-
పాక్కు సెమీస్ అవకాశాలు ఇంకా ఉన్నాయి.. ఆ ముగ్గురు కీలకం: బాబర్
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్-2023 టోర్నీ ముగింపు దశకు చేరుకుంటోంది. ఇప్పటికే టీమిండియా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా సెమీస్ చేరుకోగా.. న్యూజిలాండ్ తమ బెర్తును దాదాపుగా ఖరారు చేసుకుంది. శ్రీలంకపై ఘన విజయం ద్వారా అనధికారికంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో.. టాప్-4లో నిలవాలన్న పాకిస్తాన్ ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. అయితే, న్యూజిలాండ్ను దాటుకుని బాబర్ ఆజం బృందం ముందుకు వెళ్లాలంటే ఇంగ్లండ్పై ఊహించని రీతిలో విజయం సాధించాలి. కోల్కతా వేదికగా ఇంగ్లండ్ను 287 పరుగుల తేడాతో మట్టికరిపించాలి. లేదంటే టాస్ గెలిచి ఇంగ్లండ్ తొలుత బ్యాటింగ్ చేస్తే.. ఆ జట్టు విధించిన లక్ష్యాన్ని 3 ఓవర్లలోపే ఛేదించాలి. ఎంతటి పటిష్ట జట్టుకైనా ఇది అసాధ్యమే! అయితే, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయంటున్నాడు పాక్ సారథి బాబర్ ఆజం. ఈ మేరకు ఇంగ్లండ్తో మ్యాచ్కు ముందు మీడియాతో మాట్లాడిన బాబర్.. ‘‘క్రికెట్లో ఎప్పుడైనా.. ఏదైనా జరగొచ్చు.. ఈ టోర్నీలో మేము మెరుగైన ప్రదర్శనతోనే ముగిస్తాం. రన్ రేటును భారీగా పెంచుకునేందుకు ఇప్పటికే ప్రణాళికలు రచించాం. మైదానంలో వాటిని కచ్చితంగా అమలు చేస్తాం. తొలి 10 ఓవర్లపాటు ఎలా బ్యాటింగ్ చేయాలన్న దానిపైనే ప్రస్తుతం దృష్టి సారించాం. ఆ తర్వాత ఏం చేయాలో పరిస్థితులకు తగ్గట్లు చేసుకుపోతాం. ఒకవేళ ఫఖర్ జమాన్ 20-30 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయగలిగితే మేము అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం’’ అని పేర్కొన్నాడు. ఓపెనర్ ఫఖర్ జమాన్తో పాటు ఆల్రౌండర్ ఇఫ్తికార్ అహ్మద్, వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పాత్ర కూడా ఈ మ్యాచ్లో కీలకమేనని బాబర్ ఆజం ఈ సందర్భంగా చెప్పుకొచ్చాడు. అదే విధంగా కెప్టెన్సీ తన వ్యక్తిగత ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపడం లేదని.. రెండు బాధ్యతలను తాను సమర్థవంతంగా నెరవేర్చగలనని బాబర్ స్పష్టం చేశాడు. చదవండి: గర్వంగా ఉంది.. మా విజయాలకు కారణం అదే.. వాళ్లు అద్బుతం: హష్మతుల్లా -
పాపం న్యూజిలాండ్.. మరీ ఇంత దురదృష్టమా.. ప్రపంచకప్ చరిత్రలోనే తొలి జట్టుగా..!
ప్రపంచ క్రికెట్ చరిత్రలో దురదృష్టవంతమైన జట్లు ఏవైనా ఉన్నాయంటే, అవి న్యూజిలాండ్, సౌతాఫ్రికా జట్లే అని చెప్పాలి. ఫార్మాట్ ఏదైనా ఈ రెండు జట్లను దురదృష్టం అనునిత్యం వెంటాడుతూనే ఉంటుంది. మెగా టోర్నీల్లో వీరి బ్యాడ్లక్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. విశ్వవేదికపై పోటీపడుతున్నప్పుడు వీరి దురదృష్టం తారాస్థాయిలో ఉంటుంది. నోటి దాకా వచ్చిన విజయాలు, ఆస్వాదించకుండానే చేజారిపోయిన సందర్భాలు కోకొల్లలు. తాజాగా ఈ రెండు జట్లలో ఓ జట్టైన న్యూజిలాండ్కు ఇలాంటి సందర్భం మరోసారి ఎదురైంది. 2023 వరల్డ్కప్లో భాగంగా పాకిస్తాన్తో నిన్న జరిగిన మ్యాచ్లో కివీస్ తొలుత బ్యాటింగ్ చేస్తూ 400కు పైగా స్కోర్ చేసినప్పటికీ, వరుణుడు అడ్డుపడటంతో ఓటమిపాలైంది. ఈ ఓటమి కూడా అలాంటి ఇలాంటి ఓటమి కాదు. ఇది ఏకంగా ఆ జట్టు సెమీస్ అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపే ఓటమి. తప్పక గెలిచి తీరుతామనుకున్న మ్యాచ్లో ఓటమితో పాటు ఒక్కసారిగా సెమీస్ అవకాశాలు సంక్లిష్టం కావడంతో న్యూజిలాండ్ బాధ వర్ణణాతీతంగా ఉంది. ప్రపంచకప్ చరిత్రలో 400కు పైగా స్కోర్ చేసి ఓటమి చవిచూసిన తొలి జట్టు కివీసే కావడం విశేషం. హాట్ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ టీమ్ వరుసగా నాలుగు పరాజయాలు మూటగట్టుకుని సెమీస్కు చేరకుండానే ప్రపంచకప్ నుంచి నిష్క్రమించే దిశగా సాగుతుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో (8 మ్యాచ్ల్లో 4 విజయాలు, 0.398) ఉన్న కివీస్ సెమీస్కు చేరాలంటే తాము తదుపరి ఆడబోయే మ్యాచ్లో భారీ విజయం సాధించడంతో పాటు సెమీస్ రేసులో ఉన్న ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్లు తమ తదుపరి మ్యాచ్ల్లో ఓడాల్సి ఉంటుంది. తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్ ప్రత్యర్ధి శ్రీలంక కావడం కాస్త ఊరట కలిగించే అంశంగా చెప్పవచ్చు. ప్రస్తుత వరల్డ్కప్లో శ్రీలంక పేలవ ఫామ్లో ఉండటం కివీస్కు కలిరావచ్చు. ఒకవేళ ఈ జట్టును ఇక్కడ కూడా దురదృష్టం వెంటాడితే దేవుడు కూడా ఏమీ చేయలేడు. మరోవైపు న్యూజిలాండ్తో పాటు సెమీస్ రేసులో ఉన్న పాకిస్తాన్ ఇంగ్లండ్ను, ఆఫ్ఘనిస్తాన్.. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాలను ఎదుర్కోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే, పాక్తో నిన్న జరిగిన మ్యాచ్లో కివీస్ 21 పరుగుల తేడాతో (డక్వర్త్ లూయిస్ పద్దతి) ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (95), గ్లెన్ ఫిలిప్స్ (41) విరుచుకుపడటంతో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం పాక్ లక్ష్యాన్ని ఛేదించే సమయంలో వర్షం పలు మార్లు అడ్డుపడి న్యూజిలాండ్ ఓటమికి పరోక్ష కారణమైంది. 25.3 ఓవర్ల తర్వాత మొదలైన వర్షం ఎంతకీ ఆగకపోవడంతో అంపైర్లు డక్వర్త్ లూయిస్ పద్దతిన పాక్ను విజేతగా ప్రకటించారు. ఆ సమయానికి పాక్ వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. డీఎల్ఎస్ ప్రకారం ఈ స్కోర్ న్యూజిలాండ్ స్కోర్ కంటే మెరుగ్గా ఉండటంతో పాక్ విజేతగా నిలిచింది. ఫకర్ జమాన్ (81 బంతుల్లో 126; 8 ఫోర్లు, 11 సిక్సర్లు) అజేయమైన మెరుపు శతకంతో పాక్కు జీవం పోశాడు. అతనికి కెప్టెన్ బాబార్ ఆజమ్ (66 నాటౌట్) సహకరించాడు. -
ఫఖర్ మెరుపుల ‘వాన’లో...
బెంగళూరు: ఇటు బ్యాటింగ్ మెరుపులు... అటు వర్షపు చినుకులతో చిన్నస్వామి స్టేడియం తడిసిపోయింది. ఈ క్రికెట్ మ్యాచ్ అభిమానుల్ని పరుగుల మజాలో ముంచింది. కానీ ఈ మజాను పూర్తిగా చవిచూడకముందే వర్షంతో ఆగిన ఆటలో డక్వర్త్ లూయిస్ (డీఎల్) పద్ధతి పాకిస్తాన్ను విజేతను చేస్తే... 400 పైచిలుకు చేసిన న్యూజిలాండ్ పరాజితగా మిగిలింది. పాక్ 21 పరుగులతో గెలిచి సెమీస్ అవకాశాలు సజీవంగా నిలబెట్టుకుంది. మొదట కివీస్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోరు చేసింది. రచిన్ రవీంద్ర (94 బంతుల్లో 108; 15 ఫోర్లు, 1 సిక్స్) ఈ టోర్నీలో మూడో సెంచరీ సాధించగా, గాయంనుంచి కోలుకొని బరిలోకి దిగిన కేన్ విలియమ్సన్ (79 బంతుల్లో 95; 10 ఫోర్లు, 2 సిక్స్లు) రాణించాడు. తర్వాత పాకిస్తాన్ కష్టమైన లక్ష్యం వైపు ధాటిగా దూసుకెళ్లింది. వానతో మ్యాచ్ నిలిచేసరికి 25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 200 పరుగులు చేసింది. అప్పటి డక్వర్త్ లెక్కల ప్రకారం 25.3 ఓవర్లలో 179 చేస్తే కివీస్పై గెలుపు ఖాయం. కానీ పాక్ ఇంకో 21 పరుగులు ముందంజలో ఉంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఫఖర్ జమాన్ (81 బంతుల్లో 125 నాటౌట్, 8 ఫోర్లు, 11 సిక్స్లు) సిక్సర్లతో విరుచుకుపడి సెంచరీ సాధించాడు. కెపె్టన్ బాబర్ అజమ్ (63 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్స్లు) వేగంగా అర్ధసెంచరీ సాధించాడు. కివీస్ ఓటమితో దక్షిణాఫ్రికా సెమీఫైనల్కు చేరింది. చెలరేగిన రచిన్, విలియమ్సన్ ముందుగా కివీస్ ఓపెనర్లు కాన్వే (39 బంతుల్లో 35; 6 ఫోర్లు), రచిన్ రవీంద్ర తొలి వికెట్కు 68 పరుగులతో చక్కని ఆరంభమిచ్చారు. కాన్వే అవుటయ్యాక... రచిన్కు కెప్టెన్ విలియమ్సన్ జతయ్యాక పరుగుల వేగం పెరిగింది. ఇద్దరి స్ట్రోక్ప్లేతో బౌండరీలు మంచినీళ్ల ప్రాయంలా వచ్చేశాయి. 16వ ఓవర్లో జట్టు వంద పరుగులు చేరుకుంటే... కాసేపటికే 29 ఓవర్లోనే స్కోరు 200 దాటేసింది. ఆలోపే రవీంద్ర, విలియమ్సన్ చకచకా ఫిఫ్టీలు పూర్తిచేసుకొని శతకాలపై కన్నేశారు. ఈ క్రమంలో రచిన్ 88 బంతుల్లో సఫలం చేసుకోగా, విలియమ్సన్ 5 పరుగుల దూరంలోనే నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్కు 180 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. తర్వాత వచ్చిన వారంతా తలా ఒక చేయి వేయడంతో కివీస్ స్కోరు 400 దాటింది. ఫిలిప్స్ (25 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్స్లు), చాప్మన్ (27 బంతుల్లో 39; 7 ఫోర్లు), మిచెల్ (18 బంతుల్లో 29; 4 ఫోర్లు, 1 సిక్స్), సాన్ట్నర్ (17 బంతుల్లో 26 నాటౌట్; 2 సిక్స్లు) మెరుగ్గా ఆడారు. ఫఖర్ విధ్వంసం వర్షంతో ఆగి..సాగిన మ్యాచ్లో చివరకు పాక్ విజయ లక్ష్యాన్ని డీఎల్ పద్ధతిలో 41 ఓవర్లలో 342 పరుగులుగా నిర్దేశించారు. అంటే సగటున ప్రతి ఓవర్కు 8 పరుగుల పైచిలుకే చేసుకుంటూ పోవాలి. ఇది వన్డేలో కొండంత లక్ష్యం. దీన్ని ఓపెనర్ ఫఖర్ జమాన్ విధ్వంసం కరిగించేలా చేసింది. మరో ఓపెనర్ షఫీక్ (4) వికెట్ పారేసుకున్నా... కెపె్టన్ బాబర్ ఆజమ్తో ధనాధన్ ఛేదనకు శ్రీకారం చుట్టాడు. 4 ఓవర్లలో 12/1 స్కోరుతో ఉన్నప్పుడు పాక్ ఇంకేం ఛేదిస్తుందిలే అనుకున్నారంతా! కానీ తర్వాత ఫఖర్ బ్యాట్ సిక్సర్లతో శివమెత్తడంతో న్యూజిలాండ్ ప్రధాన బౌలింగ్ దళమంతా కకావికలమైంది. ఒక ఓవర్లో 17, మరో ఓవర్లో 16, ఇంకో రెండు ఓవర్లలో 15 చొప్పున పరుగులు రావడంతో పాక్ స్కోరు ఒక్కసారిగా పుంజుకుంది. 20వ ఓవర్ రెండో బంతికే ఫఖర్ (63 బంతుల్లోనే) సెంచరీ పూర్తయింది. అప్పటికి జట్టు స్కోరు 145 పరుగులైతే ఇందులో వంద అతనొక్కడే చేశాడంతే ఫఖర్ బ్యాటింగ్ సునామీ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోవచ్చు. బాబర్ కూడా 52 బంతుల్లో అర్ధ శతకం సాధించగా, 26వ ఓవర్లో మళ్లీ వానొచ్చింది. ఆ తర్వాత తిరిగి కొనసాగలేదు. చిత్రమేమిటంటే సోధి వేసిన 25వ ఓవర్లోనే బాబర్ ఒక సిక్స్, ఫఖర్ రెండు సిక్సర్లతో 20 పరుగులు పిండుకున్నారు. ఆ తర్వాత 3 బంతులకే ఆట ఆగిపోయింది. అంటే 25వ ఓవరే ఫలితాన్ని తలకిందులు చేసింది! ఆ ఓవర్ కంటే ముందు ఆగిపోతే కివీసే గెలిచేది! స్కోరు వివరాలు న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) రిజ్వాన్ (బి) హసన్ 35; రచిన్ (సి) షకీల్ (బి) వసీమ్ 108; విలియమ్సన్ (సి) ఫఖర్ (బి) ఇఫ్తికార్ 95; మిచెల్ (బి) రవూఫ్ 29; చాప్మన్ (బి) వసీమ్ 39; ఫిలిప్స్ (బి) వసీమ్ 41; సాన్ట్నర్ నాటౌట్ 26; లాథమ్ నాటౌట్ 2; ఎక్స్ట్రాలు 26; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 401. వికెట్ల పతనం: 1–68, 2–248, 3–261, 4–318, 5–345, 6–388. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 10–0–90–0, హసన్ అలీ 10–0–82–1, ఇఫ్తికార్ 8–0–55–1, రవూఫ్ 10–0–85–1, వసీమ్ 10–0–60–3, సల్మాన్ 2–0–21–0. పాకిస్తాన్ ఇన్నింగ్స్: షఫీక్ (సి) విలియమ్సన్ (బి) సౌతీ 4; ఫఖర్ నాటౌట్ 126; బాబర్ నాటౌట్ 66; ఎక్స్ట్రాలు 4; మొత్తం (25.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 200/1. వికెట్ల పతనం: 1–6, బౌలింగ్: బౌల్ట్ 6–0–50–0, సౌతీ 5–0–27–1, సాన్ట్నర్ 5–0–35–0, ఫిలిప్స్ 5–1–42–0, ఇష్ సోధి 4–0–44–0, మిచెల్ 0.3–0–1–0. -
న్యూజిలాండ్పై పాకిస్తాన్ విజయం.. సెమీస్ రేసులో
వన్డే ప్రపంచకప్-2023లో న్యూజిలాండ్కు పాకిస్తాన్ ఊహించని షాక్ తగిలింది. ఈ మెగా టోర్నీలో భాగంగా బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్లో కివీస్పై 21 పరుగుల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ గెలుపొందింది. ఈ విజయంతో పాకిస్తాన్ తమ సెమీస్ అవకాశాలను సజీవంగా నిలుపుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ ఇన్నింగ్స్ 21. 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160/1 వద్ద ఆటకు వర్షం అంతరాయం కలిగించింది. అయితే వర్షం తగ్గముఖం పట్టడంతో మ్యాచ్ను 41 ఓవర్లకు కుదించారు. డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం పాకిస్తాన్ టార్గెట్ను 342 పరుగులు కుదించారు. మ్యాచ్ తిరిగి ప్రారంభమయ్యే సమయానికి పాకిస్తాన్కు 19. 3 ఓవర్లలో 182 పరుగులు అవసరమయ్యాయి. అయితే మ్యాచ్ ఆరంభమైన కొద్దిసేపిటికే మళ్లీ వరుణుడు రీ ఎంట్రీ ఇచ్చాడు. రెండో సారి ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ 179 పరుగులు చేసింది. అప్పటికే న్యూజిలాండ్ డీఎల్ఎస్ ప్రకారం.. 21 పరుగుల ముందంజలో ఉంది. ఈ క్రమంలో వర్షం తగ్గుముఖం పట్టే సూచనలు కన్పించకపోవడంతో పాకిస్తాన్ను డక్వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం విజేతగా నిర్ణయించారు. జమాన్ సూపర్ ఇన్నింగ్స్.. కాగా పాకిస్తాన్ విజయంలో ఆ జట్టు ఓపెనర్ ఫఖార్ జమాన్ కీలక పాత్ర పోషించాడు. జమాన్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. భారీ లక్ష్య ఛేదనలో కివీస్ బౌలర్లను ఊచకోత కోశాడు. కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా 81 బంతుల్లో 8 ఫోర్లు ,11 సిక్స్లతో 126 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. అతడితో పాటు కెప్టెన్ బాబర్ ఆజం(66 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. చదవండి: WC 2023 NZ Vs PAK: చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్కప్ చరిత్రలోనే -
చరిత్ర సృష్టించిన పాకిస్తాన్ ఓపెనర్.. వరల్డ్కప్ చరిత్రలోనే
పాకిస్తాన్ స్టార్ ఓపెనర్ ఫఖార్ జమాన్ అరుదైన ఘనత సాధించాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన పాకిస్తాన్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా న్యూజిలాండ్తో జరుగుతున్న మ్యాచ్లో జమాన్ కేవలం 63 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. తద్వారా ఈ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ మాజీ ఆటగాడు ఇమ్రాన్ నజీర్ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్కప్లో కింగ్స్టన్ ఓవెల్ వేదికగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో 95 బంతుత్లో నజీర్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్తో నజీర్ రికార్డును జమాన్ బ్రేక్ చేశాడు. అదే విధంగా వరల్డ్కప్లో ఒకే ఇన్నింగ్స్లో అత్యధిక సిక్స్లు కొట్టిన నజీర్ రికార్డును కూడా జమాన్ బద్దలు కొట్టాడు. జింబాబ్వేతో మ్యాచ్లో నజీర్ 8 సిక్స్లు బాదాడు. ప్రస్తుతం న్యూజిలాండ్తో మ్యాచ్లో 9 సిక్స్లు కొట్టిన జమాన్.. నజీర్ను అధిగమించాడు. మ్యాచ్కు అంతరాయం.. కాగా చెన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న పాకిస్తాన్-న్యూజిలాండ్ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. ఆట నిలిచిపోయే సమయానికి పాకిస్తాన్ 21. 3 ఓవర్లలో వికెట్ నష్టానికి 160 పరుగులు చేసింది. క్రీజులో ఫఖార్ జమాన్(106), బాబర్ ఆజం(42) పరుగులతో ఉన్నారు. కాగా అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 401 పరుగుల భారీ స్కోర్ సాధించింది. కివీస్ బ్యాటర్లలో రచిన్ రవీంద్ర(108) సెంచరీతో చెలరేగగా.. కేన్ విలియమ్సన్(95), గ్లెన్ ఫిలిప్స్(41) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్లు ఆడారు. పాక్ బౌలర్లలో వసీం మూడు వికెట్లు సాధించగా.. రవూఫ్, ఇఫ్తికర్, హసన్ అలీ ఒక్క వికెట్ సాధించారు. చదవండి: World Cup 2023: హార్దిక్ పాండ్యా అవుట్.. కెఎల్ రాహుల్కి ప్రమోషన్! వన్డే వరల్డ్ కప్లో View this post on Instagram A post shared by ICC (@icc) -
అతడు అద్భుతం.. క్రెడిట్ మొత్తం వాళ్లకే.. ఆ రెండు మ్యాచ్లు గెలుస్తాం: బాబర్
WC 2023 Ban Vs Pak: Babar Azam Credits to the boys: ‘‘మా ఆటగాళ్లంతా సమిష్టిగా రాణించారు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్.. ఇలా మూడు విభాగాల్లోనూ అదరగొట్టారు. ఈ క్రెడిట్ మొత్తం వాళ్లకే దక్కుతుంది. ఫఖర్ జమాన్ గనుక 20-30 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. తనదైన శైలిలో ఆటను మరో స్థాయికి తీసుకువెళ్లాడు. తనను ఇలా చూడటం సంతోషంగా ఉంది. తదుపరి రెండు మ్యాచ్లు కూడా గెలిచేందుకు మేము శాయశక్తులా కృషి చేస్తాం. అప్పుడు మేము ఎక్కడిదాకా చేరుకుంటామో చూద్దాం! ఈరోజు షాహిన్ మాకు అద్భుత ఆరంభం అందించాడు. నిజానికి బంగ్లా ఇన్నింగ్స్లో 15-20 ఓవర్ల మధ్యలో వాళ్లు మెరుగైన భాగస్వామ్యాలు నెలకొల్పారు. ఆ సమయంలో మా ప్రధాన బౌలర్లు వాళ్లను విడగొట్టడంలో సఫలమయ్యారు. మిడిల్ ఓవర్లలో వికెట్లు పడగొట్టగలిగారు’’ అంటూ పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం హర్షం వ్యక్తం చేశాడు. బంగ్లాదేశ్పై పాక్ విజయం ఈడెన్ గార్డెన్స్లో తమకు మద్దతుగా నిలిచినందుకు అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా కోల్కతాలో మంగళవారం నాటి మ్యాచ్లో పాక్.. బంగ్లాదేశ్పై 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ క్రమంలో పాయింట్ల పట్టికలో ఐదో స్థానానికి చేరుకుని సెమీస్ రేసులో ఇంకా తాము ఉన్నామనే సంకేతాలు ఇచ్చింది. మరోవైపు.. బాబర్ ఆజం బృందం చేతిలో ఓడిన బంగ్లాదేశ్ అధికారికంగా ఈ టోర్నీ నుంచి నిష్క్రమించిన తొలి జట్టుగా నిలిచింది. అతడు అద్భుతం ఈ నేపథ్యంలో వరుసగా నాలుగు ఓటముల తర్వాత దక్కిన విజయంపై స్పందించిన బాబర్ ఆజం సంతోషం వ్యక్తం చేశాడు. కోల్కతా ప్రేక్షకులు తమకు అండగా నిలిచారని కృతజ్ఞతలు తెలిపాడు. ఇక ఈ మ్యాచ్లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న పాక్ ఓపెనర్ ఫఖర్ జమాన్పై బాబర్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. అదే విధంగా తమ పేసర్ షాహిన్ ఆఫ్రిది ఆరంభంలోనే బంగ్లాను దెబ్బకొట్టగా.. అంతా కలిసి సమిష్టిగా బంగ్లాదేశ్ను ఓడించగలిగామని తమ ప్రదర్శన పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. కాగా ఆరంభ మ్యాచ్లలో విఫలమైన ఫఖర్ జమాన్ బంగ్లాతో మ్యాచ్లో అద్భుత అర్ధ శతకంతో పాక్కు విజయాన్ని అందించడం విశేషం. ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. కాగా ఈ టోర్నీలో పాక్ తదుపరి న్యూజిలాండ్, ఇంగ్లండ్లతో తలపడనుంది. బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ స్కోర్లు ►వేదిక: ఈడెన్ గార్డెన్స్, కోల్కతా ►టాస్: బంగ్లాదేశ్- బ్యాటింగ్ ►బంగ్లాదేశ్ స్కోరు: 204 (45.1) ►పాకిస్తాన్ స్కోరు: 205/3 (32.3) ►ఫలితం: బంగ్లాదేశ్పై ఏడు వికెట్ల తేడాతో పాక్ విజయం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ఫఖర్ జమాన్(74 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు). చదవండి: Virat Kohli: అల్లుడు కాదు!.. కోహ్లినే నా ఫేవరెట్ అంటున్న బాలీవుడ్ స్టార్! ఎందుకంటే.. View this post on Instagram A post shared by ICC (@icc) -
ఎట్టకేలకు పాకిస్తాన్ ఓటములకు బ్రేక్.. వరల్డ్కప్ రేసు నుంచి బంగ్లా అవుట్
ICC Cricket World Cup 2023 Ban Vs Pak: వన్డే వరల్డ్కప్-2023లో పాకిస్తాన్ పరాజయాల పరంపరకు ఎట్టకేలకు అడ్డుకట్ట పడింది. కోల్కతాలో బంగ్లాదేశ్తో మ్యాచ్లో బాబర్ ఆజం బృందం ఏడు వికెట్ల తేడాతో గెలుపొందింది. తద్వారా వరుస ఓటములకు ముగింపు పలికి సెమీస్ రేసు నుంచి తాము పూర్తిగా నిష్క్రమించలేదని చాటిచెప్పింది. వరల్డ్కప్ నుంచి బంగ్లాదేశ్ అవుట్ మరోవైపు.. పాక్ చేతిలో ఓటమితో బంగ్లాదేశ్ ప్రపంచకప్ ఈవెంట్ సెమీస్ నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఈడెన్ గార్డెన్స్లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, పాక్ పేసర్ల విజృంభణతో ఆది నుంచే ఎదురుదెబ్బలు తిన్న షకీబ్ అల్ హసన్ బృందం నామమాత్రపు స్కోరుకే పరిమితమైంది. View this post on Instagram A post shared by ICC (@icc) పాక్ పేసర్ల దెబ్బకు పెవిలియన్కు క్యూ బంగ్లా బ్యాటర్లలో ఓపెనర్ లిటన్ దాస్(45), కెప్టెన్ షకీబ్ అల్ హసన్(43), మెహదీ హసన్ మిరాజ్(25) పర్వాలేదనిపించగా.. మహ్మదుల్లా అర్ధ శతకం(56)తో ఆకట్టుకున్నాడు. మిగతా వాళ్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో బంగ్లాదేశ్ 45.1 ఓవర్లలో 204 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో షాహిన్ ఆఫ్రిది 3, హ్యారిస్ రవూఫ్ రెండు, మహ్మద్ వసీం జూనియర్కు మూడు వికెట్లు దక్కగా.. స్పిన్ బౌలర్లు ఇఫ్తికర్ అహ్మద్, ఉసామా మిర్ చెరో వికెట్ తీశారు. View this post on Instagram A post shared by ICC (@icc) అదరగొట్టిన పాక్ ఓపెనర్లు ఇక బంగ్లా విధించిన స్వల్ప లక్ష్య ఛేదనలో ఆరంభం నుంచే దూకుడు కనబరిచిన పాకిస్తాన్ 32.3 ఓవర్లనే పని పూర్తి చేసింది. ఓపెనర్లు అబ్దుల్లా షషీక్(68), ఫఖర్ జమాన్(81) హాఫ్ సెంచరీలతో అద్భుత ఇన్నింగ్స్ ఆడారు. బాబర్ నిరాశపరిచినా.. రిజ్వాన్ పూర్తి చేశాడు అయితే, కెప్టెన్ బాబర్ ఆజం మాత్రం 9 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్(26), ఇఫ్తికర్ అహ్మద్(17) ఆఖరి వరకు అజేయంగా నిలిచి పాకిస్తాన్ను విజయతీరాలకు చేర్చారు. View this post on Instagram A post shared by ICC (@icc) ఈ మ్యాచ్లో 74 బంతులు ఎదుర్కొని 3 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేసిన ఫఖర్ జమాన్ను ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వరించింది. ఇక బంగ్లాపై గెలుపుతో పాకిస్తాన్ ఈ మెగా టోర్నీలో మూడో విజయం నమోదు చేసింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో మూడు గెలిచి ఆరు పాయింట్లతో పట్టికలో ఐదో స్థానానికి చేరుకుంది. View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: ‘స్టార్ ఓపెనర్’పై వేటు! కెరీర్కు ఎండ్ కార్డ్ అంటూ..
నెదర్లాండ్స్తో మ్యాచ్లో విఫలమైన పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్పై వేటు పడింది. వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా తమ రెండో మ్యాచ్లో పాక్ మేనేజ్మెంట్ అతడికి చోటు ఇవ్వలేదు. హైదరాబాద్లో శ్రీలంకతో మ్యాచ్ సందర్భంగా ఫఖర్ జమాన్ స్థానంలో అబ్దుల్లా షఫీక్ తుదిజట్టులోకి వచ్చాడు. టాపార్డర్లో తమ ఆటగాళ్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాస్ సమయంలో కెప్టెన్ బాబర్ ఆజం వెల్లడించాడు. ఈ నేపథ్యంలో టీమిండియాతో అక్టోబరు 14 నాటి మ్యాచ్ నుంచి ఫఖర్ జమాన్ను తప్పిస్తారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై నెట్టింట్లో సెటైర్లు పేలుతుండగా.. అభిమానులు మాత్రం ఫఖర్ జమాన్కు అండగా నిలుస్తున్నారు. ‘‘బాబర్ ఆజం మాటల్ని బట్టి.. టీమిండియాతో మ్యాచ్ నుంచి జమాన్ అవుట్ అయ్యాడని అధికారికంగా తెలిసిపోయింది. నిజానికి 2019 వరల్డ్కప్ టోర్నీలో షోయబ్ మాలిక్కు ఇలాగే జరిగింది. ఏదేమైనా పాక్ తరఫున ఎన్నో గొప్ప ఇన్నింగ్స్ ఆడిన ఘనత ఫఖర్ జమాన్ది. తదుపరి మ్యాచ్లో ఆడే అవకాశం వస్తుందో లేదో! ఒకవేళ మళ్లీ అతడిని జట్టులోకి తీసుకోలేదంటే కెరీర్ ముగిసిపోతుందనడానికి సంకేతాలు వచ్చినట్లే!’’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా హైదరాబాద్లోని ఉప్పల్ మైదానంలో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్ ఆడిన విషయం తెలిసిందే. నెదర్లాండ్స్తో జరిగిన ఈ మ్యాచ్లో ఫఖర్ జమాన్ కేవలం 12 పరుగులు మాత్రమే చేయగలిగాడు. గత 11 ఇన్నింగ్స్లో ఈ లెఫ్టాండ్ బ్యాటర్ కనీసం ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. సగటు 18.36తో 202 పరుగులు సాధించాడు. అయితే, 33 ఏళ్ల ఫఖర్ జమాన్ 2023 ఆరంభంలో మాత్రం ఐదు ఇన్నింగ్స్లో మూడు సెంచరీలు, ఒక అర్ధ శతకం సాయంతో 454 పరుగులు చేశాడు. ఇక అబ్దుల్లా షఫీక్ చివరగా ఆసియా కప్-2023 మ్యాచ్లో శ్రీలంక మీద హాఫ్ సెంచరీ బాదాడు. ఇదిలా ఉంటే.. 2017లో పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన ఫఖర్ జమాన్ ఇప్పటి వరకు 79 వన్డేల్లో కలిపి 3284 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 15 అర్ద శతకాలు ఉన్నాయి. చదవండి: WC 2023: చరిత్ర సృష్టించిన జో రూట్.. ఆల్టైం రికార్డు బద్దలు -
Asia Cup: ఫైనల్లో భారత్ వర్సెస్ పాక్ లేనట్లే! మూటాముల్లె సర్దుకోండి..
Asia Cup 2023- Pakistan Vs Sri Lanka: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీరుపై ఆ జట్టు అభిమానులు మండిపడుతున్నారు. కీలక ఆటగాడిపై వేటు వేసినందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టైటిల్ గెలవడం మాట అటుంచితే.. ఫైనల్ చేరడమే కష్టమని.. ఇక ఇంటికి వచ్చేందుకు సిద్ధం కావాలంటూ పాక్ జట్టును ఉద్దేశించి ఘాటు విమర్శలు చేస్తున్నారు. టీమిండియా చేతిలో చిత్తుగా ఓడి ఈ దుస్థితిలో కాగా ఆసియా కప్-2023 సూపర్-4లో టీమిండియా చేతిలో చిత్తుగా ఓడిన పాకిస్తాన్.. శ్రీలంకతో చావోరేవో తేల్చుకోనుంది. కొలంబో వేదికగా గురువారం నాటి ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు భారత్తో పాటు ఫైనల్కు చేరుకుంటుంది. గాయాల కారణంగా కీలక పేసర్లు అవుట్ ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే మాత్రం రన్రేటు పరంగా మెరుగ్గా ఉన్న శ్రీలంక తుదిపోరుకు అర్హత సాధిస్తుంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పాకిస్తాన్ను ఓ వైపు గాయాల బెడద వెంటాడుతుంటే.. మరోవైపు.. ఓపెనర్ ఫఖర్ జమాన్ను తప్పిస్తూ మేనేజ్మెంట్ తీసుకున్న నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. లంకతో మ్యాచ్కు ముందు పాక్ బుధవారమే తమ తుది జట్టును ప్రకటించింది. లంకతో మ్యాచ్లో ఏకంగా ఐదు మార్పులు స్టార్ పేసర్లు నసీం షా, హ్యారిస్ రవూఫ్, ఆఘా సల్మాన్ గాయాల కారణంగా జట్టుకు దూరం కాగా.. వారి స్థానాల్లో జమాన్ ఖాన్, మహ్మద్ వసీం జూనియర్, సౌద్ షకీల్ ఎంట్రీ ఇచ్చారు. ఇక టీమిండియాతో మ్యాచ్లో దారుణ ప్రదర్శన కనబరిచిన ఫహీం ఆష్రఫ్పై వేటు పడగా.. మహ్మద్ నవాజ్ జట్టులోకి వచ్చాడు. అయితే, వెటరన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ స్థానంలో మహ్మద్ హ్యారిస్ను తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. వరుస వైఫల్యాల నేపథ్యంలో వేటు! ఇప్పటి వరకు ఈ వన్డే టోర్నీలో మొత్తంగా ఆడిన మూడు ఇన్నింగ్స్లో ఫఖర్ జమాన్ కేవలం 61 పరుగులు మాత్రమే చేశాడు. టీమిండియాతో మ్యాచ్లో 50 బంతులు ఆడి కేవలం 27 పరుగులు మాత్రమే చేశాడు. అయితే, పాక్ ఇన్నింగ్స్లో అతడే టాప్ స్కోరర్ కావడం గమనార్హం. ఈ క్రమంలో వరుస వైఫల్యాల నేపథ్యంలో కీలక మ్యాచ్లో ఫఖర్ జమాన్పై వేటు పడింది. అయితే, డూ ఆర్ డై మ్యాచ్లో అతడిని తప్పించడం జట్టుకు మైనస్గా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వరుస సెంచరీలు.. ద్విశతక వీరుడు తనదైన రోజు ఒంటిచేత్తో మ్యాచ్ను మలుపు తిప్పగల సత్తా ఉన్న అనుభవం ఉన్న ఆటగాడిని కాదని హ్యారిస్ను ఆడించడం సరికాదని విశ్లేషకులు అంటున్నారు. కాగా ఈ ఏడాది ఏప్రిల్లో సొంతగడ్డపై న్యూజిలాండ్తో వన్డే సిరీస్లో ఫఖర్ జమాన్ వరుస సెంచరీలు సాధించాడు. రెస్ట్ పేరిట వేటు? జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించి.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్తో పాటు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కూడా సొంతం చేసుకున్నాడు. అయితే, గత కొంతకాలంగా నిలకడలేమి ఫామ్తో సతమతమవుతున్న ఫఖర్ జమాన్కు ఇప్పటికే చాలా అవకాశాలు ఇచ్చిన మేనేజ్మెంట్ ఓపిక నశించి ఈసారి రెస్ట్ పేరిట వేటు వేసినట్లు తెలుస్తోంది. హ్యారిస్ రికార్డు గణాంకాలేమో ఇలా ఇక ఇప్పటి వరకు పాక్ తరఫున 76 వన్డేలు ఆడిన ఈ లెఫ్టాండ్ బ్యాటర్ 3268 పరుగులు సాధించాడు. ఫఖర్ జమాన్ ఖాతాలో 10 సెంచరీలు, ఒక డబుల్ సెంచరీ ఉంది. పాక్ తరఫున వన్డేల్లో ద్విశతకం సాధించిన తొలి బ్యాటర్ అతడే! ఇదిలా ఉంటే.. ఫఖర్ జమాన్ స్థానంలో తుదిజట్టులో వచ్చిన మహ్మద్ హ్యారిస్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు ఆడిన 5 వన్డేల్లో కలిపి 27 పరుగులు సాధించాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఇదిలా ఉంటే.. గందరగోళ పరిస్థితుల్లో లంక చేతిలో పాకిస్తాన్ చిత్తు కావడం ఖాయమంటూ టీమిండియా ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: టీమిండియాకు షాక్.. ఉమ్రాన్కు లక్కీ ఛాన్స్! రేసులో అతడు కూడా! -
పాక్ ఓపెనర్ విధ్వంసం..న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు..17 ఫోర్లు,6 సిక్సర్లతో 180 నాటౌట్
స్వదేశంలో న్యూజిలాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల వన్డే సిరీస్లో పాక్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. తొలి వన్డేలో సెంచరీతో (114 బంతుల్లో 117; 13 ఫోర్లు, సిక్స్) కదం తొక్కిన జమాన్.. రెండో వన్డేలో మరింత రెచ్చిపోయాడు. భారీ లక్ష్యఛేదనలో 144 బంతుల్లో 17 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 180 పరుగులతో అజేయంగా నిలిచి విధ్వంసం సృష్టించాడు. జమాన్కు జతగా బాబర్ ఆజమ్ (65), మహ్మద్ రిజ్వాన్ (54 నాటౌట్) రాణించడంతో కివీస్ నిర్ధేశించిన 337 పరుగుల లక్ష్యాన్ని పాక్ మరో 10 బంతులుండగానే ఛేదించి, 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 2-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్.. డారిల్ మిచెల్ (119 బంతుల్లో 129; 8 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీతో, లాథమ్ (85 బంతుల్లో 98; 8 ఫోర్లు, సిక్స్), బోవ్స్ (51 బంతుల్లో 51; 7 ఫోర్లు) హాఫ్సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు స్కోర్ చేసింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్ 4, నసీం షా ఓ వికెట్ పడగొట్టారు. భారీ లక్ష్య ఛేదనలో పాక్ ఆరంభం నుంచే దూకుడగా ఆడింది. ఫకర్ జమాన్ బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడుతుంటే.. కెప్టెన్ బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ స్ట్రయిక్ రొటేట్ చేస్తూ అతనికి సహకరించారు. ఇమామ్ ఉల్ హాక్ (24) పర్వాలేదనిపించగా.. అబ్దుల్లా షఫీక్ (7) విఫలమయ్యాడు. కివీస్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ, హెన్రీ షిప్లే, ఐష్ సోధిలకు తలో వికెట్ దక్కింది. సెంచరీతో చెలరేగిన ఫకర్ జమాన్కు వరుసగా రెండో మ్యాచ్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే కరాచీ వేదికగా మే 3న జరుగుతుంది. ప్రస్తుత పాక్ పర్యటనలో న్యూజిలాండ్ టీ20 సిరీస్ను 2-2తో సమం చేసుకున్న విషయం తెలిసిందే. -
సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్.. న్యూజిలాండ్పై పాక్ ఘన విజయం
న్యూజిలాండ్తో మూడు వన్డేల సిరీస్లో పాకిస్తాన్ బోణీ కొట్టింది. రావల్పిండి వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ విజయం సాధించింది. 289 లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్.. 48.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. పాక్ బ్యాటర్లలో ఫఖర్ జమాన్(117) సెంచరీతో చెలరేగగా.. ఇమామ్ ఉల్ హాక్(60) పరుగులతో రాణించాడు. కివీస్ బౌలర్లలో మిల్నే రెండు వికెట్లు పడగొట్టగా.. టిక్నిర్,సోధి, రవీంద్ర ఒక్క వికెట్ సాధించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. కివీస్ బ్యాటర్లలో విల్ యంగ్(86), డార్లీ మిచెల్(113) పరుగులలో రాణించారు. పాక్ బౌలర్లలో నసీం షా, షాహిన్ అఫ్రిది, హారిస్ రౌఫ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. కాగా సెంచరీతో చెలరేగిన జమాన్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఏప్రిల్ 29న రావల్పిండి జరగనుంది. చదవండి: MS Dhoni: 'చెలరేగుతున్నాడన్న కోపం.. రివ్యూకు వెళ్లి చేతులు కాల్చుకున్నాడు' -
ఫఖర్ జమాన్ వీరవిహారం.. డిఫెండింగ్ ఛాంపియన్స్ జోరు
పాకిస్తాన్ సూపర్ లీగ్(పీఎస్ఎల్) 8వ సీజన్లో లాహోర్ ఖలండర్స్ తన జోరు కొనసాగిస్తుంది. గత మ్యాచ్లో ఓటమిని మరిచిపోయేలా ఇస్లామాబాద్ యునైటెడ్పై 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఖలండర్స్ ఓపెనర్ ఫఖర్ జమాన్ 57 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో వీరవిహారం చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 226 పరుగుల భారీ స్కోరు చేసింది. సామ్ బిల్లింగ్స్ 22 బంతుల్లో 32 పరుగులు చేయగా.. చివర్లో రషీద్ ఖాన్ 5 బంతుల్లో 2 ఫోర్లు, ఒక సిక్స్తో 15 పరుగులు బాదాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన ఇస్లామాబాద్ యునైటెడ్ ఏ దశలోనూ లక్ష్యం దిశగా సాగలేకపోయింది. స్పిన్నర్ రషీద్ ఖాన్ స్పిన్ మాయాజాలానికి ఇస్లామాబాద్ తోక ముడిచింది. జట్టులో అత్యధిక స్కోరు 18 పరుగులే కావడం గమనార్హం. బౌలర్ల ధాటికి ఇస్లామాబాద్ 15.1 ఓవర్లలో 107 పరుగులకే కుప్పకూలింది. రషీద్ ఖాన్ నాలుగు వికెట్లు తీయగా.. హారిస్ రౌఫ్, జమాన్ ఖాన్లు తలా రెండు వికెట్లు తీశారు. ఇప్పటికే 9 మ్యాచ్ల్లో ఏడు విజయాలు, రెండు పాయింట్లతో ఉన్న లాహోర్ ఖలండర్స్ దాదాపు సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. చదవండి: మెస్సీని భయపెట్టిన అజ్ఞాత వ్యక్తి -
తొలి బంతికి బ్యాట్ రెండు ముక్కలైంది.. రెండో బంతికి వికెట్ ఎగిరిపడింది
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్ 2023 సీజన్లో బ్యాట్కు బంతికి మధ్య భీకర పోరు నడుస్తోంది. లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య నిన్న (ఫిబ్రవరి 26) జరిగిన మ్యాచ్లో ఈ పోరు పతాక స్థాయికి చేరింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ప్రత్యర్ధి బౌలర్లను ఓ రేంజ్లో ఆడుకోగా.. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీపై ఖలందర్స్ బౌలర్లు షాహీన్ అఫ్రిది (4-0-40-5), హరీస్ రౌఫ్ (4-0-38-1), జమాన్ ఖాన్ (3-0-28-2) నిప్పులు చెరిగే బంతులతో విరుచుకుపడ్డాడు. బౌలర్లకు, బ్యాటర్లకు మధ్య జరిగిన ఈ భీకర పోరులో ఓ ఆసక్తికర విషయం అందరినీ ఆకట్టుకుంది. ఖలందర్స్ నిర్ధేశించిన 242 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇన్నింగ్స్ను ప్రారంభించిన పెషావర్కు తొలి బంతికే షాహీన్ అఫ్రిది షాక్ ఇచ్చాడు. మెరుపు వేగంతో షాహీన్ సంధించిన బంతిని డ్రైవ్ చేసే క్రమంలో మహ్మద్ హరీస్ బ్యాట్ రెండు ముక్కలైంది. అనంతరం మరో బ్యాట్తో బ్యాటింగ్ కొనసాగించిన హరీస్ను షాహీన్ రెండో బంతికే క్లీన్ బౌల్డ్ చేశాడు. షాహీన్ సంధించిన వేగం ధాటికి ఆఫ్్ స్టంప్ గాల్లోకి పల్టీలు కొడుతూ నాట్యం చేసింది. చూడముచ్చటైన ఈ తంతుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్మీడియాలో చక్కర్లు కొడుతుంది. First ball: Bat broken ⚡ Second ball: Stumps rattled 🎯 PACE IS PACE, YAAR 🔥🔥#HBLPSL8 | #SabSitarayHumaray | #LQvPZ pic.twitter.com/VetxGXVZqY — PakistanSuperLeague (@thePSLt20) February 26, 2023 ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్ బ్యాటర్లు సైమ్ అయూబ్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), జేమ్స్ నీషమ్ (8 బంతుల్లో 12; సిక్స్), సాద్ మసూద్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. -
ఇదెక్కడి బాదుడు రా బాబు.. 34 బౌండరీలు, 28 సిక్సర్లు..!
PSL 2023: పాకిస్తాన్ సూపర్ లీగ్-2023లో బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. దాదాపు ప్రతి మ్యాచ్లో బ్యాటర్లు.. బౌలర్లను చీల్చిచండాతూ భారీ స్కోర్లు చేస్తున్నారు. లీగ్లో భాగంగా నిన్న (ఫిబ్రవరి 26) లాహోర్ ఖలందర్స్-పెషావర్ జల్మీ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో బ్యాటర్లు మరోసారి శివాలెత్తడంతో పరుగుల వరద పారింది. ఇరు జట్లకు చెందిన బ్యాటర్లు బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి మ్యాచ్కు వేదిక అయిన గడాఫీ స్టేడియంను హోరెత్తించారు. బ్యాటర్ల విధ్వంసం ధాటికి ఈ మ్యాచ్లో ఏకంగా 34 బౌండరీలు, 28 సిక్సర్లు నమోదయ్యాయి. తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ ఖలందర్స్.. ఫకర్ జమాన్ (45 బంతుల్లో 96; 3 ఫోర్లు, 10 సిక్సర్లు), షఫీక్ (41 బంతుల్లో 75; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), సామ్ బిల్లింగ్స్ (23 బంతుల్లో 47 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంకర ఇన్నింగ్స్ల ధాటికి నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 241 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పెషావర్ జల్మీ కూడా ఏమాత్రం తగ్గకుండా విజృంభించి ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాదినప్పటికీ టార్గెట్ కొండంతలా ఉండటంతో 40 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. పెషావర్ బ్యాటర్లు సైమ్ అయూబ్ (34 బంతుల్లో 51; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కొహ్లెర్ కాడ్మోర్ (23 బంతుల్లో 55; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), భానుక రాజపక్ష (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, సిక్స్), రోవమన్ పావెల్ (15 బంతుల్లో 20; 2 ఫోర్లు, సిక్స్), జేమ్స్ నీషమ్ (8 బంతుల్లో 12; సిక్స్), సాద్ మసూద్ (8 బంతుల్లో 16; 2 ఫోర్లు) పోరాడినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. పెషావర్ టీమ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 పరుగులు చేయగలిగింది. షాహీన్ అఫ్రిది (5/40) పెషావర్ పతనాన్ని శాసించగా.. జమాన్ ఖాన్ 2, హరీస్ రౌఫ్, రషీద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు. లీగ్లో భాగంగా ఇవాళ (ఫిబ్రవరి 27) లాహోర్ ఖలందర్స్-ఇస్లామాబాద్ యునైటెడ్ జట్లు తలపడనున్నాయి. -
మెరుపు ఇన్నింగ్స్తో విరుచుకుపడిన ఫకర్ జమాన్
పాకిస్తాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) ఎనిమిదో ఎడిషన్ ఓపెనింగ్ మ్యాచ్లో నిన్న (ఫిబ్రవరి 13) లాహోర్ ఖలందర్స్- ముల్తాన్ సుల్తాన్స్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో ముల్తాన్ సుల్తాన్స్పై లాహోర్ టీమ్ పరుగు తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లాహోర్ జట్టు.. ఫకర్ జమాన్ (42 బంతుల్లో 66; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీతో విరుచుకుపడటంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. మీర్జా బేగ్ (32), షాయ్ హోప్ (19), సికందర్ రజా (19 నాటౌట్), తలాట్ (20) ఓ మోస్తరుగా రాణించారు. సుల్తాన్స్ బౌలర్లలో ఇహ్సానుల్లా, ఉసామా మీర్ తలో 2 వికెట్లు, అకీల్ హోసేన్, దహాని చెరో వికెట్ దక్కించుకున్నారు. అనంతరం 176 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన సుల్తాన్స్.. మహ్మద్ రిజ్వాన్ (50 బంతుల్లో 75; 8 ఫోర్లు, సిక్స్) హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. రిజ్వాన్కు జతగా షాన్ మసూద్ (35), డేవిడ్ మిల్లర్ (25), కీరన్ పోలార్డ్ (20), కుష్దిల్ షా (12 నాటౌట్) ఓ మోస్తరుగా రాణించారు. ఖలందర్స్ బౌలర్ జమాన్ ఖాన్ వేసిన ఆఖరి ఓవర్లో సుల్తాన్స్ 15 పరుగులు సాధించాల్సి ఉండగా.. కేవలం 13 పరుగులు మాత్రమే వచ్చాయి. ఫలితంగా సుల్తాన్స్ పరుగు తేడాతో ఓడింది. నిర్ణీత ఓవర్లు ముగిసే సరికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్లో ఖలందర్స్ ఓపెనర్ ఫకర్ జమాన్ ఓ అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. పీఎస్ఎల్లో 2000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. గతంలో బాబర్ ఆజమ్ మాత్రమే ఈ మైలురాయిని అధిగమించాడు. పీఎస్ఎల్లో 68 మ్యాచ్లు ఆడిన బాబర్ 2413 పరుగులు సాధించగా.. 64 మ్యాచ్లు ఆడిన ఫకర్ జమాన్ 2005 పరుగులు చేశాడు. -
న్యూజిలాండ్తో తొలి వన్డే.. సెంచరీతో రికార్డుల్లోకెక్కిన శుభ్మన్ గిల్
టీమిండియా యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ వరుస శతకాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల (జనవరి 15) శ్రీలంకపై మూడో వన్డేలో (97 బంతుల్లో 116; 14 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీ సాధించిన గిల్.. ఇవాళ (జనవరి 18) న్యూజిలాండ్తో జరుగుతున్న తొలి వన్డేలోనూ శతకం బాదాడు. ఈ ఇన్నింగ్స్లో 87 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసిన గిల్.. వరుస ఇన్నింగ్స్ల్లో సెంచరీలు సాధించడంతో పాటు అతి తక్కువ వన్డేల్లో 3 సెంచరీలు చేసిన ఆటగాడిగా శిఖర్ ధవన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ధవన్.. 17 వన్డేల్లో 3 సెంచరీలు పూర్తి చేయగా.. గిల్.. 19 వన్డేల్లో ఈ మార్కును చేరుకున్నాడు. ఈ రికార్డుతో పాటు గిల్ మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో అతి వేగంగా (19 మ్యాచ్ల్లో) 1000 పరుగులు పూర్తి చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు ఫకర్ జమాన్ (18 వన్డేలు) అగ్రస్థానంలో ఉండగా.. గిల్, మరో పాక్ ఆటగాడు ఇమామ్ ఉల్ హాక్తో కలిసి రెండో స్థానంలో నిలిచాడు. భారత్ తరఫున అతి వేగంగా 1000 పరుగులు చేసిన ఆటగాళ్ల విషయానికొస్తే.. ఈ జాబితాలో గిల్ అగ్రస్థానంలో ఉండగా.. విరాట్ కోహ్లి, శిఖర్ ధవన్ (24 మ్యాచ్లు) సంయుక్తంగా రెండో ప్లేస్లో ఉన్నారు. కాగా, ఈ మ్యాచ్లో 34 ఓవర్లు ముగిసే సమయానికి టీమిండియా స్కోర్ 210/4గా ఉంది. గిల్ (94 బంతుల్లో 111; 16 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (22 బంతుల్లో 11; ఫోర్) క్రీజ్లో ఉన్నారు. రోహిత్ శర్మ (34), సూర్యకుమార్ యాదవ్ (31) ఓ మోస్తరుగా రాణించగా.. విరాట్ కోహ్లి (8), ఇషాన్ కిషన్ (5) నిరుత్సాహపరిచారు. కివీస్ బౌలర్లలో ఫెర్గూసన్, టిక్నర్, సాంట్నర్, డారిల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టారు. -
T20 WC 2022: పాక్ ఆశలపై నీళ్లు.. గాయంతో స్టార్ ప్లేయర్ ఔట్
PAK VS SA: సెమీస్ అవకాశాలు అంతంతమాత్రంగానే ఉన్న పాకిస్తాన్ జట్టుకు పుండుపై కారం చల్లినట్లు మరో షాక్ తగిలింది. రేపు (నవంబర్ 3) సౌతాఫ్రికాతో జరుగబోయే కీలక సమరానికి ముందు స్టార్ ఆటగాడు ఫఖర్ జమాన్ గాయపడ్డాడు. వన్డౌన్లో కీలకంగా వ్యవహరించే జమాన్.. మోకాలి గాయంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని పాక్ మీడియా మేనేజర్ అధికారికంగా ప్రకటించాడు. సెమీస్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్కు కీలక ఆటగాడు అందుబాటులో లేకపోవడం పాక్ విజయావకాశాలను భారీగా దెబ్బతీస్తుంది. అసలే మిడిలార్డర్ సమస్యతో బాధపడుతున్న పాక్కు జమాన్ గైర్హాజరీ మరింత ఆందోళన కలిగిస్తుంది. సౌతాఫ్రికాతో ఓడిపోతే పాక్ ఇంటిదారి పట్టాల్సి వస్తుంది. కాగా, ఆసియా కప్ సందర్భంగా గాయపడ్డ జమాన్.. ఇటీవలే జట్టులోకి వచ్చాడు. ప్రస్తుత ప్రపంచకప్లో పాక్ ఆడిన తొలి రెండు మ్యాచ్ల్లో ఆడని జమాన్.. చివరిగా నెదర్లాండ్స్తో జరిగిన మ్యాచ్లో బరిలోకి దిగాడు. ఆ మ్యాచ్లో అతను 16 బంతుల్లో 3 ఫోర్ల సాయంతో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం గ్రూప్-2 పాయింట్ల పట్టికలో పాక్ చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఆడిన 3 మ్యాచ్ల్లో ఓ గెలుపు (నెదర్లాండ్స్), రెండు పరాజయాలతో (ఇండియా, జింబాబ్వే) 2 పాయింట్లు (0.765) కలిగి ఉంది. ఈ సమీకరణల నడమ ప్రస్తుతానికి బాబర్ సేన్ సెమీస్ అవకాశాలు మినుమినుకుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో కీలక ఆటగాడు అందుబాటులో లేకపోవడం ఆ జట్టు విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపనుంది. -
T20 World Cup 2022: భారత్తో తొలి మ్యాచ్.. పాకిస్తాన్కు గుడ్ న్యూస్!
టీ20 ప్రపంచకప్-2022కు పాకిస్తాన్కు గుడ్ న్యూస్ అందింది. గాయంతో బాధపడుతన్న ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ పూర్తిగా కోలుకున్నాడు. కాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ముందు జమన్ మోకాలి గాయంతో బాధపడ్డాడు. దీంతో అతడిని టీ20 ప్రపంచకప్కు రిజర్వ్ ఆటగాడిగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంపిక చేసింది. అయితే ఇప్పడు జమాన్ పూర్తిగా గాయం నుంచి కోలుకుకోవడంతో.. 15 మంది ఆటగాళ్లతో కూడిన పాక్ టీ20 ప్రపంచకప్ జట్టులో చేరాడు. అదే విధంగా టీ20 ప్రపంచకప్కు ఎంపికైన స్పిన్నర్ ఉస్మాన్ ఖాదిర్ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనందున అతడిని రిజర్వ్ జాబితాలో పీసీబీ చేర్చింది. సెప్టెంబర్ 25న ఇంగ్లండ్తో టీ20 మ్యాచ్లో ఉస్మాన్ ఖాదిర్ బోటనవేలుకు గాయమైంది. ఇక లండన్లో చికిత్స పొందిన ఫఖర్ జమాన్.. స్టార్ పేసర్ షాహీన్ షా ఆఫ్రిదితో కలిసి శనివారం ఆస్ట్రేలియాకు చేరుకోనున్నాడు. కాగా ఆఫ్రిది కూడా తన మోకాలి గాయానికి లండన్లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంగ్లండ్, ఆఫ్గానిస్తాన్తో జరిగే రెండు ప్రాక్టీస్ మ్యాచ్లకు వీరిద్దరూ జట్టు సెలక్షన్కు అందుబాటులో ఉంటారు. ఇక ఈ మెగా ఈవెంట్లో పాకిస్తాన్ తమ తొలి మ్యాచ్లో టీమిండియాతో ఆక్టోబర్ 23న మెల్బోర్న్ వేదికగా తలపడనుంది. చదవండి: T20 WC 2022: జట్లు, పాయింట్ల కేటాయింపు విధానం, షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్.. ఇతర పూర్తి వివరాలు -
టీ20 ప్రపంచకప్కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్!
టీ20 ప్రపంచకప్-2022కు ముందు పాకిస్తాన్కు భారీ షాక్ తగిలే అవకాశం కన్పిస్తోంది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ ఫఖర్ జమాన్ మోకాలి గాయం కారణంగా ఇంగ్లండ్ టీ20 సిరీస్తో పాటు, టీ20 ప్రపంచకప్కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఇక ఇదే విషయాన్ని పాకిస్తాన్ మాజీ కెప్టెన్ రషీద్ లతీఫ్ కూడా వెల్లడించాడు. కాగా ఆసియా కప్-2022లో పాకిస్తాన్జట్టులో భాగంగా ఉన్న జమాన్ అంతగా అకట్టుకోలేపోయాడు. ఈ మెగా టోర్నీలో 6 మ్యాచ్లు ఆడిన జమాన్ కేవలం 96 పరుగులు మాత్రమే చేశాడు. కీలకమైన ఫైనల్లో ఫఖర్ డకౌట్గా వెనుదిరిగాడు. "ఫఖర్ జమాన్ ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు దూరం కానున్నాడు. అతడు ప్రస్తుతం మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. అతడు తన గాయం నుంచి కోలుకోవడానికి నాలుగు నుంచి ఆరు వారాల సమయం పడుతోంది. అతడు త్వరగా కోలుకోని జట్టులో చేరాలని ఆశిస్తున్నాను. మరోవైపు షాహీన్ అఫ్రిది కూడా ఇదే గాయంతో బాధపడుతున్నాడు" అని రషీద్ లతీఫ్ తన యూట్యూబ్ ఛానల్లో పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్తో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా సిరీస్కు పాక్ జట్టును పీసీబి గురువారం ప్రకటించే అవకాశం ఉంది. చదవండి: Babar Azam: అతడి కెరీర్ నాశనం చేస్తున్నారు! బాబర్ ఆజం, రిజ్వాన్ను నమ్ముకుంటే పాక్ ఏ టోర్నీ గెలవలేదు! -
శివాలెత్తిన పాక్ బ్యాటర్లు.. హాంగ్ కాంగ్ ముందు భారీ లక్ష్యం
ఆసియాకప్లో భాగంగా గ్రూఫ్-ఏలో హాంగ్ కాంగ్తో మ్యాచ్లో పాకిస్తాన్ భారీ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. మహ్మద్ రిజ్వాన్(57 బంతుల్లో 78 పరుగులు నాటౌట్, 6 ఫోర్లు, ఒక సిక్సర్) బాధ్యతాయుతంగా ఆడగా.. ఫఖర్ జమాన్(41 బంతుల్లో 53, 3 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించగా.. ఆఖర్లో కుష్దిల్ షా(15 బంతుల్లో 35 పరుగులు నాటౌట్, 5 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. అంతకముందు టాస్ గెలిచి పాకిస్తాన్ను బ్యాటింగ్ ఆహ్వానించిన హాంగ్ కాంగ్కు ఆరంభంలో బాబర్ ఆజం రూపంలో బిగ్ వికెట్ లభించింది. కానీ ఆ తర్వాత మహ్మద్ రిజ్వాన్, ఫఖర్ జమాన్లు మరో వికెట్ పడకుండా ఆడారు. ఇద్దరి మధ్య వంద పరుగులకు పైగా భాగస్వామ్యం నమోదైంది. ఫిప్టీ పూర్తి చేసిన తర్వాత ఫఖర్ జమాన్ ఔటైనప్పటికి.. చివర్లో కుష్దిల్ షా విధ్వంసంతో పాక్ భారీ స్కోరు సాధించింది. హాంగ్ కాంగ్ బౌలర్లలో ఎహ్సాన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. చదవండి: Babar Azam: 'నువ్వే సరిగ్గా ఆడడం లేదు.. ఇంకెందుకు సలహాలు!' -
పాకిస్తాన్ ఆటగాడు అయిన మెచ్చుకోకుండా ఉండలేం
-
ప్రత్యర్థివైనా మెచ్చుకోకుండా ఉండలేం..
ఆసియాకప్లో భాగంగా టీమిండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఫఖర్ జమాన్ చూపిన క్రీడాస్పూర్తి విధానం అభిమానులను ఫిదా చేసింది. విషయంలోకి వెళితే.. ఇన్నింగ్స్ ఆరో ఓవర్ ఆవేశ్ ఖాన్ వేశాడు. ఆ ఓవర్లో అప్పటికే రెండు ఫోర్లతో జోరు మీదున్న ఫఖర్ జమాన్ క్రీజులో ఉన్నాడు. ఓవర్ ఐదో బంతిని ఆవేవ్ షార్ట్పిచ్ వేయగా.. బంతి బౌన్స్ అయింది. అయితే ఫఖర్ జమాన్ షాట్ మిస్ చేసుకోగా బంతి కీపర్ కార్తిక్ చేతుల్లోకి వెళ్లింది. కానీ దినేశ్ కార్తిక్ ఎలాంటి అప్పీల్ చేయలేదు. ఈ నేపథ్యంలోనే ఫఖర్ జమాన్ క్రీడాస్పూర్తిని ప్రదర్శించాడు. కనీసం అంపైర్ సిగ్నల్ ఇచ్చే వరకు కూడా వేచి చూడకుండా పెవిలియన బాట పట్టాడు. మహ్మద్ రిజ్వాన్ ఆలోచించమని చెప్పినా వినకుండా ఫఖర్ వెళ్లిపోయాడు. రిప్లేలో బంతి బ్యాట్ ఎడ్జ్ను స్లిక్ చేస్తు వెళ్లినట్లు స్పైక్ వచ్చింది. అప్పటికి కార్తిక్ మాత్రం ఏం తగల్లేదు అని సైగ చేయడం కనిపించింది. Fakhar Zaman hats of to you for walking before the umpire lifts his finger. Cricket is a gentleman's game after all#INDvsPAK — SiLItIS (@SiLItIS1) August 28, 2022 Fakhar Zaman hats of to you for walking before the umpire lifts his finger. Cricket is a gentleman's game after all#INDvsPAK — SiLItIS (@SiLItIS1) August 28, 2022 Good Sportsman's Ship #FakharZaman#INDvPAK — Chintala Madhusudhan Reddy (@madhuc430) August 28, 2022 చదవండి: IND Vs PAK Asia Cup 2022: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ లైవ్ అప్డేట్స్ -
Ned Vs Pak: పాకిస్తాన్కు చుక్కలు చూపించిన ‘పసికూన’.. బాబర్ ఏమన్నాడంటే!
Netherlands vs Pakistan, 1st ODI (Rescheduled match): పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు నెదర్లాండ్స్ చుక్కలు చూపించింది. ఆఖరి వరకు పోరాడి ఓడినప్పటికీ అద్భుత పోరాటం కనబరిచి అభిమానుల మనసు గెలుచుకుంది. పాక్కు ముచ్చెమటలు పట్టించి తమని పసికూన అని తేలికగా తీసిపారేయొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఇక చావు తప్పి కన్నులొట్టబోయినట్లు బాబర్ ఆజం బృందం 16 పరుగుల తేడాతో గట్టెక్కింది. రీషెడ్యూల్డ్ వన్డే సిరీస్లో భాగంగా పాకిస్తాన్ ప్రస్తుతం నెదర్లాండ్స్లో పర్యటిస్తోంది. సెంచరీతో చెలరేగిన ఫఖర్ జమాన్ ఇందులో భాగంగా రోటర్డామ్ వేదికగా మంగళవారం ఇరు జట్ల మధ్య తొలి వన్డే జరిగింది. టాస్ గెలిచిన పర్యాటక పాక్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఫఖర్ జమాన్ సెంచరీ(109 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 109 పరుగులు- రనౌట్)తో చెలరేగి శుభారంభం అందించాడు. అయితే, మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. వన్డౌన్లో వచ్చిన కెప్టెన్ బాబర్ ఆజం 74 పరుగులతో రాణించాడు. ఆ తర్వాత రిజ్వాన్ 14, ఖుష్దిల్ 21 పరుగులు సాధించారు. ఇక షాబాద్ ఖాన్, సల్మాన్ ఆఖరి వరకు అజేయంగా నిలిచి వరుసగా 48, 27 పరుగులు చేశారు. PC: Cricket Netherlands దీంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కింగ్మాకు ఒకటి, వాన్ బీక్కు రెండు, బాస్ డె లీడేకు రెండు వికెట్లు దక్కాయి. మూడు అర్ధ శతకాలు! ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆతిథ్య నెదర్లాండ్స్కు ఓపెనర్ విక్రమ్జిత్ సింగ్ 65 పరుగులతో రాణించి ఊపిరి పోశాడు. మరో ఓపెనర్ మాక్స్ ఒడౌడ్ (1), వన్డౌన్ బ్యాటర్ వెస్లీ(2) సహా బాస్ డీ లీడే(16) పూర్తిగా విఫలమైనా.. ఐదో స్థానంలో బరిలోకి దిగిన టామ్ కూపర్ 54 బంతుల్లో 65 పరుగులతో చెలరేగాడు. కెప్టెన్ ఇన్నింగ్స్.. టామ్ కూపర్కు జతకలిసిన కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ స్కాట్ ఎడ్వర్డ్స్ 60 బంతుల్లో 71 పరుగులు సాధించాడు. ఆఖరి వరకు అజేయంగా నిలిచి అద్భుత పోరాటం చేసి జట్టును విజయం దిశగా నడిపించాడు. అయితే, మిగతా ఆటగాళ్లు తేజ నిడమనూరు(15), లోగాన్ వాన్ బీక్(28), టిమ్ ప్రింగ్లే(0), ఆర్యన్ దత్(6- నాటౌట్) అనుకున్న స్థాయిలో రాణించకపోవడంతో ఓటమి తప్పలేదు. 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసిన నెదర్లాండ్స్ 16 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. పాక్ బ్యాటర్ ఫఖర్ జమాన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. కాస్త ఉపశమనం: బాబర్ ఆజం ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం మాట్లాడుతూ.. ‘‘ఎట్టకేలకు నాకు కాస్త ఉపశమనం లభించింది. ఫఖర్ అద్భుతమైన శతకం సాధించాడు. మేము మరింత మెరుగ్గా రాణించాల్సింది. ఇక్కడి పిచ్ పరిస్థితులు మాకు గట్టి సవాల్ విసిరాయి. వికెట్ కాస్త తేమగా ఉంది’’ అంటూ తృటిలో ఓటమి నుంచి తప్పించుకున్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించాడు. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది! ఇక నెదర్లాండ్స్ కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్.. ‘‘నిజంగా ఈ ఓటమి మమ్మల్ని పూర్తిగా నిరాశపరిచింది. 3, 4 క్యాచ్లు వదిలేశాం. లేదంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఇటీవలి కాలంలో మేము మెరుగ్గా రాణిస్తున్నాం. కానీ.. ఈరోజు చేజేతులా ఓటమిని ఆహ్వానించినట్లయింది’’ అని విచారం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే టి20 ప్రపంచకప్ టోర్నీలో ఆడేందుకు నెదర్లాండ్స్ అర్హత సాధించిన విషయం తెలిసిందే. చదవండి: Kevin Obrien: ఇంగ్లండ్ బౌలర్లకు చుక్కలు చూపించి.. పాకిస్తాన్పై సెంచరీతో మెరిసి! కెవిన్ అరుదైన ఘనతలు! IND Vs ZIM: జింబాబ్వే కదా అని తీసిపారేయొద్దు.. ఆ ముగ్గురితో జాగ్రత్త 🗣️ Fakhar Zaman shares how he and Babar Azam planned for their superb 168-run partnership as he reviews the first ODI against the Netherlands 🏏#NEDvPAK | #BackTheBoysInGreen pic.twitter.com/3L4eptqgQw — Pakistan Cricket (@TheRealPCB) August 17, 2022 -
పసికూనపై పాక్ బ్యాటర్ ప్రతాపం.. టీమిండియాతో ఆడి చూపించు!
పాకిస్తాన్ ఓపెనర్ ఫఖర్ జమాన్ పసికూన నెదర్లాండ్స్పై శతకంతో రెచ్చిపోయాడు. విషయంలోకి వెళితే.. మంగళవారం నెదర్లాండ్స్తో తొలి వన్డేలో టాస్ గెలిచిన పాకిస్తాన్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ ఇమాముల్ హక్ 2 పరుగులకే వెనుదిరిగినప్పటికి.. కెప్టెన్ బాబర్ ఆజం(74)తో కలిసి ఫఖర్ జమాన్ పాక్ ఇన్నింగ్స్ను నడిపించాడు. ఈ క్రమంలోనే వన్డేల్లో ఏడో శతకం అందుకున్న ఫఖర్ జమాన్ ఓవరాల్గా 109 బంతుల్లో 109 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. బాబర్ ఆజం(85 బంతుల్లో 74, 6 ఫోర్లు, 1 సిక్సర్) అతనికి సహకరించాడు. ఇక చివర్లో షాదాబ్ ఖాన్ (28 బంతుల్లో 48 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరిపించడంతో పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. కాగా నెదర్లాండ్స్పై శతకంతో రెచ్చిపోయిన ఫఖర్ జమాన్ను టీమిండియా ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. '' పసికూనపై ప్రతాపం చూపించడం కాదు.. ఆసియాకప్లో టీమిండియాతో మ్యాచ్లో ఆడి చూపించు.. అప్పుడు తెలుస్తుంది నీ అసలు ఆట'' అంటూ కామెంట్స్ చేశారు. కాగా ఆగష్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు ఆసియా కప్ టోర్నీ జరగనుంది. చిరకాల ప్రత్యర్థులైన టీమిండియా, పాకిస్తాన్లు ఆగస్టు 28న తలపడనున్నాయి. ఈ మ్యాచ్లో గెలిచి టి20 ప్రపంచకప్లో ఓటమికి బదులు తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఇక రెండు నెలలవ్యవధిలోనే టీమిండియా, పాకిస్తాన్ రెండుసార్లు ఎదురుపడనున్నాయి. ఒకటి ఆసియా కప్ అయితే.. మరొకటి ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 28న మరోసారి ఇరుజట్లు తలపడనున్నాయి. అన్నీ సక్రమంగా జరిగితే.. ఆసియాకప్ ఫైనల్లో భారత్, పాకిస్తాన్ తలపడితే ముచ్చటగా మూడోసారి తలపడినట్టువుతుంది. ఇక ఆసియాకప్లో భారత్, పాక్లు 13సార్లు తలపడితే.. ఏడుసార్లు టీమిండియా గెలవగా.. ఐదు మ్యాచ్ల్లో పాక్ నెగ్గింది. ఒక మ్యాచ్లో ఫలితం తేలలేదు. కాగా ఆగస్ట్ 28న జరుగనున్న భారత్-పాక్ మ్యాచ్కు సంబంధించిన టికెట్ల అమ్మకాన్ని ఆగస్టు 15న ప్రారంభించగా.. నిమిషాల వ్యవధిలోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. A seventh ODI century for Fakhar Zaman 🙌 Watch all the #NEDvPAK matches on https://t.co/CPDKNxpgZ3 for FREE (in select regions) 📺 | 📝 Scorecard: https://t.co/RGyky5X3nm pic.twitter.com/PZE0QThlk3 — ICC (@ICC) August 16, 2022 చదవండి: నిమిషాల్లో అమ్ముడుపోయిన భారత్- పాక్ మ్యాచ్ టికెట్లు.. ఒకేసారి 7.5 లక్షల మంది దండయాత్ర Rohit Sharma: 'జెండా కొనడానికి డబ్బులు లేవా'.. పరువు తీసుకున్న హిట్మ్యాన్ -
Ind Vs Pak: ప్రోమో.. రోహిత్ పుల్ షాట్లు.. కోహ్లి క్లాసిక్ డ్రైవ్స్.. అట్లుంటది మరి!
Asia Cup 2022- India Vs Pakistan: భారత్- పాకిస్తాన్ మ్యాచ్ అంటే క్రికెట్ ప్రేమికులకు ఓ పండుగ లాంటిది. దాయాది జట్ల మధ్య పోరుకు ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే! ఇటీవలి కాలంలో కేవలం ప్రపంచకప్ టోర్నీలు సహా ఆసియా కప్ వంటి ప్రతిష్టాత్మక ఈవెంట్లలో మాత్రమే ఈ చిరకాల ప్రత్యర్థులు తలపడుతున్నాయి. ఇలా అరుదుగానైనా ఈ మెగా టోర్నీల్లో భారత్- పాకిస్తాన్ పోటీ పడటం చూసి ఆనందిస్తున్నారు ఫ్యాన్స్. ఇక దాయాది దేశాల మధ్య మ్యాచ్ అంటేనే భావోద్వేగాల సమాహారం అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆటగాళ్లు మైదానంలో పోటీ పడుతుంటే.. అభిమానులు కన్నార్పకుండా మరీ మ్యాచ్ చూస్తారనడంలో అతిశయోక్తి లేదు. కాగా ఇప్పటి వరకు జరిగిన అన్ని మెగా ఈవెంట్లలో భారత్ పైచేయి సాధించగా.. ఐసీసీ టీ20 వరల్డ్కప్-2021లో మాత్రం కోహ్లి సేనకు పాక్ చేతిలో పరాభవం ఎదురైన విషయం తెలిసిందే. కనీవిని ఎరుగని రీతిలో విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియా ఏకంగా 10 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఎప్పుడెప్పుడు మళ్లీ భారత్- పాకిస్తాన్ పోటీ పడతాయా? టీమిండియా బదులు తీర్చుకునే సమయం ఎప్పుడు వస్తుందా అని భారత అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆసియా కప్-2022 రూపంలో వారి నిరీక్షణకు తెరపడే సమయం రానే వచ్చింది. ఆగష్టు 27 నుంచి ఈ ఈవెంట్ ఆరంభం కానున్న సంగతి తెలిసిందే. ఆ మరుసటి రోజే రోహిత్ సేన- బాబర్ బృందంతో అమీతుమీ తేల్చుకోనుంది. ఈ నేపథ్యంలో బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటికే పలు ప్రోమోలు వదిలింది. తాజాగా మరో వీడియోతో ముందుకు వచ్చింది. ‘‘వాళ్లు ప్రత్యర్థులు.. వారి మధ్య పోటీ తీవ్రమైనది.. ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్.. ఇరు జట్లలో స్టార్లు ఉన్నారు? ఈ మహా సంగ్రామంలో ఎవరు ఎవరిపై పైచేయి సాధిస్తారు’’ అంటూ క్యాప్షన్ జతచేసింది. ‘రోహిత్ శర్మ పుల్ షాట్లు.. ఫఖర్ జమాన్ బిగ్ హిట్లు... విరాట్ కోహ్లి క్లాసిక్ డ్రైవ్స్.. బాబర్ ఆజమ్ గ్రేస్ఫుల్ బ్యాటింగ్’’ అంటూ సాగిన ఈ ప్రోమో అభిమానులను ఆకర్షిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరూ ఓ లుక్కేయండి! చదవండి: Asia Cup 2022: టీమిండియా సెలక్టర్లు చేసిన అతి పెద్ద తప్పు అదే! Asia Cup 2022 IND VS PAK: భారత్-పాక్ మ్యాచ్ సందడి మొదలైంది.. హీటెక్కిస్తున్న హిట్మ్యాన్ ప్రోమో There are rivalries. There are intense rivalries. Then there is #INDvPAK! 🤩 Both the sides are full of stroke-makers! Which one do you think will pip the other in the greatest rivalry? #AsiaCup | Aug 28, 6 PM | Star Sports & Disney+Hotstar #TeamIndia | #BelieveInBlue pic.twitter.com/b15YcBThez — Star Sports (@StarSportsIndia) August 11, 2022
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement