-
'సముద్ర గర్భం'లోకి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే ఈ గేమ్ ట్రై చేయండి!
సముద్ర గర్భంలోకి వెళ్లడం అంటే మరో ప్రపంచంలోకి వెళ్లినట్లే. పరిచిత, అపరిచిత, వింత, క్రూర.. రకరకాల జీవులు మనకు సవాలు విసురుతాయి. సాహసం ఏమాత్రం నీరు కారి΄ోయినా జీవితం నీటిపాలు కావాల్సిందే. అందుకే సముద్ర గర్భంలో ప్రతి క్షణం...విలువైన సాహసమే. సముద్ర గర్భంలో సాహస యాత్ర చేయాలని ఉందా? అయితే ఈ గేమ్ మీ కోసమే.అడ్వెంచర్ సిమ్యూలెషన్ గేమ్ ‘ఎండ్లెస్ ఒషియన్ లుమినస్’ విడుదలైంది. జపాన్ గేమింగ్ కంపెనీ ‘అరిక’ డెవలప్ చేసిన గేమ్ ఇది. ‘ఎండ్లెస్ ఓషన్’ సిరీస్లో వస్తున్న థర్డ్ గేమ్. సముద్రగర్భ ప్రపంచాన్ని రికార్డ్ చేయడానికి ఈ గేమ్లో ప్లేయర్ స్కూబా డైవర్ పాత్ర పోషించాల్సి ఉంటుంది.ప్లాట్ఫామ్: నిన్టెండో స్విచ్,జానర్స్: అడ్వెంచర్, సిమ్యులేషన్,మోడ్స్: సింగిల్–ప్లేయర్, మల్టీ ప్లేయర్ -
స్టెల్లర్ బ్లేడ్..! గ్రహాంతరవాసులతో వార్..!!
యాక్షన్ అడ్వెంచర్ గేమ్ ‘స్టెల్లర్ బ్లేడ్’ ఈ నెల 26న విడుదల కానుంది. కథ విషయానికి వస్తే భూమి మీద ఉన్న మనుషులకు, గ్రహాంతవాసులకు మధ్య యుద్ధం జరుగుతుంది. గ్రహాంతరవాసులతో యుద్ధంలో ఓడిపోయిన తరువాత మానవాళి తరిమివేయబడుతుంది. కోల్పోయిన తమ స్వస్థలాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఈవ్తో పాటు ఆమె దళం ‘నయతిబా’ అనే గ్రహాంతరవాసులతో పోరాటానికి సిద్ధం అవుతుంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్ నుంచి ఆడే గేమ్ ఇది. శత్రువు వ్యూహాల ఆధారంగా ఎదురు దాడి చేయాల్సి ఉంటుంది. ఈ గేమ్కు సంబంధించిన డెమోను గత నెల విడుదల చేశారు. జానర్స్: యాక్షన్, అడ్వెంచర్.. ఇంజిన్: అన్రియల్ ఇంజిన్4 మోడ్స్: సింగిల్–ప్లేయర్ ప్లాట్ఫామ్: ప్లేస్టేషన్ 5 ఇవి చదవండి: ఈ షాకింగ్ నిజాల గురించి మీకు తెలుసా? -
Gaming: 'టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది..
సర్జెంట్ స్టూడియోస్ వారి ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ ఈ నెల 23న విడుదల కాబోతోంది. ఈ గేమ్లో ప్రధాన పాత్ర జావ్. డబుల్ జంప్, వాల్ జంప్, గాల్లో గంతులు వేయడంలో దిట్ట. మూడు ఆత్మలను బంధించి మృత్యుదేవత కలుంగకు అర్పిస్తుంది. సన్ మాస్క్, మూన్ మాస్క్ అనేవి జావ్ ప్రధాన ఆయుధాలు. శత్రువుల ఆటకట్టించడంలో ఈ రెండు ఆయుధాలకు తమదైన ప్రత్యేకత ఉంది. శత్రువులను జయించినప్పుడు వారి నుంచి ‘ఉలోగి’ అనే సోల్ ఎనర్జీని కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘టేల్స్ ఆఫ్ కెన్జెర’ అనేది 2.5డీ ప్లాట్ఫామ్ అడ్వెంచర్ గేమ్. ప్లేయర్స్ క్రమంగా కొత్త కొత్త స్కిల్స్ను సొంతం చేసుకుంటారు. ప్లాట్ఫామ్స్: మైక్రోసాఫ్ట్ విండోస్, నిన్టెండో స్విచ్, ఎక్స్ బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ మోడ్: సింగిల్ ప్లేయర్ -
పాపులర్ వీడియో గేమర్కి మెలనోమా కేన్సర్! ఎందువల్ల వస్తుందంటే..!
ఇటీవల కాలంటో ప్రముఖ సెలబ్రెటీలు, ఆటగాళ్లు కేన్సర్ బారిన పడుతున్నారు. ఒక్కసారిగా వారిలో చురుకుదనం కోల్పోయి డల్గా అయిపోతున్నారు. పాపం అక్కడకి లేని మనో నిబ్బరాన్నంతా కొని తెచ్చుకుని మరీ ఈ భయానక వ్యాధితో పోరాడుతున్నారు. కొందరూ ప్రాణాలతో బయటపడగా.. మరికొందరూ ఆ మహమ్మారికి బలవ్వుతున్నారు. అచ్చం అలానే ఓ ప్రసిద్ధ వీడియో గేమర్ ఈ కేన్సర్ మహమ్మారి బారిన పడ్డాడు. అతని కొచ్చిన కేన్సర్ ఏంటంటే.. ప్రోఫెషనల్ వీడియో గేమ్ ప్లేయర్ ట్విచ్ స్ట్రీమర్ నింజా చర్మ కేన్సర్తో బాధపడుతున్నాడు. ఈ విషయం విని ఒక్కసారిగా అతని అభిమానులంత షాక్కి గురయ్యారు. అతడి పాదాలపై ఒక పుట్టుమచ్చ ఉంది. అది అసాధారణంగా పెద్దది అవ్వడం ప్రారంభించింది. దీంతో వైద్యులను సంప్రదించాడు స్ట్రీమర్. అన్ని పరీక్షలు చేసి మెలనోమా కేన్సర్ అని నిర్థారించారు వైద్యులు. అయితే వైద్యులు ప్రారంభ దశలోనే ఈ కేన్సర్ని గుర్తించారని పేర్కొన్నాడు సోషల్ మీడియా ఎక్స్లో. దయచేసి అందరూ చర్మానికి సంబంధించిన చెకప్లు చేసుకోండి అని అభిమానులను కోరాడు. ఇంతకీ అతనికి వచ్చిన మెలనోమా కేన్సర్ అంటే..! మెలనోమా అనేది మెలనోసైట్స్ నుంచి ఉద్భవించే ఒక రకమైన చర్మ కేన్సర్. ఇది మెలనిన్ వర్ణద్రవ్యాన్ని ఉత్పత్తి చేస్తుంది. మెలనోమా సాధారణంగా సూర్యరశ్మికి బహిర్గతమయ్యే చర్మంపై ప్రారంభమవుతుంది. చాలా మెలనోమాలు అతినీలలోహిత కాంతికి గురికావడం వల్ల సంభవిస్తాయి. మెలనోమా దశను అనుసరించి చికిత్స విధానం మారుతుందని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ పేర్కొంది. ఈ మెలనోమా కేన్సర్ చర్మంపై ఎక్కడైనా తలెత్తుతుందని నిపుణుల చెబుతున్నారు. చాలా పుట్టుమచ్చలు, గోధుమ రంగు మచ్చలు వంటి వాటిల్లో చర్మంపై అసాధారరణ పెరుగదల ఉంటే ఇది వస్తుంది. వీటిని ఏబీసీడీఈలు అనే అగ్లీ డక్లింగ్ గుర్తు ద్వారా మెలనోమాని గుర్తించడం జరుగుతుంది. అంతేగాదు ఆ ప్రదేశంలోని అనుమానాస్పద కణజాలాన్ని చర్మవ్యాధి నిపుణుడు బయాప్సీ చేయించి , క్యాన్సర్ కణాలు ఉన్నాయా, లేదా అని నిర్ణయిస్తాడు. అలా ఈ కేన్సర్ని గుర్తించడం జరిగాక, సిటీ స్కాన్లు, పీఈటీ స్కాన్లు సాయంతో ఏ దశలో ఉందనేది నిర్థారిస్తారు. చికిత్స.. ఇతర కేన్సర్ల కంటే ఇందులో చర్మం వద్ద కణాజాలం కాబట్టి తీసివేయడం కాస్త సులభం. గాయాన్ని తొలగించేటప్పడే క్యాన్సర్ ప్రమేయం ఎంతవరకు ఉందో నిర్థారించి తొలగించాక, పూర్తిగా తొలగిపోయాయా లేదా అని నిర్ధారించుకోవడానికి పాథాలజీ పరీక్షలకు కూడా పంపడం జరుగుతుంది. మెలనోమా చర్మంలోని పెద్ద ప్రాంతాలో ఉంటే మాత్రం చర్మాన్ని అంటుకట్టుట వంటివి చేయాల్సి ఉంటుంది. ఒకవేళ కేన్సర్ శోషరస కణుపులకు వ్యాపించే ప్రమాదం ఉంటే.. శోషరస కణుపు బయాప్సీని తీసుకుంటారు. కొన్ని సందర్భాల్లో రేడియేషన్ థెరపీ, కీమో థెరపీ వంటివి కూడా అవసరమవ్వచ్చు. ఇక నింజా 2011 నుంచి వృత్తిపరంగా పలు వీడియో గేమ్లు ఆడి స్ట్రీమర్గా మారాడు. ఇక్కడ ట్విచ్ అనేది ప్రధానంగా వీడియో గేమ్లపై దృష్టి సారించే లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్ఫారమ్. అయితే ఇది సంగీతం, సృజనాత్మక కళలు, వంట మరిన్నింటిని కవర్ చేసే స్ట్రీమ్లను కూడా కలిగి ఉంటుంది. దీనిద్వారా ఎంతో మంది ప్రముఖులతో లైవ్స్ట్రీమ్లో వీడియో గేమ్లు ఆడి పేరు తెచ్చుకున్నాడు. దీని కారణంగానే అతనికి వేలాదిమంది ఫాలోవర్లుఉన్నారు. మైక్రోసాఫ్ట్ స్ట్రీమిగ్ ఫ్లాట్ఫాం మిక్సర్ కోసం 2019లో ట్విచ్ని వదిలిపెట్టాడు. ఆ మిక్సర్ షట్డౌన్ అయ్యాక మళ్లీ ట్విచ్కి తిరిగి వచ్చాడు. ఈ స్ట్రీమింగ్ ద్వారా అంతర్జాతీయ ప్రశంసల తోపాటు మిలయన్ల డాలర్లును సంపాదించాడు. (చదవండి: తండ్రి మిలియనీర్..కానీ కొడుక్కి 20 ఏళ్ల వరకు ఆ విషయం తెలియదు!) -
Gaming: యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్.. 'హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్'
హరైజన్ జీరో డాన్ (2017) గేమ్కు సీక్వెల్గా వచ్చిన యాక్షన్–రోల్ ప్లేయింగ్ గేమ్ హరైజన్ ఫర్బిడెన్ వెస్ట్(పీసీ) విడుదలైంది. థర్డ్–పర్సన్ పర్స్పెక్టివ్లో ఆడే గేమ్ ఇది. ప్రమాదకరమైన ఆయుధాలతో నిండిన ‘అలోయ్’ అనే హంటర్ను ప్లేయర్ కంట్రోల్ చేయాల్సి ఉంటుంది. నోరా తెగకు చెందిన యంగ్ హంటర్ అలోయ్ శాస్త్రవేత్త ఎలిజబెత్ సోటెక్ క్లోన్. ‘మిస్టీరియస్ ప్లేగ్’ మూలాన్ని తెలుసుకోవడానికి తన బృందాన్ని ఫర్బిడెన్ వెస్ట్ అని పిలవబడే సరిహద్దు ప్రాంతానికి తీసుకువెళుతుంది. ఆలోయ్ తన ప్రయాణంలో భారీ తుఫానులను, సంచార తెగలతో యుద్ధాలను ఎదుర్కొంటుంది. పచ్చనిలోయల నుంచి శిథిలమైన నగరాల వరకు ఆలోయ్ ప్రయాణంలో ఎన్నో దృశ్యాలు కనిపిస్తాయి. గత గేమ్తో ΄ోల్చితే ఈ గేమ్ మ్యాప్ పెద్దగా ఉంటుంది. షీల్డ్వింగ్, ఫోకస్ స్కానర్, డైవింగ్ మాస్క్, పుల్కాస్టర్లాంటి టూల్స్ను కంబాట్లో ఉపయోగించవచ్చు. ప్లాట్ఫామ్స్: ప్లే స్టేషన్ 4, ప్లే స్టేషన్ 5 విండోస్ జానర్: యాక్షన్, అడ్వెంచర్ మోడ్: సింగిల్–ప్లేయర్ ఇవి చదవండి: Sia Godika: 'సోల్ వారియర్స్'.. తను ఒక చేంజ్మేకర్! -
అసలు వీటి గురించి మీకు తెలుసా..!
పోరాటమే ఊపిరిగా.. ట్యాక్టికల్ రోల్ ప్లేయింగ్ గేమ్ ‘యూనికార్న్ వోవర్లార్డ్’ మార్చి 8న విడుదల కానుంది. తన జెనోయిరాన్ సామ్రాజ్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి రాజ్యం నుంచి బహిష్కృతుడైన యువరాజు అలైన్ తన మిత్రులను సమీకరించి చేసే పోరాటమే ఈ గేమ్. అలైన్, అతడి బలగాల పోరాటాన్ని గేమ్ప్లే ఫాలో అవుతుంది. అన్ని క్యారెక్టర్లు, లొకేషన్లు, స్ప్రైట్స్ 2డీ ఆర్ట్తో డిస్ప్లే అవుతాయి. జానర్: ట్యాక్టికల్ రోల్–ప్లేయింగ్ మోడ్: సింగిల్–ప్లేయర్, మల్టీప్లేయర్ ప్లాట్ఫామ్స్: నిన్టెండో స్విచ్/ప్లేస్టేషన్ 4/ప్లేస్టేషన్ 5, ఎక్స్బాక్స్ సిరీస్ ఎక్స్/ఎస్ అవును...ఇది నిజమే! ‘ది ఫేస్బుక్’తో కాలేజీ క్యాంపస్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు మార్క్ జుకర్ బర్గ్. ఫేస్బుక్ ఎంతోమంది ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షించింది. ఒకప్పుడు పాపులర్ అయిన సోషల్ నెట్వర్కింగ్ సైట్ ‘ఫ్రెండ్ స్టర్’ ఫేస్బుక్ను కొనుగోలు చేయడానికి ముందుకువచ్చింది. వచ్చిన బంపర్ ఆఫర్లను తిరస్కరించడం ద్వారా మరింత సంచలనం సృష్టించాడు జుకర్ బర్గ్. ఫేస్బుక్ అమ్మడంపై కాకుండా ‘ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమందికి చేరువ కావాలి’ అంటూ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాడు. పెనిషియస్ చెడు ప్రభావం, హాని కలిగిస్తుంది అనే చెప్పే సందర్భంలో వాడే మాట...పెనిషియస్ ఉదా: ది పెనిషియస్ ఎఫెక్స్ట్ ఆఫ్ ఎయిర్ పోల్యూషన్ పెర్ఫిడీ నమ్మకద్రోహం, మోసం జరిగిన సందర్భంలో వాడే మాట పెర్ఫిడీ ఉదా: ఇట్ వాజ్ యాన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిజ్ పెర్ఫిడీ పెన్యూరీ కొరత. పేదరికం, వేదన.... మొదలైన సందర్భాలలో ఉపయోగించే మాట పెన్యూరీ. ఉదా: హీ వాజ్ బ్రాట్ అప్ ఇన్ పెన్యూరీ. విత్ఔట్ ఎడ్యుకేషన్ ఇవి చదవండి: ఇంటిప్స్: వీటితో ఇబ్బంది పడ్తున్నారా.. మన్నికకై ఇలా చేయండి! -
Microsoft layoffs: 1,900 మందిని ఇంటికి పంపిస్తున్న మైక్రోసాఫ్ట్!
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ తమ యాక్టివిజన్ బ్లిజార్డ్తో సహా దాని వీడియో-గేమ్ విభాగాలలో 1,900 మంది ఉద్యోగులను తొలగిస్తోంది. యాక్టివిజన్ బ్లిజార్డ్ను మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ గత ఏడాది 69 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్ను బ్లూమ్బెర్గ్ వార్తా సంస్థ సమీక్షించింది. మైక్రోసాఫ్ట్ 22,000 మంది గేమింగ్ వర్కర్లలో 8 శాతం మంది తొలగించనున్నట్లు ఈమెయిల్లో మైక్రోసాఫ్ట్ గేమింగ్ చీఫ్ ఫిల్ స్పెన్సర్ పేర్కొన్నారు. మైక్రోసాఫ్ట్ యాక్టివిజన్ బ్లిజార్డ్ కొనుగోలును ఖరారు చేసిన మూడు నెలల్లోనే ఉద్యోగుల తొలగింపులు చేపట్టడం గమనార్హం. భవిష్యత్తుకు అనుగుణంగా తమ వనరులను రీసెట్ చేయడానికే తొలగింపులు చేపడుతున్నట్లు యాక్టివిజన్ పబ్లిషింగ్ చీఫ్ రాబ్ కోస్టిచ్ ఉద్యోగులకు పంపిన ఈమెయిల్లో పేర్కొన్నట్లు బ్లూమ్బెర్గ్ నివేదించింది. -
CES 2024: హెచ్పీ నుంచి సరికొత్త గేమింగ్ ల్యాప్ట్యాప్లు
ప్రముఖ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ హెచ్పీ సరికొత్త గేమింగ్ ల్యాప్ట్యాప్లను ఆవిష్కరించింది. లాస్ వెగాస్లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో (CES 2024)లో తమ OMEN, HyperX సబ్-బ్రాండ్ల కింద కొత్త గేమింగ్ పోర్ట్ఫోలియోను పరిచయం చేసింది. కంపెనీ కొత్త లాంచ్లలో గేమర్లకు గేమింగ్, ఇతర క్రియేటివ్ టాస్క్ల కోసం ఒమెన్ ట్రాన్సెండ్ 14 (Omen Transcend 14) గేమింగ్ ల్యాప్టాప్ ఉంది. దీంతోపాటు 240Hz రిఫ్రెష్ రేట్తో 2.5K OLED డిస్ప్లేతో OMEN ట్రాన్స్సెండ్ 16-అంగుళాల ల్యాప్టాప్ను కూడా హెచ్పీ ఆవిష్కరించింది. HP Omen 16 అంగుళాల గేమింగ్ ల్యాప్టాప్, Victus 16 అంగుళాల గేమింగ్ ల్యాప్టాప్ రెండూ సరికొత్త Intel i7 HX ప్రాసెసర్ను కలిగి ఉంటాయి. హెచ్పీ ఒమెన్ ట్రాన్సెండ్ 14 ముఖ్యమైన ఫీచర్లు.. 120Hz రిఫ్రెష్ రేట్తో గేమింగ్, కంటెంట్ క్రియేషన్కు అనువైన IMAX కూడిన సర్టిఫైడ్ 2.8K OLED డిస్ప్లే లాటిస్-లెస్ స్కై-ప్రింటెడ్ RGB కీబోర్డ్ ఎక్కడికైనా తీసుకెళ్ళేందుకు వీలుగా 1.6 కేజీల బరువుతో తేలికనది 140W ఛార్జింగ్ అడాప్టర్తో 11.5 గంటల బ్యాటరీ లైఫ్ NVIDIA GeForce RTX 4070 GPUతో ఇంటెల్ అల్ట్రా 9 185H ప్రాసెసర్ -
ఇండియాలో దూసుకుపోతున్న గేమింగ్ ఇండస్ట్రీ, 2028 నాటికి..
ఇటీవల హైదరాబాద్లో జరిగిన ఇండియా గేమ్ డెవలప్ కాన్ఫరెన్స్ (ఐజీడీసీ)లో విడుదల చేసిన ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్’ మన దేశంలో డిజిటల్ గేమింగ్ ఇండస్ట్రీ ఉజ్వల భవిష్యత్తు గురించి చెప్పకనే చెప్పింది. డిజిటల్ గేమ్స్కు యూత్ మహారాజ పోషకులే అయినప్పటికీ ‘యూజర్’ స్థానానికి మాత్రమే పరిమితం కావడం లేదు. గేమింగ్ ఇండస్ట్రీ ముఖ చిత్రాన్ని మార్చడంలో క్రియాశీల పాత్ర పోషిస్తున్నారు. సొంతంగా గేమ్ బిల్డింగ్ కంపెనీలు స్టార్ట్ చేస్తున్నారు. ఇండియా గేమ్ డెవలప్ కాన్ఫరెన్స్(ఐజీడీసీ)లో గేమింగ్ వెంచర్ క్యాపిటల్ ఫర్మ్ లుమికై గూగుల్తో కలిసి ‘లుమికై స్టేట్ ఆఫ్ ఇండియా గేమింగ్ రిపోర్ట్’ విడుదల చేసింది. మన దేశంలో గేమింగ్ ఇండస్ట్రీ స్పీడ్కు ఇది అద్దం పడుతుంది. మన గేమింగ్ ఇండస్ట్రీ 2028 నాటికి అరవై రెండు వేల కోట్లను దాటుతుందని ఈ రిపోర్ట్ తెలియజేస్తుంది. ‘డిజిటల్ గేమ్స్’ అనగానే గుర్తుకు వచ్చేది యువతరమే. వారు డిజిటల్ గేమ్స్ వైపు ఆకర్షితం కావడానికి ప్రధాన కారణాలు... ∙సోషల్ కనెక్షన్: ఫోర్ట్నైట్, మైన్క్రాఫ్ట్లాంటి గేమ్స్ ఫిజికల్ లొకేషన్తో పనిలేకుండా వర్చువల్ ఎన్విరాన్మెంట్లో ప్లేయర్స్ ఇతరులతో ఇంటరాక్ట్ అయ్యే, స్నేహం చేసే, ఆన్లైన్ కమ్యూనిటీలను నిర్మించుకునే అవకాశాన్ని కలిగిస్తున్నాయి. జెన్ జెడ్ హైలీ సోషల్ జెనరేషన్గా పేరు తెచ్చుకుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్లేయర్స్ ఒకరితో ఒకరు కనెక్ట్ కావడానికి, పోటీ పడడానికి తమ గేమ్స్లో సోషల్ ఫీచర్స్ను తీసుకువస్తున్నాయి కంపెనీలు. ►యూజర్–జనరేటెడ్ కంటెంట్: యూజర్లు తమ సొంత కంటెంట్ను క్రియేట్ చేసుకోవడానికి ఎన్నో పాపులర్ గేమ్స్ అనుమతిస్తున్నాయి. తమ స్వీయ అనుభవాలను ఉపయోగించి యూజర్–జనరేటెడ్ కంటెంట్ను వర్చువల్ వరల్డ్లో వైబ్రెంట్ అండ్ డైనమిక్గా క్రియేట్ చేయడానికి వీలవుతుంది. ∙ఎన్నో ఎన్నెన్నో: యూత్ ప్లేయర్స్కు మోడ్రన్ గేమ్స్ కాంపిటేటివ్, కో–ఆపరేటీవ్ గేమ్ప్లే, ఎక్స్΄్లోరేషన్, స్టోరీ టెల్లింగ్కు సంబంధించి సరికొత్త అనుభవాలను అందిస్తున్నాయి. ప్లేయర్స్కు గ్రాఫిక్స్, సౌండ్, గేమ్ ప్లే మెకానిక్స్ను చేరువచేయడంపై దృష్టి పెడుతున్నాయి. ►స్ట్రేస్ ఫ్రీ–క్రియేటివిటీ: యూత్లో కొద్దిమంది ఒత్తిడి నుంచి బయట పడడానికి గేమింగ్కు దగ్గరవుతున్నారు. ఆర్ట్, డిజైన్, స్టోరీ టెల్లింగ్లాంటి సృజనాత్మక ప్రక్రియలను ఇష్టపడే యువతరం క్రియేటివ్ ఎక్స్ప్రెషన్స్ కోసం వీడియో గేమ్స్ ఆడుతున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని కంపెనీలు తమ గేమ్స్లో ప్లేయర్స్కు సొంత గేమ్ మోడ్స్, మ్యాప్స్ క్రియేట్ చేయడానికి అనుమతిస్తున్నాయి. యువతరమే కారణం... మొబైల్ డివైజ్లకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా మొబైల్ గేమింగ్ అభివృద్ధికి యూత్ ఉపయోగపడుతుంది. సంప్రదాయ గేమింగ్ కన్సోల్స్ కంటే అఫర్డబుల్ అండ్ యాక్సెసబుల్గా ఉండే మొబైల్ డివైజ్లకే ప్రాధాన్యత ఇస్తోంది యువతరం. ఇ–స్పోర్ట్స్ లేదా కాంపిటీటివ్ గేమింగ్ మెయిన్ స్ట్రీమ్లోకి రావడానికి ప్రధాన కారణం యువత. యువతరం చూపిస్తున్న ఆసక్తి వల్ల ఎన్నో టెలివిజన్ నెట్వర్క్లు ఇ–స్పోర్ట్స్ను నిర్వహిస్తున్నాయి. ప్రొఫెషనల్ ఇ–స్పోర్ట్స్ ప్లేయర్స్ తయారవుతున్నారు. బోలెడు ఉపాధి అవకాశాలు... గేమ్స్ నుంచి అపారమైన ఆనందాన్ని సొంతం చేసుకోవడమే కాదు గేమింగ్ ఇండస్ట్రీ నుంచి ఉపాధి అవకాశాలను కూడా వెదుక్కుంటోంది యువతరం. ఇ- స్పోర్ట్స్ ఇటీవల కాలంలో మల్టీ–బిలియన్–డాలర్ ఇండస్ట్రీగా ఎదిగింది. ప్రొఫెషనల్ ప్లేయర్స్కు జీతాలతో పాటు స్పాన్సర్షిప్ అవకాశాలు కూడా వస్తున్నాయి. గేమింగ్ ఇండస్ట్రీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష ఉద్యోగావకాశాలు ఉన్నాయి అంటుంది టీమ్లీజ్ డిజిటల్ ఫర్మ్ రిపోర్ట్ ‘గేమింగ్: టుమారోస్ బ్లాక్బస్టర్. ప్రోగ్రామింగ్ (గేమ్ డెవలపర్స్, యూనిటీ డెవలపర్స్), టెస్టింగ్ (గేమ్స్ టెస్ట్ ఇంజనీరింగ్, క్వాలిటీ అండ్ అసూరెన్స్), యానిమేషన్, డిజైన్(మోషన్ గ్రాఫిక్ డిజైనర్స్, వర్చువల్ రియాలిటీ డిజైనర్స్), ఆర్టిస్ట్స్ (వీఎఫ్ఎక్స్ అండ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్), కంటెంట్ రైటింగ్, గేమింగ్ జర్నలిజం మొదలైన విభాగాలలో యువతకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. స్ఫూర్తిదాయక సూపర్స్టార్స్ యువతలో ఎంతోమందిలాగే ఈ ముగ్గురికి గేమ్స్ అంటే చాలా ఇష్టం. గేమింగ్ను వీరు అభిరుచిగా మాత్రమే చూడలేదు. గేమింగ్ రంగంలో తమ వ్యాపారదక్షతను నిరూపించుకోవాలకున్నారు. సొంతంగా గేమ్ బిల్డింగ్ కంపెనీ ప్రారంభించి తమ సత్తా చాటారు. యువతరంలో ఎంతో మందికి స్ఫూర్తి ఇస్తున్నారు. సూపర్ గేమింగ్ యూనివర్శిటీ ఆఫ్ ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ చేసింది క్రిస్టెల్ డీక్రూజ్. ఆ తరువాత కొలరాడో స్టేట్ యూనివర్శిటీ(యూఎస్)లో కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ చేసింది. ‘టాప్టూలెర్న్’లో ఎడ్యుకేషనల్ గేమ్ డెవలపర్గా ఉన్నప్పుడు గేమ్స్కు ఉండే పవర్ ఏమిటో దగ్గర నుంచి చూసింది. ఆ కంపెనీలో చేరిన తొలి మహిళా ఉద్యోగి క్రిస్టెల్. ఆ తరువాత ఫ్రెండ్స్తో కలిసి ‘సూపర్ గేమింగ్’ అనే గేమ్బిల్టింగ్ కంపెనీ స్టార్ట్ చేసింది. అపార్ గేమ్స్ ముంబై యూనివర్శిటీలో ఫైన్ ఆర్ట్స్లో డిగ్రీ చేసిన లక్ష్మీ కానోల్కర్ ముంబైలోని వెలింగ్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసింది. ఇంటరాక్టివ్ ఇ–లెర్నింగ్ చిల్డ్రన్స్ కంటెంట్ను డిజైనింగ్ చేయడం ద్వారా గేమింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. గేమింగ్ ఇండస్ట్రీలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన అనుభవంతో సొంతంగా గేమ్ డెవలపింగ్ కంపెనీ ‘అపార్ గేమ్స్’ ప్రారంభించింది. వినో జో ది యూనివర్శిటీ ఆఫ్ మాంచెస్టర్(ఇంగ్లాండ్)లో సైకాలజీలో మాస్టర్స్ చేసిన తరువాత కేపీఎంజీ కన్సల్టింగ్ వింగ్లో చేరింది సౌమ్యా సింగ్ రాథోడ్. టైమ్స్ గ్రూప్లో పనిచేసిన తరువాత ‘వినో జో’ పేరుతో సొంతంగా ఆన్లైన్ సోషల్ గేమింగ్ కంపెనీని మొదలు పెట్టింది. ‘ఒక విషయంపై మనకు ఇష్టం ఉన్నప్పుడు అదే మన బలంగా మారుతుంది. ఆ బలంతోనే విజయం సాధించవచ్చు’ అంటుంది సౌమ్యా సింగ్. -
డ్రీమ్ సిటీలో డ్రీమ్హాక్ గేమింగ్
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఫెస్టివల్ ‘డ్రీమ్హాక్’కు నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికైంది. శుక్రవారం ప్రారంభమైన యాక్షన్–ప్యాక్డ్ గేమింగ్ మహోత్సవం మూడ్రోజులపాటు కొనసాగనుంది. గేమింగ్, స్పోర్ట్స్ టోర్నమెంట్, చెస్ డెత్ మ్యాచ్, రెట్రో గేమింగ్ వంటి వినూత్న గేమ్లతోపాటు వర్క్షాప్లు, అభిమానుల మీట్ అండ్ గ్రీట్, డ్యాన్స్ షో, మ్యూజిక్ జోన్, స్టాండప్ కామిక్స్ వంటి వినూత్న కార్యక్రమాలను నిర్వహించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ మద్దతుతో నోడ్వింగ్ గేమింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ డ్రీమ్హాక్ గేమింగ్ మహోత్సవంలో ఇంటెల్, మాన్స్టర్, హ్యుందయ్, బింగో వంటి ప్రముఖ సంస్థలు గేమింగ్ వేదికలను ఏర్పాటు చేశాయి. పీసీ మోడ్, మొబైల్ మోడ్ విధానంలో గేమ్స్ నిర్వహించగా హైదరాబాద్తోపాటు దేశంలోని వివిధ నగరాల డిజిటల్ గేమర్స్ పాల్గొంటున్నారు. డ్రీమ్హాక్ రాపిడ్ ఓపెన్ టోర్నమెంట్, డ్రీమ్హాక్ బ్లిట్జ్ ఓపెన్ టోర్నమెంట్, కేఓ ఫైట్ నైట్, పబ్జీ ఆధారిత గేమ్లు, రెట్రో జోన్ గేమ్స్ మోనోపోలీ, లూడో, క్యారమ్, స్నేక్స్ అండ్ ల్యాడర్స్, యూఎన్వో వంటి ప్రసిద్ధ బోర్డ్ గేమ్లతో డ్రీమ్హాక్ అలరిస్తుంది. వివిధ విభాగాల విజేతలకు లక్షల్లో నగదు బహుమతులు ఇవ్వనున్నట్లు డ్రీమ్హాక్ ప్రకటించింది. -
అక్టోబర్ 7న జీఎస్టీ మండలి కీలక భేటీ
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో వచ్చే నెల 7వ తేదీన జీఎస్టీ మండలి కీలక సమావేశం జరగనుంది. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఈ జీఎస్టీ మండలి 52వ సమావేశం జరగనుందని ఎక్స్లో ఒక అధికారిక ప్రకటన పోస్టయ్యింది. జీఎస్టీ మండలి నిర్ణయాల్లో కేంద్ర ఆర్థికమంత్రితోపాటు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థికమంత్రులు కూడా భాగస్వాములుగా ఉండే సంగతి తెలిసిందే. ఆగస్టు 2వ తేదీన జరిగిన గత జీఎస్టీ మండలి భేటీలో క్యాసినోలు, గుర్రపు పందాలు, ఆన్లైన్ గేమింగ్ల పన్ను విధానాలపై కీలక నిర్ణయాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ మూడింటికి సంబంధించిన పందాల పూర్తి ఫేస్ వ్యాల్యూపై 28 శాతం జీఎస్టీ విధించాలని ఈ సమావేశాల్లో నిర్ణయించడం జరిగింది. -
కంప్యూటర్ సైన్స్లో ఫెయిల్.. పట్టుదలతో గేమింగ్ ప్లాట్ఫామ్ని నెలకొల్పాడు
స్కూల్ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ యూనిట్ టెస్ట్లో ఫెయిలైన ఏకైక విద్యార్థికి సాంకేతికతపై పట్టు సాధించాలనే పట్టుదల పెరిగితే ఎలా ఉంటుంది? అచ్చం... అభిక్ సాహ లా ఉంటుంది. పశ్చిమబెంగాల్కు చెందిన అభిక్ సాహ పదిహేను సంవత్సరాల వయసులోనే దేశీ సెర్చ్ ఇంజిన్ను డెవలప్ చేసి భేష్ అనిపించుకున్నాడు. స్నేహితుడు హర్షిత్ జైన్తో కలిసి మొదలు పెట్టిన డీ సెంట్రలైజ్డ్ క్లౌడ్ గేమింగ్ ప్లాట్ఫామ్ ‘వోన్లీ గేమ్’ విజయపథంలో దూసుకుపోతోంది. కంప్యూటర్ సైన్స్ యూనిట్ టెస్ట్లో ఫెయిల్ అయిన ఏకైన విద్యార్థి అభిక్ సాహ. అది తనపై బలమైన ప్రభావం చూపించింది. సాంకేతికతపై పట్టు సాధించాలనే పట్టుదలను పెంచింది. కంప్యూటర్ లాంగ్వేజ్లను నేర్చుకోవడాన్ని ఒకప్పుడు బోర్గా ఫీలైన సాహ ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. ఇంటర్నెట్ను విశ్వవిద్యాలయం చేసుకున్నాడు. కంప్యూటర్ లాంగ్వేజ్లను నేర్చుకోవడాన్ని ఒకప్పుడు బోర్గా ఫీలైన సాహ ఆ తరువాత వాటిపై పట్టు సాధించాడు. ఇంటర్నెట్ను విశ్వవిద్యాలయం చేసుకున్నాడు.ఆన్లైన్ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. ఆన్లైన్ ట్యుటోరియల్ ద్వారా నేర్చుకోవడం మొదలు పెట్టాడు. బేసిక్ సాఫ్ట్వేర్ నుంచి వెబ్సైట్ బ్లాకింగ్ వరకు ఎన్నో విషయాలపై పట్టు సాధించాడు. పదమూడవ పుట్టిన రోజు సందర్భంగా తండ్రి తనకు స్మార్ట్ఫోన్ గిఫ్ట్గా ఇచ్చాడు. ప్రపంచ సాంకేతికతపై అవగాహన పెంచుకోవడానికి, రకరకాల మొబైల్ అప్లికేషన్లను క్రియేట్ చేయడానికి ఈ స్మార్ట్ఫోన్ ఉపయోగపడింది. పదిహేను సంవత్సరాల వయసులో వినూత్నమైన దేశీ సెర్చ్ ఇంజిన్ ‘ఒరిగాన్’ను డెవలప్ చేయడం ద్వారా వార్తల్లోకి వచ్చి ‘భేష్’ అనిపించుకున్నాడు అభిక్ సాహ. పశ్చిమబెంగాల్లోని చల్స పట్టణానికి చెందిన సాహ హైస్కూల్ రోజుల్లోనే మొబైల్ అప్లికేషన్లు, వెబ్సైట్ బిల్డింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ డెవలపింగ్ లాంగ్వేజిలపై ఉచిత వీడియో ట్యుటోరియల్స్ నిర్వహించడంలో తలమునకలై ఉండేవాడు. ఇండియన్ ఇ–స్పోర్ట్స్ వృద్ధిరేటు ఆశాజనకంగా, ఉత్సాహంగా ఉందని, 2027 కల్లా భారీ వృద్ధిరేటు కనిపిస్తుందని కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్) రిపోర్ట్ తెలియజేస్తుంది. స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ల ద్వారా రకరకాల టోర్నమెంట్స్ను నిర్వహిస్తున్నారు. వీటిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వీక్షిస్తున్నారు. మన దేశంలో ఇ–గేమ్స్కు పెరుగుతున్న పాపులారిటీని గమనించి హర్షిత్ జైన్, అభిక్ సాహ డీసెంట్రలైజ్డ్ క్లౌడ్ గేమింగ్ ప్లాట్ఫామ్ ‘వోన్లీ ప్లే’ ప్రారంభించారు. దీన్ని ‘నెక్ట్స్ బిగ్ వోటీటీ’ లక్ష్యంగా మొదలు పెట్టారు. గేమ్ ఆడాలనే ఉత్సాహం ఒక కోణం అయితే ఖర్చును దృష్టిలో పెట్టుకొని దూరంగా ఉండడం మరో కోణం. పీసీ, కీబోర్డ్, హై–కంప్యూటింగ్ సీపీయూ సెటప్ వరకు ఎంతో ఖర్చు అవుతుంది. అయితే క్లౌడ్ గేమింగ్ ప్లాట్ఫామ్ ‘వోన్లీ ప్లే’తో యూజర్లు మంత్లీ ప్లాన్ రూ.499 ద్వారా డిఫరెంట్ స్టోర్స్ నుంచి ఎన్నో టైటిల్స్తో యాక్సెస్ కావచ్చు. హై ప్రాసెసింగ్ సీపీయూలాంటి అడ్వాన్స్డ్ గేమింగ్ ఎక్విప్మెంట్ అవసరం లేదు. యూజర్స్ తమ దగ్గర ఉన్న ఏ డివైజ్ ద్వారా అయినా గేమ్స్తో యాక్సెస్ కావచ్చు.‘ఒక విధంగా చెప్పాలంటే ఇది సైబర్ కేఫ్లాంటిది అనుకోవచ్చు. నిర్ణీతమైన టైమ్కు కొంత డబ్బు చెల్లించి ఇంటర్నెట్తో యాక్సెస్ కావడంలాంటిది’ అంటాడు కంపెనీ కో–ఫౌండర్, సీయివో హర్షిత్ జైన్. బేరింగ్ క్యాపిటల్, ఇన్ఫ్లెక్షన్ పాయింట్ వెంచర్స్ ‘వోన్లీ ప్లే’కు సీడ్ ఫండింగ్ చేశాయి. కునాల్ షా, సూరజ్ నళిన్, అమృత్ శ్రీవాస్తవ, జితేంద్ర గుప్తా ఏంజెల్ ఇన్వెస్టర్లు. గత నెలలలో అధికారికంగా లాంచ్ అయిన ‘వన్ ప్లేయర్’కు 27,000 రిజిస్టర్డ్ యూజర్లు, 5,000 ప్లేయింగ్ సబ్స్క్రైబర్లు ఉన్నారు.‘కేవలం గేమ్స్ ఆడడం మాత్రమే కాదు క్లౌడ్లో ప్రతీది చేయవచ్చు. ఉదాహరణకు 3డీ సాఫ్ట్వేర్ను రన్ చేయడంలాంటివి’ అంటున్నాడు కంపెనీ కో–ఫౌండర్, సీటీవో అభిక్ సాహ. -
గేమింగ్ ప్రియులకు గుడ్ న్యూస్: ఇన్ఫినిక్స్ జీటీ 10 ప్రో , ఫీచర్లు చూస్తే!
Infinix gt 10 pro: ఇన్ఫినిక్స్ ఇండియా తాజాగా జీటీ 10 ప్రో స్మార్ట్ఫోన్ను ప్రవేశపెట్టింది. మొబైల్ గేమింగ్కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో గేమింగ్ ప్రియులను ఆకట్టుకునేలా ఆకర్షణీయమైన ధరలో దీన్ని లాంచ్ చేసింది. సుపీరియర్ ప్రాసెసింగ్ పవర్, కూల్ టెక్నాలజీ,10-బిట్ FHD+AMOLED డిస్ప్లేను దీన్ని తీసుకు రావడం విశేషం. రియర్ కెమెరా ద్వారా 4K వీడియో రికార్డింగ్, సెల్ఫీ కెమెరా 2K వీడియో రికార్డింగ్ సదుపాయంతోపాటు AI ఫిల్మ్ మోడ్ను కూడా జోడించింది. ఇండియాలోదీని లాంచింగ్ ప్రైస్ రూ. 19,999గా ఉంది. అయితే బ్యాంక్ డిస్కౌంట్ల కారణంగా, ప్రస్తుతం రూ. 17,999కి అందుబాటులో ఉంది. ఫోన్తో పాటు,తొలి 5,000 మంది కస్టమర్లు ప్రో గేమింగ్ కిట్ను కూడా అందుకునోఛాన్స్ ఉంది. సైబర్ మెకా డిజైన్, రంగు మార్చే వెనుక ప్యానెల్, 6.67 ఫుల్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే, 16 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తదితర ఫీచర్లు ఇందులో ఉంటాయి. 108 ఎంపీ అల్ట్రా క్లియర్ ట్రిపుల్ కెమెరా, ప్రకాశవంతమైన సెల్ఫీల కోసం 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా, డ్యుయల్ 5జీ సిమ్ దీనిలో ఉన్నట్లు సంస్థ సీఈవో అనీష్ కపూర్ తెలిపారు. ఇది సైబర్ బ్లాక్, మిరాజ్ సిల్వర్ రంగుల్లో లభిస్తుందని పేర్కొన్నారు. జీటీ 10 ప్రో స్పెసిఫికేషన్స్ 6.67-అంగుళాల డిస్ప్లే మీడియాటెక్ డైమెన్సిటీ 1300ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 13 32 ఎంపీ సెల్ఫీ కెమెరా 108+2+2 ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్, 1 టీబీ దాకా విస్తరించుకునేసదుపాయం 5000mAh బ్యాటరీ -
ఎంజీ బుల్లి కామెట్ ఈవీస్పెషల్ గేమర్ ఎడిషన్: ధర పెరిగిందా?
MG unveils Comet EV Gamer Edition ఎంజీ మెటార్ ఇండియా తన బుల్లి ఈవీ కామెట్ లో కొత్త ఎడిషన్ను లాంచ్ చేసింది. ‘గేమర్ ఎడిషన్’గా పేరుతో కామెట్ ఈవీ ఆల్-ఎక్స్క్లూజివ్ స్పెషల్ ఎడిషన్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితంగా ఈసీ సెగ్మెంట్లో ఇది కస్టమైజ్ చేసిన ఫస్ట్కారుగా నిలిచింది. గేమర్ ఎడిషన్ ట్రిమ్ గేమర్లు, యువ కొనుగోలుదారులే లక్ష్యంగా స్టీరింగ్ వీల్ కవర్, థీమ్డ్ మేట్స్ లాంటి స్పెషల్ యాక్ససరీస్తో ఆకర్ణణీయంగా తీసుకొచ్చింది. (ఇండియాలో అత్యధికంగా అమ్ముడుబోయిన కారు ఇదే: ఎన్ని కార్లు తెలుసా?) కామెట్ ఈవీ బేస్ ధరతో పోలిస్తే ఈ ఎడిషన్ ధర రూ. 64,999 ఎక్కువ. రూ. 8.65 లక్షలతో ఎక్స్క్లూజివ్ గేమర్ ఎడిషన్ ఎంజీ కామెట్ ఈవీ - పేస్, ప్లే, ప్లష్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఆసక్తిగల కొనుగోలుదారులు కామెట్ 'గేమర్ ఎడిషన్'ను ఆన్లైన్లో లేదా భారతదేశం అంతటా ఎంజీ డీలర్షిప్లలో బుక్ చేసుకోవచ్చు. (కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్ ) బోల్డ్, వైబ్రంట్, డైనమిక్ , టెక్నో వైబ్ ప్రేరణగా ఈ కామెట్ EV ఎడిషన్, గేమింగ్లో అడ్రినలిన్ రష్ని ఇష్టపడే Gen Z కోసం డార్క్ అంట్ లైట్ తేలికపాటి థీమ్లలో డార్క్ క్రోమ్, మెటల్ ఫినిషింగ్తో రీసైకిల్ చేయబడిన ప్లాస్టిక్ మెటీరియల్తో స్పెషల్ఎట్రాక్షన్గా ఉంటుందని కంపెనీ చెప్పింది. ఈస్తటిక్ అండ్ డిజైన్ ఓరియంటెడ్గా, గేమింగ్ స్ట్రీమర్, ఇన్ఫ్లుయెన్సర్ మోర్టల్ (నమన్ మాథుర్) సహకారంతో దీన్ని రూపొందించింది. సైడ్ మౌల్డింగ్లు, కార్పెట్ మ్యాట్లు, ఇంటీరియర్ ఇన్సర్ట్లు, బాడీ గ్రాఫిక్స్, స్టీరింగ్ వీల్ కవర్, సీట్ కవర్లు వంటి ప్రత్యేకతలున్నాయి. (శుభవార్త: భారీగా పడిన వెండి, మురిపిస్తున్న పసిడి) ఇంకా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్లు, ABS +EBD, ఫ్రంట్ & రియర్ 3 pt తోపాటు, సీట్ బెల్ట్లు, వెనుక పార్కింగ్ కెమెరా & సెన్సార్, TPMS (పరోక్ష) , ISOFIX చైల్డ్ సీట్లు లాంటి ఇతర ఫీచర్లున్నాయి. ఎంజీ కామెట్ EV 17.3 KWH Li-ion బ్యాటరీతో 230 కిమీ (క్లెయిమ్) బ్యాటరీ పరిధితో వస్తుంది మరియు దాదాపు 7 గంటల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది. (టమాటా షాక్: ఇప్పట్లో తగ్గేదే లేదు, కారణాలివిగో..!) కాగా ఎంజీ మోటార్స కామెట్ ఎలక్ట్రిక్ వాహనం ఏప్రిల్ 2023లో భారతదేశంలో లాంచ్ చేసింది. దేశీయంగా ఇదే కాంపాక్ట్కారుగా పాపులర్ అయింది. పేస్ వేరియంట్ కోసం 7,98,000 నుండి (ఎక్స్-షోరూమ్), రూ. ప్లష్ వేరియంట్ కోసం 9,98,000 (ఎక్స్-షోరూమ్)గా ఉన్న సంగతి తెలిసిందే. -
మైక్రోసాఫ్ట్కు భారీ షాక్.. కీలక తీర్పును వెలువరించిన అమెరికా ఫెడరల్ కోర్ట్!
ప్రముఖ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు అమెరికా ఫెడరల్ కోర్ట్ భారీ షాకిచ్చింది. 69 బిలియన్ డాలర్లకు గేమింగ్ దిగ్గజం యాక్టివిజన్ బ్లిజార్డ్ (Blizzard)ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో అమెరికా ఫెడరల్ కోర్ట్ బిలియన్ డాలర్ల భారీ కొనుగోళ్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. బ్లిజార్డ్ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడాన్ని దీర్ఘకాలిక నిషేధం విధించాలనిఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ) పెడరల్ కోర్ట్ను కోరింది. ఆ మరుసటి రోజు జరిగిన విచారణలో అమెరికా ఫెడరల్ జడ్జ్ ఎడ్వర్డ్ దవిలా గేమింగ్ సంస్థ క్రయ, విక్రయాలు లేకుండా ఆదేశాలు జారీ చేసినట్ల తీర్పులో తెలిపారు. ఇదే అంశంపై శాన్ ఫ్రాన్సిస్కో ఫెడరల్ కోర్టు జూన్ 22, జూన్ 23న విచారణ జరపనుంది. ఇక బ్లిజార్డ్ కొనుగోలు దేశ (యూఎస్) యాంటీట్రస్ట్ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయా? లేదంటే విరుద్దంగా ఉన్నాయని నిర్ధారించనుంది. అప్పుటి వరకు కంపెనీ కొనుగోలుతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాత్కలిక కొనుగోళ్లకు వాయిదా వేస్తున్నట్లు రెగ్యులేటర్ ఫైలింగ్లో పేర్కొంది. ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ సంస్థగా చైనా టెన్సెంట్, జపాన్ ప్లేస్టేషన్ తయారీదారు సోనీ తర్వాత ప్రపంచంలోనే అతిపెద్ద గేమింగ్ సంస్థగా అవతరించేలా మైక్రోసాఫ్ట్ గత ఏడాది ప్రారంభంలో బ్లిజార్డ్ కొనుగోలు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ కొనుగోళ్లపై యూరోపియన్ యూనియన్ అంగీకరించింది. కానీ ఈ విక్రయం క్లౌడ్ గేమింగ్లో పోటీని నిరోధిస్తుందని భావించిన బ్రిటన్ కాంపిటీషన్ అండ్ మార్కెట్స్ అథారిటీ (CMA) వ్యతిరేకించింది. కొనుగోలును నిలిపివేస్తూ ఈ తరుణంలో ‘కాల్ ఆఫ్ డ్యూటీ’ వీడియో గేమ్ సిరీస్ను విడుదల చేసేలా యాక్టివిజన్ పేరెంట్ కంపెనీ యాక్టివిజన్ బ్లిజార్డ్తో జరిపిన లావాదేవీలు జరగకుండా ఆపాలని, ఈ లావాదేవీలు వీడియో గేమ్ సంస్థల నుంచి ఎదురవుతున్న పోటీని అణిచివేస్తుందనే ఆందోళనపై ఫెడరల్ ట్రేడ్ కమిషన్లో దావా నమోదైంది. తాజాగా, ఫెడరల్ కోర్ట్ సైతం యాక్టివిజన్ బ్లిజార్డ్ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేయడాన్ని తాత్కాలికంగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకోవడం గేమింగ్ పరిశ్రమలో చర్చాంశనీయంగా మారింది. మైక్రోసాఫ్ట్ ఏం చెబుతోంది? ఎఫ్టీసీ నిబంధనలకు అనుగుణంగా యాక్టివిజన్ బ్లిజార్డ్ను కొనుగోలు చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ తెలిపింది. అంతేకాదు కాల్ ఆఫ్ డ్యూటీ తరహా వీడియో గేమ్ సిరీస్లను రాబోయే 10 ఏళ్లలో సోనీతో పాటు ఇతర ప్రత్యర్ధి సంస్థలకు అందిస్తామని హామీ ఇచ్చింది. ఈ డీల్ ద్వారా గేమర్స్, గేమింగ్ కంపెనీలకు లాభదాయకంగా ఉంటుందని మైక్రోసాఫ్ట్ వాదిస్తోంది. ఇదీ చదవండి : భారత్లో తగ్గిన నిరుద్యోగం, ఎంతమేర తగ్గిందంటే? -
అమెజాన్ నుంచి 100 మంది అవుట్!
అమెజాన్ లేఆఫ్స్లో భాగంగా తాజాగా 100 మందిని తొలగించింది. వీడియో, గేమ్ విభాగాలలో పని చేస్తున్న సుమారు 100 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. ప్రైమ్ గేమింగ్, గేమ్ గ్రోత్, కంపెనీ శాన్ డియాగో స్టూడియోలో పనిచేస్తున్న సిబ్బంది ఇందులో ఉన్నారు. ఈ మేరకు కంపెనీ గేమ్స్ వైస్ ప్రెసిడెంట్ క్రిస్టోఫ్ హార్ట్మన్ ఏప్రిల్ 4న ఉద్యోగులకు మెమోలు పంపించారు. (ఈ-కామర్స్ వ్యాపారంలోకి ఫోన్పే.. కొత్త యాప్ పేరు ఏంటంటే..) ట్విచ్ స్ట్రీమింగ్ సర్వీస్లో భాగంగా ఉన్న క్రౌన్ చానెల్ ఎంటర్టెయిన్మెంట్ షో సహా గేమింగ్ విభాగంలో మానవ వనరుల నిర్వహణకు అమెజాన్ కంపెనీ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో ట్విచ్ ఇటీవల 400 మంది ఉద్యోగులను తొలగించింది. 2012లో ఈ డివిజన్ ప్రారంభించినప్పటి నుంచి పలు సార్లు అమ్మకానికి ఉంచినా విక్రయించకుండా అలాగే కొనసాగిస్తూ వస్తోంది. అమెజాన్ ఇప్పటి వరకూ అభివృద్ధి చేసింది కేవలం ఒకే ఒక్క గేమ్. అది కూడా 2021 సెప్టెంబర్ లాంచ్ తర్వాత దాని ప్లేయర్ బేస్ బాగా క్షీణించింది. (విప్రో కన్జూమర్ అమ్మకాలు @ రూ. 10 వేల కోట్లు) తొలగింపులు ఉన్నప్పటికీ, శాన్ డియాగో స్టూడియోలో ప్రకటించని ప్రాజెక్ట్లో పనిచేస్తున్న ఉద్యోగులు గేమ్ ప్రీ ప్రొడక్షన్ దశలో రెట్టింపు అవుతారని హార్ట్మన్ చెప్పారు. అలాగే మాంట్రియల్లోని అమెజాన్ స్టూడియోలో కూడా ఓ ప్రాజెక్ట్ అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణ కొరియా ఆన్లైన్ రోల్-ప్లేయింగ్ గేమ్ లాస్ట్ ఆర్క్ను ప్రచురించడం ద్వారా అమెజాన్ విజయాన్ని సాధించింది. థర్డ్ పార్టీ పబ్లిషింగ్ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేయనున్నట్లు హార్ట్మన్ పేర్కొన్నారు. NCSoft Corpతో ఇటీవలి ఒప్పందం కూడా అందులో భాగమేనని చెప్పారు. -
గేమింగ్ హబ్గా భారత్..
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్ పరిశమ్ర దేశంలో వేగంగా విస్తరిస్తోంది. ఒక ట్రిలియన్ డిజిటల్ ఆర్థిక వ్యవ స్థకు గణనీయమైన వాటాను సమకూర్చే సామర్థ్యం ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు ఉందని ప్రైమస్ పార్ట్నర్స్ సంస్థ ‘భారత్లో ఆన్లైన్ గేమింగ్: పన్నుల సందిగ్ధత’ పేరుతో విడుదల చేసిన నివేదిక తెలియజేసింది. ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ అనేది ఆర్థిక అవకాశాలకు ద్వారాలను తెరవడమే కాకుండా, పలు సామాజిక అంశాలకు పరిష్కారం చూపిస్తుందని ఇది అభిప్రాయపడింది. 2023–24 బడ్జెట్ లో ఆన్లైన్ గేమింగ్ రంగానికి సంబంధించి చేసిన ప్రకటనలు సానుకూలంగా ఉన్నాయని, ఆన్లైన్ గేమింగ్లో వచ్చే లాభాల నుంచి నష్టాలను సర్దుబాటు చేసుకునే డిమాండ్ను పరిష్కరించినట్టు పేర్కొంది. ఆన్లైన్ గేమింగ్ లాభాలపై టీడీఎస్ అమలుకు యంత్రాంగాన్ని బడ్జెట్లో పేర్కొనడాన్ని ఈ నివేదిక ప్రధానంగా ప్రస్తావించింది. ‘‘సెక్షన్ 194బీ కింద చేసిన సవరణలు ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయి. సెక్షన్ 194బీఏ కింద ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమకు ప్రత్యేక నిబంధనను 2023 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేలా ప్రతిపాదించారు. కానీ, ఇది లోపంగా కనిపిస్తోంది. రెండూ కూడా ఒకే తేదీ నుంచి అమల్లోకి వస్తే సరైన విధంగా ఉంటుంది. రెండూ 2023 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రావాలి. లేదంటే ప్రత్యామ్నాయంగా ప్రస్తుత పన్ను విధానాన్నే ఏప్రిల్ 1 నుంచి జూన్ 30 వరకు అమలయ్యేలా చూస్తే వ్యత్యాసాలు తొలగిపోతాయి’’అని సూచించింది. స్థూల ఆదాయం మెరుగైనది.. పరిశ్రమకు సంబంధించి సుస్థిరత అవసరమని, అదే పనిగా పరిణామాలు చోటు చేసుకోవడం వల్ల పరిశ్రమకు అధిక వ్యయాలకు దారితీస్తుందని ఈ నివేదిక పేర్కొంది. అవనసర వ్యయాలతో చిన్న, మధ్య స్థాయి గేమింగ్ కంపెనీలు నిలదొక్కుకోవడం కష్టమవుతుందని అభిప్రాయం వ్యక్తం చేసింది. పరిశ్రమకు సంబంధించి జీఎస్టీ అనేది స్థూల ఆన్లైన్ గేమింగ్ ఆదాయంపై అమలు చేయడం వల్ల పరిశ్ర మ వృద్ధికి సాయపడుతుందని సూచించింది. అలా కాకుండా మొత్తం ముఖ విలువపై అమలు చేయ డం ఈ రంగానికి ఆచరణ సాధ్యం కాదని పేర్కొంది. ఏటా 27 శాతం వృద్ధి ఆన్లైన్ గేమింగ్ పరిశ్రమ వేగంగా వృద్ధి చెందుతున్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. ఏటా కాంపౌండెడ్గా 27 శాతం చొప్పున, వచ్చే ఐదేళ్లపాటు వృద్ధి చెందుతుందని, దేశ జీడీపీకి పెద్ద మొత్తంలో వాటా సమకూర్చే, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే సామర్థ్యాలు ఈ రంగానికి ఉన్నట్టు పేర్కొంది. 2030 నాటికి లక్ష ఉద్యోగాలను కల్పించగలదని పేర్కొంది. ఇందుకోసం బాధ్యాతాయుత, పారదర్శకమైన, భద్రత వాతావరణం ఉండాలని అభిప్రాయపడింది. -
సూపర్ ఫీచర్లతో హెచ్పీ పవర్ఫుల్ గేమింగ్ ల్యాప్ట్యాప్: షాకింగ్ ప్రైస్
సాక్షి, ముంబై: ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్పీ అత్యంత శక్తివంతమైన గేమింగ్ ల్యాప్టాప్ను ఇండియాలో ఆవిష్కరించింది. ప్రీమియం సెగ్మెంట్లో ఒమెన్ 17 పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త గేమింగ్ ల్యాప్టాప్లో సరికొత్త 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ,Nvidia GeForce RTX 4080 ను జోడించింది. హెచ్పీ ఒమన్ ధర రూ.2,69,990గా నిర్ణయించింది. ఇండియాలో ఒమెన్ ప్లేగ్రౌండ్ స్టోర్స్, HP వరల్డ్ స్టోర్స్ , HP ఆన్లైన్ స్టోర్ వంటి వివిధ అవుట్లెట్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఒమెన్ టెంపెస్ట్ కూలింగ్ టెక్నాలజీతో ఒమెన్ 17 ఒమెన్ గేమింగ్ హబ్గా ఉంటుందని కంపెనీ ప్రకటించింది. గేమింగ్ ల్యాప్టాప్ హెచ్పీ ఒమెన్ 17 ఫీచర్లు 17.3-అంగుళాల IPS డిస్ప్లే క్వాడ్ HD (2560 × 1440 పిక్సెల్లు) రిజల్యూషన్ 24 కోర్ 13వ జెన్ ఇంటెల్ కోర్ i9 CPU ప్యానెల్ 240Hz రిఫ్రెష్ రేట్ 32 జీబీ DDR5 ర్యామ్, 1TB PCIe NVMe SSD నిల్వ Nvidia RTX 4080 ల్యాప్టాప్ GPUతో వస్తుంది. ఇంకా ఒమెన్ 17 బ్యాంగ్ & ఒలుఫ్సెన్ డ్యూయల్ స్పీకర్స్, 720p HD వెబ్క్యామ్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ అర్రే డిజిటల్ మైక్రోఫోన్ల Wi-Fi 6E కనెక్టివిటీ, థండర్బోల్ట్ 4 టైప్-C పోర్ట్, మూడు USB టైప్-A పోర్ట్స్, HDMI పోర్ట్, మినీ డిస్ప్లే పోర్ట్, RJ-45 పోర్ట్ , RTX 40 సిరీస్ ల్యాప్టాప్ 330W ఛార్జింగ్కు మద్దతుతో 83 Wh Li-ion పాలిమర్ బ్యాటరీ మొదలైనవి ఇతర ఫీచర్లుగా ఉన్నాయి. -
గేమింగ్ రంగంలో అవకాశాలకు ఆకాశమే హద్దు!
గత కొద్ది సంవత్సరాలుగా గేమింగ్, ఈస్పోర్ట్స్ పరిశ్రమ అసాధారణ వృద్ధి నమోదు చేస్తోంది. ప్రపంచంలో అత్యధిక ఇంటర్నెట్ వినియోగదారులు కలిగిన రెండవ దేశంగా నిలువడంతో పాటుగా స్మార్ట్ఫోన్ వినియోగదారులు బాగా పెరగడంతో దేశంలో ఈ రంగం అనూహ్య వృద్ధి నమోదు చేస్తోంది. దేశంలో ఈస్పోర్ట్స్ పరిశ్రమ ఏటా 45% (సీఏజీఆర్) వృద్ధితో 2025 నాటికి 11 బిలియన్ రూపాయలకు చేరుకోవచ్చని తాజాగా ఈవై అధ్యయనం ‘రెడీ.సెట్.గేమ్ ఆన్! ’ వెల్లడించింది. ఇప్పటికే దేశంలో 450కు పైగా గేమింగ్ కంపెనీలు, 450 మిలియన్లకు పైగా గేమర్లు ఉన్నారని కూడా తేల్చింది. అయితే దురదృష్టవశాత్తు యువతతో పాటుగా వారి తల్లిదండ్రులకు కూడా గేమింగ్ కెరీర్ పట్ల సరైన అవగాహన లేదంటున్నారు హీరో విరెడ్ ఫౌండర్–సీఈఓ అక్షయ్ ముంజాల్. ఈ రంగంలో అపారమైన అవకాశాలున్నాయంటూ ఆ అవకాశాలను అందిపుచ్చుకునేలా తాము యువతకు తోడ్పడే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఔత్సాహికులకు ప్రత్యేకంగా గేమింగ్ కోర్సుల్లో శిక్షణ ఇస్తున్నట్లు ముంజాల్ వెల్లడించారు. కేవలం ఆరు నెలల కోర్సుతో గేమ్ డిజైనింగ్, విజువలైజింగ్, పబ్లిషింగ్, లీగ్ ఆపరేషన్స్, కంటెంట్ క్రియేషన్, లైవ్ ప్రొడక్షన్ వంటి విభాగాల్లో విధులు నిర్వహించవచ్చని అన్నారు. కోర్సులో మొదటి రెండు నెలలూ ప్రైమర్గా ఉన్నప్పటికీ, ఆ తరువాత నాలుగు నెలలు మాత్రం స్పెషలైజేషన్ తీసుకోవచ్చు. ఇలాంటి కోర్సుల ఫీజు రూ.4 లక్షలు కు అటూ ఇటుగా ఉన్నాయి. అయితే గ్యారెంటీడ్ 5 నెలల ఇంటర్నెషిప్ ద్వారా ఈ ఫీజులో 50 శాతం వరకూ తిరిగి పొందే అవకాశాలు కూడా అందుబాటులో ఉన్నాయి.. గేమింగ్ పరిశ్రమతో అతి సన్నిహిత సంబంధాలున్న శిక్షణా సంస్థలు వల్ల కెరీర్ ఆధారిత కోర్స్ కరిక్యులమ్ తీర్చిదిద్దడం జరుగుతోంది . పరిశ్రమ నిపుణులతో కలిసి పనిచేయడం వల్ల అభ్యాసకులను భవిష్యత్కు సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దగలుగుతున్నారు. ఇవి అంతర్జాతీయ స్టూడియోలు, ప్రచురణ సంస్థలైన నోడ్విన్ తో పాటుగా యునిటీ, ఎన్ఎస్డీసీ , ఎంఈఎస్సీ వంటివి సర్టిఫికెట్ భాగస్వాములుగా, గేమ్ఆన్, హోలీ కౌ ప్రొడక్షన్స్, గాడ్స్పీడ్ గేమ్స్,మూన్ఫ్రాగ్ వంటివి ఇండస్ట్రీ భాగస్వాములుగా సంస్థలు కొనసాగుతున్నాయి గేమింగ్, ఈస్పోర్ట్స్ పరిశ్రమలో రాణించడానికి సర్టిఫికేషన్ కోర్సులు చేసిన వారు గేమ్ డెవలపర్,గేమ్ ఆర్టిస్ట్, గేమ్ డిజైనర్. గేమ్ ఆడియో ఇంజినీర్ వంటి ఉద్యోగాలలో రాణించవచ్చు..ఈ –స్పోర్ట్స్ను స్పెషలైజేషన్గా తీసుకుంటే లీగ్ ఆపరేషన్స్, కమ్యూనిటీ మేనేజ్మెంట్, గేమ్ మార్కెటింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్ తదితర బాధ్యతలను నిర్వర్తించవచ్చు. ఉజ్వల భవిత... భారతదేశంలో గేమింగ్ పరిశ్రమ అద్భుతమైన కెరీర్ అవకాశాలను అందిస్తోంది. ఈ రంగం ఏటేటా అనూహ్యవృద్ధిని నమోదు చేస్తోంది. అయితే ఈ రంగంలో ఉన్న అవకాశాల పట్ల యువతలో సరైన అవగాహన లేదు. అవగాహన పెంచుకుని ప్రయత్నిస్తే మంచి కెరీర్ను స్వంతం చేసుకోవచ్చు. –అక్షయ్ ముంజాల్, సిఇఒ, హీరోవిరెడ్ -
కొత్త ఏడాది టెక్కీలకు గుడ్ న్యూస్.. జీతాలు పెరగనున్నాయ్!
టెక్ దిగ్గజాలు తమ సిబ్బందిని భారీగా ఇంటికి సాగనంపడం, పింక్ స్లిప్పుల కలకలంతో ఉద్యోగుల్లో భయాందోళనల నడుమ వారికి వేతన పెంపుపై శుభవార్త వెలువడింది. భారతదేశంలో ఈ ఏడాది సగటు జీతం 10 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది గత ఏడాది కంటే కేవలం 0.4 శాతం ఎక్కువని కాన్ ఫెర్రీ తాజా వేతన సర్వే సర్వే వెల్లడించింది. "మాంద్యం, ఆర్థిక మందగమనమంటూ ప్రపంచవ్యాప్తంగా ఈ భయాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ మాత్రం ఆశాజనకంగా ఉందని కార్న్ ఫెర్రీ ఛైర్మన్, రీజినల్ మేనేజింగ్ డైరెక్టర్ నవనిత్ సింగ్ సర్వేలో పేర్కొన్నారు. 818 సంస్థలు, 8 లక్షలకు పైగా ఉద్యోగులపై జరిపిన సర్వేలో, భారతీయ కార్పొరేట్ ఉద్యోగులు 2023లో సగటున 9.8 శాతం సాలరీ పెంపు ఉండొచ్చని సర్వే పేర్కొంది. అత్యుత్తమ నైపుణ్యాలను కనబరిచే ఉద్యోగులకు ఆయా కంపెనీలు ఏకంగా 15 శాతం నుంచి 30 శాతం వరకూ వేతన పెంపు వర్తింపచేయవచ్చని తెలిపింది. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్తో సహా రంగాలు ఈ ఏడాది జీతాలు పెరిగే అవకాశం ఉన్నట్లు నివేదిక తెలిపింది. ఈ పెంపు వివిధ రంగాల పరంగా చూస్తే.. టెక్నాలజీలో 10.4 శాతం, మీడియా 10.2 శాతం, గేమింగ్ 10 శాతం. అదనంగా, కొన్ని ఇతర రంగాల జీతాల పెంపు అంచనాలలో సేవా రంగం 9.8 శాతం, ఆటోమోటివ్ 9 శాతం, రసాయనం 9.6 శాతం, వినియోగ వస్తువులు 9.8 శాతం, రిటైల్ 9 శాతం ఉన్నాయి. అదనంగా, పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్లకు అనుగుణంగా చాలా వ్యాపారాలు తమ శ్రామిక శక్తిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని సర్వే సూచిస్తుంది. సర్వేలో పాల్గొన్న దాదాపు 60 శాతం సంస్థలు తాము ఒక రకమైన హైబ్రిడ్ మోడల్ను స్వీకరించినట్లు సూచించాయి. చదవండి: గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ చేస్తే డబ్బులు ఇస్తున్నారా? కంపెనీ ఏం చెప్తోందంటే! -
గేమింగ్, యానిమేషన్ హబ్గా భారత్
న్యూఢిల్లీ: భారత్ను యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ హబ్ (ఏవీజీసీ)గా మార్చేందుకు ప్రగతిశీల, స్థిరమైన వ్యక్తిగత పన్నుల విధానం అవసరమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేశారు. గేమింగ్ ఆదాయంపై అత్యధికంగా 30 శాతం టీడీఎస్ (మూలం వద్దే పన్ను కోత) అమలు చేయడం అన్నది ఆఫ్షోర్ ప్లాట్ఫామ్లను ప్రోత్సహించడమేనని పేర్కొన్నారు. ఆఫ్షోర్ పాŠల్ట్ఫామ్లు ఎలాంటి పన్నులు చెల్లించకుండా, నియంత్రణల పరిధిలోకి రాని విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విధమైన పన్నుల ఎగవేత అన్నది ప్రభుత్వ ఖజానాకు పెద్ద నష్టమని, అంతిమంగా దేశీ పరిశ్రమకు మరణశాసనమని పేర్కొన్నారు. ఆన్లైన్లో నైపుణ్యాల ఆధారిత గేమింగ్ పరిశ్రమ పరిమాణం 2.5 బిలియన్ డాలర్లుగా ఉంటే, ఏటా 38 శాతం చొప్పున కాంపౌండెడ్ వృద్ధితో 2030 నాటికి 20 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. లాటరీల మాదిరి ఆన్లైన్ స్కిల్ గేమ్ల్లో భారీ ఆర్జన ఉండదని, కేవలం కొద్ది మందే ఆడతారని గేమ్స్24ఇంటూ7 వ్యవస్థాపకుడు త్రివిక్రమ్ థంపి తెలిపారు. కనుక ఒక ఆటగాడు 70 శాతం గేముల్లో గెలిచినా, పెద్ద ఎత్తున పన్నులు చెల్లించాల్సి వస్తున్నట్టు చెప్పారు. లాటరీలను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన పన్ను చట్టాలను ఆన్లైన్ గేమింగ్కు అమలు చేయడం వల్ల ప్రతికూతల ఫలితాలు చూడాల్సి వస్తుందన్నారు. స్టాక్ మార్కెట్ మాదిరి కాకుండా, ఆన్లైన్ గేమర్లు అంతర్జాతీయంగా నడిచే చట్ట విరుద్ధమైన, పన్నుల పరిధిలో లేని గ్యాంబ్లింగ్ ప్లాట్ఫామ్లపైకి వెళ్లే అవకాశం ఉన్నట్టు చెప్పారు. అక్కడ అయితే గేమర్లు ఎలాంటి పన్ను చెల్లించక్కర్లేదన్నారు. పన్నుల్లో మార్పులు అవసరం.. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రోషన్షా మాట్లాడుతూ.. ‘‘అంతర్జాతీయ గేమింగ్ పరిశ్రమ కేంద్రంగా భారత్ను తీర్చిదిద్దాలంటే, 1970 నాటి నిబంధనలను ప్రస్తుత నూతన తరం పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ‘‘ఇతర దేశాలు గేమింగ్ పరిశ్రమ విషయంలో ఎలా వ్యవహరిస్తున్నాయో చూడాల్సి ఉంది. అమెరికాలో గేమింగ్ ఆదాయాన్ని సాధారణ ఆదాయంగానే పరగణిస్తున్నారు. అక్కడ మినహాయింపులను క్లెయిమ్ చేసుకోవచ్చు. బ్రిటన్లో గెలుచుకున్న మొత్తంపై ఎలాంటి పన్నులేదు’’అని షా చెప్పారు. ఊహించతగిన, ప్రగతిశీల పన్నుల విధానం భారత్కు అవసరమన్నారు. -
గేమింగ్ విభాగంలో భారత్కు అరుదైన ఘనత
గేమింగ్ విభాగంలో భారత్ అరుదైన ఘనంగా సాధించింది. నికో పార్ట్నర్స్ ప్రకారం.. దేశంలో ప్రస్తుతం 39.6 కోట్ల కోట్ల (దాదాపు 40 కోట్లు) గేమర్స్ ఉన్నారని కంపెనీ వెల్లడించింది. ది ఆసియా 10 గేమ్స్ మార్కెట్ పేరుతో తయారు చేసిన రిపోర్ట్లో.. ఆసియాలోని పది దేశాలతో పోల్చి చూస్తే ఒక్క భారత్లో 50.2 శాతం గేమర్స్ ఉన్నారని, వారానికి సగటున 14 గంటలు మొబైల్ ఫోన్లలో గేమ్స్ ఆడతారని తెలిపింది. ఆన్లైన్ గేమింగ్తో డబ్బులు సంపాదించేందుకు గేమర్స్ మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది. వెరసీ గత ఐదేళ్లలో భారత్లో వీడియోగేమ్స్తో పాటు కంప్యూటర్, మొబైల్ ఫోన్లలో ఆన్లైన్ గేమ్స్ ఆడేవాళ్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో కంప్యూటర్, మొబైల్ గేమ్ మార్కెట్కు 35.9 బిలియన్ డాలర్ల ఆదాయం వస్తుందని, 2026 నాటికి ఆదాయం 41.4 బిలియన్ డాలర్లకు చేరుతుందని నికో పార్ట్నర్స్ వెల్లడించింది. కాగా, చైనా తర్వాత భారత్, థాయ్లాండ్, ఫిలీప్పీన్స్ వంటి దేశాల్లో గేమర్స్ సంఖ్య పెరుగుతోందని ఈ నివేదిక చెప్పింది. ఆసియాలోని పది దేశాల్లో జపాన్, కొరియాలు 77 శాతం మార్కెట్ ఉందని నికో పార్ట్నర్స్ తెలిపింది. -
టాప్ గేర్ లో గేమింగ్.. లక్షల్లో ఉద్యోగాలు..
-
బాధితులే నిందితులుగా..!
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా అనేక మంది నుంచి రూ.903 కోట్లు వసూలు చేసి దేశం దాటించేసిన ఘరానా స్కామ్ దర్యాప్తులో సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు కీలకాంశాలు గుర్తించారు. గేమింగ్, ఇన్వెస్టిమెంట్ ఫ్రాడ్ల వెనుక చైనీయులు ఉన్నట్లు తేల్చారు. ఒకదాంట్లో బాధితులుగా మారిన వారిని సంప్రదిస్తూ మరో స్కామ్లో తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు. వారితో అవసరమైన బ్యాంకు ఖాతాలు తెరిపిస్తూ నిందితులుగా మారుస్తున్నారని అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ వ్యవహారాలకు సంబంధించి ఐదుగురిని అరెస్టు చేసినట్లు చెప్పారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్తో కలసి మంగళ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శ్రీనివాస్ వివరాలు వెల్లడించారు. ఐపీఎల్ విన్తో సహా ప్రత్యేక ప్రో గ్రామింగ్తో కూడిన గేమ్లను అనేక యాప్లను చైనీయులు తయారు చేస్తున్నారు. ఆన్లైన్లో వీటిలోకి ప్రవేశిస్తున్న యువతకు ప్రోగ్రామింగ్ కారణంగా తొలినాళ్లల్లో లాభాలు వస్తాయి. నమ్మకం పెరగడంతో వాళ్లు పెద్ద ఎత్తున పెట్టుబడి పెడతారు. ఆపై అదృశ్యమైపోయే ఆ యాప్లు బాధితుడిని నిలువుగా ముంచేస్తాయి. తొలుత గేమింగ్ యాప్ల్లో నష్టపోయిన వారి చిట్టా ఫిలిప్పీన్స్లోని అలెన్కు చేరుతోంది. ఇతనికి.. రూ.903 కోట్ల ఫ్రాడ్లో ఇటీవల సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేసిన చైనీయుడు చుచున్ యోతో సంబంధాలున్నా యి. బాధితుల చిట్టా అందుకున్న అలెన్.. దాన్ని చుచున్కు పంపిస్తాడు. తమకు అవసరమైన బ్యాంక్ ఖాతాలు తెరిచి అందిస్తే నెలకు రూ.60 వేల వరకు జీతం, కమీషన్లు ఇస్తామని బాధితులకు చుచున్ ఎరవేస్తాడు. దీంతో అనేక మంది తమ పేర్లతోపాటు కుటుంబీకులు, బంధువుల పేర్ల తో ఖాతాలు తెరిచారు. వాటి నెట్ బ్యాంకింగ్ వివరాలు, లింకై ఉన్న ఫోన్ నంబర్ సిమ్ కార్డు ముంబైలో ఉన్న చుచున్కు చేరతాయి. అతను వాటిని అలెన్కు పంపిస్తున్నాడు. అక్కడ నుంచి అసలుకథ మొదలవుతుంది. ఖాతాదారుల నుంచి యాప్ల ద్వారా సంప్రదించే అలెన్ ఆ ఖాతాల్లో డబ్బు జమ చేయిస్తాడు. ఆ మొత్తం తమ ఖాతాల్లోకి మారుస్తూ.. సహకరించినవారికి జీతం, కమీషన్ ఇస్తున్నాడు. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు.. హైదరాబాద్కు చెందిన నాగప్రసాద్ గేమింగ్ యాప్లో రూ.20 లక్షలు నష్టపోయాడు. అదే యాప్ ద్వారా అలెన్ వల్లో పడి ముంబైలో ఉన్న చున్ ద్వారా తన బ్యాంక్ ఖాతా వివరాలు పంపాడు. ఇతడి మాదిరిగానే రామ్ అనే బాధి తు డు తన బావమరిది అనిల్ బ్యాంకు ఖాతా వివరాలు, సాగర్ తన స్నేహితుడైన శ్రీనివాస్ భార్య బ్యాంకు ఖాతా వివరాలు పంపారు. యాప్ల ద్వారా వచ్చే డబ్బు ఈ ఖాతాల్లో పడేలా చేసే అలెన్.. రూ.కోట్లు స్వాహా చేసేవాడు. చున్ విచారణ, అతడి ఫోన్ విశ్లేషణతో ఈ వివరాలు గుర్తించిన సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు మంగళవారం రామ్, శ్రీనివాస్, సాగర్, నాగప్రసాద్ను అరెస్టు చేశారు. చుక్తోపాటు అప్పట్లో నగరా నికి చెందిన బ్యాంక్ ఖాతాదారులు సయ్యద్ సుల్తాన్, మిర్జా నదీమ్ బేగ్, పర్వేజ్ పట్టుబడిన విషయం తెలిసిందే. దుబాయ్లో ఉంటున్న ఇమ్రాన్ ద్వారా వీరు ఈ ఉచ్చులో చిక్కుకున్నట్లు తేలడంతో పోలీసులు అతడిపై లుక్ఔట్ నోటీసులు జారీ చేశారు. తర్వాత ఇమ్రాన్ దుబాయ్ నుంచి వస్తూ ముంబై ఎయిర్పోర్టులో ఇమ్మిగ్రేషన్కు చిక్కాడు. ఈ క్రమంలో సిటీ సైబర్క్రైమ్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. తనతో వీఓఐపీ కాల్స్ ద్వారానే సంప్రదించాలంటూ నాగప్రసాద్తో అలెన్ చెప్పాడని, దీని కోసం ఓ యంత్రాన్ని పంపాడని, దాన్నీ స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. -
గేమింగ్లో గెలుపు జెండా.. ‘పాయల్ ధారే’ విజయపథం
‘ఉమన్ గేమర్! వినడానికి కొత్తగా ఉంది’ అని ఒకరు ఎగతాళిగా నవ్వారు. ‘ఆడడం బాగానే ఉంటుందిగానీ, కెరీర్కు బాగుండదు’ అని గంభీరస్వరంతో నిరాశ పరిచారు మరొకరు. అంతా అయోమయంగా ఉంది. అలా అని ఆగిపోలేదు. ఓనమాలు నేర్చుకుంటూనే, కొత్త విషయాలపై పట్టు సంపాదిస్తూనే మేల్–డామినేటెడ్ స్పేస్ అనుకునే గేమింగ్లో బిగ్గెస్ట్ యూట్యూబ్ ఉమన్ గేమర్(ఇండియా)గా గెలుపు జెండా ఎగరేసింది పాయల్ ధారే... కరోనా మహమ్మారి పదునుగా కోరలు చాస్తున్న సమయంలో, లాక్డౌన్ రోజుల్లో మధ్యప్రదేశ్లోని చింద్వారాకు చెందిన పాయల్ ధారే గేమింగ్–ఫోకస్డ్ ఛానల్కు శ్రీకారం చుట్టింది. నిజం చెప్పాలంటే యూట్యూబ్ వీడియో ప్లాట్ఫామ్పై లైవ్స్ట్రీమింగ్ కంటెంట్ గురించి ఆమెకు అంతగా అవగాహన లేదు. కాలేజీలో స్నేహితులతో కలిసి ‘పబ్జీ’ గేమ్ ఇష్టంగా ఆడేది. ‘పబ్జీ’ని నిషేధిస్తారనిగానీ, గేమింగ్ను తాను కెరీర్గా ఎంచుకుంటాననిగానీ అనుకోలేదు పాయల్. గేమింగ్పై ఇష్టం పెరుగుతున్న క్రమంలో తన మనసులో మాటను ఇంట్లో చెప్పింది. ‘గేమింగ్నే కెరీర్గా ఎంచుకుంటాను’ తల్దిదండ్రులు ససేమిరా అన్నారు. ‘చదువుపై దృష్టి పెట్టు’ అని మందలించారు. వారిని ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎట్టకేలకు తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. అలా తొలి విజయం సాధించింది పాయల్. తాము ఉండే చింద్వారా పట్టణంలో ఇంటర్నెట్ కనెక్టివిటీ అంతంత మాత్రమే. మొదట్లో ఇన్స్టాగ్రామ్లో గేమింగ్ సెషన్స్ క్లిప్స్ను పోస్ట్ చేసేది. 100కె ఫాలోవర్స్తో తన మీద తనకు నమ్మకం వచ్చింది. ఈ సమయంలోనే యూట్యూబ్లో ప్రయత్నించమని స్నేహితులు, ఫాలోవర్స్ నుంచి ఒక సూచన వచ్చింది. ‘ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం సులభం కాబట్టి మొదట దాన్నే ఎంచుకున్నాను. మీ గేమింగ్ స్కిల్స్కు యూట్యూట్ అనేది సరిౖయెన వేదిక అనే సలహాతో పాయల్ గేమింగ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాను’ అంటుంది పాయల్. ఛానల్ మొదలైన తరువాత రకరకాల విషయాలు స్వయంగా నేర్చుకోవడం మొదలుపెట్టింది. ప్రేక్షకుల నుంచి సలహాలు, సూచనలు తీసుకునేది. లైవ్స్ట్రీమింగ్ గురించి ఎన్నో రోజులు రిసెర్చ్ చేసింది. ఎలాంటి కంటెంట్ను ప్రజలు ఇష్టపడుతున్నారు? లైవ్స్ట్రీమింగ్ పనితీరు ఎలా ఉంటుంది? ఇప్పుడున్న గేమింగ్ ఛానల్స్కు భిన్నంగా ఎలా ప్రయత్నించవచ్చు....ఇలా రకకరాల విషయాలపై లోతైన పరిశోధన చేసింది. పాయల్ కాస్త సిగ్గరి. నలుగురి ముందు మాట్లాడాలంటే భయం. కెమెరా ఫేస్ చేయాలంటే కష్టం. ‘ఒకటి సాధించాలని బలంగా అనుకొని బరిలోకి దిగితే, వారిలోని రెండు లోపాలు మాయమవుతాయి’ అంటారు. పాయల్ విషయంలోనూ అదే జరిగింది. బరిలోకి దిగిన తరువాత కెమెరాను హాయిగా ఫేస్ చేయడం నేర్చుకుంది. బెటర్ ఇంటర్నెట్ కోసం సొంత పట్టణం వదిలి, అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి మారాలనుకున్నప్పుడు తల్లిదండ్రులు వద్దని గట్టిగా చెప్పారు. వారిని ఒప్పించడానికి చాలా సమయమే పట్టింది. అయితే ఇక్కడికి మారిన తరువాత సబ్స్కైబర్ల సంఖ్య బాగా పెరిగింది. మొదట్లో తనకు పేరున్న గేమర్స్లాగా పర్సనల్ కంప్యూటర్ సెటప్ లేదు. లైవ్స్ట్రీమ్, అప్లోడ్కు తన దగ్గర ఉన్న ఫోన్ తప్ప మరో మార్గం లేదు. ఇప్పుడు మాత్రం తన దగ్గర డ్యూయల్ మానిటర్స్తో కూడిన మంచి పీసీ సెటప్ ఉంది. ‘పాయల్ గేమింగ్’ ఛానల్ 2.5 మిలియన్ సబ్స్రైబర్లతో దూసుకుపోతుంది. ఈ విజయాన్ని పాయల్ ఊహించలేదు. అయితే ఇది అంత సులువుగా దక్కిన విజయం కాదు. ‘సబ్స్క్రైబర్లు కొద్దిమంది మాత్రమే ఉన్నప్పుడు పెద్దగా ఎవరి దృష్టి ఉండదు. అయితే అదే ఛానల్ విజయవంతంగా దూసుకుపోతున్నప్పుడు అందరి దృష్టి దానిపైనే ఉంటుంది. ప్రోత్సహించే వారి కంటే రాళ్లు రువ్వే వాళ్లే ఎక్కువగా ఉంటారు. నా లైవ్స్ట్రీమ్స్పై కొందరు హేట్ కామెంట్స్ చేశారు. కొందరు బాడీ షేమింగ్ చేశారు. మొదట్లో బాధపడేదాన్ని. వారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారనే విషయం అర్థమైన తరువాత వాటిని తేలికగా తీసుకున్నాను’ అంటుంది పాయల్. విజయం కోసం పోరాటం ఎంత ముఖ్యమో, ఆ విజయాన్ని నిలుపు కోవడం కోసం గట్టిగా నిలబడడం కూడా అంతే ముఖ్యం. పాయల్ ధారే ప్రస్తుతం అదే ప్రయత్నంలో ఉంది. ఇదీ చదవండి: విలేజ్ నుంచి విదేశాలకు: పూజా, ఆశా, సుర్భి ఏం చేస్తున్నారంటే!
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
ప్రారంభమైన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు
టీడీపీ జనసేన మధ్య డబ్బు గొడవ
ఇస్మార్ట్ రాహుల్ గాంధీ
ఎల్లో టెర్రరిజం..బాబు, పురందేశ్వరి కుట్ర దీనికోసమేనా ?
Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
నీ శకం ముగిసింది బాబు..
సాత్విక్–చిరాగ్ జోడీ శుభారంభం!
చంద్రబాబు ఏమైనా హీరోనా ?..అంబటి మురళి మాస్ ర్యాగింగ్
శృతి శర్మ : ‘హీరామండి’లో మెరిసిన ‘ఏజెంట్’ హీరోయిన్
స్లోవేక్ ప్రధానిపై హత్యాయత్నం ఎందుకు జరిగిందంటే..
తప్పక చదవండి
- Federation Cup 2024: నీరజ్ చోప్రాకు స్వర్ణం
- పెంపుడు కుక్క పెట్టిన గొడవ.. నడిరోడ్డుపైనే చితకబాదారు
- ఏపీలో ఓటేసుకునే స్వేచ్ఛ కూడా లేదా?
- సీఎం జగన్కు వేద పండితుల ఆశీర్వచనం
- Yadadri: ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు.. సాయం చేయండి
- తెలంగాణలో దంచికొట్టనున్న వానలు.. హైదరాబాద్కు కుంభవృష్టి హెచ్చరిక!
- టీడీపీ గూండాగిరికి పోలీసుల వత్తాసు
- భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ రేసులో టాలీవుడ్ హీరో
- Today Horoscope: ఈ రాశి వారికి ఇంటిలో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
- విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు
Advertisement