-
విడుదలకు ముందే వివరాలు లీక్ - ధర ఎంతంటే?
OnePlus Nord Buds 2r: ఆధునిక కాలంలో ఇయర్ ఫోన్స్ ఉపయోగించే వారి సంఖ్య కంటే 'బడ్స్' ఉపయోగించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఇప్పటికే మార్కెట్లో అనేక బ్రాండ్లకు సంబంధించిన బడ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు సరసమైన ధరలో వన్ప్లస్ (OnePlus) కంపెనీ 'నార్డ్ బడ్స్ 2ఆర్' (Nord Buds 2r) విడుదల చేయనుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. దేశీయ మార్కెట్లో విడుదలకానున్న కొత్త 'వన్ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్' బాక్స్ ధర రూ. 2,999 అని తెలుస్తోంది. అంటే వీటి రిటైల్ ధర ఇంకా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కంపెనీ వీటిని 2023 జులై 05న లాంచ్ చేయనుంది. విడుదలకు ముందే ఈ ఇయర్బడ్స్ ఫీచర్స్ కూడా లీక్ అయ్యాయి. (ఇదీ చదవండి: అట్లుంటది ముఖేష్ అంబానీ అంటే! ఆ కారు పెయింట్ ఖర్చు రూ. కోటి..) వన్ప్లస్ నార్డ్ బడ్స్ 2ఆర్ ఒక ఛార్జ్తో 38 గంటల వరకు పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఐపీ55 రేటింగ్ వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కూడా కలిగి మంచి ఆడియో క్వాలిటీ అందిస్తుంది. ఇందులో 12.4mm డైనమిక్ టిటానియం డ్రైవర్, 25డీబీ నాయిస్ కాన్సిలింగ్ ఉండనున్నాయి. ఈ లేటెస్ట్ బడ్స్ కలర్ ఆప్షన్స్ గురించి మాత్రమే కాకుండా ఆఫర్స్ గురించి కూడా త్వరలోనే తెలుస్తుంది. -
ఈ గూగుల్ ఇయర్ బడ్స్ స్పెషల్ ఏంటో తెలుసా?
టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త వైర్లెస్ ఇయర్బడ్స్ను విడుదల చేసింది. గతనెలలో పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్ ఇయర్ బడ్స్ విడుదల చేస్తున్నట్లు అనుకోకుండా ప్రకటించింది. అదే ఇయర్ బడ్స్ ను తాజాగా గూగుల్ అధికారికంగా విడుదల చేసింది. గూగుల్ ట్రూ వైర్లెస్ స్టీరియో (టిడబ్ల్యుఎస్) ఇయర్బడ్స్ ధర $ 99 (సుమారు రూ .7,200) కాగా ప్రస్తుతం ఈయర్ బడ్స్ యుఎస్, కెనడాలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సున్నితంగా, అతి తక్కువ సౌండ్ లో స్పష్టంగా వినబడతాయి. దీంతో చెవులల్లో ఒత్తిడి తగ్గిపోతుందని గూగుల్ తెలిపింది. కొత్త పిక్సెల్ బడ్స్ ఎ-సిరీస్ అడాప్టివ్ సౌండ్తో వస్తుంది. ఇది పరిసరాల ఆధారంగా వాల్యూమ్ను పెంచుతుంది లేదా తగ్గిస్తుంది. వినియోగదారులు ప్రయాణాల్లో ఈ ఇయర్ బడ్స్ వినియోగించడం వల్ల ఇతర వాహనాల నుంచి వచ్చే శబ్ధాలు రాకుండా నివారిస్తున్నట్లు తెలుస్తోంది. నివేదిక ప్రకారం,ఈ ఇయర్ బడ్స్ ఒక్కసారి పెట్టిన ఛార్జింగ్ 24 గంటల పాటు ఉండడమే కాదు కంటిన్యూగా 5 గంటల పాటు వినియోగించుకోవచ్చు. అతి తక్కువ సమయంలో అంటే 15నిమిషాలు ఛార్జింగ్ పెడితే 3గంటల పాటు వినియోగించుకోవచ్చు. దీంతో పాటు హలో గూగుల్ అంటూ మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. ట్రాన్సలేషన్, నోటిఫికేషన్లు పొందవచ్చు. చదవండి : Battlegrounds Mobile India భారీ స్థాయిలో ప్రి రిజిస్ట్రేషన్ -
గూగుల్ బడ్స్తో 40 భాషలు
భాషరాని చోటికి వెళితే ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. చేతిలో గూగుల్ పిక్సెల్ ఫోన్.. ‘బడ్స్’ఇయర్ ఫోన్స్ ఉంటే చాలు.. దాదాపు 40 భాషలు మీకు వచ్చినట్లే.. ఎందుకంటే ఈ బడ్స్ 40 భాషలను తర్జుమా చేసి వినిపిస్తాయి. ఇటీవల జరిగిన గూగుల్ పిక్సెల్ కార్యక్రమంలో భాగంగా ఈ బడ్స్ను విడుదల చేశారు. ఆపిల్ ఎయిర్పాడ్స్ మాదిరిగా ఇవి నేరుగా స్మార్ట్ఫోన్ లేదా టాబ్లెట్కు అనుసంధానమై ఉండవు. కానీ రెండు చెవుల్లో ఉంచుకునే ఫోన్స్ మాత్రం ఒక తీగతో కనెక్ట్ అయి ఉంటాయి. అంతేకాకుండా కుడివైపు ఇయర్ఫోన్పై ఓ టచ్ప్యాడ్ ఉంటుంది. దీనిద్వారా మ్యూజిక్ను కంట్రోల్ చేయొచ్చు. పిక్సెల్ స్మార్ట్ఫోన్లో ఉండే గూగుల్ ట్రాన్స్లేట్ సాఫ్ట్వేర్ ద్వారా ఏ భాషనైనా ఇంకో భాషలోకి తర్జుమా చేసి వినిపిస్తాయి. అవతలి వ్యక్తి మాట్లాడుతూండగానే.. తర్జుమా చేసిన మాటలు మనకు వినిపించడం విశేషం. కుడిచెవిలోని వేళ్లతో టచ్ చేసి ఫలానా భాష మాట్లాడేందుకు సాయం చేయాలని అడగటమే ఆలస్యం గూగుల్ ట్రాన్స్లేట్ పనిలో పడిపోతుంది. మీరు మాట్లాడే భాష తాలూకూ భాషను స్పీకర్ ద్వారా ఎదుటి వ్యక్తికి వినిపించొచ్చు. బడ్స్లో ఎలాగూ ‘గూగుల్ అసిస్టెంట్’ఉంటుంది కాబట్టి.. స్మార్ట్ఫోన్లోని మ్యూజిక్ను మన మాటలతోనే కంట్రోల్ చేయొచ్చు. ఫోన్కాల్స్, టెక్ట్స్ మెసేజీ చదివేందుకు కూడా స్మార్ట్ఫోన్ను బయటకు తీయాల్సిన అవసరం ఉండదన్నమాట! -
కందినైనా కాపాడుకోండి
శనగపచ్చ పురుగు రెక్కల పురుగులు(బసవంతలు) లేత ఆకులపై పూత, పిందెలపై తెల్లని గసగసాల పరిమాణంలో గుడ్లు పెడుతాయి. వీటి నుంచి బయటకు వచ్చిన లార్వాలు తొలి రోజుల్లో ఆకులను తిని రంధ్రాలు చేస్తాయి. తర్వాత పంట పూత దశకు చేరగానే పూత, మొగ్గలు, కాయలు, గింజలను ఆశించి అధిక నష్టం కలగజేస్తాయి. నివారణ చర్యలు... దీని నివారణకు మొక్కల మొదళ్లలో గోనె సంచులు లేదా తాటిపత్రి షీట్లను పరవాలి. మొక్కను సున్నితంగా ఓ వైపు వంచి దులపాలి. ఇలా చేస్తే 90 శాతం శనగపచ్చ పురుగులు, ఇతర క్రిమికీటకాలు, నల్లులు, పెంకు పురుగులు కింద పడుతాయి. రాలిన లార్వాలను, ఇతర కీటకాలను పూడ్చడం గానీ మంటలో వేయడం చేయాలి. ఉధృతి మరీ ఎక్కువగా ఉంటే లీటర్ నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (20శాతం ఈసీ) లేదా 1 మిల్లీలీటరు నోవాల్యురాన్ (10శాతం ఈసీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ (50 శాతం ఈసీ) మందును ఉదయం లేదా సాయంత్రం వేళల్లో పంటపై పిచికారీ చేయాలి. కాయతొలుచు పురుగు దీన్ని మారుక మచ్చల పురుగు, గూడు పురుగు అని కూడా అంటారు. వీటి లార్వాలు చిన్నవిగా ఉండి పూత లోపలి మెత్తటి భాగాలను తిని నష్టపరుస్తాయి. ఆకులు, పూత, పిందెలను కలిపి గూడుగా మలిచి తింటూ ఉండిపోతుంది. ఫలితంగా పంట కాత పట్టదు. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి ప్రవేశిస్తుంది. లోపలి మెత్తటి గింజలను తినేసి కాయలను డొల్లగా మారుస్తాయి. ఈ లార్వా ఆశించిన పూతపై, కాయ లోపల వాటి విసర్జన పదార్థాన్ని చూసి నిర్ధారించుకోవచ్చు. నివారణ చర్యలు... ఈ పురుగు నివారణకు లీటరు నీటిలో 3 మిల్లీలీటర్ల క్లోరోఫైరిపాస్ (25శాతం ఈసీ) మందును కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉన్నట్లయితే రెండోసారి వారం రోజుల తర్వాత.. లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ట్రయాజోఫాస్ (40శాతం ఈసీ) లేదా 0.4 మిల్లీలీటర్ల ఇమమేక్టిన్ బెంజోయేట్ (5 ఈసీ డబ్ల్యూజీ) లేదా 2 మిల్లీలీటర్ల ప్లూబెండమైడ్ (39, 35 ఎస్సీ) మందును కలిపి స్ప్రే చేయాలి. కాయతొలుచు ఈగ తల్లి ఈగ గుడ్లను కాయ లోపలికి జొప్పించి పెడతాయి. కాయ లోపలే గుడ్లు పొదిగి కాళ్లు లేని పిల్లలు(మగ్గోట్స్)గా మారి లేత గింజలను తిని మగ్గేట్ దశను పూర్తి చేసుకుని ప్యూపాగా మారుతాయి. ప్యూపాలు కొంత కాలం తర్వాత పగిలి తల్లి ఈగలు తయారవుతాయి. మగ్గేట్లు కాయ లోపలి భాగాన్ని కొరికి తినేటప్పుడు కాయ తొక్కకి పలుచని పొర ఏర్పడుతుంది. దీన్ని చీల్చుకుంటూ తల్లి ఈగ బయటకు వస్తుంది. ఈగ లేత దశలోనే ఆశించడం వల్ల జీవిత చక్రం కాయ లోపలనే జరుపుకోవడంతో ఇది కలుగజేసే నష్టాన్ని గుర్తించడం కష్టం. నివారణ చర్యలు... మొదటి దశలో లీటరు నీటిలో 2 మిల్లీలీటర్ల మోనోక్రొటోఫాస్ మందును పిచికారీ చేయాలి. పది రోజుల తర్వాత రెండో విడతగా లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల డైమిథోయేట్ను పంటపై స్ప్రే చేయాలి. వేరుకుళ్లు, ఎండుకుళ్లు ఈ తెగులు సోకిన మొక్కల ఆకులు వడలిపోయి క్రమేపీ వాడిపోతాయి. కాండాన్ని చీల్చి చూసినట్లయితే గోధుమ రంగు ధారలు కనిపిస్తాయి. వేర్లు పూర్తిగా కానీ పాక్షికంగా గానీ కుళ్లిపోతాయి. కొద్ది రోజుల్లోనే మొక్క చనిపోతుంది. నివారణ చర్యలు... దీని నివారణకు లీటరు నీటిలో 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా 0.2 గ్రాముల తెబుకొనజోల్ మందును కలిపి పిచికారీ చేయాలి. - మొక్కను మొత్తం మందుతో తడపాలి. ముఖ్యంగా మొదళ్లు బాగా తడిసేలా చూడాలి. - పై పద్ధతులను పాటిస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని ఏఓ సూచించారు. కందిపెంకు పురుగు పెంకు పురుగులు పూత, కాతను ఆశించి పూత నుంచి కాత రసాన్ని పీల్చడం ద్వారా నష్టాన్ని కలుగజేస్తాయి. వీటిని సకాలంలో గుర్తించి నివారిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. నివారణ చర్యలు... లీటరు నీటిలో 2.5 మిల్లీలీటర్ల ప్రొఫెనోపాస్ మందును కలిపి పిచికారీ చేయాలి.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
నియోజకవర్గానికో హబ్..
No Headline
No Headline
పాలమూరు సమగ్రాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
పూర్తిస్థాయిలో వలసల నివారణకు కృషి..
అహంకారానికి,ఆత్మగౌరవానికి మధ్య పోరు..
No Headline
పార్లమెంట్లో ప్రజల గొంతుకనవుతా..
కేంద్ర నిధులతోనే అనేక అభివృద్ధి పనులు..
ఓటింగ్ శాతం పెరుగుతుందా ?..తగ్గుతుందా ?
తప్పక చదవండి
- AP: నేడు 13 జిల్లాలకు భారీ వర్ష సూచన
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- Weekly Horoscope: ఈ రాశి వారికి జీవితాశయం నెరవేరి ఉత్సాహంగా గడుపుతారు
- అమ్మా... నా పేరు గుర్తుందా?
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- చట్టం మీ బాబు చుట్టమా రామోజీ?
- ఇక మాటల్లేవ్!
- ‘ప్లేఆఫ్స్’కు కోల్కతా
- వందో ఆస్కార్కి నాలుగు వేల కోట్లు!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement