-
Virat Kohli Completes 15 Years In International Cricket: విరాట్ కోహ్లి @ 15 ఏళ్లు.. కింగ్ అరుదైన ఫొటోలు చూశారా?
-
‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను
తమన్నా నటించిన తాజా వెబ్సిరీస్ ‘ఆఖరి సచ్’. 2018లో ఢిల్లీలో బూరారిప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన పదకొండుమంది ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటనలతో ‘ఆఖరి సచ్’ రూపొందింది. తమన్నా, అభిషేక్ బెనర్జీ, శివిన్ నారంగ్, రాహుల్ బగ్గా లీడ్ రోల్స్లో రాబీ గ్రేవాల్ దర్శకత్వం వహించారు. ఈ నెల 25 నుంచి డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ– ‘‘ఇందులో అన్య అనే ఇన్వేస్టిగేటివ్ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. ‘ఆఖరి సచ్’ కథ విన్నప్పుడు నేను షాక్ అయ్యాను. ఈ సిరీస్ నాకు చాలా స్పెషల్. ఎందుకంటే నా కెరీర్లో తొలిసారిగా ఓ పొలీసాఫీసర్ పాత్రలో నటించాను. అలాగే నా కంఫర్ట్జోన్ దాటి చాలా ఎమోషన్స్తో కూడు కున్న అన్య పాత్రలో నటించాను’’ అని చెప్పుకొచ్చారు తమన్నా. -
రెక్కలిచ్చిన ఆసనం
మనకు ఊహ తెలిసిన దగ్గర నుంచి పెద్దయ్యాక ఇది అవ్వాలి, అది అవ్వాలి అని రకరకాల కలలు కంటాము. ఎంతో ఇష్టమైన కలను నిజం చేసుకునేందుకు ఎదురైన అడ్డంకులన్నింటిని దాటుకుని సాధిస్తాం. హమ్మయ్య చేరుకున్నాం అని కాస్త సంతోషపడేలోపు అనుకోని కుదుపులు కెరీర్ను పూర్తిగా నాశనం చేస్తాయి. తిరిగి కోలుకోలేని దెబ్బకొడతాయి. అచ్చం ఇలానే జరిగింది అన్షుక పర్వాణి జీవితంలో. తనకెంతో ఇష్టమైన కెరీర్ను వదిలేసినప్పటికీ... యోగా ఇచ్చిన ధైర్యంతో యోగానే కెరీర్గా మలుచుకుని సెలబ్రెటీ యోగా ట్రైనర్గా రాణిస్తోంది పర్వాణి. ముంబైకి చెందిన అన్షుక పర్వాణి విద్యావంతుల కుటుంబంలో పుట్టింది. అన్షుకకు చిన్నప్పటినుంచి ఆస్తమా ఉంది. అయితే మందులు మింగడం అంటే ఇష్టం ఉండేది కాదు. దీంతో డాక్టర్స్ అయిన తాతయ్య, నాయనమ్మలు... ‘‘రోజూ స్విమ్మింగ్ చేస్తుంటే నీ ఊపిరి తిత్తులు బలంగా మారతాయి’’ అని ప్రోత్సహించేవారు. మందులు మింగే బాధ ఉండదని, అన్షుక ఎంతో ఆసక్తిగా స్విమ్మింగ్ నేర్చుకుని రోజూ ఈతకొట్టేది. ఈతలో పట్టుసాధించి జాతీయస్థాయి ఛాంపియన్ షిప్స్లో గోల్డ్మెడల్ గెలిచింది. స్విమ్మింగ్తోపాటు విమాన ప్రయాణం అన్నా అన్షుకకు చాలా ఇష్టం. ఈ ఇష్టంతోనే పైలట్ కావాలని కలలు కనేది. పైలట్ అయ్యి, ప్రపంచమంతా తిరిగిరావాలని... కష్టపడి కమర్షియల్ పైలట్ అయ్యింది. ► ఎగరలేకపోయింది అది 2008.. అన్షుక అనుకున్నట్టుగానే పైలెట్గా గాలిలో తేలిపోతున్న రోజులవి. ఒకరోజు బైక్ యాక్సిడెంట్లో అనుష్క కాళ్లు, తల, నడుముకు తీవ్ర గాయాలయ్యాయి. ఎటూ కదల్లేని పరిస్థితి. కొన్ని నెలలపాటు బెడ్కే పరిమితమైంది. దీంతో కమర్షియల్ పైలట్ ఉద్యోగానికి ఫిట్ కాదని జాబ్ నుంచి తొలగించారు. ఒకపక్క గాయాలతో గుచ్చుకుంటోన్న శరీరం, మరోపక్క విమానం నడపలేని పరిస్థితి అన్షుకను కలచివేసింది. ఇదే సమయంలో తల్లిదండ్రులు అండగా ఉండి, తమ సంపూర్ణ సహకారం అందించడంతో... ఫిజియోథెరపీ, యోగాలతో కొన్ని వారాలలోనే కోల్పోయిన మనోధైర్యాన్ని కూడదీసుకుంది. ఎలాగైనా లేచి నడవాలి అని నిర్ణయించుకుని ఆసనాలను కఠోరంగా సాధన చేసేది. తన తల్లి యోగా టీచర్ కావడం, చిన్నప్పటి నుంచి ఆస్తమాను ఎదుర్కోవడానికి యోగాసనాలు వేసిన అనుభవంతో ఎనిమిది నెలల్లోనే కోలుకుని తిరిగి నడవగలిగింది. ► యోగ శక్తిని తెలపాలని... యోగాతో సాధారణ స్థితికి వచ్చిన అన్షుక.. తిరిగి పైలట్గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ యోగాపై ఏర్పడిన నమ్మకం, ఆసక్తితో ‘యోగాను ఎందుకు కెరీర్గా ఎంచుకోకూడదు? ఎగరలేక కిందపడిపోయిన తనని తిరిగి లేచి నyì చేలా చేసిన ఈ యోగా శక్తిని అందరికీ తెలియచేయాలి’ అనుకుని.. తొమ్మిది నెలల పాటు యోగాలో శిక్షణ తీసుకుని సర్టిఫికెట్ అందుకుంది. యోగాను మరింత లోతుగా తెలుసుకునేందుకు ముంబై యూనివర్శిటీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. పీజీ చేస్తూనే వివిధ రకాల సంప్రదాయ యోగాలను సాధన చేసి ఔపోసన పట్టింది. ఈ క్రమంలోనే పైలట్స్, బాలే, జుంబాను నేర్చుకుని సర్టిఫికెట్ పొందింది. 2015లో బాంద్రాలో యోగా ఇన్స్టిట్యూట్ను నెలకొల్పింది. సంప్రదాయ యోగాసనాలకు కొన్ని టెక్నిక్స్ను జోడించడంతో మంచి ఫలితాలు వచ్చేవి. దీంతో అన్షుక యోగా సెంటర్ బాగా పాపులర్ అయ్యింది. ► అన్షుక యోగా స్టూడియో! యోగాపై పెరిగిన అవగాహనతో సెలబ్రెటీలు సైతం తమ ఫిట్నెస్కోసం యోగాను ఎంచుకుంటున్నారు. అన్షుక ట్రైనింగ్ బావుండడంతో.. మలైకా అరోరా, హూమా ఖురేషి, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, కరీనా కపూర్, ఆలియాభట్, దీపికా పదుకోన్, రకుల్æప్రీత్ సింగ్, మిస్బా గుప్తా, అనన్య పాండే, జాహ్నవీ కపూర్, సోనాల్ చౌహాన్ వంటి సెలబ్రెటీలు అన్షుక దగ్గర యోగాలో శిక్షణ తీసుకున్నారు. ఎంతమంది సెలబ్రెటీలకు యోగా ట్రైనర్గా పనిచేసినా నాకు ఎలాంటి ఒత్తిడీ ఉండదు. శిక్షణ ఇవ్వడమంటే ఇష్టం. ట్రైనింగ్ ఇస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఎందుకంటే, నేను మనసా వాచా కర్మణ్యా పనిచేస్తున్నాను. ఎవరికైనా సలహాలు, సూచనలు ఇచ్చినప్పుడు అవి కచ్చితత్వంతోనూ, సత్యంతోనూ ఉంటేనే వాటికి విలువ ఉంటుంది. అందుకే నేను యోగాసనాలు వేసి, వేయించి, దాని శక్తిని అందరికీ తెలిసేలా చేస్తున్నాను. అందుకే నా శిక్షణకు ఆదరణ లభిస్తోంది. -
తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించాడు.. ఆదిపురుష్ హీరోయిన్
బాలీవుడ్ భామ కృతి సనన్ గురించి పరిచయం అక్కర్లేదు. మహేశ్ బాబు హీరోగా నటించిన నేనొక్కడినే సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య సరసన దోచేయ్ చిత్రంలో కనిపించింది. గతడేది వరుణ్ ధావన్తో కలిసి భేడియా చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ప్రభాస్ సరసన నటించిన ఆదిపురుష్ ఈనెల 16న విడుదల కాబోతోంది. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించిన ఈ చిత్రంలో కృతి సనన్ సీత పాత్రలో కనిపించనుంది. (ఇది చదవండి: కొత్తింట్లోకి అడుగు పెట్టిన హిమజ, ఫోటో వైరల్ ) ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా కృతి సనన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. తన కెరీర్కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది ముద్దుగుమ్మ. మోడలింగ్పై ఆసక్తితో దిల్లీ నుంచి ముంబయి చేరుకున్నట్లు కృతి సనన్ తెలిపింది. అయితే మొదట్లో అవకాశాల కోసం చాలా అవమానాలు ఎదుర్కొన్నానని తెలిపింది. సినిమాలు వెళ్లిపోదామనుకున్నా అయితే ఓ ర్యాంప్షోలో కొరియోగ్రాఫర్ తనతో చాలా అసభ్యంగా ప్రవర్తించి అందరి ముందు అవమానించాడని తెలిపింది. ఆ బాధతో మోడలింగ్ వదిలేద్దామనుకున్నట్లు వివరించింది కృతి. ఇంటికొచ్చేస్తానంటూ ఏడుస్తూ అమ్మకి ఫోన్ చేశానని పేర్కొంది. ప్రతిచోటా సవాళ్లు ఉంటాయని.. వాటిని ఎదుర్కొని ముందుకు సాగితేనే విజయం సాధిస్తామని ఆ సమయంలో అమ్మ తనకు చెప్పిందని వెల్లడించింది. తన వల్లే నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నానని చెబుతోంది ఆదిపురుష్ భామ. ( ఇది చదవండి: ఓవల్లో వాలిపోయిన ప్రేమజంట.. ఫోటోలు వైరల్!) -
నా సంపాదన రెండు వేలే.. వాటితోనే రోజులు గడిపా: బుల్లితెర నటి
సాథ్ నిభానా సాథియా -2తో బుల్లితెరపై గుర్తింపు తెచ్చుకున్న నటి స్నేహా జైన్. ఆమె ప్రస్తుతం 'జనమ్ జనమ్ కా సాత్ షో'లో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన నటి తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. కెరీర్ తొలినాళ్లలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాని తెలిపారు. మొదట్లో సరైన అవకాశాలు ఎన్నోసార్లు మానసికంగా దెబ్బతిన్నానని చెప్పుకొచ్చింది. స్నేహా ఇప్పటికే క్రైమ్ పెట్రోల్, కృష్ణదాసి, క్రైమ్ పెట్రోల్ డయల్ 100 లాంటి సిరీస్ల్లో కనిపించింది. (ఇది చదవండి: రాధికా శరత్కుమార్కు గోల్డ్ రింగ్ గిఫ్టుగా ఇచ్చిన లారెన్స్) స్నేహా జైన్ మాట్లాడుతూ.. 'నాకు చిన్న చిన్న పాత్రలు వచ్చేవి. మొదట యాక్టింగ్ సర్టిఫికేట్ కోర్స్ చేశా. ఆ తర్వాత క్రాఫ్ట్ బాగా నేర్చుకునేందుకు థియేటర్ కోర్సు కూడా చేశా. నా పాత్రలు ప్రేక్షకులను మెప్పించేలా సిద్ధం చేసుకోవాలనుకున్నా. మొదట కొన్ని పాత్రలు నాకు మంచి గుర్తింపునిచ్చాయి. కెరీర్ ప్రారంభంలో నాకు స్నేహితుల పాత్రలు వచ్చినందున డైలాగ్ చెప్పే అవకాశం రాలేదు. టీవీ ఇండస్ట్రీలో అడుగుపెట్టాక ప్రారంభంలో చాలా ఇబ్బందులు పడ్డా. నాకు రోజుకు కేవలం రూ.2 వేలే ఇచ్చేవారు. నలుగురైదుగురు అమ్మాయిలతో కలిసి గదిని పంచుకునేదాన్ని. ఆ రోజులు నాకు జీవితమంటే చాలా నేర్పించాయి. ఇప్పటికీ నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నా. ఈ పరిశ్రమలో అంతులేని పోరాటంగా భావిస్తున్నా.'అని చెప్పుకొచ్చింది. (ఇది చదవండి: బుల్లితెర నటి సూసైడ్ కేసు.. దర్యాప్తులో షాకింగ్ విషయాలు!) -
మొదట్లో చాలా భయపడేదాన్ని: ప్రియాంక చోప్రా
బాలీవుడ్లో నటి ప్రియాంక చోప్రా పరిచయం అక్కర్లేని పేరు. ఇటీవలే స్పై థ్రిల్లర్ సిటాడెల్ వెబ్ సిరీస్తో అలరించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియాంక కెరీర్ మొదట్లో ఎదుర్కొన్న ఇబ్బందులను వివరించింది. కెరీర్ ప్రారంభంలో మానసికంగా చాలా ఇబ్బంది పడినట్లు చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఎవరితోనూ పరిచయాలు లేకపోవడంతో భయపడినట్లు తెలిపింది. (ఇది చదవండి: అవార్డులు కొల్లగొట్టిన ఆలియా భట్ మూవీ..!) ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. '20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మొదట్లో చాలా కష్టంగా అనిపించింది. ఈ పరిశ్రమలో నాకు ఎవరూ తెలియదు. చాలా భయపడేదాన్ని. ప్రతి చిన్న విషయాన్ని ఎంతో సీరియస్గా తీసుకునేదాన్ని. మానసికంగా ఇబ్బందులు పడ్డా. ఏదైనా సినిమా ఫెయిలైనా.. ఏదైనా అవకాశాన్ని కోల్పోయినప్పుడు ఆ బాధపడేదాన్ని. నేను చూసిన బిగ్గెస్ట్ స్టార్స్తో నటించాను. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే ఎంతో సంతోషంగా ఉంది.' అని అన్నారు. కాగా.. అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ను పెళ్లి చేసుకున్న ప్రియాంక ఓ కూతురు కూడా జన్మించింది. తన ముద్దుల కూతురికి మేరీ మాల్టా అని పేరు పెట్టింది. (ఇది చదవండి: పొలిటీషియన్ను పెళ్లాడిన బుల్లితెర నటి.. దాదాపు పదేళ్ల తర్వాత!) -
Neha Bagaria: ఉద్యోగ పర్వం..రీస్టార్ట్
ఉద్యోగం ఊరకే ఎవరూ మానెయ్యరు. సవాలక్ష కారణాలు ఉండవచ్చు. ఉద్యోగం మానేయడం ఎంత తేలికో, తిరిగి ఉద్యోగంలో చేరడం అంత కష్టం. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మహిళలు తమ కెరీర్ను రీస్టార్ట్ చేయడానికి బెంగళూరు కేంద్రంగా ‘జాబ్స్ ఫర్ హర్’ ప్లాట్ఫామ్కు శ్రీకారం చుట్టింది నేహా బగరియా, ఆ ప్లాట్ఫామ్ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసి రెండడుగులు ముందుకు వేసింది నేహా... రకరకాల కారణాల వల్ల ఉద్యోగాలు మానేస్తున్న మహిళలు ఎంతోమంది ఉన్నారు. కరోన కరకు కాలంలో ఉద్యోగం మానేసిన వారిలో మహిళలే ఎక్కువగా ఉన్నారు. అలా ఉద్యోగాలు మానేసిన వారు కెరీర్ రీస్టార్ట్ చేయడానికి తనవంతు ప్రయత్నం చేస్తోంది నేహా బగరియా. అమెరికాలోని వార్టన్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ చేసిన నేహా హెచ్ ఆర్లో ఫైనాన్స్, మార్కెటింగ్ రంగాలలో పనిచేసింది. 2010లో తన కెరీర్కు బ్రేక్ వచ్చింది. తిరిగి మూడు సంవత్సరాల తరువాత ఉద్యోగంలో చేరింది. ‘కెరీర్ రీస్టార్ట్ చేయకపోతే ఎంతో నష్టపోయేదాన్ని’ అని తనలో తాను అనుకుంది. అదే సమయంలో ఉద్యోగాలు మానేసి ఇంటికే పరిమితమైన ఎంతోమంది మహిళా ఉద్యోగులు గుర్తుకు వచ్చారు. వారు అనాసక్తతతోనో, వ్యతిరేకతతోనో ఉద్యోగాలు మానేసి ఉండరు. ఒకానొక నిర్దిష్టమైన సమయంలో తప్పనిసరి పరిస్థితులలో ఉద్యోగం మానేసి ఉంటారు. వారు తిరిగి ఉద్యోగంలో చేరాలకుంటున్నా దారి కనిపించి ఉండదు. ‘పురుషులతో పోల్చితే మహిళలకు ఉద్యోగ అవకాశాలు అనే కిటికీ చాలా చిన్నది’ అంటుంది నేహా. కొన్ని కంపెనీలు అప్పుడే కాలేజీ విద్యను పూర్తి చేసుకున్న అమ్మాయిలకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. కుటుంబ బాధ్యతల వల్ల ఉద్యోగ విధులు సరిగ్గా నిర్వహించలేరేమో అనే భయం వల్ల పెళ్లయిన మహిళలకు ఉద్యోగం ఇవ్వడానికి వెనకాడుతున్నారు. అయితే అది అపోహే అని చరిత్ర చెబుతూనే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ‘జాబ్స్ ఫర్ హర్’ అనే ఆన్లైన్ పోర్టల్ స్టార్ట్ చేసింది నేహా. ఉద్యోగం మానేసిన ఎంతోమంది మహిళలు తిరిగి ఉద్యోగంలో చేరడానికి ఈ ప్లాట్ఫామ్ ఎంతో ఉపయోగపడింది. కంపెనీలకు, ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న మహిళలకు మధ్య వారధిగా మారింది. ‘తమను తాము తిరిగి నిరూపించుకోవాలనే పట్టుదల చాలామంది మహిళలలో కనిపించింది’ అంటుంది నేహా. ‘జాబ్స్ ఫర్ హర్’ ద్వారా ఉద్యోగంలో చేరిన మహిళలలో ముంబైకి చెందిన శ్రీప్రియ ఒకరు. ‘వ్యక్తిగత కారణాల వల్ల ఉద్యోగం మానేసిన నేను కాస్త ఆలస్యంగా అయినా తిరిగి ఉద్యోగం చేయాలనే నిర్ణయం తీసుకున్నాను. అయితే అది అంత సులువైన విషయం కాదని తెలిసిపోయింది. ఈ పరిస్థితులలో జాబ్స్ ఫర్ హర్ చుక్కానిలా కనిపించింది’ అంటుంది శ్రీప్రియ. కొంత కాలం తరువాత... ‘జాబ్స్ ఫర్ హర్’ వెంచర్ను ‘హర్ కీ’ పేరుతో రీబ్రాండ్ చేసింది నేహా. ‘హర్ కీ’కి కలారీ క్యాపిటల్, 360 వన్ ఎసెట్... మొదలైన సంస్థలు ఫండింగ్ చేశాయి. ‘ఉద్యోగం మానేసిన మహిళలలో ఎనభై శాతం మంది తిరిగి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు. అలాంటి వారికి హర్ కీ కొత్త దారి చూపుతుంది’ అంటోంది ‘360 వన్ ఎసెట్’ సీనియర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నిధి గుమాన్. -
నా కుటుంబాన్ని మిస్ అయ్యాను.. నేను ప్రేమించిన వాళ్ళ దగ్గరకు వెళ్లి బాధలు పడ్డాను
-
ఇలా చేశారంటే ఇక మీ కెరీర్ రాకెట్ స్పీడే.. దూసుకుపోతుందంతే..!
ప్రతీ గ్రాడ్యుయేట్కు ఒక లెక్క ఉంటుంది.. 4 సంవత్సరాల ప్రిపరేషన్, పరీక్షల తర్వాత, వారు ప్రపంచాన్ని ఎదుర్కోవడానికి కెరీర్ను తయారు చేసుకోవడానికి సిద్ధమవుతారు. జాబ్ మార్కెట్ను ఛేదించే సామర్థ్యం తమకు ఉందని నమ్ముతారు. కానీ ప్రస్తుత వాతావరణంలో ’ఫ్రెషర్’ లేబుల్ చాలా మంది గ్రాడ్యుయేట్లకు అడ్డంకి మారుతోంది. ఫ్రెషర్స్ వర్సెస్ ఎక్స్పీరియన్స్ సాధారణంగా సంస్థల యాజమాన్యాలు అప్పటికే నిరూపితమైన ట్రాక్ రికార్డ్లు కలిగిన సిబ్బందిని కోరుకుంటాయి. ఎందుకంటే నైపుణ్యం కలిగిన ఉద్యోగుల వల్ల కలిగే దీర్ఘకాలిక ప్రయోజనాలు ఫ్రెషర్ల వల్ల అయ్యే తక్కువ నియామక ఖర్చుల కన్నా ఎక్కువ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని బయటకు వస్తున్న గ్రాడ్యుయేట్లు తరగతి గదిలో సంస్థాగత గత విధులు నేర్చుకోలేరు. అది అనుభవం నుంచి మాత్రమే వస్తుంది. అందుకే గ్రాడ్యుయేట్లు కళాశాల నుంచి బయటకు వచ్చిన తర్వాత వారి మొదటి ఉద్యోగాలను పొందడం కష్టంగా భావించడంలో ఆశ్చర్యం లేదు. గ్లోబల్ అస్థిరత అనిశ్చితి ఎక్కువగా ఉండటంతో పోస్ట్–పాండమిక్ జాబ్ మార్కెట్ లో కష్టతరమైన పరిస్థితులను ఫ్రెషర్లు ఎదుర్కొంటున్నారు. కంపెనీలు తమ ఆఫర్ లెటర్లను రద్దు చేస్తున్నాయి లేదా కొత్త, మరింత కఠినమైన నియామక పద్ధతుల నేపథ్యంలో తమ రిక్రూట్మెంట్ను ఆలస్యం చేస్తున్నాయి, దీనివల్ల వీరు అడ్డంకులు ఎదుర్కొంటున్నారు. నైపుణ్యమే.. విజయం.. ఫ్రెషర్లు కెరీర్ వేటలో ఉన్నప్పుడే మరింత ఎక్కువ నైపుణ్యత సాధించి, పోటీని దూరం చేయవచ్చు, ఆకర్షణీయమైన సామర్ధ్యాల పోర్ట్ఫోలియోను రూపొందించడం ద్వారా అడ్డంకులను దాటవేయవచ్చు. గ్రేట్ లెర్నింగ్ అనే సంస్థ ఇటీవలి నివేదిక ప్రకారం.. కెరీర్ ప్రారంభంలో నైపుణ్యం పెంచుకోవడంలో వ్యయ ప్రయాసలను పెట్టుబడి పెట్టే వారు తోటివారి కంటే రెండింతలు ఎక్కువ సంపాదిస్తారు. ఎక్కువ ఇంక్రిమెంట్లను పొందుతారు. మిగతా వారి కంటే చాలా ముందుగానే ఆర్థిక స్వాతంత్య్రం పొందుతారు. ఆధునిక జాబ్ మార్కెట్ నైపుణ్యం రీస్కిల్లింగ్ను చాలా ముఖ్యంగా పరిగణిస్తుంది. ఎంపిక జాగ్రత్త.. వ్యక్తిగత సామర్ధ్యాల గురించి ఒక అంచనాకు వచ్చిన తర్వాత దేనిని ఎంచుకోవాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. ప్రస్తుతం ఫైనాన్స్ టెక్నాలజీ పరిశ్రమలు అధిక జీతాలను అందించేవిగా పరిగణించబడుతున్నాయి. పెరుగుతున్న డిజిటలైజేషన్తో, ముఖ్యంగా డేటా సైన్స్, బ్లాక్చెయిన్ టెక్నాలజీ హాటెస్ట్ సెక్టార్లలో ఒకటిగా ఉద్భవించింది. గత 2022లో, డేటా సైన్స్లో నైపుణ్యాలను పెంపొందించడం వల్ల 2040 నాటికి వారి జీతం 57.9 ఎల్పిఎకి.. నైపుణ్యం లేని వారి తోటివారి కంటే 3 రెట్లకు చేరుకునే అవకాశం ఉందని గ్రేట్ లెర్నింగ్ అధ్యయనం వెల్లడించింది. అదేవిధంగా, 2022లో నైపుణ్యం పెంచుకునే మార్కెటింగ్ ప్రొఫెషనల్ 10 సంవత్సరాల వ్యవధిలో వారి తోటివారి కంటే 100 శాతం ఎక్కువ సంపాదిస్తారు. అలాగే ఆధునిక–యుగపు నైపుణ్యాలు కలిగిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ నిపుణుడు తోటివారి కంటే 4రెట్ల వరకు సంపాదించగలరు. నైపుణ్యం లేని ఒక ప్రొఫెషనల్ వారి పదవీ విరమణ కార్పస్ ఫండ్ ఏర్పాటు కోసం 60 సంవత్సరాల ఆగాల్సి వస్తే... నైపుణ్యం కలిగిన నిపుణులు 50 సంవత్సరాల వయస్సులోపే వారి పదవీ విరమణ నిధిని కూడబెట్టుకుంటారు. పేపర్ పులి కావద్దు... కేవలం కాగితంపై స్కిల్స్ థృవీకరణ పొందడం కంటే వాస్తవిక సామర్థ్యాన్ని పెంపొందించడంపై దృష్టి పెట్టాలి. పెట్టుబడి పెట్టిన సమయం, డబ్బుపై సాధ్యమైనంత ఎక్కువ రాబడిని సాధించడానికి, పరిశ్రమకు సంబంధించిన పాఠ్యాంశాలను అందించే ప్లాట్ఫామ్ను ఎంచుకోవడం చాలా అవసరం. ఈ ప్రయాణంలో ఎదుర్కొనే సవాళ్లను పరిష్కరించడంలో ఇది సహాయపడుతుంది. నియామక కంపెనీలతో అనేక అప్స్కిల్లింగ్ ప్లాట్ఫామ్లు కనెక్షన్లను కలిగి ఉన్నాయి. నెట్వర్క్ పెంచుకోండి.. సామాజిక వృత్తిపరమైన పరిచయాలను పెంచుకోవడం అవసరం. ఇది అప్స్కిల్లింగ్లో తరచుగా చాలా మంది పట్టించుకోని అంశం. పరిశ్రమ డొమైన్లో అభ్యర్థి తమ నైపుణ్యం సెట్లను అప్డేట్ చేసిన తర్వాత, తదుపరి దశలో తోటి అభ్యాసకుల ద్వారా పరిశ్రమతో కనెక్ట్ అవ్వడం అలాగే ఉపాధి–కేంద్రీకృత ఆన్లైన్ ప్లాట్ఫామ్లను తరచుగా పరిశీలించాలి. అలాగే సృజనాత్మకతను, వృత్తిపరమైన సంబంధాలను పెంపొందించుకోవడానికి సహాయపడే సోషల్ నెట్వర్క్ను రూపొందించుకోవాలి. ఒకే రకపు ఆలోచన కలిగిన నిపుణులతో పరస్పర చర్చలు చేయాలి. నైపుణ్యాలను కలిగి ఉండటం మాత్రమే సరిపోకపోవచ్చు; వాటిని ప్రదర్శించాలి ఎందుకు మీరు అర్హత పొందారో చూపించాలి: అందుబాటులో ఉన్న టూల్స్ ను నేర్చుకోవడం ద్వారా వాటి ప్రయోజనాన్ని పొందాలి. గ్రూపులు ఫోరమ్లలో చేరాలి. అలాగే వివిధ ఈవెంట్లలో పాల్గొనాలి. సుస్థిరమైన సభ్యుల గ్లోబల్ నెట్వర్క్తో కనెక్ట్ కావాలి. పరిశ్రమకు సంబంధించిన ప్రోగ్రామ్లు, హ్యాకథాన్లు సమ్మిట్ల వంటి లైవ్ ప్రాజెక్ట్లలో పాల్గొనడం ద్వారా నెట్వర్కింగ్ను బలోపేతం చేసుకోవాలి. పోర్ట్ఫోలియో... ఓ గుర్తింపు. పోర్ట్ఫోలియో అనేది మీ గుర్తింపు, మీరు వ్యక్తిగతంగా కాబోయే యజమానిని కలిసే ముందు అది మీ గురించి చెబుతుంది. అలాగే, ఆధునిక, సమకాలీనమైన మీ ప్రతిభ సామర్థ్యాలపై అంతర్గత వీక్షణను అందించగల నిర్దిష్ట డాక్యుమెంటు గురించి చాలా జాగ్రత్తలు తీసుకోండి. మీ అనుభవాలను వివరించాలి. మీ విజయాలను ప్రదర్శించడానికి వెనుకాడకండి. ప్రాజెక్ట్లలో మీరు చూపించిన డైరెక్ట్ రిజల్టులను హైలైట్ చేయండి, పురోగతి భావాన్ని, విజయం సాధించాలనే ఆరాటాన్ని ప్రదర్శించండి. మీరు ఎంచుకున్న నైపుణ్యాలతో సివిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి. –హరికృష్ణన్ నాయర్, కో ఫౌండర్, గ్రేట్ లెర్నింగ్ -
అతడి కంటే అందగాడివా అని హేళన చేశారు: చిరంజీవి
ప్రముఖ సింగర్ స్మిత వ్యాఖ్యాతగా ‘నిజం విత్ స్మిత’ టాక్ షో ప్రారంభమైంది. ఈ షో ద్వారా సినీ, రాజకీయ ప్రముఖుల జీవితంలోని చోటు చేసుకున్న సంఘటనలు, వ్యక్తిగత విషయాలను చర్చించనున్నారు. ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీలివ్లో వేదికగా ప్రసారమయ్యే ఈ షో ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి, హీరోయిన్ సాయి పల్లవి, దగ్గుబాటి రానా, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుతో పాటు తదితరులు పాల్గొన్నట్లు చూపించారు. ఇక ఫిబ్రవరి 10న ఈ షో ప్రారంభం కాగా తొలి ఎపిసోడ్గా మెగాస్టార్ చిరంజీవి ఇంటర్య్వూను ప్రసారం చేశారు. చదవండి: ఫేం కోసం తప్పుడు ప్రచారం.. సింగర్ యశస్వి చీటింగ్ బట్టబయలు! ఇందులో చిరు తన వ్యక్తిగత, సినీ కెరీర్కు సంబంధించిన పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్గా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న చిరంజీవి తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానంటూ నాటి సంఘటనలను గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. ‘నేను నటుడిగా ఈ స్థాయి చేరుకునే క్రమంలో ఎన్నో అవమానాలు పడ్డాను. అవకాశాల కోసం వెళితే హేళన చేశారు. కొన్ని సార్లు అయితే మానసిక క్షోభకు గురయ్యాను. ఆ బాధను ఎవరికి చెప్పుకోలేదు. దేవుడి ముందుకు నిలబడి నాకు నేను ధైర్యం చెప్పుకునేవాడిని. ఆ తర్వాత మళ్లీ అవకాశాల వేట మొదలు పెట్టేవాడిని’ అని చెప్పారు. అయితే ‘‘సినిమాల్లో నటించాలనే ఆశతో ఓ రోజు మద్రాస్కు వెళ్లాను. పాండీబజార్లోని ఫిలిం ఇన్స్టిట్యూట్కు వెళ్లా. అక్కడ ఓ వ్యక్తి నన్ను చూసి ‘ఏంటి ఫిలిం ఇన్స్టిట్యూట్లోకి వచ్చావా? సినిమాలు ట్రై చేద్దామనే! అతను చూడు ఎంత అందంగా ఉన్నాడో. అతడి కంటే నువ్వు అందగాడివా.. తెలిసిన వాళ్లు లేకపోతే అవకాశాలు దొరకడం కష్టం. ఇండస్ట్రలోకి రావాలంటే ఇక్కడ తెలిసిన వాళ్లు ఉండాలి. చదవండి: ఈసారి బిగ్బాస్ హౌజ్లోకి యాంకర్ రష్మీ? భారీగా పారితోషికం..! కాబట్టి నీ కల మర్చిపో’ అంటూ నన్ను హేళన చేస్తూ మాట్లాడాడు. ఆ మాటలు నన్ను బాధించాయి. ఇంటికి వెళ్లి దేవుడు ముందు కూర్చోని ఇలాంటి వాటికి బెదిరి వెనకడుగు వేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను. ఇక ఆ తర్వాత ఏడాది పాటు పాండీ బజార్ వైపు వెళ్లలేదు’’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. కాగా ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన చిరు మొదట క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, విలన్గా మెప్పించారు. అలా అంచెలంచెలుగా హీరోగా స్వయం కృషితో ఎదిగిన చిరు ప్రస్తుతం సినీరంగంలో గాడ్ఫాదర్గా అభిమానుల గౌరవ, అభిమానాలను అందుకుంటున్నారు. -
అపురూప కల్పన
ముంబైకి చెందిన ఆష్తి మిల్లర్ను ‘ఆర్కిటెక్ట్’ అంటే మాత్రమే సరిపోదు. అలా అని ‘ఆర్ట్’కు మాత్రమే పరిమితం చేయలేము. ఇలస్ట్రేషన్, గ్రాఫిక్ డిజైన్లతో తనప్రోఫెషనల్ కెరీర్కు కొత్త మెరుపు తీసుకువచ్చింది. అదే తన ప్రత్యేకశైలిగా మారింది... నేను చేసే వర్క్స్లో వీలైనన్ని వివరాలు ఉండేలా జాగ్రత్త పడతాను. దీంతో వీక్షకులు అందులో కొత్తదనాన్ని చూస్తారు. నా ఆలోచన విధానం ఏమిటో తెలిసిపోతుంది. నా మది ఎప్పుడూ రకరకాల ఐడియాలతో నిండిపోయి ఉంటుంది. వాటిలో నుంచి కొన్ని ఐడియాలను తీసుకొని పనిచేస్తాను. – మిల్లర్ ముంబైలోని ఆష్తి మిల్లర్ ఇల్లు క్రియేటివిటీకి సంబంధించిన విషయాలకు కేంద్రంగా ఉండేది. తల్లి ఫైన్ ఆర్టిస్ట్. తండ్రి ఆర్కిటెక్ట్. ఇంటినిండా ఆర్ట్కు సంబంధించిన ముచ్చట్లే! చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులతోపాటు రకరకాల మ్యూజియమ్లు, ఆర్ట్గ్యాలరీలకు వెళుతుండేది మిల్లర్. అవి ఊరకే ఉండనిస్తాయా! తనలో సృజనాత్మకమైన ఆలోచనలను పెంపొందించాయి. సక్సెస్ఫుల్ ఆర్కిటెక్ట్గా తండ్రికి మంచి పేరు ఉంది. అయితే అది రాత్రికి రాత్రి వచ్చేందేమీ కాదు. ఎంతో కష్టపడ్డాడు. తండ్రి కష్టం తనకు ఆదర్శం అయింది. తండ్రి బాటలోనే ఆర్కిటెక్చర్ కోర్సు చదువుకుంది. ‘మిల్లర్ ఇంక్ స్టూడియో’ మొదలు పెట్టింది. ఈ స్టూడియో ద్వారా ప్రోఫెషనల్ కెరీర్ ‘ఆర్కిటెక్ట్’ను తన క్రియేటివిటీకి సంబంధించిన ఇలస్ట్రేషన్ అండ్ గ్రాఫిక్ డిజైన్లతో మిళితం చేసి యూనిక్ స్టైల్తో తిరుగులేని విజయం సాధించింది మిల్లర్. జాతీయ,అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధ బ్రాండ్లతో కలిసి పనిచేస్తోంది. మారథాన్లకు సంబంధించిన మెడల్స్ను యూనిక్ స్టైల్లో డిజైన్ చేయడంలో తనదైన ప్రత్యేకత సాధించుకుంది. ఒక ఫిన్టెక్ కంపెనీ బ్రాండ్కు సంబంధించి మనీఆర్ట్ సిరీస్ కోసం మిల్లర్ సృష్టించిన 14 లేయర్లతో కూడిన ఆర్ట్ వర్క్కు మంచి పేరు వచ్చింది. ప్రతి లేయర్లో వివిధ దేశాలకు చెంది కరెన్సీ, వివిధ భౌగోళిక ప్రాoతాలకు సంబంధించిన ఎలిమెంట్స్ ప్రతిఫలిస్తాయి. మిల్లర్ ఆర్ట్వర్క్స్ దేశవిదేశాల్లోని ప్రసిద్ధ గ్యాలరీలలో ప్రదర్శించబడ్డాయి. ‘మిల్లర్ ఆర్ట్వర్క్లో తాజాదనం కనిపిస్తుంది. సూటిగా మనసును తాకే ఆకర్షణీయత ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో నగరాలలో ఎన్నో కట్టడాలు ఉన్నాయి. వాటి వైవిధ్యాన్ని తన కళలోకి తీసుకురావడానికి ఎంతో అవకాశం ఉంది’ అంటుంది క్యూరెటర్ అమ్బ్రోగి. ‘మిల్లర్లోని ప్రత్యేకత ఏమిటంటే ఒకే సమయంలో భిన్నమైన విషయాల గురించి ఆలోచించడం. వాటిని సృజనాత్మకంగా సమన్వయం చేసుకోవడం. ఆమె ఆర్ట్వర్క్స్లో ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్, శిల్పం, చిత్రం మిళితమై కనిపిస్తాయి’ అంటున్నాడు ఆర్కిటెక్చరల్ సంస్థ పికార్ట్కు చెందిన ఆంథోనీ మార్కెస్.ఆంథోనితో కలిసి అర్బన్ మాస్టర్ ప్లాన్స్ నుంచి పర్సనల్ స్పేసెస్ వరకు ఎన్నోప్రాజెక్ట్లలో పనిచేసింది ఆష్తి మిల్లర్.‘మోర్ ఈజ్ బెటర్’ అనే ఫిలాసఫీని నమ్ముతున్న ఆష్తి మిల్లర్ తాజాగా ఫోర్బ్స్ ఇండియా ‘30 అండర్ 30’లో చోటు సంపాదించింది. -
నాతో షూటింగ్ చేసి చివరికి వేరే హీరోయిన్ను తీసుకున్నారు: రకుల్
నార్త్ నుంచి వచ్చి ముందు సౌత్లో స్టార్ హీరోయిన్ అయ్యారు రకుల్ ప్రీత్సింగ్. తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలతో దూసుకెళుతున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళంలో ‘ఇండియన్ 2’, ‘అయలాన్’లో నటిస్తున్నారు. కాగా హిందీలో ఆమె నటించిన ‘ఛత్రీవాలీ’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఇందులో రకుల్ సురక్షితమైన శృంగారం గురించి పాఠాలు చెప్పే కెమిస్ట్రీ టీచర్గా నటించారు. ‘‘కొన్ని విషయాలను బహిరంగంగా మాట్లాడటానికి ఇష్టపడం. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు అయితే మారుతున్న కాలానికి తగ్గట్టు మనం మారాలి. పిల్లలకు అవగాహన కల్పించాలి. అందుకే ఈ సినిమా చేశాను’’ అన్నారు. ఇక.. కెరీర్ ఆరంభంలో తనకు ఎదురైన అనుభవాల గురించి రకుల్ చెబుతూ.. ‘‘ఇండస్ట్రీలో నాకు బ్యాక్గ్రౌండ్ లేదు. ముంబైలో నేను కాండీవాలీలో ఉండేదాన్ని. కానీ నా ట్రైనర్తో కలిసి బాంద్రాలో ఒక కేఫ్లో కూర్చుని, ఏయే ఆఫీస్కి వెళ్లాలి? ఎన్ని ఆడిషన్స్ ఇవ్వాలి? అని ప్లాన్ చేసేదాన్ని. బాంద్రా, అంథేరీల్లో ఏమైనా ఆడిషన్స్ ఉంటే వెళ్లొచ్చని ఆ కేఫ్కి వెళ్లేదాన్ని. చదవండి: వారి వల్లే అనసూయ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిందా? బ్యాగులో కొన్ని డ్రెస్సులు పెట్టుకుని, కారులోనే మార్చుకునేదాన్ని. చాన్స్ వచ్చినట్లే వచ్చి చేజారేది. ఒక్కోసారి నాతో షూటింగ్ చేసి, వేరే హీరోయిన్ని తీసుకునేవారు. ఇదంతా నేను పోరాటం అనుకోలేదు. ఎందుకంటే కష్టపడకుండా ఈజీగా దక్కాలనుకునే మనస్తత్వం కాదు నాది. అందుకే ‘పోరాటం’ అనే పదం నాకు నచ్చదు. ఆ రోజు ఆత్మవిశ్వాసంతో అడుగులు వేశాను కాబట్టే ఈరోజు ఈ స్థాయికి చేరుకోగలిగాను’’ అన్నారు. -
Annie Ernaux: స్వీయ అనుభవాలే సాహిత్యం
ఆనీ ఎర్నౌకు 23 ఏళ్లు ఉండగా అవాంఛిత గర్భం వచ్చింది. దాంతో చట్టవిరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి వచ్చింది. ఇది జరిగింది 1963లో. 1999లో ఈ అనుభవాన్ని ఆమె నవలగా రాసింది. 130 పేజీల ఈ నవల 2000 సంవత్సరంలో ‘హ్యాపెనింగ్’ పేరుతో వెలువడి సంచలనం రేపింది. కాల్పనిక సాహిత్యం రాసే ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ ఆ రకమైన సాహిత్యాన్ని వదిలిపెట్టి స్వీయ జీవితంలోని పరాభవాలు, ఆందోళనలు దాపరికం లేకుండా రాయడం కూడా సాహిత్యమేనని గ్రహించింది. 2022 సంవత్సరానికి ప్రతిష్టాత్మక నోబెల్ ప్రెయిజ్ గెలుచుకున్న ఆనీ ఎర్నౌ ఇంగ్లిష్లో రాయకున్నా ఈ బహమతి గెలుచుకున్న అతి కొద్దిమంది మహిళల్లో ఒకరు. ఆమె గురించి... ఆమె పుస్తకాల గురించి... ‘ఇది పురుషాధిక్య ప్రపంచం. దీనిని బోనెక్కించాల్సిన సమయం వచ్చినప్పుడు బోనెక్కించాల్సిందే’ అంటుంది 82 సంవత్సరాల ఫ్రెంచ్ రచయిత్రి ఆనీ ఎర్నౌ. తన జీవితంలో జరిగిన ఒక సంఘటన– చట్ట విరుద్ధంగా అబార్షన్ చేయించుకోవాల్సి రావడాన్ని– 1999లో ఫ్రెంచ్లో ‘ఇవెన్మో’ పేరుతో నవలగా రాస్తే మరుసటి సంవత్సరం అది ‘హ్యాపెనింగ్’ పేరుతో ఇంగ్లిష్లో అనువాదం అయ్యి వెలువడింది. ఆ సందర్భంగా ఆనీ ఎర్నౌ అన్న మాట అది. ‘నా జీవితంలో నాకు జరిగింది రాయడం ఎందరో స్త్రీలకు గొంతునివ్వడమే’ అని ఆమె అంది. ‘నాకు అవాంఛిత గర్భం వచ్చినప్పుడు అది నా వ్యక్తిగతమైన విషయంగా మిగల్లేదు. బయటపడితే నా కుటుంబం మొత్తం సామాజిక నీతిలో విఫలమైందన్న విమర్శను మోయాల్సి వచ్చేది’ అంటుందామె. కాకతాళీయమే అయినా ఇండియాలో అబార్షన్ గురించి సుప్రీంకోర్టు స్త్రీలకు సంపూర్ణ హక్కులు ఇచ్చిన సందర్భంలోనే అబార్షన్ గురించి, స్త్రీల దైహిక వేదనల గురించి, మనో సంఘర్షణల గురించి, వారికి మాత్రమే ఎదురయ్యే అనుభవాల గురించి అది కూడా శ్రామిక వర్గ కోణం నుంచి విస్తృతంగా రాసిన ఆనీ ఎర్నౌకు నోబెల్ సాహిత్య బహుమతి లభించింది. ఇప్పటి వరకు 119 మంది నోబెల్ సాహిత్య బహుమతి లభిస్తే వారిలో కేవలం 16 మందే స్త్రీలు. ఆనీ ఎర్నౌ 17వ రచయిత్రి. బాల్యం నుంచి గుణపాఠాలే ఫ్రాన్స్లోని ఇవెట్తో అనే ఊళ్లో చిన్న పచారీ కొట్టు నడిపేవారు ఆనీ తల్లిదండ్రులు. తండ్రికి పట్టకపోయినా జీవితాలు మారాలంటే చదువు ముఖ్యం అని ఆమె తల్లి గట్టిగా భావించింది. దాంతో తమ స్థాయికి చెందకపోయినా కాస్త మంచిబడిలో ఆనీని చేర్పించింది. ఆ బడికి కలిగిన పిల్లలు వచ్చేవారు. ‘అక్కడే నాకు తొలిపాఠం తెలిసింది. శ్రామిక వర్గానికి దక్కే మర్యాదలు కూడా తెలిశాయి. నిన్ను నువ్వు చిన్నబుచ్చుకుంటూ బతకాల్సి రావడం కంటే ఘోరమైన విషయం లేదు. మన స్థాయికి మించిన విషయాల్లో అడుగు పెట్టకూడదని నాకు గట్టిగా అందిన సందేశం అందింది’ అంటుందామె. ఆమె తన స్వీయానుభవాల ఆధారంగా ‘ఏ గర్ల్స్ స్టోరీ’ (2016) అనే నవల రాసింది. ‘18 ఏళ్ల అమ్మాయి స్టూడెంట్స్ క్యాంప్లో లైంగిక అనుభవం పొందితే అది సంతోషకరంగా ఉండాలి. కాని ఇది తెలిసిన వెంటనే మగ విద్యార్థులు ఆ అమ్మాయిని గేలి చేశారు. ఆమె అద్దం మీద అసభ్యకరంగా రాసి వెక్కిరించారు. ఎన్నాళ్లు గడిచినా నైతికంగా పతనమైన భావనను కలిగించారు’ అని రాసిందామె. చదువు ముగిశాక ఆమె టీచర్గా మారి ఆనీ ఎర్నౌ 2000 సంవత్సరంలో రిటైరయ్యి పూర్తికాలం రచయిత్రిగా రచనలు కొనసాగిస్తూ ఉంది. సూటిగా, సులభంగా ఆనీ ఎర్నౌ రచనా శైలి సూటిగా సులభంగా ఉంటుంది. నేరుగా పాఠకులకు అందేలా ఆమె వచనశైలి ఉంటుంది. నోబెల్ కమిటీ కూడా ఇదే మాట అంది. ‘ఆమె సాహిత్యం అత్యంత సాధారణ భాషలో అత్యంత పరిశుభ్రంగా ఉంటుంది’ అని అభిప్రాయపడింది. ఆనీ ఎర్నౌ రాసిన పుస్తకాల్లో ‘క్లీన్డ్ ఔట్’ (1974), ‘షేమ్’ (1997), ‘గెటింగ్ లాస్ట్’ (2001), ‘ది ఇయర్స్’ (2008) ముఖ్యమైనవి. 1988లో పారిస్లో ఉద్యోగం చేస్తున్న ఒక సోవియెట్ దౌత్యవేత్తతో ఆనీ ఎర్నౌ బంధం ఏర్పరుచుకుంది. అతడు ఆమె కంటే 12 ఏళ్లు చిన్నవాడు. కొంత కాలానికి ఆ బంధం ముగిసింది. ఆ సమయంలో తన భావోద్వేగాలను ‘గెటింగ్ లాస్ట్’ పేరుతో నవల రాసిందామె. అలాగే తన గురించి, ఫ్రాన్స్ సమాజం గురించి రెండో ప్రపంచ యుద్ధం నాటి నుంచి ఇటీవలి కాలం వరకూ జరిగిన ఘటనలను ‘ది ఇయర్స్’గా రాసింది. ఒక రకంగా ఇది స్వీయ చరిత్ర, ఫ్రాన్స్ చరిత్ర కూడా. స్త్రీ పక్షపాతి ఆనీ ఎర్నౌ తనను తాను ‘రచనలు చేసే మహిళ’గా చెప్పుకున్నా ఆమె స్త్రీ పక్షపాతి. స్త్రీవాద ఉద్యమానికి ప్రోత్సాహకురాలు. ‘రాజకీయాలు భ్రష్టుపట్టిన ఈ సమయంలో ఫెమినిస్టులే సరిహద్దులను ప్రశ్నిస్తూ కొత్త ఆలోచనలను చేస్తూ ఆశలు రేకెత్తిస్తున్నారు’ అంటుందామె. ఇటీవల జరిగిన మీటూ ఉద్యమం ఆమెకు చాలా సంతోషాన్నిచ్చింది. ‘తమతో ఎలాగైనా వ్యవహరించవచ్చనే స్థితిని స్త్రీలు ఇక మీద ఏ మాత్రం అంగీకరించరు’ అంటారామె. ‘నేను రాయగలను కాబట్టే నాకు వినూత్న అనుభవాలు ఎదురవుతున్నాయి’ అని చెప్పుకున్న ఆనీ రాయగలిగే మహిళలంతా తమ జీవన అనుభవాలను బెరుకు లేకుండా చెప్పడాన్ని ప్రోత్సహిస్తుంది. అప్పుడే స్త్రీలు, స్త్రీలతో ఉన్న సమాజం మరింత మెరుగ్గా అర్థమవుతాయి. స్వీయ అనుభవాలే రచనలు ఆనీ ఎర్నౌ ఏవో ఊహించి కథలు అల్లడం కన్నా తన జీవితంలో జరిగినవే రాయాలని నిర్ణయం తీసుకుంది. దాంతో ఆమె జ్ఞాపకాల రచయిత్రి అయ్యింది. మన జీవితంలో జరిగినదాన్ని రాయడం వల్ల మిగిలినవారు పోల్చుకోవడానికో, సహానుభూతి చెందడానికో అది ఉపయోగపడుతుంది అంటుందామె. మనుషులు వేరే చోట్ల ఉన్నా వారు భావోద్వేగాలు ఒకటే కదా. ఆనీ ఎర్నౌ రాసిన ‘హ్యాపనింగ్’ నవల ఒక కాలపు ఫ్రాన్స్లో స్త్రీల సంఘర్షణను సూటిగా నిలపడంతో ఆమెకు ప్రశంసలు వచ్చాయి. 1963లో ఆమె అబార్షన్ చేయించుకోవాల్సి వస్తే ఆ తర్వాత 12 ఏళ్లకు కాని ఫ్రాన్స్లో (అవివాహితులకు) అబార్షన్ను చట్టబద్ధం చేయలేదు. ‘అబార్షన్ హక్కు లేకపోవడం అంటే.. చట్టం, సంఘపరమైన నియమాలు వ్యక్తి స్వేచ్ఛను పూర్తిగా ధ్వంసం చేయడమే’ అంటుందామె. -
మీ కెరీర్ మలుపు తిప్పే టర్నింగ్ పాయింట్.. నిజంగా ఇది గోల్డెన్ ఛాన్సే..
రాజానగరం(తూర్పుగోదావరి): చదివిన చదువు విద్యార్థికి ఉపయోగపడాలి. ఉపాధికి మార్గం చూపాలి. విజ్ఞానం పంచాలి. ఇందుకు భిన్నమైన పరిస్థితులు ఉండటంతో విద్యార్థులు చదువు పూర్తయ్యాక పట్టా చేత పట్టుకుని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అటు ఉద్యోగం పొందలేక ఇటు బయట ప్రపంచంలో మనలేక అవస్థలు పడుతున్నారు. చదవండి: మగవాళ్లకు మాత్రమే.. ఆడవారికి నో ఎంట్రీ.. ఎందుకంటే? కొద్దిరోజులుగా ఈ పరిస్థితిలో మార్పు వస్తోంది. విద్యార్థికి ఎదురవుతున్న ఇటువంటి క్లిష్ట పరిస్థితిని చక్కదిద్దేందుకు విద్యా సంస్థలు మార్గాన్వేషణ చేస్తున్నాయి. స్కిల్ బోధన చేస్తున్నాయి. కొన్ని చోట్ల ఇంజినీరింగ్ విద్యార్థులకు ఇంటర్న్షిప్ ఇస్తూ ఉపాధి బాట చూపుతున్నాయి. నన్నయ విశ్వ విద్యాలయం ఈ విషయంలో చురుకైన పాత్ర పోషిస్తోంది. ఏటా లక్షలాది మంది విద్యార్థులు ఇంజినీరింగ్ కోర్సులు పూర్తి చేసి, బయటకొస్తున్నారు. వారిలో చాలామందిలో పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యాలు కొరవడుతున్నాయి. ఫలితంగా సరైన ఉపాధి అవకాశాలు పొందలేకపోతున్నారు. ఈ కొరతను నివారించి, తరగతి గదిలో నేర్చుకున్న పరిజ్ఞానం ఉపయోగపడేలా విద్యాసంస్థలు ఇప్పుడు బాట వేస్తున్నాయి. పరిశ్రమలకు అవసరమైన సామర్థ్యంతో కూడా అవగాహన కలిగించేందుకుగాను ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ ఇంటర్న్షిప్ ఎంతగానో తోడ్పడుతుంది. అంతేకాదు పరిశోధనలు చేసే విద్యార్థులకు కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుందంటున్నారు అధ్యాపకులు. ఈ కారణంగానే ప్రతి విద్యార్థి తన కోర్సులో ఏదోఒక పరిశ్రమలో ఇంటర్న్షిప్ చేయాలని రాష్ట్ర ఉన్న విద్యామండలి నిబంధన కూడా పెట్టింది. ఈ నేపథ్యంలో ఇంటర్న్షిప్ అనేది ఇంజినీరింగ్ విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు మార్గాన్ని చూపటంతోపాటు ఉపాధి అవకాశాలకు తొలి మెట్టుగా ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు. అందుకే కాలేజీల నుంచి ఇంటర్న్షిప్నకు మరో పరిశ్రమ లేదా సంస్థకు వెళ్లే విద్యార్థులు దీనిని సదవకాశంగా భావించాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. దీనిని క్యాజువల్గా పరిగణిస్తే భవిష్యత్కు ఇబ్బందికరమంటున్నారు. ఉపాధి పొందే అవకాశం ♦ తరగతి గదిలో నేర్చుకున్న సాంకేతిక పరిజ్ఞానానికి మరింత పదును పెట్టి, వర్కుపై అవగాహన పెంచడం ఇంటర్న్షిప్ ప్రధాన ఉద్దేశం. ♦ పరిశ్రమలు, కొన్నిరకాల సంస్థలు ఇంజినీరింగ్ విద్యార్థులకు ఈ అవకాశాన్ని అందిస్తున్నాయి. ♦ తొలినాళ్లలోనే పని నేర్చుకునే వీలు కల్పిస్తున్నాయి. ♦ ప్రాజెక్టులు రూపొందించడం, ఫీల్డ్ గురించి తెలుసుకోవడం, హార్డ్, సాప్ట్ స్కిల్స్ని అభివృద్ధి చేయడం వంటి వాటి కోసం ఇంటర్న్షిప్లో సమయాన్ని కేటాయిస్తారు. ఈ సమయంలో వారు చూపించే ప్రతిభాపాటవాలతో కొన్ని సంస్థలు వారికి ఉద్యోగ అవకాశాలు కూడా ఆఫర్ చేస్తుంటాయి. ♦ వేసవిలో 10 నుండి 12 వారాలపాటు ఇంటర్న్ షిప్ చేయవలసి వస్తే ఇతర కాలాలలో ఆరు మాసాలకు లోబడి సమయాన్ని ఆయా సంస్థలు, పరిశ్రమలు నిర్ణయిస్తాయి. ♦ ఈ సమయంలో గౌరవ వేతనాలను కూడా పొందే అవకాశాలుంటాయి. ♦ అనుభవజ్ఞులతో పరిచయాలు ఏర్పడం, వారి అనుభవాలను షేర్ చేసుకోవడం జరుగుతుంటుంది. ♦ విద్యార్థి ఉజ్వల భవిష్యత్తుకు ఇంటర్న్షిప్ ఎంతగానో దోహదపడుతుంది. ♦ ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు, ఉన్నత అవకాశాలను పొందేందుకు కూడా తోడ్పడుతుంది. ♦ ఏ ఉద్యోగానికైనా అనుభవం కొలమానికంగా ఉన్న నేపథ్యంలో ఇంటర్న్షిప్ అనుభవంగా సహకరిస్తుంది. పీహెచ్డీ చేసే వారికి బాగా ఉపయోగపడుతుంది కంపెనీలు ఇచ్చే జాబ్ సెలక్షన్స్లో ఇంటర్న్షిప్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఎంటెక్ చేసి, పీహెచ్డీ చేయాలనుకునే వారికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ఆదికవి నన్నయ యూనివర్సిటీ, కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ నుంచి ఇప్పటి వరకు రెండు బ్యాచ్ల విద్యార్థులు చదువు పూర్తి చేసి బయటకు వెళ్లారు. ప్రస్తుతం 800 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు చదువుతున్నారు. ఇక్కడ చదివిన విద్యార్థులకు ఐఐటీ, ఎన్ఐటీ, ఎన్టీఆర్ఐ, సీఐటీడీ వంటి సంస్థలలో ఇంటర్న్ఫిప్ చేసే అవకాశాలు వచ్చాయి. – ఆచార్య ఎం.జగన్నాథరావు, వైస్చాన్సలర్, ఆదికవి నన్నయ యూనివర్సిటీ మార్గదర్శకాలను అనుసరించే.. ఉన్నత విద్యా మండలి మార్గదర్శకాలను అనుసరించి ఇంజినీరింగ్ విద్యార్థులంతా ఇంటర్న్షిప్ చేయవలసి ఉంటుంది. దీనిని ఆన్లైన్లోగాని, ఆఫ్లైన్లోగాని తప్పనిసరిగా చేయవలసిందే. ఇందుకోసం కంపెనీలు ఒక్కోసారి నోటిఫికేషన్స్ ఇస్తుంటాయి, వాటిని విద్యార్థులు చూసి, దరఖాస్తు చేసుకుంటారు. ఇంటర్న్షిప్స్ ఎక్కువగా సమ్మర్ హాలిడేస్లో చేస్తుంటారు. – డాక్టర్ వి.పెర్సిస్, ప్రిన్సిపాల్, ‘నన్నయ’ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అనుభవాన్ని అందించింది ఎలక్రిక్టకల్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్లో మూడో సంవత్సరం చదువుతున్న నాకు ప్రాసెస్ కంట్రోల్ రంగంలో ప్రతిష్టాత్మక నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ( తిరుచిరాపల్లి)లో ఇంటర్న్షిప్ చేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నాం. నిజంగా ఇది మాకు వర్కుపై కొత్త అనుభవాన్ని అందించింది. తద్వారా లక్ష్యాన్ని సాధించాగలమనే ధీమాను ఇచ్చింది. – కార్తీక్కుమార్రెడ్డి, వసంతకుమార్, మౌనిక -
ఏం చెప్పాలో మాటలు రావడం లేదు.. నితిన్ ఎమోషనల్
Nithin Emotional Post On His 20 Years Cinema Journey: 'జయం' సినిమాతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు యంగ్ హీరో నితిన్. దిల్, సై, ఇష్క్ వంటి తదితర సినిమాలతో మంచి బ్రేక్ తెచ్చుకున్నాడు. జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం మూవీతో ఆగస్టు 12న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాడు. అయితే 2002లో 'జయం' సినిమాతో కెరీర్ ప్రారంభించిన నితిన్ 20 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ సందర్భంగా తన అభిమానులకు, దర్శక-నిర్మాతలకు సోషల్ మీడియా వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. 'డియర్ ఫ్రెండ్స్.. 20 ఏళ్ల కిందట నా మొదటి సినిమా అయిన జయంతో సినీ ప్రయాణాన్ని ప్రారంభించాను. దీన్ని ఎలా వర్ణించాలో మాటలు కూడా రావడం లేదు. నాలోని నటుడిని గుర్తించి నాకు జయం సినిమాలో అవకాశం ఇచ్చిన తేజ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా సినీ ప్రయాణంలో నాకు అండగా నిలిచిన దర్శకులు, నిర్మాతలు, నటులు, సాంకేతిక నిపుణులు, వ్యక్తిగత సిబ్బంది.. ఇలా నాతో పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. చదవండి: కొడుకు ఫొటోను షేర్ చేసిన కాజల్.. ఈసారి ముఖం కనిపించేలా మీరు లేకపోతే నేను ఎక్కడ ఉండేవాడినో. ఈ అందమైన ప్రయాణంలో నాకు ఎంతోమంది అండగా నిలిచారు. కెరీర్లో కష్టాలు ఎదురైనప్పుడు ఎంతో సహకరించారు. ఇన్నేళ్లుగా అభిమానిస్తూ, నాపై నమ్మకాన్ని ఉంచి నా వెన్నంటే ఉంటూ వచ్చిన నా అభిమానులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.' అని ట్విటర్లో ఎమోషనల్గా పోస్ట్ చేశాడు నితిన్. ❤️❤️❤️ pic.twitter.com/WbhRMZMac3 — nithiin (@actor_nithiin) June 14, 2022 -
జాకీతో ప్రేమ.. అది నాకిష్టం లేదు: రకుల్ ప్రీత్ సింగ్
టాలీవుడ్లో అతికొద్ది సమయంలోనే స్టార్ హీరోయిన్గా పేరు తెచ్చుకుంది కూల్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ ఫిట్నెస్ బ్యూటీ ఇటీవల 'రన్ వే 24', జాన్ అబ్రహం అటాక్ చిత్రాలతో బాలీవుడ్ ప్రేక్షకుల్ని అలరించింది. 'రన్ వే 24' మూవీలో బిగ్బీ అమితాబ్ బచ్చన్, అజయ్ దేవగణ్ వంటి స్టార్స్తో కలిసి నటించింది. ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇంటర్వ్యూలో కెరీర్, ప్రేమపై పలు ఆసక్తికర విషయాలు తెలిపింది. ప్రతి ఒక్కరికీ వ్యక్తిగత జీవితం ఉంటుందని, అది చాలా సహజం అని చెప్పుకొచ్చింది. 'జాకీ భగ్నానీ నేను మంచి స్నేహితులం. మా అభిరుచులు కలవడంతో ప్రేమలో పడ్డాం. మా రిలేషన్షిప్ గురించి ఓకే అనుకున్నప్పుడే వీలైనంత త్వరగా ప్రపంచానికి తెలియజేయాలనుకున్నాం. ఎందుకంటే రిలేషన్ను బయటకు చెప్పకపోతే మా గురించే వచ్చే వార్తలు, పుకార్లతో ప్రశాంతంగా ఉండలేం. నిజానికి మా వ్యక్తిగత జీవితం గురించి కాదు, మేము చేసే వర్క్ గురించి అందరూ మాట్లాడుకోవాలి. ప్రతి ఒక్కరికీ పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఒక రిలేషన్షిప్లో ఉండటం చాలా సహజం. మన లైఫ్లో పేరెంట్స్, బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్ ఎలా ఉంటారో అలాగే మనకోసం ఒకరు ఉంటారు. సెలబ్రిటీలు కావడంతో మాపై అందరి దృష్టి ఎక్కువగానే ఉంటుంది. అది మాకిష్టం లేదు. అందుకే మేము బహిరంగంగా చెప్పేశాం.' అని రకుల్ తెలిపింది. చదవండి: ఆ మాటే నాకు నచ్చదు: రకుల్ ప్రీత్ సింగ్ వెబ్ సిరీస్గా మారిన అక్షయ్, రకుల్ చిత్రం.. -
సినిమా ఆఫర్లు రాకపోతే ఉద్యోగం చేసుకుంటా: హీరోయిన్
Nivetha Pethuraj Comments On Heroine Career: యంగ్ హీరో శ్రీ విష్ణు నటించిన 'మెంటల్ మదిలో' చిత్రంతో టాలీవుడ్కు ఎంట్రీ ఇచ్చింది నివేదా పేతురాజ్. తర్వాత బ్రోచేవారెవరురా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'అల వైకుంఠపురము' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. 'పాగల్' వంటి తదితర మూవీస్లో కీలక పాత్రల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. చేసింది తక్కువ సినిమాలే అయినా తెలుగు, తమిళ ఇండస్ట్రీల్లో నటిగా బాగానే క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల 'బ్లడీ మేరీ' చిత్రంతోనూ ఆకట్టుకుంది. నివేదాకు పర్ఫార్మెన్స్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. అయితే స్టార్ హీరోయిన్గా మాత్రం ఎదగలేకపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నివేదా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. హీరోయిన్ కన్నా నటిగా అనిపించుకోవడం గర్వంగా ఉంటుంది. కథానాయికగా సినిమాలు చేయకపోతే కెరీర్ ఉండదేమో అని చాలా మంది భయపడుతుంటారు. నాకు అలాంటి భయం లేదు. నేను ఎలాంటి బౌండరీస్ పెట్టుకోలేదు. నటనకు ఇంపార్టెన్స్ ఉంటే ఎలాంటి రోల్స్ అయినా చేస్తాను. ఒకవేళ సినిమా ఆఫర్లు రాకుంటే ఏదైనా ఉద్యోగం చేసుకుంటా. అని తెలిపింది నివేదా పేతురాజ్. ఆమె నటించిన 'విరాట పర్వం' సినిమా జూలై 1న విడుదల కానుంది. చదవండి: సినిమాల్లోకి రాకముందు నటి నివేదా ఏం చేసేదో తెలుసా? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4491455922.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అక్షయ్ కుమార్ సినీ కెరీర్కు 30 ఏళ్లు.. ఊహించని సర్ప్రైజ్ వైరల్
Akshay Kumar Completes 30 Years In Bollywood YRF Special Poster: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సినిమా కోసం ప్రాణం పెట్టి నటిస్తాడు. సన్నివేశం బాగా వచ్చేందుకు ఎలాంటి రియల్ స్టంట్స్ అయిన చేస్తాడు. అలా ఆయన చేసిన స్టంట్స్ ఎన్నో ఉన్నాయి. అందుకే ఆయన్ను యాక్షన్ హీరో అని ముద్దుగా పిలుచుకుంటుంది బీటౌన్. ఇటీవల 'సూర్యవంశీ', 'ఆత్రంగి రే', 'బచ్చన్ పాండే' చిత్రాలతో ప్రేక్షకులను, అభిమానులను అలరించాడు అక్కీ. తాజాగా ఈ యాక్షన్ హీరో హిందీ చిత్ర పరిశ్రమలో 30 వసంతాలు పూర్తి చేసుకున్నాడు. అక్షయ్ కుమార్ తొలి చిత్రం 'సౌగంధ్' 1991లో విడుదలైంది. ప్రస్తుతం పరాక్రమవంతుడు పృథ్వీరాజ్ చౌహన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న 'పృథ్వీరాజ్' సినిమా కోసం సిద్ధమవుతున్నాడు. ఈ మూవీని 'యశ్ రాజ్ ఫిలీంస్' బ్యానర్పై ఆదిత్య చోప్రా నిర్మించారు. డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే అక్షయ్ కుమార్ సినీ ఇండస్ట్రీలో 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యశ్ రాజ్ ఫిలీంస్ అక్షయ్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చింది. చదవండి: కశ్మీర్ ఫైల్స్ నా సినిమాను దెబ్బకొట్టింది: అక్షయ్ కుమార్ View this post on Instagram A post shared by Yash Raj Films (@yrf) అక్షయ్ కుమార్కు కానుకగా 'పృథ్వీరాజ్' సినిమా కొత్త పోస్టర్ను ఆవిష్కరించింది. ఈ పోస్టర్ను పృథ్వీరాజ్ పాత్రలో ఉన్న అక్షయ్ ఫొటోతో పాటు ఆయన కెరీర్లోని అన్ని చిత్రాలతో రూపొందించారు. ఈ కానుకకు అక్షయ్ వీడియో రూపంలో కృతజ్ఞతలు తెలిపాడు. ఇందులో 'నా సినీ ప్రయాణం ప్రారంభమై 30 ఏళ్లు గడిచింది అంటే నమ్మలేకపోతున్నాను. నా తొలి చిత్రం సౌగంధ్ 30 ఏళ్లు పూర్తి చేసుకోవడం చాలా మనోహరంగా ఉంది. నా సినీ కెరీర్లో మొదటి షాట్ ఊటీలో జరిగింది. అది కూడా యాక్షన్ షాట్. ఈ పోస్టర్కు ధన్యవాదాలు. ఇది నిజంగా నాకు చాలా ప్రత్యేకమైనది.' అని తెలిపాడు ఈ యాక్షన్ హీరో అక్కీ. ప్రస్తుతం ఈ సర్ప్రైజ్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. చదవండి: అక్షయ్ కుమార్ పాజిటివ్ మంత్ర.. సూర్యుడికి శుభాకాంక్షలు -
డబ్బున్నోళ్లంతా ఎందుకిలా చేస్తారు? ఈలాన్ మస్క్ ఆసక్తికర సమాధానం
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు తెచ్చుకోవడం, ఆ వెంటనే కోట్లాది మంది యూజర్లు ఉన్న ట్విటర్ను నాటకీయ పరిస్థితుల్లో ప్రైవేటు కంపెనీగా మార్చడం. బస్సుల్లో ఊరెళ్లి వచ్చినట్టు రాకెట్లలో అంతరిక్ష ప్రయాణానికి ప్రణాళికలు రూపొందించం వంటి పనుల్తో టాక్ ఆఫ్ ది వరల్డ్గా మారిపోయాడు ఈలాన్ మస్క్. దీంతో ఈలాన్ మస్క్ ఎదుగుదలపై రకరకాల కథనాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటికి ఎంతో ఓపిగ్గా బదులిచ్చాడు ఈలాన్ మస్క్. ధనవంతుల కుటుంబాలకు చెందిన పిల్లలు విచిత్రంగా చిత్రలేఖనం వంటి కళలకు స్కూల్స్కి వెళ్తుంటారు. చదువయ్యాక ఉద్యోగాలు చేయరు. వృధాగా గడిపేస్తుంటారు. ఇంత చేసినా ఒక్కోసారి ధనవంతుల కుటుంబాల నుంచి వచ్చే ఈలాన్ మస్క్ లాంటి వారయితే అనూహ్యమైన విజయాలను సాధిస్తుంటారు. ఇందుకు కారణం ఏంటి అంటూ నేరుగా ఈలాన్ మస్క్నే డోనా అనే టీనేజ్ ట్విటర్ యూజర్ ప్రశ్నించింది. కసి డోనా ప్రశ్నకు ఈలాన్ మస్క్ బదులిస్తూ.. డబ్బులేని వాళ్లతో పోల్చినప్పుడు అదున్నవాళ్ల దగ్గర ఏదైనా సాధించాలనే కసి (మోటివేషన్) తక్కువగా ఉంటుందంటూ చెప్పాడు. నేను మొదటి స్టార్టప్ అయిన జిప్2ను 1995లో ప్రారంభించేప్పుడు నా దగ్గర స్టూడెంట్లోనుగా తీసుకున్న వంద డాలర్లు, ఒక కంప్యూటర్ మాత్రమే ఉందంటూ బదులిచ్చాడు. అవన్నీ కట్టు కథలే ఈ సంభాషణలోకి వచ్చిన ఇండియన్ యూజర్ ప్రణయ్ పటోల్ మాట్లాడుతూ... ఈలాన్ మస్క్ పుట్టుకతోనే ధనవంతుడనే తప్పుడు ప్రచారం బాగా జరుగుతోంది. ఈలాన్ మస్క్ తండ్రికి ఎమరాల్డ్ మైన్స్ ఉండేవంటూ లేని పోని కథలు చక్కర్లు కొడుతున్నాయి... అసలు ఈలాన్ మస్క్ తన కెరీర్ తొలి రోజుల్లో ఎలా పైకి వచ్చాడో మీకు తెలియదంటూ చెప్పాడు. నైట్క్లబ్గా మారిన ఇళ్లు ప్రణయ్ పటోల్ ట్వీట్కి ఈలాన్ మస్క్ సమాధానం ఇస్తూ కెరీర్ తొలి రోజులను గుర్తు చేసుకున్నారు.. ‘ మేము నివసిస్తున్న ఇంటికి అద్దె చెల్లించే స్థోమత కూడా ఆ రోజుల్లో లేదు. దీంతో ఆ ఇంటి అద్దె చెల్లించే డబ్బుల కోసం, రాత్రి వేళ నేనుండే ఇంటిని నైట్ క్లబ్గా మార్చేవాడిని. ఎంట్రీకి 5 డాలర్లు వసూలు చేసేవాడిని’ అంటూ తన కెరీర్ తొలి రోజులను వివరించాడు ఈలాన్ మస్క్. సౌతాఫ్రికా నుంచి మొదలు దక్షిణాఫ్రికాలో పుట్టిన ఈలాన్ మస్క్ తన కలల ప్రపపంచాన్ని వెతుక్కుంటూ అమెరికాకి వలస వచ్చాడు. అక్కడ పెన్సిల్వేనియా యూనివర్సిటీ డిగ్రీ పట్టా పొందాడు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదివేందుకు కాలిఫోర్నియా చేరుకుని అక్కడే తన సోదరుడు కింబల్తో కలిసి 1995లో వెబ్ సాఫ్ట్వేర్ స్టార్టప్ జిప్2ని నెలకొల్పాడు ఈలాన్ మస్క్. ఈ జిప్2ని కాంపాక్ సంస్థ 307 మిలియన్ డాలర్లకు 1999లో కొనుగోలు చేసింది. అంచెలంచెలుగా జిప్2ను అమ్మగా వచ్చిన డబ్బుతో బ్యాంక్.ఎక్స్ స్టార్టప్లో సహా వ్యవస్థాపకుడిగా మారాడు. 2000లో బ్యాంక్.ఎక్స్ను కాన్ఫినిటీలో విలీనం చేసి.. ఆ తర్వాత పేపాల్ను స్థాపించాడు. ఈ కొత్త స్టార్టప్ పేపాల్ సూపర్ సక్సెస్ అయ్యింది. దీన్ని 1.5 బిలియన్ డాలర్లకు ఈబేకు కొనుగోలు చేసింది. పేపాల్ను అమ్మగా వచ్చిన సొమ్ముతో 2002లో స్పేస్ఎక్స్, 2004లో టెస్లాలో పెట్టుబడులు పెట్టి సహా వ్యవస్థాపకుడు అయ్యాడు ఈలాన్ మస్క్, ఆ తర్వాత తన అద్భుత వ్యూహ చతురతతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా రూపాంతరం చెందాడు. ఇటీవల 44 బిలియన్ డాలర్లతో ట్విటర్ను కొనుగోలు చేశాడు. If being born to a well-off family is why @ElonMusk succeeded extravagantly in life then explain to me why all these rich kids go to art school, never get a job, and waste away — 𝕯𝖆𝖓𝖆 🌞 🕵️♀️#ShadowCrew (@daelmor) May 3, 2022 చదవండి: నేనేం రోబోను కాదు.. నాకూ ఫీలింగ్స్ ఉన్నాయి: ఎలన్ మస్క్ -
Warren Buffett: మీకిదే నా సలహా..ఇలా చేస్తే జాబ్, మంచి ఫ్యూచర్ ఉంటుంది!
వారెన్ బఫెట్ పైనుంచి దిగిరాలేదు. గోల్డ్ స్పూన్ తో పుట్టలేదు. ఆయన వెనుక గాఢ్ ఫాదర్ ఎవరూ లేరు. కటిక పేదరికాన్ని చూశారు. ఆకలి కేకలు పెట్టారు. అన్నమో రామచంద్రా అని ఏడ్చారు. పేదరికంతో బాధపడ్డారు. అంతే. అంతవరకే పేదరికాన్ని తిడుతూ కూర్చోలేదు. అవకాశాల్ని వెతుక్కున్నారు. అవకాశాలు లేని చోట దాన్ని సృష్టించుకున్నారు. ఒక్కో క్షణాన్ని కరెన్సీ నోటుగా మార్చడం తెలుసుకున్నారు. ఇలా 91ఏళ్ల వయస్సులో 117 బిలియన్ల (రూ. 8.97 లక్షల కోట్లు) కంటే ఎక్కువ విలువైన బెర్క్షైర్ హాత్వేకి ఛైర్మన్, సీఈఓగా ఉన్న బఫెట్ అప్పుడప్పుడు యువతకు ఉపయోగపడేలా సలహాలు ఇస్తుంటారు. తాజాగా తన షేర్ హోల్డర్లకు లేఖ రాశారు. అందులో యువత జాబ్తో మంచి ఫ్యూచర్ ఎలా పొందవచ్చో తెలిపారు. కంపెనీ షేర్హోల్డర్లకు తన తాజా వార్షిక లేఖలో ..బఫెట్ తన సుదీర్ఘ కెరీర్లో పనిని ఆస్వాదించినట్లు చెప్పారు. ఇక ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులు పలు అంశాలను గుర్తుంచుకోవాలని చెప్పారు. డబ్బులు కోసం ఎప్పుడూ పని చేయకండి. మీరు చేసే పనిని ఎంజాయ్ చేయండి. అలా చేస్తే మీకు కావాల్సిన డబ్బులు వాటంతట అవే వస్తాయి. ఒకవేళ డబ్బులు ఎక్కువగా వస్తున్న జాబ్లో మీరు జాయిన్ అయితే.. డబ్బులు వస్తున్నాయి. కాబట్టి పనిని ఎంజాయ్ చేయలేరు. ఉన్న జాబ్ను కూడా సక్రమంగా చేయలేరు. అందుకే మంచి భవిష్యత్ కావాలంటే పనని ఎంజాయ్ చేయాలని సూచించారు. బఫెట్ ఏం చేశారు. బఫెట్ తన తాత ముంగెర్కు చెందిన కిరాణా దుకాణంలో పని చేయడం ప్రారంభించారు. అయితే బఫెట్కు ఆ పని నచ్చకపోవడంతో సెక్యూరిటీలను విక్రయించే వ్యాపారంలోకి అడుగుపెట్టారు. బఫెట్ తాత ముంగెర్ లాయర్ వృత్తిని ప్రారంభించారు. అలా 1965లో ఇద్దరూ కంపెనీ నిర్వహణ, ఆర్థిక విధానాలను నియంత్రించేలా బెర్క్షైర్ హాత్వే కంపెనీ కంట్రోల్ స్టేక్ను కొనుగోలు చేశారు. జనరల్ మోటార్స్, కోకా కోలా కంపెనీ,యాపిల్ వంటి మెగా కంపెనీలలో 700 బిలియన్లకు పైగా మార్కెట్ క్యాప్, హోల్డింగ్లతో ఆర్థిక దిగ్గజాలుగా ఎదిగారు. చదవండి: గేట్స్ ఫౌండేషన్కు బఫెట్ రాజీనామా -
కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు: కంగనా
బాలీవుడ్ డేరింగ్ హీరోయిన్, వివాదాల బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తూ కాంట్రవర్సీ క్వీన్గా రికార్డుకెక్కింది. ఏ అంశమైన తనదైన స్టైల్లో ఎలాంటి భయం లేకుండా విమర్శలను సంధిస్తుంటుంది. అయితే బీటౌన్ నటి, నిర్మాత ఏక్తా కపూర్ ఎంతో మంచి వ్యక్తి అని కంగనా అభిప్రాయపడింది. ఏక్తా కపూర్ నిర్మిస్తోన్న రియాల్టీ షో లాక్ అప్కి కంగనా హోస్ట్గా వ్యవహరిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవల జరిగిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఈ ఇంటర్వ్యూలో కంగనా 'ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అంతగా పరిచయాలు లేకపోవడంతో అందరూ నన్ను ఏడిపించేవారు. ఇంగ్లీష్ మాట్లాడటం రాదని, కొండ ప్రాంతాల నుంచి వచ్చానని అవమానించేవారు. ఇంకా కొందరైతే ఇండస్ట్రీ నీ లాంటి వారి కోసం కాదు, ఇక్కడి నుంచి వెళ్లిపో అని నా ముఖంపైనే చెప్పేవారు. కానీ, నా నిర్మాత ఏక్తా కపూర్ అలా అన్లేదు. నా కెరీర్ స్టాటింగ్ టైంలో ఆమెతో కలిసిపనిచేశాను. ఆమె చాలా మంచి వ్యక్తి. నాకు ఫస్ట్ హిట్ను ఇచ్చింది కూడా ఆమె. నాకు ఎప్పుడు మద్దతు ఇస్తూనే ఉన్నారు.' అని తెలిపింది. -
ఫ్రెషర్లకు కొలువుల పండగ!
న్యూఢిల్లీ: కాలేజీల నుంచి పట్టాలు పుచ్చుకుని కొలువుల కోసం చూస్తున్న ఫ్రెషర్లకు తీపికబురు. ఈ ఏడాది జనవరి–జూన్ మధ్య కాలంలో కంపెనీలు ఫ్రెషర్లను అధికంగా తీసుకోనున్నాయి. టీమ్లీజ్ ఎడ్యుటెక్ ‘కెరీర్ అవుట్లుక్ రిపోర్ట్’ ఈ వివరాలు వెల్లడించింది. క్రితం ఏడాది తొలి ఆరు నెలలతో పోలిస్తే ప్రస్తుత ఏడాది అర్ధ భాగంలో ఫ్రెషర్లను నియమించుకోవాలన్న ఉద్దేశం కంపెనీల్లో 30 శాతం ఎక్కువగా కనిపించినట్టు వివరించింది. 47 శాతానికి పైగా కంపెనీలు జూన్లోపు ఫ్రెషర్లను నియమించుకోనున్నట్టు తెలిపాయి. గతేడాది ఇది 17 శాతంగానే ఉన్నట్టు తెలిపింది. ‘‘కరోనా మహమ్మారి నేపథ్యంలో ఎన్నో సవాళ్లు నెలకొన్నప్పటికీ కంపెనీల్లో ఫ్రెషర్ల నియామకం పట్ల సానుకూలత పెరగడం సంతోషాన్నిస్తోంది’’ అని టీమ్లీజ్ ఎడ్టెక్ సీఈవో శంతనురూజ్ పేర్కొన్నారు. ఆర్థిక కార్యకలాపాలు ఊపందుకోవడం, వృద్ధిపై దృష్టి సారించడం ఈ సానుకూల ధోరణికి కారణాలుగా తెలిపారు. ఫ్రెషర్లతోపాటు అన్ని రకాల ఉద్యోగాలకు కలిపి చూస్తే నియామకాల ఉద్దేశం 50 శాతం పెరిగినట్టు ఈ నివేదిక తెలిపింది. ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో ఫ్రెషర్లకు ఐటీ, ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్లు, టెలికమ్యూనికేషన్స్ రంగాల్లో అధిక కొలువులు రానున్నట్టు పేర్కొంది. వీటికి అధిక డిమాండ్ ‘‘డేటా అనలైటిక్స్, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సైబర్ సెక్యూరిటీ, ఏఆర్/వీఆర్, కంటెంట్ రైటింగ్ ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ నెలకొంది. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, ఆర్టిíఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్, టెక్నికల్ రైటర్, ఫుల్ స్టాక్ డెవలపర్, సప్లయ్ చైన్ అనలిస్ట్ ఉద్యోగాలకూ డిమాండ్ ఉంటుంది. ఫ్రెషర్ల విషయానికొస్తే విశ్లేషణా సామర్థ్యాలు, ఇన్నోవేషన్, ఒత్తిడిని నియంత్రించుకోగలగడం, సమాచార నైపుణ్యాలు, భావోద్వేగాల నియంత్రణ, సానుకూల దృక్పథాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నాయి’’ అని టీమ్లీజ్ ఎడ్యుటెక్ ప్రెసిడెండ్, సహ వ్యవస్థాపకుడు నీతి శర్మ తెలిపారు. ఐటీలో 3.6 లక్షల కొలువులు ఐటీ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం మీద 3.6 లక్షల మంది ఫ్రెషర్లకు ఉపాధి కల్పిస్తుందని మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ ‘అన్ఎర్త్ ఇన్సైట్’ సంస్థ పేర్కొంది. డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికంలో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 22.3%గా ఉన్నట్టు తెలిపింది. సెప్టెంబర్ త్రైమాసికంలో 19.5% నుంచి పెరిగినట్టు పేర్కొంది. జనవరి–మార్చి త్రైమాసికంలో 24%కి పెరగొచ్చని.. వచ్చే ఏడాది (2022–23)లో ఇది 16–18%కి తగ్గుతుందని అంచనా వేసింది. -
టాలెంటెడ్ యంగ్ హీరో కెరియర్ అండ్ గ్రోత్ విశేషాలు
Happy Birthday Naga Shaurya: వరుస ఆఫర్లతో సక్సెస్పుల్గా కరియర్ను ట్రాక్లో నడిపిస్తున్న టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్కింగ్ టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య.'చందమామ కథలు' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి 'ఊహలు గుసగుసలాడే' అంటూ అమ్మాయిల గుండెల్లో గిలిగింతలు పెట్టాడు. క్యూట్ లుక్స్తో, లవర్ బాయ్లా ఛలో అంటూ సూపర్ హిట్ కొట్టేశాడు. ఇటీవల ఎయిట్ ప్యాక్ బాడీతో అదరగొట్టి ‘లక్ష్య’న్ని మిస్ చేసుకున్నాడు. ఇపుడిక వరుడు కావలెను అంటూ ఓటీటీలో సందడి చేస్తున్నాడు. జనవరి 22 నాగశౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ లవర్బాయ్ గురించిన విశేషాలపై ఓ లుక్కేద్దామా! మాంచి ఒడ్డూ పొడుగుతో అందమైన నవ్వుతో టాలీవుడ్లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నాగశౌర్య. తొలి సినిమాతో ఎట్రాక్ట్ చేసి వరుస అవకాశాలు అందిపుచ్చుకున్నాడు. 'కల్యాణ వైభోగమే' 'దిక్కులు చూడకు రామయ్యా' 'జ్యో అచ్యుతానంద' 'ఒక మనసు' చిత్రాతో ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ఆడియన్స్కి కూడా దగ్గరయ్యాడు. ఇక అక్కడినుంచి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస అవకాశాలను దక్కించుకున్నాడు. ముఖ్యంగా రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన 'ఛలో' తో సూపర్ హిట్ అందుకున్న నాగశౌర్య ఆ తరువాత దూకుడును మరింత పెంచాడు. నాగశౌర్య ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరులో జన్మించాడు. సినీరంగంలో ప్రవేశానికి ముందుగా టెన్నిస్ ఆడేవాడట. విజయవాడలో ఉంటున్న రోజులనుంచి సినిమాలలో నటించాలనేకోరిక పుట్టింది. అలా తన డ్రీమ్స్ సాకారం కోసం హైదరాబాదు షిప్ట్ అయ్యాడు. ఐదు సంవత్సరాలు నటనలో శిక్షణ కూడా తీసుకున్నాడు. ఇక సినిమాలు మన వల్ల కాదులే అనుకుంటున్న టైంలో అనూహ్యంగా 2011లో సినీ రంగంలోకి ఎంట్రీ దొరికింది. అవసరాల శ్రీనివాస్ నిర్మిస్తున్న ఊహలు గుసగుసలాడే మూవీలో లీడ్ రోల్ పోషించే అవకాశాన్ని దక్కించుకున్నాడు. కమర్షియల్గా సక్సెస్ను అందుకున్నాడు. తరువాత దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మీ రావే మా ఇంటికి, 2015లో జాదూగాడు, అబ్బాయితో అమ్మాయి మూవీల ద్వారా నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2016లో మెగా డాటర్ నీహారిక కొణిదెలకు జోడీగా ఒక మనసు, మాళవిక నాయర్ హీరోయిన్గా కళ్యాణ వైభోగమే సినిమాలతో ఆకట్టుకున్నాడు. ఇక ఆ తరువాత వరుడు కావలెను, 'లక్ష్య' సినిమాల్లో నటించాడు. కానీ ఛలో మూవీ అంతటి రేంజ్ హిట్ దక్కలేదు. వరుస ఆఫర్లు వస్తున్నా బ్లాక్ బ్టస్టర్ హిట్ కొట్టడంలో మాత్రం విఫలమవుతున్నాడు. అందుకే ప్రస్తుత ట్రెండ్కు తగ్గట్టే తన మూవీలను ఓటీటీ బాట పట్టించాడు. ముఖ్యంగా ఆర్చరీ నేపథ్యంలో తీసిన ‘లక్ష్య’ సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితం దక్కలేదు. కండలు తిరిగిన బాడీతో కసరత్తు చేసినా లక్ష్య టార్గెట్ రీచ్ కాలేదు. నాగశౌర్య, రీతూవర్మ జంటగా నటించిన వరుడు కావలెను, కేతికశర్మ హీరోయిన్గా నటించిన లక్ష్య మూవీలను ఓటీటీద్వారా విడుదల చేసితన అదృష్టాన్ని పరీక్షించు కుంటున్న సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు గత ఏడాది చివరలో రిలీజయ్యాయి. మరోవైపు నాగశౌర్య బర్త్ డే స్పెషల్గా అప్ కమింగ్ మూవీలపై ఇవ్వనున్న అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. -
సమంతపై రామ్ చరణ్ ఆసక్తికర కామెంట్.. మూడు ముక్కల్లో
టాలీవుడ్ బెస్ట్ కపుల్గా పేరొందిన సమంత-నాగ చైతన్యల విడాకుల విషయం ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట అసలు విడాకులు ఎందుకు తీసుకుందని ఇంకా చాలా మంది మదిలో మెదిలే ప్రశ్న. అయితే ఈ విషయంపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. వీరి మూడేళ్ల పెళ్లి బంధానికి ముగింపు పలుకుతూ అక్టోబర్ 2న తాము భార్యభర్తలుగా విడిపోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. అయితే అప్పటి నుంచి సమంతనే టార్గెట్ చేస్తూ కొందరు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో విడాకుల తర్వాత సమంత కెరీర్ క్లోజ్ అవుతుందని అందరు ఊహించారు. ఆ ఊహలను పటాపంచలు చేస్తూ రెట్టించిన ఉత్సాహంతో వేగంగా ముందుకు దూసుకుపోతోంది సామ్. హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలతో పాటు పుష్పలో స్పెషల్ సాంగ్తో సమంత కెరీర్ తారాజువ్వలా పైకిపోతుంది. ఈ క్రమంలో సమంత గురించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆసక్తిర వాఖ్యలు చేశాడు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ రాజమౌళిల భారీ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మీడియా సంస్థలకు వరుసబెట్టి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ సందర్బంగా సమంత గురించి చెప్పమని యాంకర్ రామ్ చరణ్ను ప్రశ్నించాడు. దానికి సమంత 'కమ్ బ్యాక్.. బిగ్గర్.. స్ట్రాంగర్..' అండూ మూడు ముక్కల్లో చెప్పాడు రామ్ చరణ్. అయితే ఈ మాటలు విన్న సామ్ తెగ సంతోషపడినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను మూడు లవ్ సింబల్స్తో ట్విటర్లో షేర్ చేసింది. ♥️♥️♥️ https://t.co/IqHN3aQ8Jw — Samantha (@Samanthaprabhu2) December 27, 2021 ఇదీ చదవండి: అల్లు అర్జున్ భార్యపై సమంత 'హాట్' కామెంట్స్ వైరల్ -
ఈ రంగంలో అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కొలువు మీ సొంతం
ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్.. అర్హతలుంటే కొలువులు ఖాయం చేస్తున్న రంగం. ఎంట్రీ లెవల్ మొదలు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల వరకూ.. చక్కటి ఆఫర్లు అందిస్తోంది. ఇటీవల ఈ రంగం టెక్నికల్ నుంచి స్పెషలైజ్డ్ జాబ్ ప్రొఫైల్స్ వరకూ.. భారీగా నియామకాలు చేపడుతోంది! ఉద్యోగార్థులు.. సంబంధిత అర్హతలు, నైపుణ్యాలు పెంచుకుంటే.. కోరుకున్న కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఫైనాన్షియల్ సేవల రంగంలో తాజా రిక్రూట్మెంట్ ట్రెండ్స్.. కొలువులు..అర్హతలు, నైపుణ్యాలపై ప్రత్యేక కథనం.. కరోనా పరిణామాల్లో అంతా డిజిటలైజేషన్ బాట పట్టారు. దాంతో ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో కార్యకలాపాలు విస్తృతమవుతున్నాయి. ఈ సెక్టార్ పరిధిలోకి వచ్చే ట్రేడింగ్, స్టాక్ మార్కెట్, బీఎఫ్ఎస్ఐ, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ.. ఇలా అన్నింటిలోనూ కార్యకలాపాలు తిరిగి వృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా ఫైనాన్షియల్ రంగంలో నియామకాలు ఊపందుకుంటున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకూ.. ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లోని సంస్థల్లో నమోదైన నూతన నియామకాల సంఖ్యే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. అందుకే కొలువులు గత కొంత కాలంగా అనేక సంస్థలు స్టాక్ మార్కెట్లో ఐపీఓల బాటపట్టాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు, ప్రయివేట్ ఈక్విటీ సంస్థలకు నిధులు భారీగా వస్తున్నాయి. ట్రేడింగ్ కార్యకలాపాలు ఊపందుకుంటున్నాయి. మరోవైపు సంస్థలు టెక్నాలజీ ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించడంపై దృష్టిపెడుతున్నాయి. బ్యాంకింగ్ రంగం సైతం విస్తరిస్తోంది. ఇవన్నీ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో నియామకాల జోరుకు కారణాలుగా చెబుతున్నారు. వీటన్నింటి ఫలితంగా సంప్రదాయ డిగ్రీ అభ్యర్థులు మొదలు టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సుల ఉత్తీర్ణుల వరకూ..ఫైనాన్షియల్ రంగంలో ఉద్యోగాలు లభిస్తున్నాయి. జూనియర్, మిడిల్ లెవల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్టార్లో.. జూనియర్, మిడిల్ లెవల్లో భారీగా నియామకాలు జరుగుతున్నాయి. కరోనా ముందుకాలం నాటి ఆఫర్స్తో పోల్చుకుంటే.. సగటున 30 నుంచి 50 శాతం మేర కొత్త కొలువులు లభించాయి. జూనియర్ లెవల్లో 1 నుంచి 4ఏళ్ల అనుభవం ఉన్న వారిని, మిడిల్ లెవల్లో అయిదు నుంచి 13ఏళ్ల అనుభవం ఉన్న వారిని సంస్థలు నియమించుకుంటున్నాయి. బీఎఫ్ఎస్ఐ.. ఎవర్గ్రీన్ ఫైనాన్షియల్ సెక్టార్ అనగానే గుర్తుకొచ్చే బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్(బీఎఫ్ఎస్ఐ) సెక్టార్లోని సంస్థలు.. రిక్రూట్మెంట్స్లో ఎవర్గ్రీన్గా నిలుస్తున్నాయి. 2020 సెప్టెంబర్తో పోలిస్తే.. 2021 సెప్టెంబర్ నాటికి బీఎఫ్ఎస్ఐ రంగంలో 43 శాతం అధికంగా నియామకాలు జరిగినట్లు నౌకరీ జాబ్స్ స్పీక్ ఇండెక్స్ గణాంకాలు తెలియజేస్తున్నాయి. టాలెంట్ కొరత ఫైనాన్స్ రంగంలో భారీగా నియామకాలు జరుగుతున్నప్పటికీ.. కంపెనీలకు అవసరమైన టాలెంట్ కొరత నెలకొన్నట్లు చెబుతున్నారు. నైపుణ్యాలున్న మానవ వనరులను గుర్తించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పలు కంపెనీలు, స్టాఫింగ్ సంస్థలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా స్టాక్ బ్రోకింగ్, వెల్త్ మేనేజ్మెంట్ సంస్థల్లో ఈ సమస్య కొంత ఎక్కువగా ఉంది. వేతనాలు ఆకర్షణీయం నైపుణ్యాలున్న వారికి ఫైనాన్షియల్ రంగ సంస్థలు ఆకర్షణీయ ప్యాకేజీలు అందిస్తున్నాయి. జూనియర్ లెవల్లో సగటున రూ.8లక్షలు, మిడిల్ లెవల్లో రూ.12లక్షలు, సీనియర్ లెవల్లో రూ.18లక్షల వార్షిక వేతనం లభిస్తోంది. ఫైనాన్షియల్ రంగం.. జాబ్ ట్రెండ్స్.. ముఖ్యాంశాలు ► ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ మధ్యలో భారీగా నియామకాలు. ► జూనియర్, మిడిల్ లెవల్లో 30 నుంచి 50 శాతం వరకూ పెరుగుదల. ► జూనియర్ లెవల్లో రూ.8 లక్షలు, మిడిల్ లెవల్లో రూ.12లక్షలు, సీనియర్ లెవల్లో సగటున రూ.18 లక్షల వరకు వేతనాలు. ► సైబర్ సెక్యూరిటీ, డేటాసైన్స్, ఏఐ–ఎంఎల్ నిపుణులకు డిమాండ్. రీసెర్చ్ అనలిస్ట్ ఫైనాన్షియల్ రంగంలో ముఖ్యంగా స్టాక్ బ్రోకింగ్, ఈక్విటీ, ట్రేడింగ్ సంస్థల్లో కీలకంగా నిలుస్తున్న జాబ్ ప్రొఫైల్.. రీసెర్చ్ అనలిస్ట్. ఆయా స్టాక్స్కు సంబంధించి రీసెర్చ్ చేసి ఫండ్ మేనేజర్లకు వాటి సానుకూలతలు, ప్రతికూలతల గురించి సూచించడం.. క్లయింట్ల కోసం ఈక్విటీ డెరివేటివ్స్, ఈక్విటీస్పై విశ్లేషణ వీరి ప్రధాన విధులు.ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్ బ్రోకరేజ్ సంస్థలు.. ఎంబీఏ, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్లో పీజీ ఉత్తీర్ణులను రీసెర్చ్ అనలిస్టులుగా నియమించుకుంటున్నాయి. ఫండ్ మేనేజర్ ఆయా ఫండ్స్లో ఇన్వెస్టర్ల డబ్బును పెట్టుబడిగా పెడుతుంటారు. అలాంటి సందర్భంలో సదరు సంస్థల ప్రస్తుత పనితీరు, ఆర్థిక ఫలితాలు, లాభనష్టాలు, డివిడెండ్స్.. భవిష్యత్లో ఆ సంస్థల పనితీరు ఎలా ఉండబోతోంది వంటి అంశాలను విశ్లేషించి.. ఇన్వెస్టర్లకు సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది. నిర్దిష్ట ఫండ్లలో పెట్టుబడుల గురించి ఇన్వెస్టర్లను ఒప్పించడం వంటి కీలక విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్ సంస్థలు.. ఎంబీఏ, సీఏ, ఫైనాన్షియల్ ప్లానింగ్, కామర్స్, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ విభాగంలో పీజీ స్థాయి అర్హతలు ఉన్న వారికి ఆఫర్స్ ఇస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ సెక్యూరిటీ పోర్ట్ఫోలియోస్లో ఇన్వెస్టర్ల తరఫున పెట్టుబడుల నిర్వహణ.. ఇన్వెస్ట్మెంట్ మేనేజర్ల ప్రధాన విధి. వీరు నిత్యం సెక్యూరిటీస్ క్రయ విక్రయాలు, పోర్ట్ఫోలియో సమీక్ష, లావాదేవీల పరిష్కారం, సంబంధిత స్టాక్స్, పనితీరు, నియంత్రణ,క్లయింట్ల(ఇన్వెస్టర్లు)కు నివేదించడం వంటివి చేయాల్సి ఉంటుంది. సంస్థలు కామర్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్తో బ్యాచిలర్, పీజీ ఉత్తీర్ణులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. టెక్ నిపుణులకు అవకాశం ఫైనాన్షియల్ రంగంలోని సంస్థలు.. ఇన్వెస్ట్మెంట్ అనాలసిస్లో బిగ్ డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ వంటి లేటెస్ట్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. ఫలితంగా బీటెక్, ఎంటెక్ తదితర కోర్సుల ఉత్తీర్ణులకు ఈ రంగంలో కొలువులు లభిస్తున్నాయి. యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్ పాలసీ మొత్తం, దాని ఆధారంగా చెల్లించాల్సిన ప్రీమియం, చెల్లించే సామర్థ్యం, వయసు తదితరాలు గణించి.. పాలసీకి అర్హతలు నిర్ణయించే వారే..యాక్చుయరీ ఎగ్జిక్యూటివ్స్. వీరికి బీమా సంస్థలు పెద్ద పీట వేస్తున్నాయి. ఇందుకు ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. యాక్చుయేరియల్ సొసైటీ నిర్వహించే కోర్సుల ఉత్తీర్ణులకు ఆఫర్స్ ఖరారు చేస్తున్నాయి. అండర్ రైటర్స్ ఇన్సూరెన్స్ సంస్థల్లో మరో కీలకమైన కొలువు..అండర్ రైటర్స్. ఎవరైనా ఒక వ్యక్తి పాలసీ తీసుకోవాలనే ప్రతిపాదన చేసినప్పుడు.. దాన్ని పరిశీలించి, సదరు పాలసీకి ఆ వ్యక్తి సరితూగుతారో లేదో నిర్ణయించడం వీరి ప్రధాన విధి. ప్రత్యేక అర్హతలున్న వారికే సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇన్సూరెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అందించే అసోసియేట్ డిప్లొమా ఉత్తీర్ణులకు బీమా సంస్థలు పెద్దపీట వేస్తున్నాయి. రిస్క్ అనలిస్ట్స్ నాన్–లైఫ్ ఇన్సూరెన్స్ విభాగంలో.. పాలసీ చేయాలనుకున్న వస్తువులు లేదా నిర్మాణాలను పరిశీలించి.. వాటి జీవిత కాలాన్ని పరిగణనలోకి తీసుకొని రిస్క్ అనలిస్ట్లు నివేదికలు ఇస్తారు. సదరు నివేదిక ఆధారంగానే సంస్థ ప్రీమియం మొత్తాన్ని నిర్ణయిస్తుంది. క్లెయిమ్స్ ఎగ్జిక్యూటివ్స్ పాలసీ క్లెయిమ్ల పరిష్కారంలో వీరి పాత్ర కీలకం. ముఖ్యంగా పాలసీ వ్యవధి పూర్తి కాకుండానే ఏదైనా సంఘటన జరిగిందని.. ఆ కారణంగా బీమా చెల్లించాలనే విషయంపై తుది నిర్ణయం వీరిచ్చే నివేదికపైనే ఆధారపడి ఉంటుంది. క్లెయిమ్ ఎగ్జిక్యూటివ్స్.. సదరు బీమా మొత్తం కోసం వచ్చిన ప్రతిపాదనను పరిశీలించి, డ్యామేజ్ విలువను లెక్కిస్తారు. ఆ మొత్తానికి బీమా పరిష్కారం లభిస్తుంది. బ్యాంకింగ్లో అవకాశాలు బ్యాంకింగ్ రంగంలో.. క్షేత్ర స్థాయిలో కస్టమర్లతో సంప్రదింపులు సాగించే కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ మొదలు ఉన్నత స్థాయిలో చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ వరకూ.. అనేక రకాల అవకాశాలు లభిస్తున్నాయి. బిజినెస్ బ్యాంకింగ్ మేనేజర్, కార్పొరేట్ బిజినెస్ సేల్స్ మేకర్, బ్రాంచ్ సర్వీస్ పార్ట్నర్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ఆఫీసర్, రిస్క్ ఎగ్జిక్యూటివ్స్, ఫైనాన్షియల్ ప్లానర్ వంటి ఉద్యోగాలు బ్యాంకింగ్ రంగంలో అందుకోవచ్చు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
కేఎల్ రాహుల్ను ఇంటికి పిలిచిన గోయెంక: అతియా శెట్టి పోస్ట్ వైరల్
ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!
వైఎస్సార్సీపీలో ఉన్నంత కాన్ఫిడెన్స్.. కూటమిలో లేదు!
మందు తాగినా లివర్ సేఫ్.. సరికొత్త జెల్ కనిపెట్టిన సైంటిస్టులు
అనంత్ - రాధిక ప్రీవెడ్డింగ్ బాష్ : 800 మందితో గ్రాండ్గా, ఎక్కడో తెలుసా?
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement