ, ఎక్కువ అప్పులు చేశామని మన మీద అబద్ధాల బ్యాచ్ ప్రచారం చేస్తోంది మన హయాంలో కేంద్ర ప్రభుత్వం 6.5 శాతం అప్పులు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం అప్పులు 5.2 శాతం మాత్రమే ఏ రకంగా చూసినా గత ప్రభుత్వానికి, మనకూ ఎంత వ్యత్యాసముందో చెప్పేందుకు ఈ సమాచారం ఉపయోగపడుతుంది. ఈ మాత్రం చేయగలిగామనేందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది జనాలకు మంచి చేశామన్న సంతృప్తి మాకు ఉంది అంత అప్పుతో మన ప్రయాణం.. : సీఎం జగన్ విభజన నాటికి రూ.లక్షా 53 వేల కోట్ల అప్పు ఉంటే.. చంద్రబాబు దిగిపోయే నాటికి రూ.4.12 లక్షల కోట్లకు చేరింది. 2019 మే నెల నాటికి 4,12,288 కోట్ల రూపాయలు రూ.4.12 లక్షల కోట్ల అప్పుతో ప్రయాణం ప్రారంభించాం. ఇప్పుడది ఏడు లక్షల కోట్ల పై చిలుకుగా ఉంది. మన హయాంలో ఆర్థిక సంఘం సిఫారసుల కంటే రూ. 366 కోట్లు తక్కువ తీసుకున్నాం ఈనాడు, టీవీ-5, ఆంధ్రజ్యోతి వంటి వాళ్లు మనపై చేసే ఇంకో ఆరోపణ విపరీతంగా అప్పులు చేశారని! హద్దు పద్దూ లేకుండా లక్షల కోట్లు చేసేశారని ఆరోపిస్తూంటారు గ్యారెంటీలతో కలిపి వివిధ సంస్థలు చేసిన అప్పులు.. గ్యారెంటీల్లేని అప్పులను కూడా పరిగణలోకి తీసుకుంటే విభజన నాటికి.. రాష్ట్ర ప్రభుత్వం అప్పు 132000 కోట్లు (రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చినవి.. చేసిన అప్పులు కలిపి) గ్యారెంటీల్లేని ప్రభుత్వ అప్పులు కూడా కలుపుకుంటే మొత్తం అప్పు రూ. 1,53,000 కోట్లు బాబు హయాంలో అప్పులు పెరగింది 21.87 ఏడాదికైతే... మన హయాంలో ఇది కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ... ఖర్చులు పెరిగినప్పటికీ.. బటన్లు నొక్కినప్పటికీ కూడా బాబు హయాయంలో ఉన్న 21. 87 శాతం అప్పుల పెరుగుదల రేటు ఉంటే మన హయాంలో మాత్రం అది 12.13 శాతం మాత్రమే. అంటే.. అప్పుల పెరుగుదల 12 శాతానికి పరిమితం చేశాం యెల్లో మీడియా దుష్ఫ్రచారం: సీఎం జగన్ ఎల్లో మీడియా ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తోంది ఇలాంటి వారిపై మనం యుద్ధం చేస్తున్నాం చంద్రబాబు హయాంలో కంటే.. అభివృద్ధి కోసం అదనంగా మేం అదనంగా ఖర్చు చేస్తున్నాం చంద్రబాబు హయాంలో రూ. 15,227 కోట్లు సగటున ఖర్చు చేస్తే.. మా హయాంలో రూ.17,757 కోట్లు ఖర్చు చేశాం అప్పులపై యెల్లో మీడియా దుష్ఫ్రచారం చేస్తోంది లంచాలు, వివక్ష లేకుండా పారదర్శక పాలన అందించాం రూ.2లక్షల 55 వేల కోట్లు పేదల ఖాతాల్లో వేశాం నాన్ డీబీటీ ద్వారా రూ.లక్షా 76 వేల కోట్లు అందించాం దురదృష్టవశాత్తూ మనకు శత్రువులు ఎక్కువ గోల చేసే వాళ్లు ఎక్కువ.. ఒకే విషయాన్ని మళ్లీమళ్లీ చెబుతూ గందరగోళం సృష్టించే వాళ్లూ ఎక్కువే కేపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ తక్కువని వీరు ఆరోపణలు చేస్తూంటారు. జగన్ కేవలం బటన్లు మాత్రమే నొక్కుతూంటారన్నది కూడా అబద్ధం సమర్పించిన అంకెలన్నీ కాగ్ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఇచ్చినవే కడుతున్న మూడు పోర్టులను కూడా కలుపుకుంటే ఈ మొత్తానికి ఇంకో పన్నెండు వేల కోట్లు చేర్చాల్సి వస్తుంది ప్రతీ రూపాయి ప్రజలకే: సీఎం జగన్ రూ.2 లక్షల 55 వేల కోట్లు లబ్ధిదారుల ఖాతాల్లో వేశాం 57 నెలల ప్రయాణంలో ఎక్కడా అవినీతికి తావివ్వలేదు ఎలాంటి వివక్ష లేకుండా ప్రతీ రూపాయి ప్రజలకు చేరుతోంది బటన్ నొక్కి నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమ చేశాం అయినా ప్రతిపక్షాలు యెల్లో మీడియాతో విష ప్రచారం చేస్తున్నాయి విభజన నష్టం భారీగానే.. :సీఎం జగన్ మనది రైతులు, వ్యవసాయంతో కూడిన ఎకానమీ తెలంగాణతో పోలిస్తే ఏపీ ఆదాయం తక్కువ రాష్ట్రాన్ని అడ్డంగా విడగొట్టారు విభజన కారణంగా ఏటా రూ.13 వేల కోట్లు నష్టపోయాం ఈ ఐదేళ్లలో లక్ష కోట్ల అదనపు ఆదాయం కోల్పోయాం కనీస చట్టంలోనూ ఆ వెసులుబాటు కల్పించలేదు ఆ లోటు ఇప్పటికీ వెంటాడుతోంది: సీఎం జగన్ గత ప్రభుత్వ విధానాల వల్ల కూడా బాగా నష్టం జరిగింది ఆర్థిక వ్యవస్థ కుదేలు అయ్యింది గత ప్రభుత్వ విధానాల వల్ల విద్య, వ్యవసాయం, మహిళా సాధికారత లాంటి రంగాలు కుదేలయ్యాయి రైతులను చంద్రబాబు మోసం చేశారు ఐదేళ్లలో చంద్రబాబు రైతులకు రూ.15వేలకోట్లు కూడా ఇవ్వలేదు పొదుపు సంఘాల వడ్డీ కూడా మాఫీ చేయలేదు ప్రతీ రాష్ట్రానికి ఒక ఎకనామిక్ పవర్ హౌజ్ ఉండాలి అలాంటి పవర్హౌజ్ లేకపోతే రాష్ట్ర ఆదాయాలు ఎప్పటికీ పెరగవు ఉమ్మడి ఆస్తిగా నిర్మించుకున్న హైదరాబాద్ను కోల్పోయాం రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికీ రెవెన్యూ లోటు వెంటాడుతోంది రాష్ట్ర తలసరి ఆదాయం తగ్గిపోయింది అందుకే విశాఖ గురించి పదే పదే చెబుతున్నా రాష్ట్రం ఆర్థికంగా ఎదగడానికి పెద్ద పెద్ద నగరాలు అవసరం ఓ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి నగరాలు ఉండాలి ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించలేదు: సీఎం జగన్ 2015-19 మధ్య కేంద్రం ఇచ్చిన పన్నుల వాటా కేవలం 31.5 శాతమే 15వ ఆర్థిక సంఘం 41 శాతం సిఫారసు చేసిన మనకు 31 శాతం మాత్రమే దక్కింది. బాబు హయాంలో 35 శాతం వరకైనా తగ్గింది. మేము అధికారంలోకి వచ్చేటప్పటికీ బాగా తగ్గిపోయాయి. కేంద్రం నుంచి రాష్ట్రానికి పన్నుల వాటా గత ఐదేళ్లలో.. 2018 - 19లో 32780 వేల కోట్లు వస్తే 2019- 20లో 28000 కోట్లు 2020-21 - 24000 కోట్లకు 2021-22 - 36 వేల కోట్లు 2023-23లో 38 000 కోట్లకు చేరుకుంది కరోనా కారణంగా రెండు ఆర్థిక సంవత్సరాలు తీవ్రంగా నష్టపోయాం ఆదాయం తగ్గడంతో పాటు ఖర్చులూ పెరిగాయ్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తగ్గాయ్ ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎవరూ ఊహించలేదు ఎన్నో కష్టాల్ని ఎదుర్కొని ఐదేళ్లు పాలించాం: సీఎం జగన్ కరోనా కారణంగా ఆదాయం తగ్గింది మూడేళ్లలో రాష్ట్రం 66 వేల కోట్లు ఆదాయం నష్టపోయింది కోవిడ్ మహమ్మారి వల్ల అనూహ్యంగా కొన్ని ఖర్చులు పెరిగిపోయాయి. ఈ ఐదేళ్లలో చూసిన అనూహ్య పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చే వాటా (డెవల్యూషన్స్) తగ్గిపోవడం ఒకటి. చంద్రబాబు పాలన కాలంతో పోలిస్తే ఈ ఐదేళ్లలో మన రాష్ట్రంతోపాటు అన్ని రాష్ట్రాలకూ తగ్గాయి. రాష్ట్రానికి అత్యంత కీలకమైన వ్యవసాయం, విద్య, మహిళ సాధికారిత వంటి రంగాలపై గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం, ప్రజలపై ఎంతో తీవ్ర ప్రభావం పడింది ఈ కష్టాలను కూడా ఎదుర్కొని ఐదేళ్లు పాలన సాగించాం కరోనా వల్ల మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలు నష్టపోయాయి రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి మనల్ని రెవెన్యూ లోటు వెంటాడుతోంది. అయినా సరే.. ఈ ఐదేళ్లలో సుపరిపాలన అందించగలిగాం. జూన్లో మళ్లీ బడ్జెట్ పెడతాం: సీఎం జగన్ సంప్రదాయం ప్రకారం.. ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు ఆమోదం ఈ సమావేశాల్లో తెలపనున్నాం జూన్లో కొలువుదీరబోయే మన ప్రభుత్వం.. ఇదే సభలో మళ్లీ పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తుంది ఇప్పటిదాకా ఐదు ప్రజా బడ్జెట్లు ప్రవేశపెట్టాం ప్రతిపక్షం వేస్తున్న నిందలు.. వాస్తవాలేంటన్నది ప్రజలకు వివరించబోతున్నాం కఠినమైన పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చాం ఈ ఐదు సంవత్సరాల్లో అనూహ్య పరిస్థితులెన్నో చూశాం.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం నాకు ఊహ తెలిసినప్పటి నుంచి కరోనా లాంటి సంక్షోభం ఎప్పుడూ రాష్ట్రం చవిచూడలేదు గత ప్రభుత్వ పాలన ప్రభావం కూడా రాష్ట్రంపై కనిపించింది ఈ పరిస్థితులన్నీ అధిగమించి గొప్ప పాలన అందించాం సీఎం జగన్ పాలనతో పేదరికం తగ్గింది సీఎం జగన్ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది సీఎం జగన్ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు రూ.2 లక్షల 53 వేల కోట్లు పేదల ఖాతాలో వేశారు సీఎం జగన్ పాలనతో పేదరికం తగ్గింది మీకు మంచి జరిగితేనే నాకు అండగా నిలబడండి అని సీఎం జగన్ చెప్పారు నాయకత్వం అంటే సీఎం జగన్ది నాయకుడికి ఉండాల్సిన లక్షణం చంద్రబాబుకి లేదు ఎన్నికల్లో ఎలా లబ్ధి పొందాలో ప్రతిపక్షం ఆలోచిస్తోంది శాసనసభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ధృడ సంకల్పంతో సీఎం జగన్ పనిచేస్తున్నారు: జక్కంపూడి రాజా వైఎస్ రాజశేఖర్రెడ్డి గారు అన్ని రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ పేదలకు చేయూత ఇచ్చారు. ఆపై రాజశేఖర్రెడ్డి గారి మరణ తర్వాత మళ్లీ వెనుకబడ్డామనే భావన కల్గింది 2009 నుంచి 2019 వరకూ గడ్డు పరిస్థితుల్నే ఎదుర్కొన్నాం 2014లో చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని చేజిక్కించుకోవాలని దురాలెచనతో 650 హామీలిచ్చి అధికారంలోకి వచ్చారు. ఆపై ఇచ్చిన హామీలను గాలికొదిలేశారు చంద్రబాబు ఆ తరుణంలో ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలను జగన్ చూశారు. అందుకోసం సుదీర్ఘమైన పాదయాత్ర చేసిన జగన్.. ప్రజల కష్టాలను తెలుసుకున్నారు అప్పట్నుంచి పేదవాడి కష్టాలను తీర్చాలనే లక్ష్యంతో పని చేస్తున్న నాయకుడు సీఎం జగన్ జగన్ ముఖ్యమంత్రి అయిన దగ్గర్నుంచీ నేటి వరకూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే ధృడమైన సంకల్పంతో పని చేస్తున్నారు స్పీకర్పై టీడీపీ సభ్యులకు గౌరవం లేదు: అబ్బయ్య చౌదరి తొడలు కొడితే కుర్చీరాదు.. ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుంది విలువలేకుండా ఏదో మాయ మాటలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయి పేదల కోసం ఆలోచించి, పేదల కోసం జీవించే ప్రభుత్వం మనది పేదలకు అండగా ఉండాలనే సిద్ధాంతంతో ముందుకు వెళుతున్న సీఎం జగన్ చూసి చాలా ఆనందంగా ఉంది నిజమైన నాయకుడు అనేవాడు ప్రజల అభివృద్ధిపైనే ఫోకస్ చేస్తాడు అదే సీఎం జగన్ చేస్తున్నారు అంబేద్కర్ను వ్యక్తిలా కాకుండా సిద్ధాంతంలా తీసుకుని ముందుకు వెళుతున్న నాయకుడు సీఎం జగన్ విద్యా వ్యవస్థ రూపురేఖలు పూర్తిగా మార్చి పిల్లలకు మేనమామలా ఉన్న వ్యక్తి మనం సీఎం జగన్ హెల్త్ కేర్ను ప్రతీ పేదవాడికి అందిస్తున్న నాయకుడు సీఎం జగన్ ప్రతీ ఒక్కరికి హెల్త్ కేర్ అనేది అభివృద్ధి చెందిన దేశాల్లోనే సాధ్యం కాలేదు.. కానీ పేదవారికి వైద్యం అందించాలనే ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్ ఆరోగ్యశ్రీని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిది జగనన్న ఆరోగ్య సురక్ష పథకం ఎంతో గొప్పది ఆరోగ్యానికి పేదవాడి చేతిల్లో నుంచి డబ్బు ఖర్చు పెట్టకూడదని ఆలోచన చేసిన నాయకుడు సీఎం జగన్ ఈరోజు పేదవాడికి మెరుగైన వైద్యం అందుతుంటే అందుకు కారణం సీఎం జగన్ టీడీపీ ఎమ్మెల్యేల తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల ఆగ్రహం పదే పదే స్పీకర్ కుర్చీ దగ్గరకు వచ్చి ఆందోళన చేయడం అనైతికం ప్రజలకు తెలియ చేయాల్సిన విషయాలను పక్కదోవ పట్టించే యత్నం చేస్తున్నారు టీడీపీ సభ్యులు సాక్షాత్తు స్పీకర్పై దాడి చేయడం విలువల్లేని రాజకీయాలకు నిదర్శనం ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్ టీడీపీ సభ్యులను ఒక రోజు సస్పెండ్ చేసిన స్పీకర్ పదే పదే స్పీకర్ పోడియాన్ని చుట్టిముట్టి ఆందోళన సృష్టిస్తున్న నేపథ్యంలో టీడీపీ సభ్యులపై సస్పెన్షన్ మళ్లీ స్పీకర్ పోడియంను చుట్టిముట్టిన టీడీపీ సభ్యులు అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ వైపు దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు స్పీకర్ చాంబర్ వైపు దూసుకెళ్లి.. విజిల్స్వేస్తూ టీడీపీ సభ్యుల రగడ సభలో గందరగోళం సృష్టించి సభా సమయాన్ని వృథా చేస్తున్న టీడీపీ సభ్యులు రెడ్లైన్ దాటి స్పీకర్చాంబర్లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు సభా నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ సభ్యుల తీరు సభలో విజిల్స్వేస్తూ అనుచితంగా ప్రవర్తిస్తున్న టీడీపీ సభ్యులు ప్రారంభమైన శాసన మండలి నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై టిడిపి, డీఎస్సీ పోస్టుల సంఖ్యపై పీడీఎఫ్ వాయిదా తీర్మానాలు. వాయిదా తీర్మానాలను తిరస్కరించిన ఛైర్మన్ పోడియం వద్ద పోస్టర్లతో ఆందోళనకు దిగిన టీడీపీ సభ్యులు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన మర్రి రాజశేఖర్ శాసనమండలి 10 నిమిషాల పాటు వాయిదా టీడీపీ సభ్యుల తీరుతో సభ వాయిదా టీడీపీ సభ్యులకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదు: సుధాకర్బాబు టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను పాటించడం లేదు బలహీన వర్గాలకు చెందిన స్పీకర్ను అవమానించారు టీడీపీ సభ్యులు నీచ రాజకీయాలు చేస్తున్నారు పేద విద్యార్థులకు విద్యను చేరువ చేశాం టీడీపీ పాలనలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదు సీఎం జగన్.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారు విద్యాకానుక కింద రూ. 11,901 కోట్లు అందించాం విద్యా దీవెన కింద రూ. 4, 276 కోట్లు అందించాం రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశాం సీఎం జగన్ హయాంలో విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లుకు ఆమోదం ఏపీ అడ్వకేట్స్ అండ్ క్లర్క్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లుకు ఆమోదం గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించిన స్పీకర్ స్పీకర్పై పేపర్లు విసరడం మర్యాద కాదు: అంబటి రాంబాబు స్పీకర్పై టీడీపీ సభ్యుల వ్యవహారశైలి సరికాదు పేపర్లు చింపి ఇలా చేస్తూ స్పీకర్ను అవమానిస్తున్నారు మీరు సభా సంప్రదాయాను తప్పుతున్నారు ఇది మర్యాద కాదు మీరు అసలు సభలో ఉండాలనుకుంటున్నారో.. లేదో తేల్చుకోండి ఇలా ప్రతీసారి సభను అడ్డుకోవడం సరికాదు టీడీపీ సభ్యుల మమ్మల్ని రెచ్చగొడుతున్నారు జాగ్రత్త ►అసెంబ్లీకి బయలుదేరిన సీఎం జగన్ టీడీపీ నేతలు ఓవరాక్షన్ సభకార్యకలాపాలకు అడ్డుతగిలిన టీడీపీ సభ్యులు. స్పీకర్పై పేపర్లు విసిరిన టీడీపీ సభ్యులు. స్పీకర్ తమ్మినేని పోడియం వద్దకు దూసుకెళ్లి హంగామా. ►ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ప్రజలు సీఎం వైఎస్ జగన్ పక్షానే ఉన్నారు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పేర్నినాని కామెంట్స్ ప్రజలే కృష్ణుల్లాగా జగన్ను ముందుకు నడిపిస్తారు జగన్ ఫోటో పెట్టుకొని బాలశౌరి ఎంపీగా గెలిచాడు ఇప్పుడు సిగ్గులేకుండా విమర్శలు చేస్తున్నాడు జంపింగ్ జపాంగ్ ని వీరుడిలా పవన్ భావిస్తున్నాడు కుటుంబ బంధాల గురించి మాట్లాడే అర్హత పవన్ కి లెదు చిరంజీవి జనరంజక నటుడు చిరంజీవి కాంగ్రెస్లో కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు పవన్ ఏ పాత్ర పోషించారు శత్రువులతో షర్మిల చేతులు కలిపారు బజారుకెక్కి సొంత అన్ననే ధూషిస్తున్నారు జగన్ అనుచరులు చూస్తూ ఊరుకొంటారా నీతులు చెప్పే ముందు మీ గతాన్ని తలుచుకోండి తల్లిని తిట్టిన వాళ్ళ పల్లకీ మోసే పవన్ని ఏమనాలి జరగబోయే కురుక్షేత్రంలో పవన్ ది శల్యుడి పాత్ర పవన్ని సీఎంగా చూడాలన్న కార్యకర్త స్థైర్యాన్ని దెబ్బతీస్తున్నాడు చంద్రబాబు రిజెక్ట్ చేసి బాలశౌరిని పవన్ పక్కకు పంపాడు పదవులకోసం నేతలు గడ్డికరుస్తున్నారు నాదెండ్ల మనోహర్ కాళ్ళు పట్టుకొని బాలశౌరి జనసేనలో దూరారు ఆశ్రయం ,అధికారం ,అర్హత కల్పించిన సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి లేదు శక్తులన్నీ ఏకమై కౌరవుల్లా వచ్చినా జగన్ లాంటి అర్జునుడిని ఏమీ చేయలేరు కాపు కులాన్ని పణంగా పెట్టి చంద్రబాబు పల్లకీ మోయవద్దు అని హరిరామ జోగయ్య కూడా లేక రాసారు హుందాగా వ్యవహరించాలని పవన్ కి సూచించారు కమ్మలు ,రెడ్లు లాగే అధికారం కోసం పోరాడామని లేఖలో కోరారు వ్యక్తిత్వ హననం చేస్తూ సీఎం వైఎస్ జగన్ని మాట్లాడితే చూస్తూ ఊరుకోము చంద్రబాబుకి మతిభ్రమించి మాట్లాడుతున్నారు నన్ను సర్వర్లా చంద్రబాబు అభివర్ణించారు పెత్తందారీ చంద్రబాబుకి సర్వర్లంటే అంత చిన్నచూపా పవన్ అసహాయ రాజకీయ నాయకుడు: మంత్రి చెల్లుబోయిన అసెంబ్లీ మీడియా పాయింట్ మంత్రి చెల్లుబోయిన కామెంట్స్ ప్రజాక్షేమాన్ని కాంక్షించే వాళ్లే రాజకీయ పార్టీ పెట్టాలి చిరంజీవి పార్టీ పెట్టి రాష్ట్రానికి అన్యాయం చేశారు తప్పు సరిదిద్దుకొనేందుకే పవన్ పార్టీ పెట్టారనుకొన్నాము చంద్రబాబు కోసం పార్టీ పెట్టారన్న విషయం బయటపడింది. లోకేష్ అవినీతి పరుడని మాట్లాడిన పవన్ ఇప్పుడు వారితో అంటకాగుతున్నాడు ప్రజాసంక్షేమం అందించటంలో సీఎం వైఎస్ జగన్ చరిత్ర సృష్టించారు పేదరిక నిర్ములనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు ఎన్టీఆర్ ఫ్యామిలీకి ద్రోహం చేసిన చంద్రబాబుకు పవన్ వంతపాడుతున్నాడు పేదలకు సాయం చేస్తున్న సీఎం జగన్ ఓడిస్తానని ప్రగల్భాలు పలుకుతున్నాడు పవన్ అసహాయ రాజకీయ నాయకుడు ►ఆంధప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సంయుక్త సమావేశాల్లో భాగంగా రెండో రోజు(మంగళవారం) గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ►ఉదయం తొమ్మిది గంటలకు రెండో రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న ఎమ్మెల్యేలు టీజేఆర్ సుధాకర్బాబు, అబ్బయ్య చౌదరి ►చర్చ అనంతరం సీఎం జగన్ ప్రసంగం ►పది గంటలకు శాసనమండలి సమావేశాలు ►గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ►చర్చను ప్రారంభించనున్న ఎమ్మెల్సీ లు మర్రి రాజశేఖర్, వరుదు కల్యాణి ►బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు సోమవారం శాసనసభ, శాసన మండలి సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి గవర్నర్ నజీర్ ప్రసంగించారు. -
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. అప్డేట్స్
Updates.. అసెంబ్లీ సమావేశాలు రేపటికి వాయిదా ముగిసిన బీఏసీ సమావేశం ఈనెల 8వరకూ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్ 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్ ద్వారా 3040 కేసులు పేదలందరికీ ఇళ్ల పథకం కింద 22 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం ఇప్పటికే 9 లక్షల ఇళ్లను లబ్దిదారులకు అందించాం పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడానికి అధిక ప్రాధాన్యత పీడీఎఫ్ కుటుంబాలకు సానుభూతితో పునరావాసం కల్పించాం పోలవరం ప్రాజెక్టులో ఇప్పటివరకూ 74.01 శాతం పూర్తి ఎల్ఏ అండ్ ఆర్ ఆర్ పనిలో 22.42 శాతం పూర్తి జగనన్న చేదోడు ద్వారా దుకాణాలు, నాయిబ్రాహ్మణులు, దర్జీలకు ప్రభుత్వం రూ. 10 వేలు అందిస్తోంది జగనన్న తోడు ద్వారా వీధి వ్యాపారులు, చిరు వ్యాపారులకు రూ. 10 వేల వడ్డీలేని రుణం అందిస్తున్నాం వైఎస్సార్ కళ్యాణమస్తు, షాదీ తోఫా ద్వారా రూ. 350.89 కోట్లు అందిస్తున్నాం నాన్ డీబీటీ కింద 4.23 లక్షల కోట్ల సంక్షేమ ఫలాలు అందించాం 2023-24లో 268 కి.మీ పొడవునా 58 బీటీ రోడ్లు వేశాం రూ. 71 కోట్ల వ్యయంతో 500 తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాల కొనుగోలు దీని ద్వారా 3, 27, 289 మంది తల్లులకు లబ్ది వైఎస్సార్ పెన్షన్ కానుక కింద 66.34 లక్షల మందికి పెన్షన్ అందిస్తున్నాం 2024 జనవరి 1వ తేదీ నుంచి రూ. 3వేలు పెన్షన్ అందిస్తున్నాం నెలవారీ పెన్షన్ బడ్జెట్ రూ. 1961 కోట్లకు పెరిగింది ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ, క్యాబ్ మొబైల్ డిస్పెన్సింగ్ ఓనర్లకు రూ. 10 వేలు ఆర్థిక సాయం అందిస్తున్నాం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం రూ. 4,969.05 కోట్లు వైఎస్సార్ చేయూత ద్వారా రూ. 14, 129 కోట్లు పంపిణీ వైఎస్సార్ కాపునేస్త కింద రూ. 2, 029 కోట్లు జమ వైఎస్సార్ కాపు నేస్తం ద్వారా ఏడాదికి రూ. 15 వేలు అందిస్తున్నాం ఐదేళ్లలో రూ. 75 వేలు అందిస్తున్నాం 3, 57, 844 మంది అర్హుల ఖాతాల్లో రూ. 2,029 కోట్లు జమ వైఎస్సార్ ఈబీసీ నేస్తం కింద రూ. 1,257.04 కోట్లు జమ మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషి రాష్ట్రంలో 55,607 మెయిన్, మినీ అంగన్ వాడీ కేంద్రాలు వైఎస్సార్ సంపూర్ణ పోషణ ద్వారా 6.4 లక్షల మంది గర్భిణీలు, 28. 62లక్షల మంది పిల్లలకు లబ్ధి పౌష్టికాహార పథకాలకు రూ. 6,688 కోట్లు అంగన్వాడీ కేంద్రాలకు రూ. 21.82 కోట్ల విలువైన గ్రోత్ మానిటరింగ్ పరికరాలు అందించాం వైఎస్సార్ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం 78.84 లక్షల మంది మహిలలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లు ఆక్వా రైతుల విద్యుత్ చార్జీల రాయితీ కోసం రూ. 3,186. 36 కోట్లు అందించాం రూ. 50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్లు ఏర్పాటు 2.12 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో ఆక్వా కల్చర్ రొయ్యల ఉత్పత్తిలో 75 శాతం వాటాలో ఆక్వా హబ్ ఆఫ్ఇం డియాగా ఏపీ మత్స్య కార కుటుంబాలకు రూ. 540 కోట్లు అందించాం మత్స్యకార భరోసా కింద 2.43 లక్షల లబ్ధిదారుల రూ. 540 కోట్ల జమ చేపల వేట నిషేధ కాలంలో పరిహారం రూ. 10 వేలకు పెంచాం చేపల వేటకు వెళ్లి మరణిస్తే నష్టపరిహారం రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచాం ఫిషింగ్ బోట్లకు డీజిల్ సబ్సిడీ కోసం రూ. 128.27 కోట్లు ఇచ్చాం రైతులు రాష్ట్రానికి వెన్నుమక 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు 10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు ఇప్పటివరకూ 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చాం రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేస్తున్నాం రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నాం 22.85 లక్షల రైతులకు రూ. 1, 977 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం మిచాంగ్ తుపానులో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయం నాడు-నేడు ద్వారా ఆసుపత్రుల్లో మెరుగు 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్ హెల్త్ క్లినిక్లు ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్ సిబ్బందిని నియమించాం ఇప్పటివరకూ రూ. 1.32 కోట్లు రోగులకు అందించాం ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం మన విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధన 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్లు పంపిణీ చేశాం వచ్చే ఏడాది జూన్ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తాం విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చు ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్ చేస్తున్నాం ప్రభుత్వ కృషితో స్కూళ్లలో డ్రాప్ఔట్లు గణనీయంగా తగ్గాయి ఉన్నత విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం 26.98 లక్షల మంది విద్యార్థులకు రూ. 11.901 కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నాం పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశాం జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నాం జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశాం విద్యాసంస్కరణల్లో డిజిటల్ లెర్నింగ్ కీలకమైనది మా ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టింది సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోంది విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించాం అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు అభినందనీయం బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉంది జగన్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల జీవన ప్రమాణాల మెరుగుకు కృషి చేస్తున్నాం నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం కృషి నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు పేద పిల్లలకు గ్లోబల్ ఎడ్యుకేషన్ అందిస్తున్నాం మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మార్చాం విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశాం ►ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం ►అసెంబ్లీకి చేరుకున్న సీఎం జగన్ మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు: మంత్రి అంబటి అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్.. హామీల అమలుపై చంద్రబాబు అసత్యప్రచారం చేస్తున్నారు దేశంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకున్న ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను మాయం చేసిన ఘనుడు చంద్రబాబు మేనిఫెస్టోని ఇంటింటికీ తీసుకెళ్లి అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్ది రాబోయే ఎన్నికల్లో 175 స్థానాలను గెలవబోతున్నాము సీట్ల ముష్టి కోసం చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్ళాడు పవన్ను నమ్ముకుంటే కుక్కతోక పట్టుకొని సముద్రం ఈదినట్టే జనసేన కార్యకర్తలు ఇప్పటికైనా నిద్రమేలుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎంగా చరిత్రలో జగన్ నిలిచిపోతారు దుష్టచతుష్టయం పన్నే పద్మవ్యూహాలని ఛేదించి రాగల అర్జునుడు సీఎం వైఎస్ జగన్ లోకేష్ బయట ఉంటే పార్టీ అవుట్ అని దాచేసారు టికెట్ లేదని చెబితే బఫున్లు పార్టీలు మారుతారు బాలశౌరీ అన్యాయాలు అక్రమాలు చేసిన బఫూన్ బాలశౌరీ ఎరికైనా నమ్మకద్రోహం చేసే వ్యక్తి ►అసెంబ్లీకి బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్. ►గవర్నర్ ప్రసంగం తర్వాత బీఏసీ సమావేశం ►అసెంబ్లీ సమావేశాల అజెండాను ఖరారు చేయనున్న బీఏసీ ►ఈనెల 7న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ►మూడు నెలల కోసం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ఆర్థికమంత్రి బుగ్గన ►కాసేపట్లో ప్రారంభం కానున్న రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశాలు ►ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగం ►అనంతరం సమావేశాలు ప్రారంభం ►అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) సమావేశమై ఈ సమావేశాలు ఎప్పటి వరకు నిర్వహించాలనేది నిర్ణయించనుంది. ►అదేవిధంగా త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ నెల 7వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024–25 ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెడతారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ, ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలలకు (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) ఓటాన్ అకౌంట్ బడ్జెట్కు అసెంబ్లీ ఆమోదం పొందనున్నారు. ►ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ద్వారా ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఉద్యోగుల జీతభత్యాలు, సామాజిక పింఛన్లు, కొనసాగుతున్న వివిధ పథకాలు, కార్యక్రమాలకు అవసరమైన నిధుల వ్యయానికి అసెంబ్లీ ఆమోదం తీసుకోనున్నారు. అంతకుముందు ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ఆమోదించడానికి ఏడో తేదీ ఉదయం 8గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. -
పేదలకు గుడ్ న్యూస్..ఉచిత విద్యుత్ పై కీలక ప్రకటన
-
Budget 2024: కీలక అంశాలు ఇవే
-
రెండు కోట్ల ఇళ్ల నిర్మాణం..సంచలన ప్రకటన
-
మాల్దీవ్స్ కు షాక్..లక్షద్విప్ పై కీలక ప్రకటన
-
ఉద్యోగులకు గుడ్ న్యూస్ 7 లక్షల వరకు No Tax
-
వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం
-
మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలు
-
మా దృష్టి అంతా గరీబ్, మహిళ, యువ, అన్నదాత
-
నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
-
AP Budget: మహిళా సాధికారతే ధ్యేయంగా..
సాక్షి, అమరావతి: మహిళా సాధికారత కోసం బడ్జెట్లో వేల కోట్ల రూపాయలు కేటాయించింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. పేద మహిళలు ఆర్థికంగా బలపడేందుకు, స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. మహిళా పాడిరైతులను ఏకీకృతం చేయడానికి అదే విధంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలతో సమానంగా మహిళా పాల సహకార సంఘాలను(ఎండీఎస్ఎస్) ప్రోత్సహించడానికి జగనన్న పాల వెల్లువ ప్రాజెక్టును వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. 17 జిల్లాలలో సుమారు 2.5 లక్షల మంది మహిళా పాడి రైతుల కోసం ఈ ప్రాజెక్టును అమలు చేసింది. దళారులను తొలగించి పాడి రైతుల నుంచి నేరుగా 561 లక్షల లీటర్ల పాలను కొనుగోలు చేసి రూ.250 కోట్లు నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు చెల్లించింది. ఈ విధానం ద్వారా పాల నాణ్యతను బట్టి గతంలో లభించే ధర కంటే లీటరుకు రూ.5-20 వరకు మెరగైన ధర లభిస్తోంది. వైఎస్సార్ ఆసరా.. స్వయం సహాయక సంఘాలలోని గ్రామీణ, పట్టణ పేద మహిళలకు ఏప్రిల్ 4, 2019 నాటికి బకాయి ఉన్న బ్యాంకు రుణాల మాఫీ కోసం వైఎస్సార్ ఆసరా పథకం కింద 4 విడతలుగా చెల్లిస్తామని ప్రభుత్వ ప్రకటించింది. ► దీని కోసం బడ్జెట్లో రూ.6,700 కోట్లు కేటాయించింది. వైఎస్సార్ సున్నా వడ్డీ సకాలంలో రుణాలను తిరిగి చెల్లించే సంస్కృతిని ప్రోత్సహించడానికి 3 లక్షల రూపాయల వరకు బ్యాంకు రుణాలను కలిగి ఉన్న అన్ని స్వయం సహాయక సంఘాలపై వడ్డీ భారాన్ని తగ్గించడానికి సీఎం జగన్ ప్రభుత్వం వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేస్తోంది. దీనికి గాను 2019 సంవత్సరం నుండి గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలను కలుపుకొని స్వయం సహాయక సంఘాలకు చెందిన 1.02 కోట్ల మహిళలకు 3,615 కోట్ల రూపాయలు చెల్లించింది. ఈ చర్య మహిళా సాధికారత ప్రయత్నాలను బలోపేతం చేసి స్వయం సహాయక సంఘాలకు చెందిన పేద మహిళల ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేసింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ సున్నా వడ్డీ పథకం కోసం 1,000 కోట్ల రూపాయలు కేటాయించింది. ( ఫైల్ ఫోటో ) వైఎస్సార్ చేయూత ప్రభుత్వం షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతుల మరియు అల్పసంఖ్యాక వర్గాలకు చెందిన 45 నుండి 60 సంవత్సరాల మధ్య వయస్సు గల 25 లక్షల మంది మహిళలకు సంవత్సరానికి 18,750 రూపాయల చొప్పున గత నాలుగేళ్లలో 75,000 వేల రూపాయలను ఇచ్చింది. ఈ మొత్తాన్ని లబ్దిదారులు తమ ఎంపిక ప్రకారం ప్రస్తుత జీవనోపాధి కార్యకలాపాలలోను లేదా కొత్త సంస్థల స్థాపనకు పెట్టుబడిగా పెట్టుకోవడంలోను ఉపయోగిస్తున్నారు. ఇప్పటి వరకు 26.7 లక్షల మంది మహిళా సభ్యులకు 3 విడతలుగా 14,129 కోట్ల రూపాయలను అందజేయడం జరిగింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను వైఎస్సార్ చేయూత పథకం కోసం 5,000 కోట్ల రూపాయల కేటాయించింది. ఉజ్జావల, స్వధార్ గృహ పథకం మహిళలకు సహాయం అందించడం కోసం 'ఉజ్జావల', 'స్వధార్ గృహ పథకం' క్రింద నడిచే గృహాలు, వన్ స్టాప్ సెంటర్లు, మహిళా ఉద్యోగినిల వసతి గృహాలు, సేవాగృహములు, ఉచితంగా పనిచేసే మహిళా హెల్ప్ లైన్ నెంబర్లు పనిచేస్తున్నాయి. సమీకృత మహిళా సాధికారత కార్యక్రమం అమలును పర్యవేక్షించేందుకు మిషన్ శక్తి పథకం కింద రాష్ట్ర కమిటీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ► 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను మహిళా అభివృద్ధి, పిల్లల సంక్షేమం కోసం 3,951 కోట్ల రూపాయలు కేటాయించింది. చదవండి: ఏపీ వార్షిక బడ్జెట్.. సంక్షేమ పథకాలకు పెద్దపీట -
ఏపీ అసెంబ్లీలో నేడు 2023-24 వార్షిక బడ్జెట్
-
Budget Session 2023-24: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. తొలి రోజు దృశ్యాలు
-
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
సాక్షి, అమరావతి: శాసనసభ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్గా బాధ్యతలు చేపట్టాక ఆయన పాల్గొంటున్న తొలి అధికారిక కార్యక్రమం ఇదే. నజీర్ ప్రసంగం తర్వాత రెండు సభలు వాయిదా పడనున్నాయి. ఆ తర్వాత స్పీకర్ తమ్మినేని సీతారాం నేతృత్వంలో బీఏసీ (బిజినెస్ అడ్వైజరీ కమిటీ) సమావేశం జరగనుంది. ఇందులో సభ ఎన్ని రోజులు నిర్వహించాలి, ఏ అంశాలపై చర్చించాలి, రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే తేదీని నిర్ణయించనున్నారు. ఈ నెల 14 నుంచి 24 వరకు సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా భావిస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. కనీసం 7, 8 రోజులు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. కాగా మంగళవారం బీఏసీ తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలోనే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టే బిల్లులను కేబినెట్ ఆమోదించనుంది. ఇక.. కీలకమైన 2023-24 వార్షిక బడ్జెట్ను ఈ నెల 17వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. ఇక ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24వ తేదీ వరకు జరిగే అవకాశాలున్నాయి. ఈ ఏడాది రూ. 2లక్షల 60 వేల కోట్లకు పైగా బడ్జెట్ ఉండే అవకాశం కనిపిస్తోంది. సంక్షేమంతో పాటు వ్యవసాయం, విద్యా, వైద్య రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా బడ్జెట్ రూపకల్పన దిశగా ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. పైగా వచ్చే ఏడాదిలో ఎన్నికల నేపథ్యంలో ఇదే పూర్తి స్థాయి బడ్జెట్ కావడంతో దృష్టి సారించింది. మరోవైపు కీలక అంశాలపై అసెంబ్లీలో సీఎం జగన్ ప్రకటన చేయొచ్చని తెలుస్తోంది. నాలుగేళ్ల పాలనతో పాటు మూడు రాజధానులు, సంక్షేమం, వైజాగ్ గ్లోబల్ సమిట్ ముఖ్యమైన అంశాల ఎజెండాతో సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. -
సచివాలయ వ్యవస్థకు చట్టబద్ధత.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు
సాక్షి, అమరావతి: కుగ్రామం, నగరం అన్న తేడా లేకుండా ప్రజలందరికీ వారి సొంత ఊళ్లో ప్రభుత్వ సేవలన్నీ అందుబాటులో తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు పూర్తిస్థాయి చట్టబద్ధత కలి్పంచేందుకు సంబంధించిన బిల్లును ప్రభుత్వం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటుచేస్తూ 2022 డిసెంబర్లో జారీచేసిన ఆర్డినెన్స్ స్థానంలో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి.. ఆ వ్యవస్థకు పూర్తి చట్టబద్ధతను కల్పించనుంది. ఇప్పుటికే ఆర్డినెన్స్లో పేర్కొన్న వివరాల మేరకు ఇందుకు సంబంధించి ముసాయిదా బిల్లును గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు రూపకల్పన చేస్తున్నారు. ఈ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు ముందు ఈ నెల 14న జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఆమోదానికి వెళ్లనున్నట్టు అధికారులు వెల్లడించారు. జగన్ సీఎం అయ్యాక 4 నెలలకే ఈ వ్యవస్థకు శ్రీకారం జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన వెంటనే 2019 అక్టోబరు 2వ తేదీ నుంచి రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఈ సచివాలయాల్లో పనిచేసేందుకు అప్పటికప్పుడే కొత్తగా 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు మంజూరు చేశారు. వెంటనే ఉద్యోగాలను భర్తీ చేశారు. ఇవన్నీ కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ప్రభుత్వం పూర్తిచేసింది. ► గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ, వార్డు సచివాలయాలు కొలువుదీరాయి. ► అంతకుముందు వరకు కనీసం ఒక్క శాశ్వత ఉద్యోగి కూడా నియామకం జరగని చాలా గ్రామాల్లో కొత్తగా ఏర్పాటైన సచివాలయాల్లో పది నుంచి 11 మంది వరకు శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను ప్రభుత్వం నియమించింది. ► కుగ్రామాలతోసహా ప్రతి చోటా.. ప్రజలకు తమ గ్రామ సచివాలయంలోనే ప్రభుత్వ సేవలన్నీ అందేలా ఏర్పాటు చేసింది. 545 రకాల ప్రభుత్వ సేవలను సచివాలయాల్లో అందుబాటులోకి తీసుకొచి్చంది. ప్రతి సచివాలయానికి ఇంటర్నెట్ వసతితోపాటు కంప్యూటర్లు, ప్రింటర్లసహా ఇతర ఫర్నిచర్ను ప్రభుత్వం అందజేసింది. ► ఇప్పటివరకు గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ప్రజలు వారి సొంత ఊరు దాటాల్సిన అవసరం కూడా లేకుండా దాదాపు ఏడుకోట్లకు పైగా ప్రభుత్వ సేవలను వినియోగించుకున్నారు. చదవండి: స్కాములన్నీ బాబు హయాంలోనే -
అసెంబ్లీలో ఈటల రాజేందర్ వర్సెస్ మంత్రి కేటీఆర్
అప్డేట్స్ ►బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఈ మేరకు అసెంబ్లీలో కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండోనేషియా వెళ్తే.. వాళ్ల ఫ్రెండ్కు గనులు వస్తాయని వ్యాఖ్యానించారు. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్ముతుంది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం పోడు భూములంటే దురాక్రమణే అడవులను నరికేయడం కరెక్టేనా ప్రభుత్వ షరతులు ఒప్పుకుంటేనే పోడు భూములు పంపిణీ పోడు భూములు న్యాయపరమైన డిమాండ్ కాదు ఫారెస్ట్ అధికారి శ్రీనివాస్ను ఎవరు చంపారు గొత్తికోయల గూండాగిరి మంచిది కాదు ఫిబ్రవరిలో పోడు భూముల పంపిణీ పోడు భూములకు విద్యుత్, రైతు బంధు ఇస్తాం అటవీ సంపదకు ఇబ్బంది కల్గిస్తేనే పోడు భూములు రద్దు ►రాష్ట్రంలో గుణాత్మక, విప్లవాత్మక మార్పులు రావడానికి కారణం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వమేనని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గత ప్రభుత్వాలు వైద్య రంగాన్ని నిర్వీర్యం చేస్తే, ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య రంగాన్ని పటిష్టం చేశారన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి హరీశ్రావు మాట్లాడారు. ‘సమైక్య రాష్ట్రంలో 20 యేండ్లకు ఒక్క కాలేజ్ మాత్రమే పెట్టారు. సీఎం కేసీఆర్ మాత్రం ఒక్క సంవత్సరం లోనే 8 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో మెడిజల్ కాలేజీలు లేక ఉక్రెయిన్తోపాటు ఇతర దేశాలకు వెళ్లారు. ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 4 మెడికల్ కాలేజీలు వచ్చాయి. వరంగల్ జిల్లాలో 5 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నాము. మహబూబ్ నగర్ లో ఇప్పటికే మూడు వచ్చాయి రానున్న రోజుల్లో మరో రెండు వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య 157 మెడికల్ కాలేజీలు దేశవ్యాప్తంగా మంజూరు చేస్తే రాష్ట్రానికి ఒక్కటి అంటే ఒక్కటి కూడా మంజూరు చేయలేదు. అప్పటి వైద్యారోగ్యా శాఖ మంత్రులు లేఖలు రాసినా పట్టించుకోలేదు’ అని అన్నారు. -
పార్లమెంట్లో మోదీ ప్రసంగం.. రాహుల్ వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్..
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటులో ప్రసంగించారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ఆయన లోక్సభలో మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం దేశ ప్రజలందరికీ మార్గ నిర్దేశం చేసిందని అన్నారు. మంగళవారం సభలో కొందరు చాలా ఉత్సాహంగా వ్యాఖ్యలు చేశారని పరోక్షంగా రాహుల్ గాంధీని ఉద్దేశించి మోదీ అన్నారు. అవి చూసి చాలా మంది థ్రిల్ అయ్యారని సెటైర్లు వేశారు. ఆ వ్యాఖ్యలు వారి మనసులోని ద్వేషాన్ని బయటపెట్టాయని కౌంటర్ ఇచ్చారు. భారత్ తన సమస్యల పరిష్కారం కోసం ఒకప్పుడు ఇతరులపై ఆధారపడేదని, ఇప్పుడు భారతే ఇతరుల సమస్యలను పరిష్కరించే స్థాయికి చేరుకుందని రాష్ట్రపతి అన్నారని గుర్తు చేశారు. తాము దేశంలో అవినీతిని నిర్మూలించామని మోదీ అన్నారు. ఈ క్షణం కోసం దేశం చాలా ఏళ్లుగా ఎదురుచూసిందని పేర్కొన్నారు. 'ఇవాళ జీ-30 నిర్వహించే స్థాయికే భారత్ ఎదగడం గర్వకారణం. ఇది కొంతమందికి కంటగింపు కావచ్చు. నాకైతే గర్వకారణమే. నిరాశలో ఉన్న కొందరు దేశ ప్రగతిని అంగీకరించలేకపోతున్నారు. చాలా దేశాలను నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వేధిస్తున్నాయి. భారత్ మాత్రం బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. దేశ విజయాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. మొబైళ్ల తయారీలో భారత్ రెండో స్థానంలో ఉంది. ఇంధన వినియోగంలో మూడో స్థానంలో ఉంది. 104 యూనికార్న్స్ ఈ మధ్య ఏర్పడ్డాయి. 150 దేశాలకు వ్యాక్సిన్లు పంపించాం. వ్యాక్సిన్ సర్టిఫికేట్లు క్షణాల్లో మొబైల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ప్రపంచం మొత్తం భారత్ వైపు చూస్తోంది. ప్రతి రంగంలో భారత్ చరిత్ర సృష్టిస్తోంది. ఇవన్నీ కొందరికి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మా విజయాలు చూసి నిరాశవాదులకు నిద్రపట్టడంలేదు. వారు ప్రశాంతంగా పడుకోలేక పోతున్నారు. 2014 నుంచి ఇప్పటిదాకా మా ప్రభుత్వం ఏం చేసిందో దేశ ప్రజలకు తెలుసు. ప్రజలు పదే పదే మాకు మద్దతు ఇస్తున్నారు. 2004-14 వరకు దేశంలో అవినీతి రాజ్యమేలింది. భారీ కుంభకోణాలు జరిగాయి. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఉగ్రవాదం రాజ్యమేలింది. 2జీ, బొగ్గు స్కాం, కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి జరిగింది. 2004-14 అనేది దేశంలో అవినీతి దశాబ్దమైంది. దేశంలో ఆ పదేళ్లు రక్తపుటేరుల పారాయి. టెలికాం మూమెంట్ 2జీ స్కామ్ అయింది. న్యూక్లియర్ మూమెంట్ ఓటుకు నోటు అయ్యింది. కామన్వెల్త్ గేమ్స్ మూమెంట్ సీడబ్ల్యూసీ స్కామ్ అయింది. ఆ దశాబ్ద కాలం భారత్ తీవ్రంగా నష్టపోయింది. అవినీతిపై కొరడా ఝుళిపిస్తే దర్యాప్తు సంస్థలను తప్పుబడుతున్నారు.' అని కాంగ్రెస్కు మోదీ గట్టి కౌంటర్ ఇచ్చారు. 'అవినీతిపై చర్యలు తీసుకుంటున్న దర్యాప్తు సంస్థలపై విపక్షాలన్నీ విమర్శలు గుప్పిస్తాయి. విపక్షాలన్నింటినీ ఈడీ ఏకతాటిపైకి తెచ్చింది. అందుకు ఈడీకీ థ్యాంక్స్ చెప్పాలి. కరోనా టైంలో విపక్షాలు విచిత్రంగా మాట్లాడాయి. కరోనా వల్ల భారత్ పతనంపై హార్వర్డ్ యూనివర్సిటీలో పరిశోధనలగు జరుగుతున్నాయన్నాయి. కానీ కాంగ్రెస్ పతనంపై హార్వర్డ్లో పరిశోధన జరిగింది. మిగతా వర్సిటీలు కూడా దీనిపై పరిశోధలను జరిపాయి. మోదీపై బురదజల్లి లబ్ధి పొందాలని విపక్షాలు అనుకుంటున్నాయి. టీవీలు, పేపర్లలో నాపై వివర్శలు చేసి లబ్ధి పొందలేరు. దేశ ప్రజలకు నాపై విశ్వాసం ఉంది. వన్ నేషన్ వన్ రేషన్తో లబ్ధి పొందిన పేదలు మీ మాటలు నమ్ముతారా? ప్రధాన మంత్రి ఆవాస్ యోజనతో సొంతింటి కల సాకారం చేసుకున్న సామాన్యులు మీ విమర్శలు నమ్ముతారా? కొందరు ఒకే కుటుంబానికి సేవ చేస్తారు. కానీ 25 కోట్ల కుటుంబాల్లో నేను సభ్యుడిని. 140 కోట్ల మంది ప్రజలే నాకు రక్షణ కవచం. దాన్ని మీరు ఛేదించలేరు' అని మోదీ విపక్షాలను ఏకిపారేశారు. బీఆర్ఎస్ వాకౌట్... మరోవైపు మోదీ ప్రసంగానికి ముందే బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అదానీ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని వారు డిమాండ్ చేయగా.. స్పీకర్ దీన్ని పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో బీఎర్ఎస్ ఎంపీలు సభను వీడారు. చదవండి: 2014 తర్వాతే ‘అదానీ మ్యాజిక్’ -
Mahua Moitra: సారీనా? నేనెందుకు చెప్పాలి?
ఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా క్షమాపణలు చెప్పేదే లే అంటున్నారు. మంగళవారం బడ్జెట్ సెషన్లో టీడీపీ ఎంపీ రామ్మోహన్నాయుడు మాట్లాడుతున్న సమయంలో.. మెహువా లేచినిలబడి బీజేపీ ఎంపీ రమేశ్ బిదూరిని ఉద్దేశించి అసభ్య పదజాలంతో దూషించారు. దీనిపై పెను దుమారమే రేగింది. బీజేపీ ఎంపీలు ఆమె వైఖరిని తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్నారు. అయితే వివరణాత్మక క్షమాపణలు చెప్పాలన్న బీజేపీ డిమాండ్పై ఎంపీ మహువా మోయిత్రా తీవ్రంగా స్పందించారు. అసలు క్షమాపణలు ఎందుకు చెప్పాలని ఆమె ఎదురు ప్రశ్నిస్తున్నారు. యాపిల్ను యాపిల్ అనే అన్నాను. అందులో తప్పేం ఉంది. నేను ఏదైతే అన్నానో.. ఆ మాటకు కట్టుబడి ఉన్నా అని బుధవారం పార్లమెంట్ బయట మీడియా ప్రతినిధులతో పేర్కొన్నారామె. సారీనా? ఎందుకు చెప్పాలి?. గతంలో ఇదే పెద్దమనిషి(రమేశ్ బిదూరిని ఉద్దేశించి) రైతులను వ్యభిచార గృహాల నిర్వాకులని వ్యాఖ్యానించాడు. అది పార్లమెంట్ రికార్డుల్లోనూ ఉంది. అందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేశాను. Mahua Moitra using cuss word like “harami” in Parliament And Brut won’t show this 😀 pic.twitter.com/y8gMNXTR3i — Rishi Bagree (@rishibagree) February 7, 2023 బీజేపీకి చెందిన గౌరవనీయులైన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరిగారూ రాజ్యసభలో.. డాక్టర్ శాంతనూ సేన్ను ఉద్దేశించి అభ్యంతరకర పదం వాడారు. అయినా పార్లమెంట్లో ఇలాంటి పదాలు ఉపయోగించడం కొత్తేం కాదు కదా. ఒక మహిళ అయి ఉండి అలా ఎలా మాట్లాడతారని ప్రశ్నిస్తున్నారు వాళ్లు. మంచిగా తిరిగి ఇవ్వడానికి నేను పురుషుడినే కావాలా ఏంటి?. అయినా.. బీజేపీ వాళ్లు పార్లమెంటరీ మర్యాదలు బోధించడం చాలా ఆశ్చర్యానికి గురి చేస్తోందని అన్నారామె. ఇదిలా ఉంటే మెహువా వ్యాఖ్యలపై పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్ర స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేశారు. టీఎంసీ క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీజేపీ ఎంపీ హేమా మాలిని సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుకను అదుపులో ఉంచుకోవాలని. భావోద్వేగంలో ఏది పడితే అది మాట్లాడొద్దని.. పార్లమెంట్లో సభ్యులకు గౌరవం ఇచ్చిపుచ్చుకోవాలని హేమమాలిని వ్యాఖ్యానించారు. -
HYD: డొక్కు బస్సులే దిక్కా?
సాక్షి, సిటీబ్యూరో: ఏడాదికోసారి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెడుతూనే ఉంది. ప్రతి సంవత్సరం ఊరించి ఉసూరుమనిపిస్తూనే ఉంది. ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్లో ఏళ్లకు ఏళ్లుగా కాలం చెల్లిన సిటీ బస్సులే నడుస్తున్నాయి. దశాబ్ద కాలంగా ఒక్క కొత్త బస్సు కూడా రోడ్డెక్కలేదు. మరోవైపు హైదరాబాద్ మహానగరం విస్తరిస్తోంది. ఔటర్కు వెలుపల సైతం వదలాది కాలనీలు వెలిశాయి. ఆయా కాలనీలన్నీ ప్రజా రవాణాకు దూరంగానే ఉన్నాయి. ప్రైవేట్ వాహనాలు, ఆటోలు, వ్యక్తిగత వాహనాలపైనే ఆధారపడి లక్షలాది మంది నగరవాసులు రోజువారీ రాకపోకలు సాగిస్తున్నారు. పొరుగున ఉన్న ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ప్రజా రవాణా పరుగులు తీస్తుండగా హైదరాబాద్లో మాత్రం చతికిలపడటం గమనార్హం. ఈ– బస్సులేవీ? రెండేళ్లుగా ఎలక్ట్రిక్ బస్సులపై ఊరిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఒక్క సర్వీసు కూడా అందుబాటులోకి రాలేదు. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడిపేందుకు గతేడాది టెండర్ల ఆహ్వానించారు. కొన్ని సంస్థలు ముందుకొచ్చాయి. వాటిలో ఒక సంస్థ సాంకేతిక సామర్థ్యంపై అనర్హత కారణంగా టెండర్ల ప్రక్రియలో వివాదం చోటుచేసుకుంది. అనంతరం న్యాయస్థానం ఆదేశాల మేరకు ఈ వివాదం పరిష్కారమైనప్పటికీ ఇంకా ప్రతిష్టంభన తొలగిపోలేదు. దీంతో గతేడాది డిసెంబర్ నాటికే నగరంలోని వివిధ మార్గాల్లో సుమారు 300 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి వస్తాయని భావించినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం గ్రేటర్లోని 28 డిపోల పరిధిలో సుమా రు 2,850 బస్సులు ఉన్నాయి. వీటిలో కనీసం వెయ్యికిపైగా డొక్కు బస్సులే. కాలం చెల్లిన వీటితోనే ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేస్తున్నారు. ప్రతి రోజు సుమారు 22 లక్షల మంది ప్రయాణం చేస్తుండగా ఈ అరకొర బస్సులతోనే ఆర్టీసీ అధికారులు పాట్లు పడుతున్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు బస్సులను ఏర్పాటు చేయలేకపోతున్నట్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. శివారు ప్రాంతాల్లోని కాలనీలకు రోజుకు 8 ట్రిప్పుల డిమాండ్ ఉంటే కేవలం 4 ట్రిప్పులే నడుపుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. 6 వేల బస్సులు అవసరం.. రవాణారంగ నిపుణుల అంచనా మేరకు విస్తరిస్తున్న హైదరాబాద్ అవసరాల మేరకు ఇప్పటికిప్పుడు కనీసం 6 వేల బస్సులు కావాలి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి నగరాల్లో వేలకొద్దీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. బెంగళూరులో నిత్యం 6వేల బస్సులు నడుస్తుండగా అదనంగా మరిన్ని కొనుగోలుకు చర్యలు చేపట్టారు. ముంబైలో ఎలక్ట్రిక్ డ బుల్ డెక్కర్ బస్సులు అందుబాటు లోకి వచ్చాయి. వాహన కాలుష్య నియంత్రణ కోసం ఢిల్లీలో సీఎన్జీ బస్సులను భారీ ఎత్తున కొనుగోలు చేసి నడుపుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో అందుకు విరుద్ధంగా బస్సుల సంఖ్య తగ్గిపోవడం గమనార్హం. -
కేటీఆర్ ప్రసంగం మతలబేంటి?
హైదరాబాద్: గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభ నాయకుడిగా సీఎం సమాధానం ఇవ్వడం ఆనవాయితీ. కానీ శనివారం మంత్రి కేటీఆర్ సమాధానమిచ్చారు. ఉమ్మడి ఏపీగా ఉన్నప్పటి నుంచి చూసినా ఇలా జరగడం ఇదే తొలిసారి కూడా. ప్రస్తుతం ఇది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్కు బదులు కేటీఆర్ సమాధానమివ్వడం ద్వారా భవిష్యత్ బీఆర్ఎస్ రాజకీయ వ్యూహానికి అసెంబ్లీ వేదికగా నాంది పలికారని కొందరు అంటుండగా.. గవర్నర్తో విభేదాల క్రమంలోనే ఆమె ప్రసంగానికి సమాధానం ఇవ్వకుండా కేసీఆర్ సభకు గైర్హాజరయ్యారని మరికొందరు పేర్కొంటున్నారు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
కాబోయేవాడు ఎలా ఉండాలంటే?.. జాన్వీ కపూర్ ఆసక్తికర కామెంట్స్!
స్లొవేకియా ప్రధానిపై కాల్పులు
ఇండియా కూటమితో విభేదాలు.. వెనక్కి తగ్గిన దీదీ
నా కోసం కొంత డబ్బు కావాలి.. అందుకే నేనే అడిగా: రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
International Family Day: ఐపీఎల్ స్టార్లు, కెప్టెన్ల అందమైన కుటుంబాలు చూశారా? (ఫొటోలు)
ఈసీ నిష్పక్షపాతంగా వ్యవహరించిందని ఎలా నమ్మాలి?: సజ్జల
మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
సీఏఏ చట్టం కింద తొలిసారి 14 మందికి భారత పౌరసత్వం
100 రోజులకు బ్లూ ప్రింట్ రెడీ.. ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు
తప్పక చదవండి
- ఇండియా కూటమి గెలిస్తే మద్దతిస్తాం: మమతా బెనర్జీ
- పనిమనిషి ఇంట్లో నోట్ల గుట్టలు.. జార్ఖండ్ మంత్రి అలంగిర్ అరెస్టు
- మెగాస్టార్ చిత్రంలో మరో సీనియర్ నటి.. ఆ కాంబో రిపీట్!
- స్టార్ క్రికెటర్ ప్రపోజ్.. హీరోయిన్ ఏమన్నారంటే!
- పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ విడుదల
- వడదెబ్బ మరణాలు.. ఐదో వంతు భారత్లోనే !
- సచిన్ టెండూల్కర్ సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య!
- అతడి కంటే చెత్త కెప్టెన్ ఎవరూ లేరు.. పైగా హార్దిక్ను అంటారా?
- పల్నాడు ప్రమాదంపై సీఎం జగన్ దిగ్భ్రాంతి
- BCCI: టీమిండియా హెడ్కోచ్గా వాళ్లిద్దరిలో ఒకరు?
Advertisement