-
Summer Special: వేసవిని తట్టుకునేలా.. కంఫర్ట్ & స్టైలిష్గా లాంగ్ ఫ్రాక్స్
వేసవి వేడిమిని తట్టుకోవాలి, కంఫర్ట్గా ఉండాలి అదే టైమ్లో స్టైలిష్గానూ కనిపించాలి. కాటన్ కుర్తీ పైకి బాందినీ, చందేరీ, ఇకత్, సిల్క్ ఓవర్ కోట్లు ఇప్పుడు బెస్ట్ ఛాయిస్గా ఉంటున్నాయి. బోహోస్టైల్ని తలపిస్తూ, సమ్మర్ స్పెషల్గా ఉండే ఈ స్టైల్ ఏ సందర్భానికైనా బాగా నప్పుతుంది.కలర్ఫుల్గా.. కంఫర్టబుల్గా..సంప్రదాయ వేడుకల్లో షిమ్మరీ లుక్ ఉండే లాంగ్ ఫ్రాక్ట్, వాటి మీదకు సిల్క్ డిజైనర్ లాంగ్ ఓవర్ కోట్స్ ప్రత్యేకతను చూపుతాయి.లాంగ్ ఫ్రాక్ లేదా లాంగ్ కుర్తీ ఈ స్టైల్కి ఎంచుకోవచ్చు. సౌకర్యాన్ని బట్టి స్లీవ్స్ లేదా స్లీవ్లెస్ టాప్స్ని సెలక్ట్ చేసుకోవాలి. కాటన్ కుర్తీ ఏ ఫ్యాబ్రిక్ అయినా ఫ్లోరల్స్లో లేదా భిన్నమైన ప్రింట్లు ఉన్న ఓవర్ కోట్స్ బాగా నప్పుతాయి. ఈ స్టైల్ డ్రెస్సింVŠ బోహో లుక్తో అట్రాక్ట్ చేస్తుంది. ఈ కాలానికి తగినట్టుగా ఫ్యాషన్ జ్యువెలరీ దీనికి సరైన ఎంపిక అవుతుంది.కాటన్ కుర్తీ–పైజామా మీదకు ఫ్లోరల్ ప్రింట్ ఉన్న కాటన్ ఓవర్కోట్ను ధరించవచ్చు. దుపట్టా అవసరం లేని ఈ స్టైల్ క్యాజువల్ వేర్గానూ, పార్టీవేర్గానూ సెట్ అవుతుంది.కాటన్ లాంగ్ కుర్తీకి ఇక్కత్ లాంగ్ ఓవర్ కోట్ ధరిస్తే ఉక్కబోతను, స్టైల్ని రెండింటినీ బ్యాలెన్స్ చేయవచ్చు.సింపుల్ అండ్ గ్రేస్గా కనిపించే లుక్ టాప్ అండ్ బాటమ్కి ఫ్లోరల్ ఓవర్ లాంగ్ కోట్ సూపర్ స్టైలిష్ లుక్గా కనిపిస్తుంది. ప్లెయిన్ డ్రెస్ ధరించినప్పుడు పూర్తి కాంట్రాస్ట్ ఓవర్ కోట్ వేసుకుంటే ఎక్కడ ఉన్నా స్పెషల్గా కనిపిస్తారు.లాంగ్ ఫ్రాక్కి అటాచ్ చేసినట్టుగా ఉండే ఫ్రాక్ స్టైల్ ఓవర్ కోట్ పార్టీలో స్టైలిష్ లుక్తో వెలిగిపోతుంది.ఓవర్కోట్లా అనిపించే లాంగ్ ఫ్రాక్ డ్రెస్ను కూడా ఈ స్టైల్కి ఎంపిక చేసుకోవచ్చు. సమ్మర్లో ఈవెనింగ్ పార్టీకి స్పెషల్ అట్రాక్షన్గా వెలిగి΄ోవచ్చు.సిల్క్ టాప్స్ అయినా ఈవెనింగ్ టైమ్కి ఓకే అనుకున్నవారు అదే కాంబినేషన్లో వచ్చే సిల్క్ ఓవర్ కోట్ ప్రత్యేకంగా కనిపిస్తుంది.ఇదీ చదవండి: Madhumita Murgia: డీప్ఫేక్ గుట్టు ఆమెకు తెలుసు! -
ఫ్యాషన్ ప్రపంచంలో ఆమె స్టయిలే వేరు; రూ. 50వేలనుంచి 35కోట్ల దాకా
పురుషులతో తామేమీ తక్కువ కాదంటూ చిన్నవయసులో మహిళా పారిశ్రామికవేత్తలుగా పలువురు యువతులు ముందుకు వస్తున్నారు. తమ అభిరుచికి తగ్గట్టు, ఆధునిక శైలిని అవగాహన చేసుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్న వారు చాలామందే ఉన్నారు. అలాంటి వారిలో దుస్తుల బ్రాండ్తో కోట్లు సంపాదిస్తున్న పరి పూనమ్ చౌదరి ఒకరు. ఆమె సక్సెస్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం! ఫ్యాషన్ పరిశ్రమ ఎప్పుడూ డైనమిక్గా ఉండాలి. వినియోగదారుల ప్రాధాన్యతలే మార్కెట్కు ప్రాణం. యుక్తవయసులో ఉన్నప్పటినుంచి పరికి మహిళలను ఆకట్టుకునే ఫ్యాషన్, అందమైన దుస్తులను తయారు చేయడం అంటే ఇష్టం. 13 ఏళ్లకు సొంతంగా తనకుంటూ ఒక బ్రాండ్ఉండాలనే ఆలోచన మొదలైంది. ఆ పట్టుదలే 23 ఏళ్లకే దేశంలోనే అత్యంత ప్రియమైన దుస్తుల బ్రాండ్ బునాయ్కు నాంది పలికింది. సొంత వ్యాపారాన్ని ప్రారంభించి, అన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ రాణిస్తోంది. బునాయ్ ఏర్పాటు, సక్సెస్ సుమారు 5-6 సంవత్సరాలు ఇతర సంస్థలకు పనిచేసినఅనుభవంతో 2016లో పరి చౌదరి కేవలం ముగ్గురితో కలిసి బునాయ్ని లాంచ్ చేసింది. అప్పటినుంచి ఆ టీమ్ అలా పెరుగుతూ వందలాదిమందికి చేరింది. కేవలం 50 వేల పెట్టుబడితో కుర్తా సెట్లు, లెహంగాలు లాంటివాటితో వ్యాపారాన్ని మొదలు పెట్టింది. రాజస్థానీ, జైపూర్, డిజైన్స్, చందేరి నుండి ఎంబ్రాయిడరీ దాకా వివిధ రకాల ఫ్యాబ్రిక్లను అందిస్తూ, బునాయ్ నైట్వేర్, ఇతర యాక్సెసరీస్, జ్యెయల్లరీని జోడించింది. హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్, హ్యాండ్-డైడ్, హ్యాండ్పెయింటెడ్, ఆకర్షణీయంగా అందమైన డిజైన్లు, సిగ్నేచర్ స్టైల్ కలర్స్, కాటన్ ఫ్యాబ్రిక్ ఇలాంటి వాటికే ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఆదరణ పొందింది. ఆధునిక శైలి, సంప్రదాయకళను మిళితం చేస్తూ స్టైలిష్ ఫ్యాషన్ ప్రపంచంలో బునాయ్ను పరుగులు పెట్టిస్తోంది. అంతేనా క్లాసిక్ బట్టల నుండి హెయిర్, స్టైలిష్ హోమ్ డెకార్ దాకా మంచి నాణ్యత ,స్టైల్ని ఇష్టపడే ప్రతి ఒక్కరికీ ‘బునాయ్’ వినపడేలా చేసింది. 2021లో 12 కోట్టుగా ఉన్న బునాయ్ ఆదాయం కాస్త 2022లో 35 కోట్లకు పెరిగిందంటేనే ఈ బ్రాండ్కు లభించిన ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఇండోర్, జైపూర్లో రెండు స్టోర్లను కూడా ప్రారంభించారుబునాయ్ 800 విభిన్న ఉత్పత్తులతో దాదాపు 90K కస్టమర్ల బేస్తో రాణిస్తోంది. సోనాక్షి సిన్హా, భూమి పెడ్నేకర్, శివలీకా ఒబెరాయ్, రిధి డోగ్రా, దివ్యాంక త్రిపాఠి లాంటి ప్రముఖులు బునాయ్ స్టైల్స్ ఫ్యాన్స్. అంతేకాదు అనేక బెస్ట్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్ , బిజినెస్ అవార్డులను కూడా సొంతం చేసుకుంది పరి చైదరి. స్థానిక కళాకారులచేత,రాజస్థానీ సంస్కృతి మూలాలతో ముడిపడి ఉన్న ప్రాంతాల ద్వారా ఉత్తమంగా తయారు చేస్తాం. అన్నీ ఉత్పత్తులు ప్రేమతో చేతితో తయారు చేసినవే. మెటీరియల్ నాణ్యతలో కూడా రాజీలేదు. ఫెయిర్ట్రేడ్, హెరిటేజ్, మేడ్ ఇన్ ఇండియా,సుస్థిరత ,మహిళా సాధికారత ఇవే తమ కంపెనీ బలం - పరి పూనం చౌదరి పరి చౌదరి విద్య పరి జైపూర్లోని నీర్జా మోడీ స్కూల్లో తన పాఠశాల విద్యను, ఆ తరువాత, IIS విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీని పొందింది. ఫ్యాషన్/అప్పరల్ డిజైన్ చ విజువల్ ఆర్ట్స్ & స్టిల్ ఫోటోగ్రఫీలో నైపుణ్యం సాధించింది. 2019లో ఉన్నత చదువుల కోసం యూనివర్శిటీ ఆఫ్ ఆర్ట్స్ లండన్కు వెళ్లింది. ఇక్కడే ఈమె వ్యాపార ఆలోచనలకు మరింత పదును ఏర్పడింది. లగ్జరీ బ్రాండ్లకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ, ఫ్యాషన్ మీడియా స్టైలింగ్ , ఫ్యాషన్ కొనుగోలు మరియు అమ్మకాలపై దృష్టి సారించింది. బునాయ్ ప్రారంభించే ముందు దాదాపు 3 సంవత్సరాలు అర్బన్ విమెన్ కంపెనీలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్గా పనిచేసింది. ఫ్యాషన్ ప్రపంచంలో తన అనుభవం ఇతరులకు ఉపయోగపడాలని, ప్రతిభ , వాస్తవికత మధ్య అంతరాన్ని తగ్గించడంలో సహాయపడాలని కోరుకుంటోంది. -
రిపబ్లిక్ డే స్పెషల్.. 'మూడు రంగుల ముస్తాబు'
దేశీయ స్ఫూర్తి కోసం ఈ రోజు ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు తిరంగా రంగులను ట్రై చేయచ్చు. అయితే ఆరెంజ్, తెలుపు, పచ్చ మూడు రంగులను ఒకే డ్రెస్లో ఉండాలనుకునేవారు కొందరైతే, ఒకే కలర్ కాన్సెప్ట్తో స్పెషల్గా వెలిగిపోవాలనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాగని, గాఢీగా కాకుండా లేత రంగుల ప్రత్యేకతతోనూ మెరిసిపోవాలనుకుంటారు. అభిరుచికి తగినట్టుగా డ్రెస్ను ఎంపిక చేసుకునే స్పెషల్ డే కి స్పెషల్ లుక్. యాక్ససరీస్.. ► ఔట్ఫిట్స్లో ట్రై కలర్స్కి నో చెప్పేవాళ్లు ఇతర అలంకరణలో ప్రత్యేకతను చూపవచ్చు. అందుకు ట్రై కలర్ గాజులు, బ్రేస్లెట్స్ మంచి ఎంపిక అవుతుంది. ట్రై కలర్స్లో నెయిల్పాలిష్ డిజైన్నూ ఎంచుకోవచ్చు. ► వైట్ కుర్తా మీదకు ట్రై కలర్ దుపట్టా ఒక మంచి ఎంపిక అవుతుంది. ప్రత్యేకంగానూ ఉంటుంది. ► పూర్తి వైట్ గాగ్రా చోళీ లేదా మూడు రంగుల కలబోతగా మిక్స్ అండ్ మ్యాచ్ చేయచ్చు. ► ఆరెంజ్ కలర్ శారీ, వైట్ కలర్ బ్లౌజ్ లేదా సేమ్ ఆల్ ఓవర్ ఒకే కలర్ని ఎంచుకోవచ్చు. ► జీన్స్ మీదకు గ్రీన్ కలర్ కుర్తా లేదా లాంగ్ ఓవర్ కోట్, ట్రై కలర్ జాకెట్ ధరించినా చాలు. ప్రఖ్యాత డిజైనర్స్ సైతం తమ డిజైన్స్లో తెలుపు, పచ్చ, ఆరెంజ్ల ఒకే కలర్ కాన్సెప్ట్తో డిజైన్ చేస్తుంటారు. సందర్భాన్ని బట్టి మిక్స్ అండ్ మ్యాచ్ కాంబినేషన్ ఔట్ఫిట్ను మనమే సొంతంగా రీ డిజైన్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: జనవరి 26నే 'రిపబ్లిక్ డే' ఎందుకో తెలుసా! -
ఫ్యాషన్ ట్రెండ్స్: పాత బట్టలను కొత్తగా మార్చేయొచ్చు..
కొత్తగా మెరిసిపోవాలంటే కొత్త డ్రెస్సులు వేసుకోవాల్సిందేనా! ట్రెండ్కు తగినట్టు ఉండాలంటే మార్కెట్లో రెడీమేడ్గా ఉండే వాటిని కొనుగోలు చేయాల్సిందేనా! ఈ మాటలకు కాలం చెల్లిపోయేలా వినూత్నంగా ఆలోచన చేస్తున్నారు నేటి మహిళలు. పర్యావరణ అనుకూలంగా ఫ్యాషన్లోనూ మార్పులు చేసుకుంటున్నారు. అప్సైక్లింగ్ పేరుతో పాత డ్రెస్సులను, చీరలను కొత్తగా అప్డేట్ చేస్తున్నారు. ఈ యేడాది వచ్చిన ఈ మార్పు రాబోయే రోజులను మరింత పర్యావరణ హితంగా మార్చేయనున్నారు అనేది ఫ్యాషన్ డిజైనర్ల మాట. పాత వాటిని కొత్తగా మెరిపించడంలో ఖర్చు కూడా తగ్గుతుంది. పర్యావరణంపై కార్బన్ ఉద్గారాల ప్రభావమూ తగ్గుతుంది. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ మన దగ్గర ఉన్న డ్రెస్సులనే కొత్తగా మార్చేయవచ్చు. చిన్నపాటి సృజనతో డ్రెస్సింగ్లో మెరుగైన మార్పులు తీసుకురావచ్చు. డెనిమ్.. ప్యాచ్ పాతవి అనే పేరే గానీ చాలామంది ఇళ్లలో పక్కన పెట్టేసిన డెనిమ్ జాకెట్స్, ప్యాంట్స్, కుర్తాలు.. ఉంటాయి. వాటిని తిరిగి ఉపయోగించుకోవాలంటే రకరకాల మోడల్స్ని తయారు చేసుకోవచ్చు. ప్యాచ్వర్క్తో రీ డిజైనింగ్ చేసి ఓవర్కోట్స్ లేదా హ్యాండ్ బ్యాగ్స్ డిజైన్ చేసుకోవచ్చు. శారీ ఖఫ్తాన్ కుర్తాల మీదకు సిల్క్ ష్రగ్స్ లేదా లాంగ్ ఓవర్ కోట్స్ వాడటం ఇండోవెస్ట్రన్ స్టైల్. పాత సిల్క్ లేదా కాటన్ చీరలను కూడా లాంగ్ కోట్స్కి ఉపయోగించ వచ్చు. అలాగే, ఖఫ్తాన్ డిజైన్స్కి కూడా శారీస్ను వాడచ్చు. పర్యావరణ అనుకూలం ఆర్గానిక్ కాటన్స్, వీగన్ క్లాత్స్.. స్లో ఫ్యాషన్ కిందకు వస్తాయి. వీటితో చేసే డిజైన్స్లో ప్రత్యేకంగా మెరిసిపోవడమే కాదు పర్యావరణ ప్రేమికులుగా అందరి దృష్టిని ఆకర్షిస్తారు. మన దగ్గర ఉన్న పాత బట్టలను ఎలా తీసేయాలా అనుకునేవారు కొందరు, అవసరమైన వారికి తక్కువ ధరకు అమ్ముదాం అనుకునేవారు మరికొందరు ఉంటారు. అలాంటివాళ్లకోసం కొన్ని వెబ్స్టోర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ స్టోర్స్ అమ్మకందారుల దగ్గర నుంచి దుస్తులు సేకరించి కావల్సిన వారికి అందజేసే మాధ్యమంగా పనిచేస్తున్నాయి. -
పార్లమెంట్ అలజడి కేసులో వెలుగులోకి కీలక అంశాలు
జైపూర్: పార్లమెంట్లో అలజడి సృష్టించిన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. నిందితుల ఫోన్లను దహనం చేసిన స్థలాన్ని పోలీసులు గుర్తించారు. అక్కడ కాలిపోయి శిథిలావస్థలో ఉన్న సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బట్టలు కాల్చి వేసిన ప్రదేశాన్ని కూడా పోలీసులు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా నిందితులను తీసుకువెళ్లి విచారణ చేపట్టారు. Parliament security breach: Police recover burnt phone parts of accused in Rajasthan Read @ANI Story | https://t.co/Jpwc9HIqR6#ParliamentSecurityBreach #Parliament #LokSabha #RajyaSabha pic.twitter.com/OkVJKYfMM7 — ANI Digital (@ani_digital) December 17, 2023 పార్లమెంట్లో మొత్తం ఏడుగురు నిందితులు గందరగోళం సృష్టించిన విషయం తెలిసిందే. లోక్సభ లోపల, పార్లమెంట్ ఆవరణలో పొగ బాంబులతో నిందితులు అరాచకం సృష్టించే పనిచేశారు. ఒంటికి మండే లేపనాలు పూసుకుని ఆత్మాహుతికి పాల్పడటానికి ప్రయత్నించారు. కానీ చివరికి స్మోక్ క్యానిస్టర్లను ప్రయోగించాలని నిర్ణయానికి వచ్చారు. సాగర్ శర్మ, డి.మనోరంజన్, అమోల్ షిండే, నీలం దేవి, ప్రధాన నిందితుడు లలిత్ ఝాలను పోలీసు ప్రత్యేక విభాగం తాలూకు కౌంటర్ ఇంటలిజెన్స్ విభాగం విచారిస్తోంది. నిందితులకు ఏడు రోజుల కస్టడీ విధించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా వారు ఆశ్రయం పొందిన, కుట్ర పన్నిన ప్రాంతాలకు శుక్రవారం రాత్రి వారిని తీసుకెళ్లారు. అలాగే నిందితులకు లోక్సభ పాస్లు సిఫార్సు చేసిన బీజేపీ ఎంపీ ప్రతాప్ సింహా స్టేట్మెంట్ను కూడా నమోదు చేయాలని భావిస్తున్నారు. లోక్సభలో కలకలం జరిగిన తీరుపై పార్లమెంటు అనుమతితో సీన్ రీ కన్స్ట్రక్ట్ చేసే ఆలోచన కూడా ఉన్నట్టు సమాచారం. లలిత్కు సహకరించిన మహేశ్ కుమావత్, కైలాశ్లకు క్లీన్చిట్ ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. లలిత్ను బుధవారం పార్లమెంటు ప్రాంగణం నుంచి పారిపోయి అతను రాజస్థాన్లో తలదాచుకున్న నగౌర్కు కూడా తీసుకెళ్లారు. అక్కడ తనతోపాటు సన్నిహితుల సెల్ ఫోన్లను ధ్వంసం చేశానని లలిత్ చెప్పిన ప్రదేశంలో ఆధారాలు సేకరించారు. తమ డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసేందుకు దేశంలో అరాచకం సృష్టించాలని భావించినట్లు కీలక సూత్రధారి లలిత్ ఝా కస్టడీ విచారణ సందర్భంగా ఢిల్లీ పోలీసులకు తెలిపాడు. లలిత్ ఝా తన ఫోన్ను ఢిల్లీ-జైపూర్ సరిహద్దులో విసిరివేసినట్లు అంగీకరించాడు. ఈ కుట్ర ప్రణాళికను అమలు చేయడానికి ముందు ఢిల్లీలో అనేకమార్లు కలిసినట్లు లలిత్ ఝా చెప్పాడు. ఇతర నిందితుల ఫోన్లను ధ్వంసం చేసినట్లు వెల్లడించాడు. ఇదీ చదవండి: రాజస్థాన్ బీజేపీ కొత్త చీఫ్గా కైలాష్ చౌదరి -
క్యాన్సర్ రోగులకు ఉపయోగపడే సౌకర్యాల వేర్!
సాధారణంగా రిటైర్మెంట్కు దగ్గర్లో ఉన్న వారెవరైనా... ‘ఇన్నాళ్లూ పనిచేసి అలసిపోయాం, ఇక విశ్రాంతి తీసుకుందాం’ అనుకుంటారు. అయితే సుకన్య, సంధ్యారావులు మాత్రం ఇలా అనుకోలేదు. రిటైర్మెంట్ తరువాత కొత్త వ్యాపారం చేయాలనుకున్నారు. అరవై ఏళ్లకు దగ్గరలో ఉన్నా వారిలోని హుషారు, ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు. అక్క సుకన్య ఎమ్మెస్సీ చేసింది. దానికితోడు టీచింగ్, ఫార్మా, ఆడిటింగ్, ఆర్ట్స్ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఉంది. టెక్స్టైల్ టెక్నాలజీ ఇంజినీర్ జాతీయ అంతర్జాతీయ బ్రాండ్స్లో పనిచేసిన అనుభవం వాటికి తోడైంది. అయితే అనుకోకుండా ఎదురైన ఒక సంఘటన వల్ల వారు క్యాన్సర్ రోగులకు ముఖ్యంగా స్త్రీలకు అవసరం అయిన ప్రత్యేక తరహా దుస్తులను రూపొందిస్తూ తమ వైవిధ్యాన్ని కూడా చాటుకుంటున్నారు. అత్తయ్య అవస్తలు చూసి... దుస్తుల పరిశ్రమలో ఇరవై ఏళ్లపాటు పనిచేసిన సంధ్య తనకు తనే బాస్ కావాలి అనుకునేది. ఈ క్రమంలోనే ఏదైనా దుస్తుల తయారీ కంపెనీ పెడితే బాగుంటుందని అనుకున్నారు అక్కాచెల్లెళ్లు. వీరు ఇలా ఆలోచిస్తున్న సమయంలో... వీరిద్దరికీ ఎంతో ఇష్టమైన వీరి మేనత్తకు రొమ్ము క్యాన్సర్ ఉన్నట్లు తెలిసింది. సుకన్య, సంధ్యలకు మంచి స్నేహితురాలిలా ఉండే మేనత్త క్యాన్సర్తో బాధపడడం వారిని కలచి వేసింది. ఒకపక్క క్యాన్సర్ బాధిస్తుంటే మరోపక్క ఆమె ధరించే దుస్తులు ఆమెకు సౌకర్యంగా లేకపోవడాన్ని ఇద్దరూ గమనించారు. క్యాన్సర్తో బాధపడే ఎంతోమంది రోగులు కూడా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. క్యాన్సర్ రోగులు ధరించడానికి వీలుగా ఉండే దుస్తులు రూపొందిస్తే వందలాది మంది క్యాన్సర్ రోగులకు సాయం చేసినట్లే అనుకుని ‘వీకీ వేర్’ పేరిట క్యాన్సర్ రోగులకు దుస్తులు తయారు చేయడం ప్రారంభించారు. సలహాలు... సూచనలతో... ఆంకాలజిస్టులు, క్యాన్సర్ రోగుల సలహాలు, సూచనలు తీసుకుని 2017లో తలకు పెట్టుకునే టోపీని రూపొదించారు. కాటన్తో తయారు చేసిన ఈ టోపీని కీమోథెరపీ చేయించుకునేటప్పుడు ధరించడానికి అనుకూలంగా తయారు చేశారు. తరువాత మాస్టెక్టమీ బ్రాలను రూపొందించారు. చర్మానికి సౌకర్యంగా ఉండే బ్రాలను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలా క్యాన్సర్ రోగులకు అవసరమైన వాటిని స్వయం సహాయక గ్రూపులతో తయారు చేయిస్తూ సాటి మహిళ లకు ఉపాధి కల్పిస్తున్నారు. వీరి వీకీ వేర్ ఉత్పత్తులు ఇతర దేశాలకు కూడా ఎగుమతి అవుతున్నాయి. రోగులకు ఇలా... వీకీ వేర్ ఉత్పత్తులు తయారయ్యాక క్యాన్సర్ రోగులకు టెస్టింగ్ కోసం పంపించి, వారికి అన్నివిధాల సౌకర్యంగా ఉన్నాయన్న నిర్ధారణ అయిన తరువాత మార్కెట్లో విక్రయిస్తున్నారు. క్యాన్సర్ కేర్ ఆసుపత్రుల్లోని డాక్టర్లను కలిసి వీకీ వేర్ గురించి చెప్పడం, క్యాన్సర్తో ధైర్యంగా పోరాడుతున్న రోగులకు వాటిని ఇవ్వడం ద్వారా వీకీ వేర్ రోగులకు చేరుతున్నాయి. వీకీ వేర్ వెబ్సైట్, సోషల్ మీడియా, ఈ కామర్స్ సైట్ల ద్వారా ఉత్పత్తులు విక్రయిస్తున్నారు సుకన్య, సంధ్యారావులు. ‘‘మీ కలలను ఎప్పటికీ వదులుకోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీరు కంటోన్న కల మీద నమ్మకం ఉంచండి. అది తీరడానికి సుదీర్ఘ కాలం పట్టవచ్చు. అయినా వెనక్కి తగ్గవద్దు. కలను నిజం చేసుకునే క్రమంలో ఎవరినైనా సాయం అడగడానికి సిగ్గుపడవద్దు. ఇలా నిజాయితీగా ముందుకు సాగితే వ్యాపారం ఏదైనా రాణించగలుగుతారు’’ అని సుకన్య, సంధ్యలు యువతరానికి ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. (చదవండి: పడుకునే ముందు ముఖం కడుగుతున్నారా? ) -
గడ్డిదారంతో దుస్తులు.. పట్టుపురుగులొద్దు, పత్తి వద్దు. పాలిస్టర్ వద్దు
‘పట్టు కోసం పట్టుపురుగుల ్రపాణాలు తీయవద్దు. పత్తి కోసం రైతులు కష్టాలను కొని తెచ్చుకోవద్దు. మట్టిలో కలవడానికి మొరాయిస్తుంది పాలియెస్టర్. ఆ దుస్తులతో పర్యావరణానికి హాని కలిగించద్దు.గడ్డి దారంతో ఫ్యాషన్లో కొత్త ట్రెండ్ తీసుకువద్దాం.స్టైల్ స్టేట్మెంట్కి కొత్త నిర్వచనం ఇద్దాం’... ...అంటోంది నేచర్ లవర్ శృతి రావల్. హైదరాబాద్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన శృతి అంతర్జాతీయ సదస్సులో తన పరిశోధన పత్రాన్ని సమర్పించింది. పర్యావరణ పరిరక్షణ పట్ల సమాజాన్ని చైతన్యవంతం చేయాలనే తన సంకల్పానికి వస్త్ర ప్రపంచాన్ని వేదికగా మార్చుకుందామె. ఎకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ పట్ల తన ఆసక్తిని సాక్షితో పంచుకున్నదీ యువతి. ఫ్యాషన్ – పర్యావరణం ‘‘నేను పుట్టింది హరియాణాలోని పంచకుల. అమ్మ పుట్టిల్లు పంజాబ్. నాన్నది హరియాణా. నాన్న ఉద్యోగరీత్యా హైదరాబాద్ వచ్చేటప్పటికి నేను సిక్తŠస్ క్లాస్లో ఉన్నాను. ఇక నా చదువు, కెరీర్ అంతా హైదరాబాద్తోనే ముడివడిపోయింది. ఫ్యాషన్ ప్రపంచాన్ని బాగా అధ్యయనం చేసే కొద్దీ ఈ ఇండస్ట్రీ నుంచి పర్యావరణానికి కలిగే హాని అర్థమైంది. చాలా ఆందోళన కలిగింది. మన వస్త్రాల మోజు భూమిని అతలాకుతలం చేస్తోంది. భూమాతను కలుషితం చేస్తున్న ఇండస్ట్రీలలో ఫ్యాషన్ ఇండస్ట్రీ రెండవది. దీనికి పరిష్కారం ఈ రంగంలోనే వెతకాలనిపించింది. పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాన్ని చూపించాలనేదే నా ప్రయత్నం. నా స్టూడియోకి ‘ఎవోక్’ అని పేరు పెట్టడంలోని ఉద్దేశం కూడా పర్యావరణం పట్ల నిద్ర మేల్కొనండి’ అని పిలుపునివ్వడం. రిస్క్ అని హెచ్చరించారు! ఎవోక్ ్రపాజెక్ట్ నా బ్రెయిన్ చైల్డ్. ఈ ఎకో ఫ్రెండ్లీ క్లోతింగ్ స్టూడియోని 2020 మార్చిలో ్రపారంభించాను, అదే నెలలో లాక్డౌన్ మొదలైంది. ఆ మెటీరియల్తో మాస్కులు చేసి పోలీస్ డిపార్ట్మెంట్కి విరాళంగా ఇచ్చాను. ఈ ్రపాజెక్టు ్రపారంభానికి ముందే... ‘రిస్క్ చేస్తున్నావు’ అన్నారు తెలిసిన వాళ్లందరూ. పర్యావరణ పరిరక్షణ గురించి దశాబ్దాలుగా చెప్తున్నా కూడా సమాజంలో తగినంత చైతన్యం రానేలేదు. ఈ గడ్డి దుస్తుల గురించి అసలే తెలియదు. రంగు భరోసా, వస్త్రం మన్నిక ఉంటుందని కూడా తెలియదు. అలాంటప్పుడు మార్కెట్ ఎలా? పెట్టుబడి వెనక్కి వచ్చేదెప్పటికి? అన్నారు. అందరూ అలా అనుకుని తమను తాము సేఫ్జోన్లో ఉంచుకుంటే చాలా? బాగా లాభాలు వచ్చే రంగాన్నే ఎంచుకోవాలనే స్వార్థం తప్పు కాదు. కానీ లాభాల కోసం కొన్నేళ్లపాటు ఎదురు చూడగలిగిన ఆర్థిక పరిపుష్టి ఉన్నవాళ్లయినా ఒక ప్రయత్నం చేయాలి. ఇరవై ఏళ్ల కిందట ఎవరూ ముందుకు రాకపోతే మనం ఈ రోజు ఎలక్ట్రానిక్ వెహికల్ను వాడగలిగేవాళ్లమా? అలాగే వీగన్ డైట్ గురించి కూడా ఎంతోమంది సమావేశాలు ఏర్పాటు చేసి మరీ చైతన్యవంతం చేశారు. నేను కూడా గత నెల 23వ తేదీన హెంప్, బెంబెర్గ్, టెన్సెల్, సిట్రస్ పీల్ వస్త్రాలతో రూపొందించిన డిజైనర్ వేర్తో ఫ్యాషన్ పెరేడ్ నిర్వహించాను. ఎకో ఫ్రెండ్లీ, ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ ఉద్యమంలో మమేకమయ్యే క్రమంలో నేను వెజిటేరియన్గా మారిపోయాను’’ అని చెప్పింది శృతి. ‘భవిష్యత్తులో మనం ప్రతి విషయంలోనూ పర్యావరణహితమైన ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాల్సిందే. అందులో భాగంగా నేను నా ఫ్యాషన్ రంగాన్నే మాధ్యమంగా ఎంచుకున్నాను’ అని చె΄్పారు శృతి రావల్. ఆకులతో దారం ! ఒక రైతు పొలం దున్ని పత్తి పంట వేసి ఒక కేజీ పత్తి పండించాలంటే ఇరవై వేల లీటర్ల నీరు కావాలి. ఒక టెక్స్టైలర్ ఒక టీ షర్టుకి రంగులద్దడానికి రెండున్నర వేల లీటర్ల నీరు కావాలి. పత్తి పండడానికి పట్టే నీటిని భూమి పీల్చుకుంటుంది, ఇది కొంతలో కొంత నయం. కానీ హాట్ డైయింగ్ పద్ధతిలో రసాయన రంగులద్దిన నీరు భూమిని కలుషితం చేస్తుంది. అందుకే నేను గడ్డి మొక్కల దారంతో వడికిన వస్త్రాలను పరిచయం చేస్తున్నాను. మనదేశంలో ఇలాంటి సంస్థలు నాలుగైదుకి మించిలేవు. ఇక పూర్తి స్థాయి హెంప్ (నార) క్లోతింగ్ స్టూడియో హైదరాబాద్లో ఇదొక్కటే. ఆకులను శుభ్రం చేసే ్రపాసెస్లో బూజు పట్టకుండా సహజసిద్ధమైన వనరులనే జత చేస్తారు. ఎండిన ఆకులతో దారం వడుకుతారు. మొక్కల ఆకుల దారంతో వస్త్రాలు తయారు చేసే పరిశ్రమలు మనదేశంలో రాజస్థాన్, ఉత్తరాఖండ్లో మాత్రమే ఉన్నాయి. ఈ గడ్డి రకం మొక్కలు పత్తిలాగ ఎక్కువ నీటిని తీసుకోవు, పత్తికంటే త్వరగా పెరిగి చేతికి వస్తాయి. వీటి పరిరక్షణ కోసం శ్రమించాల్సిన అవసరం ఉండదు. ఈ దారం ఇప్పుడు చైనా నుంచి దిగుమతి అవుతోంది. ఈ దుస్తులు ఎలా ఉంటాయోననే ఆందోళన అక్కర్లేదు. నేను ధరించింది హెంప్ వీవింగ్ డ్రస్సే. క్లాత్ మీద డిజైన్లు నేను రూపొందించి డిజిటల్ ప్రింట్ చేయిస్తాను. కోల్డ్ డై కలర్స్ కాబట్టి క్లాత్తోపాటు ఎక్కువ కాలం మన్నుతాయి. – శృతి రావల్, ఫౌండర్, ఎవోక్ స్టూడియో,హైదరాబాద్ - – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వానకు తడిచిన బట్టల నుంచి వాసన రాకుండా ఇలా చేయండి..
ఇంటిప్స్ ►వానాకాలంలో బట్టలను ఉతికాక కర్పూరం కలిపిన నీటిలో జాడించడం వల్ల దుస్తుల నుంచి దుర్వాసన రాకుండా ఉంటుంది. ► ఆరీ ఆరని దుస్తులను ఇస్త్రీ చేసినా అదోవిధమైన వాసన వస్తాయి. అందువల్ల దుస్తులు పూర్తిగా ఆరిన తర్వాతనే ఐరన్ చేయాలి. ► అల్మారాలో బట్టలను పెట్టేముందు అక్కడక్కడ కొన్ని కర్పూరం బిళ్లలు ఉంచాలి. దీనివల్ల చిమటల వంటి కీటకాలు చేరకుండా ఉంటాయి. అంతేకాకుండా బట్టల్లో దుర్వాసన తొలగితుంది. -
ఆ ఊర్లో మహిళలు దుస్తులే ధరించరు.. 5 రోజుల పాటు!
భారతదేశంలోని నివసిస్తున్న ప్రజలు.. వారు పాటించే ఆచార వ్యవహారాలు, సంస్కృతి సాంప్రదాయాలు ప్రాంతం బట్టి మారుతూ ఉంటాయి. అయితే ఇందులో కొన్ని వింతగా, ఆశ్చర్యంగా అనిపిస్తాయి. ఇక ప్రత్యేకించి గ్రామాల్లో నివసించే ప్రజలు వారి ఆచార వ్యవహారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారన్న సంగతి తెలిసిందే. హిమాచల్ ప్రదేశ్లోని ఓ గ్రామంలో ఒక వింత ఆచారాన్ని స్థానికులు పాటిస్తున్నారట. సంవత్సరంలో కొన్ని రోజులు అక్కడి మహిళలు దుస్తులు ధరించరట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ ఆచారాన్ని అక్కడి వాళ్లు పాటిస్తున్నారు. అయితే దీనికి వెనుక ఒక కారణముందని అంటున్నారు. అదేంటంటే..! ఈ గ్రామం ఎక్కడ ఉంది? అవును, మనం మాట్లాడుకుంటున్న గ్రామం పరాయి దేశంలో కాదు, మన దేశంలోనే ఉంది. హిమాచల్ ప్రదేశ్లోని మణికర్ణ లోయలోని పిని అనే గ్రామంలో, శతాబ్దాలుగా ఒక సంప్రదాయం కొనసాగుతోంది, ఇందులో మహిళలు సంవత్సరంలో 5 రోజులు దుస్తులు ధరించరు. ఈ ఐదు రోజులు పిని గ్రామానికి బయటి వ్యక్తులెవరూ రాలేరు. ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతోంది. ఇక్కడి ప్రజలు కూడా దాన్ని కచ్చితంగా పాటిస్తున్నారు. మహిళలు బట్టలు ధరించరు ఈ ఐదు రోజులు మహిళలు దుస్తులు ధరించరు. మహిళులు వారి ఇంటి వద్దనే ఉంటారు, బయటకు రారు. మరోవైపు ఈ ఐదు రోజులు నియమనిష్టలతో ఈ ఆచారాన్ని మహిళలు కొనసాగిస్తారట. ఈ సమయంలో స్త్రీలే కాదు, పురుషులు కూడా కొన్ని నియమాలు పాటిస్తారు. అలాంటి వారు మద్యం తాగలేరు, నాన్ వెజ్ తినరు. అంతే కాదు ఈ ఐదు రోజులు భార్యాభర్తలు ఒకరితో ఒకరు మాట్లాడుకోరు. గ్రామస్తులు ఈ సంప్రదాయాన్ని ఎందుకు పాటిస్తున్నారు? గ్రామస్తుల ప్రకారం, ఈ సంప్రదాయం పాటించకపోతే కొన్ని రోజుల తర్వాత మహిళకు చెడు జరుగుతుందని అక్కడి గ్రామస్తులు నమ్ముతున్నారు. ఇది పాటిస్తున్నప్పుడు భార్యాభర్తలు ఒకరినొకరు చూసి నవ్వకూడదట. పురుషులు కూడా ఈ సంప్రదాయాన్ని పాటించడం తప్పనిసరి. సంప్రదాయం చరిత్ర సంప్రదాయ చరిత్ర పుటలు ఆసక్తికరంగా ఉన్నాయి. శతాబ్దాల క్రితం తమ గ్రామాన్ని రాక్షసులు ఆక్రమించాయి. గ్రామంలోని వివాహిత స్త్రీలకు అందమైన దుస్తులు ధరింపజేసి రాక్షసులు ఎత్తుకెళ్లేవారట. అప్పుడు లహువా ఘోండ్ అనే దేవత ప్రత్యక్షమై ఆ రాక్షసులను ఓడించి మహిళలను విడిపించిందట. అప్పటి నుంచి మహిళలు అందమైన దుస్తులు ధరిస్తే రాక్షసులు వస్తారని, అందుకే సంవత్సరంలో 5 రోజులు మహిళలు బట్టలు లేకుండా ఉంటారని అక్కడి గ్రామ పెద్దలు చెబుతున్నారు. చదవండి: చైనా కంపెనీ వింత నిబంధన: అఫైర్లు వద్దు.. విడాకుల మాటే ఎత్తొద్దు...! -
ఆ డైరెక్టర్ లోదుస్తులు చూపించమన్నాడు: స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సినీ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. బాలీవుడ్ పలువురు స్టార్ హీరోలతో సినిమాల్లో మెప్పించింది. బీటౌన్లో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం బాలీవుడ్ నుంచి హాలీవుడ్కు మారిపోయిన ప్రియాంక చోప్రా అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ను 2018లో పెళ్లాడింది. ఆ తర్వాత ఈ జంటకు ఓ కూతురు కూడా పుట్టిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: నా ఇద్దరు కూతుర్లు ఇప్పటికీ నిత్యానంద దగ్గరే ఉన్నారు: నటుడు) అయితే ఇటీవలే ముంబయిలో నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవానికి తొలిసారి బిడ్డతో కలిసి ఇండియాకు వచ్చారు. తాజాగా ఓ మ్యాగజైన్కు ఇంటర్వ్యూలో ఇచ్చిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన కెరీర్ ప్రారంభంలో ఓ సన్నివేశం చిత్రీకరిస్తుండగా.. బాలీవుడ్ దర్శకుడు తన లో దుస్తులను చూడాలనుకున్నారని వెల్లడించింది. 2002-03లో మధ్య కాలంలో ఈ సంఘటన జరిగినట్లు తెలిపింది. ప్రియాంక మాట్లాడుతూ.. 'అప్పుడప్పుడే బాలీవుడ్లోకి అడుగుపెట్టాను. నేను ఒక సినిమాను అంగీకరించా. అందులో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. అప్పుడు దర్శకుడు నా దగ్గరకు వచ్చి డ్యాన్స్ చేసేటప్పుడు లో దుస్తులన్నీ తీసేయాలన్నాడు. నాకు చాలా కోపం వచ్చింది. అందుకు నేను ఒప్పుకోలేదు. ఆ మరుసటి రోజే నేను ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నా. ఇందులో నాకు నటించడం ఇష్టం లేదు.' అంటూ ప్రియాంక చోప్రా గతంలో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. అయితే దీనిపై దర్శకుడికి వ్యతిరేకంగా మాట్లాడలేదని తెలిపింది. (ఇది చదవండి: ఆ నిర్మాతకు అమ్మాయిల పిచ్చి.. ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు: నటి) -
స్టైలిష్ దుస్తులను మార్కెట్ లోకి తెస్తున్న ఈషా అంబానీ
-
ఇషా అంబానీ ఇండియాకు తీసుకురానున్న చైనా బ్రాండ్ ఇదే..
Shein India: అపర కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ కుమార్తె 'ఇషా అంబానీ' గురించి అందరికి తెలుసు. వ్యాపార రంగంలో తండ్రికి తగ్గ తనయురాలిగా పేరు తెచ్చుకున్న ఈమె త్వరలో భారతదేశానికి చైనీస్ ఫ్యాషన్ బ్రాండ్ 'షీన్' (Shein) తీసుకురావడానికి కావలసిన అన్ని ఏర్పాట్లను సిద్ధం చేస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సుమారు మూడేళ్ల తర్వాత షీన్ను ఇండియాకు తీసుకురావడానికి ఇషా అంబానీ సిద్ధమైంది. ఇండియాకు తిరిగి రావడానికి షీన్ రిలయన్స్ రిటైల్తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. సరసమైన ధరలో ట్రెండింగ్ అండ్ స్టైలిష్ దుస్తుల కోసం చూస్తున్న మహిళలకు షీన్ ఒక మంచి షాపింగ్ ప్లాట్ఫారమ్. ఈ బ్రాండ్ అతి తక్కువ కాలంలోనే మంచి ఆదరణ పొందగలిగింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల 2020 జూన్లో ఈ కంపెనీ భారతదేశంలో నిషేధానికి గురైంది. అయితే సుదీర్ఘ సమయం తరువాత మళ్ళీ దేశీయ మార్కెట్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతోంది. 2020లో నిషేదానికి గురైన సమయంలో కూడా బ్రాండ్ ప్రోడక్ట్స్ ఢిల్లీ వంటి ప్రముఖ నగరాల్లో ఈ-కామర్స్ ప్లాట్ఫారమ్ అమెజాన్ ద్వారా ఢిల్లీ కోర్టు నోటీస్ జారీ చేసే వరకు అమ్ముడవుతూనే ఉన్నాయి. నిజానికి రిలయన్స్ ఇండస్ట్రీస్తో షీన్ బ్రాండ్ ఒప్పందం కుదుర్చుకున్న తరువాత ఒకదానితో ఒకటి ప్రయోజనం పొందుతాయి. (ఇదీ చదవండి: ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!) రిలయన్స్ రిటైల్ భాగస్వామ్యంలో ఇప్పటికే జిమ్నీ చూ, జార్జియా అర్మానీ, హ్యూగో బాస్, వెర్సస్, మైఖేల్ కోర్స్, బ్రూక్స్ బ్రదర్స్, అర్మానీ ఎక్స్చేంజ్, బర్బెర్రీ వంటి బ్రాండ్స్ ఉన్నాయి. ఈ జాబితాలో షీన్ కూడా త్వరలోనే చేరే సూచనలు కనిపిస్తున్నాయి. 2022లో రిలయన్స్ రిటైల్కు కొత్త లీడర్గా ఎంపికయ్యే సమయాన్ని బ్రాండ్ నికర విలువ రూ. 2కోట్లు, అయితే ఇప్పుడు బ్రాండ్ విలువ ఏకంగా రూ. 4 కోట్లకు చేరింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
అమ్మాయిల దుస్తులపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఇండోర్: మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేత వివాదంలో చిక్కుకున్నారు. అసభ్యకరమైన బట్టలు(డర్టీ క్లాత్స్) ధరించే అమ్మాయిలు రామాయణంలో శూర్పణఖ మాదిరి కనిపిస్తారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా వ్యాఖ్యానించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గామారింది. మధ్య ప్రదేశ్లోని ఇండోర్లో మహవీర్ జయంతి సందర్భంగా జైన సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన దుస్తులు వేసుకోని అమ్మాయిలను ఆయన తప్పుపట్టారు. రాత్రిపూట బయటకు వెళ్లినప్పుడు మద్యం మత్తులో డాన్స్ చేస్తున్న యువతీ యువకులు కనిపిస్తుంటారని.. దేవుడి మీద ప్రమాణం చేస్తున్నాను.. వారిని చూస్తుంటే గట్టిగా చెప్పుతో కొట్టాలన్నంత కోపం వస్తుందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘మహిళలను మనం దేవతలా ఆరాధిస్తాం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అసభ్యకరంగా దుస్తులు ధరించిన కొంతమంది ఆడవాళ్లను చూస్తుంటే శూర్పణఖలా కనిపిస్తారు. దేవుడు మీకు మంచి శరీరాన్ని ఇచ్చాడు. మంచి దుస్తులు వేసుకోవాలి. తల్లిదండ్రులు పిల్లలకు మంచి బుద్దులు నేర్పాలి’ అని సూచించారు. అయితే విజయ్వర్గియా వ్యాఖ్యలపై నెటిజన్లు మండిపడుతున్నారు. మహిళల పట్ల ద్వేషం కక్కుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన వ్యాఖ్యలతో పురుషాధిక్యత, పితృస్వామ్య భావజాలన్ని ప్రోత్సహిస్తున్నారని విమర్శిస్తున్నారు. రాజకీయ నేతలు ఇలా మాట్లాడటం సరికాదని.. బీజేపీ నేతపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా కైలాష్ విజయవర్గియా ఇంలాటి వ్యాఖ్యలు చేయడం తొలిసారి కాదు. గతంలోనూ పలుమార్లు ఆయన వివాదంలో ఇరుకున్నారు. చదవండి: కేంద్రమంత్రి కిరణ్ రిజిజుకి తృటిలో తప్పిన ప్రమాదం.. BJP Leader @KailashOnline says girls dress badly & look like ‘Shurpanakha’. This is a reprehensible & demeaning insult to every woman of this country Where is @smritiirani now? Does she condone this disgusting statement? Or does she only find her voice to attack @RahulGandhi! pic.twitter.com/hzoxrnZpl1 — Dr. Shama Mohamed (@drshamamohd) April 8, 2023 -
నాకు ఇది ముందే ఎందుకు కనిపించలేదబ్బా: ఆనంద్ మహీంద్ర
సాక్షి,ముంబై: ప్రముఖ పారిశశ్రామికవేత్త, మహీంద్ర అండ్ మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో గురువారం మరో ఆసక్తికరమైన వీడియోను షేర్ చేశారు. సాధారణంగా ఇంట్లో బట్టలు ఉతికిన తరువాత మడతపెట్టి బీరువాలోనో,కప్బోర్డ్లోనే సర్దడం అనేది ఒక పెద్ద టాస్క్. అందులోనూ ఏదైనా ఊరికి వెళ్లేటపుడు తక్కువప్లేస్లో ఎక్కువ లగేజీ సర్దడం అంటే నిజంగా బిగ్గెస్ట్ టాస్క్. ఈ విషయానికి సంబంధించిన వీడియోనే ఆనంద్ మహీంద్ర తన ఫాలోయర్లతో షేర్ చేశారు. పొందికగా, అందంగా దుస్తులను మడతపెట్టుతున్న ఈ వీడీయో ఆనంద్ మహీంద్రను బాగా ఆకర్షించింది. సాధారణంగా చేసుకునే పనులలో సింపుల్ టెక్నిక్స్ కొత్త ఇన్నోవేషన్ & డిజైన్ నైపుణ్యాలు ఆవిష్కారానికి నాంది పలుకుతాయి. ఈ వీడియో చాలా ఫ్యాసినేటింగ్ ఉంది అంటూ కొనియాడారు. దశాబ్దాలుగా ప్యాకింగ్ల మీద ప్యాకింగ్లు చేసుకుంటూ ప్రపంచమంతా కలియదిరుగుతున్న తనకు ముందే ఈ వీడియో ఎందుకు కనిపించలేదంటూ ఫన్నీగా కమెంట్ చేశారు. Fascinating. How innovation & design skills can bring huge productivity in such simple activities. Wish I had seen this video decades ago when I traveled like a maniac and was packing & re-packing every few days. https://t.co/mEXfa4TFP1 — anand mahindra (@anandmahindra) March 2, 2023 -
పరిస్థితి ఇంత దారుణమా!.. చలికి ఏకంగా బట్టలే గడ్డకట్టిపోయాయి
-
కొత్త రకం హ్యాంగర్.. దగ్గరకు వెళ్తే పరిమళాలు వెదజల్లుతుంది!
దుస్తులు వేలాడదీసుకోవడానికి కలప హ్యాంగర్లు, లోహపు హ్యాంగర్లు చాలాకాలంగా వాడుకలో ఉన్నవే! వార్డ్రోబ్లలో దుస్తులు దాచుకోవడానికి చాలామంది హ్యాంగర్లు వాడుతుంటారు. సాదాసీదా హ్యాంగర్లకు అంతకు మించిన ఉపయోగం ఇంకేమీ లేదు. అయితే, అమెరికాకు చెందిన చైనీస్ సంతతి డిజైనర్ సూవా షోయి ఇటీవల ‘ప్లౌడ్’ పేరుతో పరిమళాలను వెదజల్లే హ్యాంగర్కు రూపకల్పన చేసింది. ఈ హ్యాంగర్ను విడిభాగాలుగా విడదీసుకోవడం, తిరిగి జోడించడం చాలా తేలిక. ఈ హ్యాంగర్లో గొట్టంలా ఉండే భాగంలో నచ్చిన పరిమళాలతో కూడిన సెంట్ పాడ్స్ను నింపుకొని, తిరిగి బిగించేసి, దుస్తులు తగిలించుకుంటే చాలు. ఈ హ్యాంగర్ అన్నివైపులా సమానంగా తిరుగుతూ దుస్తులను పరిమళభరితం చేస్తుంది. ఈ పరిమళాల హ్యాంగర్ ఇంకా మార్కెట్లోకి విడుదల కావాల్సి ఉంది. -
దుస్తుల ఎగుమతులు పెరిగాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దుస్తుల ఎగుమతులు దేశం నుంచి నవంబరులో 11.7 శాతం వృద్ధి చెందాయి. అంతర్జాతీయంగా ఉన్న సవాళ్ల నేపథ్యంలో గడిచిన కొన్ని నెలలుగా ఎగుమతులు తిరోగమనం చెందాయని అపారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ తెలిపింది. ‘యూకే, ఈయూ, యూఎస్ వంటి సంప్రదాయ మార్కెట్లు మాంద్యం, ఎదురుగాలులు చవిచూస్తున్నందున దేశం నుంచి రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు దారుణంగా పడిపోయాయి. ద్రవ్యోల్బణం, ముడిసరుకు, రవాణా ఖర్చులు పెరగడంతోపాటు రష్యా–ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఎగుమతిదారులపై భారం పెరిగింది. కొన్ని నెలల తర్వాత ఎగుమతులు సానుకూలంగా మారాయి. ప్రబలంగా ఉన్న సవాళ్లను ఎదుర్కోవడానికి పరిశ్రమకు ఉన్న స్థితిస్థాపకతను ఇది సూచిస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దుస్తుల ఎగుమతి లక్ష్యం రూ.1.45 లక్షల కోట్లు. ఏప్రిల్–నవంబరులో రూ.82,740 కోట్లకుపైగా ఎగుమతులు నమోదయ్యాయి’ అని కౌన్సిల్ వివరించింది. చదవండి: ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్ స్టాక్.. కలలో కూడా ఊహించని లాభం! -
కోడి ఈకలతో కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు
-
మహిళ దుస్తులు చింపి, అనుచిత దాడి...కాదు దోపిడి అంటున్న యజమాని
న్యూఢిల్లీ: ఒక క్లబ్లోని బౌన్సర్లు ఒక మహిళ పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారు. సదరు మహిళ బట్టలు చింపి, దారుణంగా దాడి చేశారు. దీంతో సదరు మహిళ ఇద్దరు బౌన్సర్లు తన పట్ల చాలా అనుచితంగా ప్రవర్తించారంటూ పోలీసులకు ఫిర్యాదులు చేసింది. సెప్టంబర్ 18న ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం... సదరు బాధిత మహిళ నుంచి తమకు ఫోన్ కాల్ వచ్చిందని తెలిపారు. తాము సంఘటన స్థలానికి వచ్చేటప్పటికీ మహిళ దుస్తులు చిందరవందరగా ఉన్నట్లు గుర్తించామన్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఎయిమ్స్ ట్రామా సెంటర్కి తరలించామని తెలిపారు. అలాగే సదరు క్లబ్లోని బౌన్సర్ల వివరాలను సేకరించడమే కాకుండా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. బాధిత మహిళ స్నేహితులతో కలిసి క్లబ్కి వచ్చానని, ఎంట్రీపై వాగ్వాదం చోటు చేసుకోవడంతో బౌన్సర్లు ఈ ఘటనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. కానీ విచారణలో క్లబ్ యజమాని సురేంద్ర్ సింగ్ చౌదరి మరో కథ చెబుతన్నాడు. తాము ప్రతినెల స్థానిక పోలీస్ సిబ్బందికి దాదాపు రూ. 5 లక్షలు చెల్లించాల్సి వస్తుందని తెలిపాడు. ఐతే తాను చెల్లించడానికి ప్రస్తుతం నిరాకరించడంతో ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు. రాత్రి ఒంటి గంట సమయంలో ఇద్దరు అబ్బాయిలు, ముగ్గురు అమ్మాయిలు దురుసుగా ప్రవర్తించడమే కాకుండా పోడియం వద్ద నుంచి బలవంతంగా సుమారు రూ. 1.5 లక్షలు తీసుకుని పోలీసులకు ఫోన్ చేశారని తెలిపాడు. చచ్చిన ఆ పోలీసులు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారని, ఇవ్వకపోతే తీవ్ర పరిణామలు ఎదుర్కొవాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారని వివరిస్తూ..స్పెషల్ సీపీకి లేఖ రాశాడు. అలాగే పోలీసులు తమ క్లబ్ సిబ్బందిలో ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాడు. అంతేగాదు సదరు క్లబ్ యజమాని తమ క్లబ్లో ఉన్న సీసీ కెమెరా ఆధారంగా దర్యాప్తు చేయాలని పోలీసులను అభ్యర్థించారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: ఆస్పత్రిలో చేరిన కర్ణాటక మాజీ సీఎం) -
ఇదేం రూల్ సామీ.. బాల్కనీలో బట్టలు ఆరబెడితే రూ.20 వేలు ఫైన్!
మన ఇంటి బాల్కనీలో లేదా టెర్రస్పైన ఉతికిన దుస్తులను ఆరబెట్టడం సహజమే. అయితే ఓ ప్రాంతంలో మాత్రం అలా బాల్కనీలో బట్టలు ఆరబెడితే ఫైన్ కట్టాల్సివస్తుంది. ఎక్కడనుకుంటున్నారా.. ఈ వింత రూల్ యూఏఈలోనిది. అయితే ఇలాంటి నిబంధన తీసుకురావడానికి కారణం ఉందని ఆ ప్రాంత అధికారులు చెప్తున్నారు. అసలు ఆ కథేంటని తెలుసుకుందాం! వివరాల్లోకి వెళితే.. అబుదాబిలోని మున్సిపాలిటీ అధికారులు అపార్ట్మెంట్ల బాల్కనీలు, కిటికీలపై బట్టలు ఆరబెట్టవద్దని ఆ ప్రాంత నివాసితులకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక వేళ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,000 దిర్హామ్లు (భారత కరెన్సీ ప్రకారం రూ. 20,000) లేదా అంతకంటే ఎక్కువ జరిమానా విధించే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయం వెనుక ఓ కారణం ఉందని అంటున్నారు అక్కడి మున్సిపల్ అధికారులు. బాల్కనీలో దుస్తులు ఆరేయడం వల్ల నగర అందం దెబ్బతింటుందని, అందుకే బాల్కనీలో, కిటికీలకు బట్టలు వేలాడదీయవద్దని హెచ్చరించారు. ప్రస్తుతం దీనికి ప్రత్యామ్నాయంగా లాండ్రీ డ్రైయింగ్ గానీ, ఎలక్ట్రిక్ డ్రైయర్స్ వాడడం లేదా ఇతర మార్గాల ద్వారా బట్టలు ఇంట్లోనే ఆరబెట్టుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. చదవండి: ‘ఇది కరెక్ట్ కాదు.. రష్యా వాటిని అడ్డం పెట్టుకుని బ్లాక్మెయిల్ చేస్తోంది’ -
బంపరాఫర్.. ఆ షాపులో ఒక డ్రెస్ ఖరీదు రూ.1 మాత్రమే..!
బెంగళూరు: కరోనా మహమ్మారి సమయంలో పేదలు జీవనోపాధి కోల్పోయి నానా అవస్థలు పడ్డారు. చాలా మంది ఎన్జీవోస్, స్యచ్ఛంద సంస్థలు తమ వంతు సాయం అందిచడానికీ ముందుకు వచ్చాయి. ఈ క్రమంలోనే నిరుపేదలను ఆదుకునేలా బెంగళూరులోని నలుగురు స్నేహితులు సరికొత్త ఆలోచనతో ముందుకు రావడమే కాక కార్యాచరణలోకి తీసుకువచ్చి అందర్నీ ఆశ్చర్య పరిచారు. (చదవండి: ఎంత మంచి వాడో.. ప్రతి డెలివరీ బాయ్కు గిఫ్ట్ ఇస్తాడట) ఈ మేరకు మెలిషా నొరోన్హా అనే ఆమె తన భర్త వినోద్ లోబో, తల్లి గ్లాస్గో, మరో ఇద్దరు స్నేహితులు నితిన్ కుమార్, విఘ్నేశ్తో సహా కలసి 2013లో పేద ప్రజల కోసం ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ కరోనా మహమ్మారి తర్వాత ప్రజల దీనస్థిత చూశక వారికి క్లాత్ బ్యాంక్ అనే ఆలోచన వచ్చింది. ఆ క్రమంలోనే తాము ఇమాజిన్ క్లాత్స్ బ్యాంక్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సెప్టెంబర్ 2021లో బెరటేన అగ్రహారంలో లవకుశ లే అవుట్లోని ఒక చిన్న డబల్ బెడ్రూం అపార్ట్మెంట్లో షాపును ప్రారంభించారు. అయితే ఈ షాపుకి అక్కడ ఎలక్ట్రానిక్ సిటీ చుట్టుపక్కల ఉన్నవాళ్లు బట్టలను విరాళంగా ఇచ్చారు. ఈ క్లాత్ బ్యాంక్లో పేదవాళ్లు తమకు నచ్చిన దుస్తులను ఎన్నుకోవచ్చు. పైగా వాటి ధర రూ.1 మాత్రమే. పైగా ఈ క్లాత్ షాపులోని క్లాత్లు అమ్మగా వచ్చిన డబ్బులను కూడా వారు నిరుపేద కుటుంబాల పిల్లల చదువు, వైద్య ఖర్చుల అవసరాలకు నిధులుగా సమకూరుస్తున్నారు. అంతేకాదు ఒక పేద కుటుంబం సంవత్సరానికి దుస్తులు కోసం రూ. 2000 ఖర్చు చేస్తున్నారు. అదే ఈ బ్యాంక్ ద్వారా వారికి డబ్బు ఆదా కూడా అవుతుంది. ఈ మేరకు వినోద్, నితిన్ మాడుతూ.."2002లో మంగళూరులోని సెయింట్ అలోసియస్లో మా కాలేజ్ డేస్లోనే ఈ క్లాత్ బ్యాంక్ ఆలోచన ఉంది. మేము అప్పుడు కూడా మా స్నేహితు సాయంతో దుస్తులను సేకరించి పేదలకు పంపిణీ చేసేవాళ్లం." అని అన్నారు. (చదవండి: ప్రమాదం ఆ కుక్క జీవితాన్ని మార్చింది.. ఏకంగా మనిషిలా..) -
Quilt Craft: పాత బట్టలను జ్ఞాపకాల బొంతలుగా మార్చిన తోబుట్టువులు...
నేటి తరానికి క్విల్ట్గా పరిచయమైన నిన్నటి తరం బొంతను జ్ఞాపకాల పుంతలా అందిస్తున్నవారిని గుర్తించింది ఢిల్లీ ఎన్సిఆర్. అంతేకాదు, ఈ అందమైన కళను కాపాడేందుకు ముందుకు వచ్చింది. ఢిల్లీతో పాటు అక్కడి చుట్టుపక్కల పట్టణ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేసే ఎన్సిఆర్ (నేషనల్ కాపిటల్ రీజియన్) ఇటీవల పాత బట్టలతో కొత్తగా రూపొందించే రెండు క్విల్ట్ (బొంతల తయారీ) క్రాఫ్ట్ వెంచర్లను గుర్తించి, ఈ తయారీకి సపోర్ట్గా నిలిచింది. మెమరీ క్విల్ట్లుగా గతకాలపు జ్ఞాపకాలతో నిండిన పెట్టెలుగా మనల్ని హత్తుకునేలా తీర్చిదిద్దుతున్నారు వీటి రూపకర్తలైన మనీషా దేశాయ్, ఆయేషా దేశాయ్. నలభై ఏళ్ల మనీషా దేశాయ్, నలభై మూడేళ్ల ఆయేషా దేశాయ్లు తోబుట్టువులు. ఇద్దరూ గురుగ్రామ్లోని గార్డెన్ ఎస్టేట్లో ఉంటున్నారు. వారి ట్రంక్ పెట్టెల నిండా గత కాలంలో ఉపయోగించిన అత్యుత్తమ దుస్తులు దొంతర్లుగా ఉంటాయి. మనీషా మాట్లాడుతూ ‘నేను పూణెలో ఉన్నప్పుడు 2016లో కర్ణాటక బెల్గాంలో ఉన్న మా పుట్టింటికి వచ్చాను. మా చిన్ననాటి నుంచి మేం వాడిన పాతబట్టలతో నిండిన పెద్ద ట్రంకు పెట్టె ఉంది. ఆ డ్రెస్సులన్నీ తీసేస్తానన్నప్పుడు మా అమ్మ పెద్ద గొడవ చేసింది. వాటిని ఏదైనా చేయాలనుకుంటే కూతుళ్లు అని కూడా చూడనని బెదిరించింది. ఎంత చెప్పినా తను వినలేదు. మా ఇంట్లో అందరం కూర్చొని వాటిని ఏం చేయాలో చర్చించుకున్నాం’ అని తమ క్రాఫ్ట్స్ తయారీ మూలం గురించి వివరించింది మనీషా. గతంలో తాము ధరించిన దుస్తులకు మరింత ప్రత్యేకత జత చేయాలనే ఉద్దేశ్యంతో ఓ కుట్టు మిషన్ని కొని, కొన్ని బట్టలను ఎంచుకొని, వాటిలోని నాణ్యమైన భాగాలను ఎంపిక చేసుకుంటూ ఓ బొంతను కుట్టాం. అది చూసి అమ్మ ఎంత సంతోషించిందో మాటల్లో చెప్పలేను. కుటుంబసభ్యులు, స్నేహితులు అందరికీ బాగా నచ్చింది. అడిగారు అని మా స్నేహితుల కోసం కొన్ని బొంతలు కుట్టి ఇచ్చాం’ అని తెలిపిన ఈ సోదరీమణులు ఆ మరుసటి ఏడాది ఎంతగా అంటే, ఇదే కాన్సెప్ట్తో ‘కార్నోకోపియా’ అనే పేరుతో ఒక సంస్థనే ఏర్పాటు చేశారు. గతం ఇచ్చిన కానుకగా జత కట్టి ‘చాలా మంది తమ పాత బట్టలను వదులుకోవడానికి ఇష్టపడరు. వాటితో వారికి కొన్ని జ్ఞాపకాలు ఉంటాయి. తమ కుటుంబసభ్యులు ప్రేమగా ఇచ్చినవి, ప్రత్యేక సందర్భాలలో కొనుగోలు చేసినవి, తమకు తాముగా కుట్లు అల్లికలు చేసుకున్నవి.. ఇలా వాడిన దుస్తుల జ్ఞాపకాలు ఎన్నో ఉంటాయి. వాటిని ఎవరికైనా ఇవ్వాలంటే ఆ జ్ఞాపకం దూరం చేసుకున్నట్టే అని భావిస్తారు. అలాగే ఉంచేయాలనుకుంటే వాటి సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. వారి జ్ఞాపకాలు పదిలంగా ఉండేలా ‘థీమ్ ఆధారిత ఎంబ్రాయిడరీ బొంతల’ను నాలుగేళ్ల క్రితం నుంచి తయారుచేయడం మొదలుపెట్టాం. ‘మెమరీ క్విల్ట్’లుగా పిల్లల పాత బట్టల నుండి ప్యాచ్లను తయారుచేయడం ప్రారంభించాం. టీ షర్టుల నుంచి ప్యాంటు వరకు అన్నీ వీటిల్లో ఉపయోగించాం. కొన్ని సమయాల్లో షాపుల నుండి ఫాబ్రిక్ వ్యర్థాలు కూడా సేకరించాం. గురుగ్రామ్ గార్డెన్ ఎస్టేట్లో జరిగిన వర్క్షాప్లో ఢిల్లీ–ఎన్సిఆర్ పాల్గొంది. నివాసితులకు ఇవ్వడానికి కొన్ని బొంతలను తయారుచేయించింది. 4 అడుగుల వెడల్పు ఆరు అడుగుల పొడవు ఉండే మెత్తని బొంత రూ.7,500 ఉంటుంది. బొంత పరిమాణాన్ని బట్టి ధర పెరుగుతుంది’ అని వివరిస్తారు ఈ సోదరీమణులు. అంతే కాదు పాత వస్త్రాలను, క్లాత్ ముక్కలను నూలుగా మార్చడం, వీటి నుండే దారాలు తీయడంతో పాటు ప్యాకేజీకి పనికివచ్చే బ్యాగులను కూడా తయారుచేస్తారు ఈ అక్కాచెల్లెళ్లు. జ్ఞాపకాలకే డిమాండ్ ‘ఫ్యాబ్రిక్ వ్యర్థాల నుండి తయారుచేసిన క్విల్ట్ల కంటే మెమరీ క్విల్ట్లకు డిమాండ్ చాలా ఎక్కువ ఉంది. కోవిడ్ తర్వాత ఈ తరహా మెత్తని బొంతల తయారీకి ఆర్డర్లు కూడా ఎక్కువ వస్తున్నాయి. జ్ఞాపకాలకు న్యాయం చేయడం అనేది చాలా క్లిష్టమైన బాధ్యత. కానీ, కుటుంబాలు తమ జీవితాంతం ఉపయోగించుకునేలా మనపై నమ్మకం ఉంచినప్పుడు దానినే గౌరవంగా భావిస్తున్నాం. చంటిపాప అయినా, జీవిత భాగస్వామి లేదా అమ్మమ్మ, తాతయ్య అయినా వారు చెప్పే అందమైన కథలో మేమూ భాగం అవుతున్నాం. ఆ జ్ఞాపకాలకు పూర్తి స్థాయిలో ప్రాతినిధ్యం వహించడానికి ప్రయత్నిస్తున్నాం’ అని వివరించారు ఈ తోబుట్టువులు. మనసు లోతులను తడమాలే కానీ ఇలాంటి ఎన్నో మధురానుభూతులను మిగిల్చే కళలు లోకంలో ఎక్కడో చోట పుడుతూనే ఉంటాయి. వీరి కళ నచ్చితే ఎవరైనా ఓ ప్రయత్నంతో ఈ జ్ఞాపకాల బొంతను సొంతంగా తయారుచేసుకోవచ్చు. బిడ్డలను కథలా అల్లుకుపోయేలా.. ఫరీదాబాద్లో ఉంటున్న ఫ్యాషన్ డిజైనర్ రాశీ మాలిక్ తన సోదరి కోసం మొట్టమొదటి జ్ఞాపకాల బొంతను సృష్టించినట్టు గుర్తుచేసుకుంది. ‘మా అక్క లండన్లో ఉంది. ఆమె బిడ్డ కోసం తన దుస్తులను ఉపయోగించి, ఒక అందమైన మందపాటి దుప్పటిని రూపొందించాను. అది ఎంత అందంగా అంటే, కొన్ని కథలు రోజూ కళ్ల ముందు కదలాడుతున్నట్టే ఉంటాయి. హృదయానికి హత్తుకున్న దృశ్యమవుతుంది. మా అక్క ఎంత ఆనందించిందో మాటల్లో చెప్పలేను’ అని తన మొదటి జ్ఞాపకాల క్విల్ట్ రూపకల్పన గురించి వివరిస్తుంది రాశీ. ‘మామ్–ఎంటోస్’ పేరుతో క్విల్ట్ వర్క్షాప్ను ప్రారంభించి, బేబీ క్విల్ట్లను సృష్టిస్తోంది. ఆ తర్వాత కొన్నేళ్లుగా తన వెంచర్ను విస్తరిస్తూనే ఉంది. ఇప్పుడు తన వెంచర్ నుంచి పాత దుస్తులను ఉపయోగిస్తూ కుషన్లు, దిండు కవర్లు, బొమ్మలను కూడా తయారుచేస్తోంది. దుప్పట్లు, బొంతలు జ్ఞాపకాలను ఎలా స్పర్శిస్తాయో చెబుతూ ‘మంచం మీద పొరలుగా ఉన్నప్పడు చిన్ననాటి కథలు, మధురమైన జ్ఞాపకాలను మన కళ్ల ముందు ప్రదర్శిస్తాయి. పిల్లలకి వారు పెద్దయ్యాక తమ బాల్యం గురించి తెలుసుకోవడానికి ఇదొక మార్గం అవుతుంది. పెద్దలకు కానుక ఇస్తే.. పిల్లలు తల్లిదండ్రులకు తమ డిగ్రీపట్టాను కానుక ఇచ్చినంత సంబరాన్నిస్తుంది’ అని చెబుతుంది రాశీ మాలిక్. చదవండి: నెలకు అక్షరాలా రూ. 3 లక్షలు సంపాదిస్తున్న బాతు.. ఎలాగంటే.. -
గ్రామంలోని మహిళల బట్టలు ఉతకాలి.. నిందితుడికి కోర్టు ఆదేశం
పాట్నా: లైంగిక దాడికి యత్నించిన ఓ వ్యక్తికి బిహార్లోని కోర్టు వింత షరతులో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలలపాటు గ్రామంలోని మహిళలందరి బట్టలు ఉచితంగా ఉతకడంతోపాటు ఇస్త్రీ చేయాలని స్థానిక కోర్టు బుధవారం తీర్పిచ్చింది. దీనికి అవసరమైన డిటర్జెంట్, ఇతర ఖర్చులను అతడే భరించాలని పేర్కొంది. కోర్టు నిర్ణయంతో ఆ గ్రామంలోని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. బిహార్లోని మజోర్ గ్రామానికి చెందిన 20 ఏళ్ల లాలన్ కుమార్ బట్టలు ఉతుకుతూ జీవనోపాధి పొందేవాడు. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో మహిళపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: తన పెట్ డాగ్ కోసం విమానంలోని బిజినెస్ క్లాస్ సీట్లన్ని.. అప్పటి నుంచి అతడు జైల్లో ఉండగా.. అతని తరపు న్యాయవాది బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు కొన్ని వింత షరతులతో బెయిల్ మంజూరు చేసింది. ఆరు నెలల పాటు గ్రామంలోని 2 వేల మంది మహిళల దుస్తులు ఉతికి, శుభ్రంగా ఇస్త్రీ చేయాలని షరతు విధించింది. ఈ పనికి ఎటువంటి డబ్బులు తీసుకోరాదని ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుచేస్తామని కోర్టు హెచ్చరించింది. చదవండి: వారెవ్వా ఆయుషి ! సర్దుకుపోలేదు.. సమస్యకు పరిష్కారం చూపింది అయితే కోర్టు బుధవారం ఇచ్చిన ఈ తీర్పుపై గ్రామంలోని సుమారు 2 వేల మంది మహిళలు హర్షం వ్యక్తం చేసినట్లు గ్రామ సర్పంచ్ నసీమా ఖాటూన్ తెలిపారు. ‘ఈ తీర్పు చారిత్రాత్మకమైంది. మహిళల గౌరవాన్ని పెంపొందిస్తుంది. మహిళల గౌరవాన్ని కాపాడటానికి సహాయపడుతుంది’ అని ఆమె అన్నారు. అలాగే మహిళలపై జరిగే అఘాయిత్యాల గురించి సమాజంలో చర్చించడంపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని ఆ గ్రామంలోని మహిళలు తెలిపారు. -
నైకీ, హెచ్అండ్ఎం బ్రాండ్స్కు చైనా షాక్
బీజింగ్: వీగర్ ముస్లింల అణిచివేత అంశంలో చైనా వైఖరిని వ్యతిరేకిస్తున్న విదేశీ కంపెనీలను కట్టడి చేయడంపై డ్రాగన్ దేశం దృష్టి పెట్టింది. ఈ క్రమంలో హెచ్అండ్ఎం, నైకీ, జారా తదితర విదేశీ బ్రాండ్స్ .. పిల్లలకు హానికరమైన బొమ్మలు, దుస్తులు మొదలైనవి దేశంలోకి దిగుమతి చేస్తున్నాయంటూ ఆరోపించింది. ఈ వారంలో అంతర్జాతీయ బాల కార్మికుల దినోత్సవం సందర్భంగా ఇలాంటి 16 కంపెనీలకు చెందిన టీ-షర్టులు, బొమ్మలు, టూత్బ్రష్షులు మొదలైన వాటిని ‘‘నాణ్యత, భద్రత పరీక్షలో అర్హత పొందని’’ ఉత్పత్తులుగా చైనా కస్టమ్స్ ఏజెన్సీ ఒక జాబితా తయారు చేసింది. వీటిని ధ్వంసం చేయడం లేదా వాపసు పంపడం చేస్తామని పేర్కొంది. అయితే, వివాదాస్పదమైన షాంజియాంగ్ ప్రావిన్స్ పరిణామాల గురించి గానీ, విదేశీ కంపెనీల విమర్శలను గానీ ఈ సందర్భంగా ప్రస్తావించలేదు. దుస్తులు, బొమ్మల్లో హానికారకమైన అద్దకాలు, ఇతర రసాయనాలు ఉన్నాయని మాత్రమే తెలిపింది. షాంజియాంగ్ ప్రావిన్స్లో వీగర్ ముస్లింలను అణిచివేస్తూ, వెట్టిచాకిరీ చేయిస్తోందంటూ చైనా ఆరోపణలు ఎదుర్కొంటోంది. అక్కడి ఉత్పత్తులను ఉపయోగించడం వల్ల తమపైనా విమర్శలు వస్తుండటంతో హెచ్అండ్ఎం ఇకపై షాంజియాంగ్ ప్రావిన్స్లో ఉత్పత్తయ్యే పత్తిని తమ ఉత్పత్తుల్లో వినియోగించబోమంటూ ఇప్పటికే ప్రకటించింది. ఈ ప్రకటనతో ఆగ్రహించిన చైనా ఈ-కామర్స్ కంపెనీలు తమ ప్లాట్ఫామ్స్ నుంచి హెచ్అండ్ఎం ఉత్పత్తులను తొలగించాయి. ఆ కంపెనీతో పాటు నైకీ, అడిడాస్ వంటి ఇతర విదేశీ బ్రాండ్స్కి సంబంధించిన యాప్స్ను కూడా యాప్ స్టోర్స్ తొలగించాయి. అయితే తాజా పరిణామంపై నైక్, జారా, హెచ్ అండ్ ఎం ఇంకా స్పందించలేదు. -
ఆలియాభట్ స్టార్టప్.. పిల్లల దుస్తులు
వెండితెరపై రకరకాల పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఆలియాభట్ ఇప్పుడు ఎంటర్ప్రెన్యూర్ పాత్రలోకి ప్రవేశించింది. అయితే ఇది ‘రీల్’ జీవిత పాత్ర కాదు ‘రియల్’ జీవిత పాత్ర. 2 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసు పిల్లల దుస్తుల కోసం ‘ఎడ్–ఎ–మమ్మా’ అనే స్టార్టప్ లాంచ్ చేసింది. మన ప్రధాని నినాదం ‘వోకల్ ఫర్ లోకల్’తో గొంతు కలిపింది. ఆలియా క్లాతింగ్ లైన్ను ఎందుకు ఎంచుకుంది అనే విషయాన్ని పక్కనపెడితే ఈ స్టార్టప్ ప్రత్యేకత నేచురల్ ఫ్యాబ్రిక్స్. ప్లాస్టిక్తో తయారైన బటన్స్ ఉపయోగించకపోవడం ఇందులో ఒకటి. ‘ఎడ్–ఎ–మమ్మా’ ద్వారా ‘బ్యాక్ టు నేచర్’ నినాదానికి బలం చేకూర్చాలనే సంకల్పబలం ఆలియాలో కనిపిస్తుంది. స్టోర్ల సంఖ్య పెంచడంతో పాటు పిల్లల పుస్తకాల ద్వారా స్టోరీలు కూడా చెబుతుందట. పిల్లలను ప్రకృతికి మరింత దగ్గరికి తీసుకువెళ్లే కథలన్నమాట! ‘ప్రతి గార్మెంట్ ఒక కథ చెబుతుంది. ప్రకృతి పట్ల ప్రేమను పెంచుతుంది’ అంటున్న ఆలియా నుంచి వచ్చిన మరో మంచి మాట: ‘చిన్న పిల్లలు, పెద్దవాళ్లు అంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు. భూమాతకు అందరం బిడ్డలమే. చిన్నపిల్లలమే!’
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఊళ్లకు పోటెత్తిన ఓటర్లు!
Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
ఇదేందయ్యా వెలగపూడి?
5 వేల మందితో బందోబస్తు
ఎన్నికల సామగ్రి తరలింపు
ప్రయాణికుల కోసం ఎన్నికల స్పెషల్ రైలు
పశ్చిమలో ‘గణ’ంగా ప్రలోభాలు
ఓటేసే ముందు.. ఒక్క క్షణం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నీ పరిసరాలు చూడు
ఏజెంట్లకు సూచనలివే..
ప్రత్యేక ఆకర్షణగా పింక్ పోలింగ్ స్టేషన్
తప్పక చదవండి
- చీరాలలో టీడీపీ, కాంగ్రెస్ బరితెగింపు
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
- గన్నవరంలో టీడీపీ గలాటా
- పోలింగ్ సిబ్బంది ‘పచ్చ’పాతం
- Lok Sabha Election 2024: మహిళలకు ‘మహాలక్ష్మి’ గ్యారెంటీ: సోనియా
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
- Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
Advertisement