-
ఉగ్రవాది గోల్డీ బ్రార్ బతికే ఉన్నాడు
వాషింగ్టన్: పంజాజీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో నిందితుడైన గ్యాంగ్స్టర్, ఉగ్రవాది గోల్డీ బ్రార్ మృతి చెందినట్లు వచ్చిన వార్తలను అమెరికాలోని కాలిఫోర్నియా పోలీసులు కొట్టిపారేశారు. గోల్డీబ్రార్ బతికే ఉన్నాడని చెప్పారు. ప్రెస్నో సిటీలో మంగళవారం సాయంత్రం రెండు గ్యాంగ్ల మధ్య జరిగిన కాల్పుల్లో గోల్డీ బ్రార్ మరణించాడని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే, హతుడిని 37 ఏళ్ల జేవియర్ గ్లాండీగా ప్రెస్నో పోలీసులు బుధవారం గుర్తించారు. గోల్డీ బ్రార్ హతమైనట్లు భారత మీడియాలోనూ ప్రసారమైంది. -
అన్సారీ అంత్యక్రియలు పూర్తి
లక్నో: గ్యాంగ్స్టర్, రాజకీయ నేత ముఖ్తార్ అన్సారీ అంత్యక్రియలు శనివారం యూపీలోని గాజీపూర్లో ముగిశాయి. వేలాది మంది అన్సారీకి మద్దతుగా నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. పట్టణంలో 144 సెక్షన్ అమలు చేశారు. కొందరు శ్మశాన వాటికలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించగా అడ్డుకున్నారు. అన్సారీ సోదరుడు, ఎంపీ అఫ్జల్ అన్సారీ, ఘాజీపూర్ జిల్లా మేజిస్ట్రేట్ ఆర్యక అఖౌరీ మధ్య ఈ సందర్భంగా కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. -
Mukthar Ansari : ‘‘అన్సారీ మరణంతో మాకు న్యాయం జరిగింది’’
లక్నో: గ్యాంగ్స్టర్, పొలిటీషియన్ ముఖ్తార్ అన్సారీ మృతితో తమకు న్యాయం జరిగిందని 2005లో అన్సారీ చేతిలో హత్యకు గురైన బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ కుటుంబ సభ్యులు వ్యాఖ్యానించారు. కృష్ణానందరాయ్ కుమారుడు పియూష్ రాయ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ అన్సారీ మృతితో తమ కుటుంబం సంతోషంగా ఉందని చెప్పారు. ‘బాబా గోరక్నాథ్ దయతోనే మాకు న్యాయం జరిగింది. రంజాన్ నెలలోనే అన్సారీకి దేవుడు తగిన శిక్ష విధించాడు. పంజాబ్లోని జైళ్లలో ఉండి కూడా అన్సారీ అక్కడి నుంచి నేరాలకు పాల్పడ్డాడు. ఉత్తరప్రదేశ్కు వచ్చిన తర్వాత అతడికి తగిన శాస్తి జరిగింది. ప్రతిపక్షాలకు కేవలం రాజకీయాలు కావాలి. ఒక క్రిమినల్కు ఆయా పార్టీల నేతలు మద్దతు పలకడం దారుణం’అని పియూష్ రాయ్ వ్యాఖ్యానించారు. అన్సారీ నేరాల వల్ల గాయపడ్డ కుటుంబాలకు ఇప్పుడు న్యాయం జరిగిందని, తాము సంతోషంగా ఉన్నామని ఎమ్మెల్యే కృష్ణానందరాయ్ భార్య అల్కా రాయ్ అన్నారు. ఇదీ చదవండి.. అన్సారీపై విష ప్రయోగం -
Mukhtar Ansari: అన్సారీపై విష ప్రయోగం?
లక్నో: బాందా జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ (63) గురువారం కన్నుమూశారు. అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ఆయనకు చికిత్స అందుతుండగానే.. గుండెపోటుకు గురై చనిపోయినట్లు దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రి వైద్యులు ప్రకటించారు. అయితే.. కుటుంబ సభ్యులు మాత్రం అన్సారీ మృతిపై సంచలన ఆరోపణలకు దిగారు. ముఖ్తార్ అన్సారీపై విషప్రయోగం జరిగిందని.. 2005 నుంచి బాందా జైలులో ఉన్న ఆయనపై విషప్రయోగం జరగడం ఇప్పుడు రెండోసారి ఆయన సోదరుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. ‘జైలులో అన్సారీకి ఆహారంలో విషం కలిపి ఇచ్చారు. సుమారు 40 రోజుల పాటు ఆహారంలో విషం కలిపారు. మార్చి 19వ తేదీన ఆయన తిన్న ఆహారంలో విషం కలిసింది. అందుకే ఆయన ఆరోగ్యం ఆందోళనకంగా మారి ఆస్పత్రిలో చేరారు’ అని అఫ్జల్ అన్సారీ అంటున్నారు. తన తండ్రికి స్లో పాయిజన్ ఇచ్చి చంపేశారంటూ ముఖ్తార్ కుమారుడు ఉమర్ ఆరోపిస్తున్నాడు. ఈ విషయంపై కోర్టును సంప్రదిస్తానని చెప్పారు. ‘ మా నాన్న(ముఖ్తార్)పై విష ప్రయోగం జరుగుతోందన్న విషయాన్ని మేము గతంలో కూడా చెప్పాం. ఇప్పుడూ కూడా అదే చెబుతున్నాం. మార్చి 19న మా నాన్న( ముఖ్తార్)కు రాత్రి భోజనంలో విషం కలిపారు. మేము ఈ విషయంలో కోర్టును సంప్రదిస్తాం. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది’ అని ఉమర్ తెలిపారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ ఆరోగ్యం విషయమించటంతో ఆయన్ను మంగళవారం బాందాలోని దుర్గావతి మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నట్లు ఆయనపై విష ప్రయోగం జరిగిందా? అనేదానిపై వైద్యులు స్పందించలేదు. బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఇవాళ ముఖ్తార్ అన్సారీ మృతదేహానికి శవపరీక్ష జరగనుంది. ఆపై ఈ ఆరోపణలపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. గ్యాంగ్స్టర్ పొలిటీషియన్ యూపీలోని మౌకు చెందిన అన్సారీపై గ్యాంగ్స్టర్ నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన అన్సారీ 2005 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. ఆయనపై మొత్తం 61 కేసులు నమోదయ్యాయి. అందులో 15 హత్య కేసులు ఉన్నాయి. 1980ల్లో గ్యాంగ్ సభ్యుడిగా చేరిన అన్సారీ 1990ల్లో సొంతంగా గ్యాంగ్ను ఏర్పాటు చేసుకున్నారు. మౌ, ఘాజీపుర్, వారణాసి ప్రాంతాల్లో ఈ గ్యాంగ్ దోపిడీలు, కిడ్నాపులకు పాల్పడేది. 2004లో అన్సారీ వద్ద మెషిన్ గన్ బయటపడడంతో పోలీసులు అప్పటి ఉగ్రవాద నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. భాజపా ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ హత్య కేసులో గతేడాది ఏప్రిల్లో కోర్టు ఆయనకు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 1990లో నకిలీ తుపాకీ లైసెన్స్ కలిగి ఉన్నారన్న అభియోగాల నేపథ్యంలో ఈ నెల 13న కోర్టు జీవితఖైదు విధించింది. ఐదుసార్లు మౌ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్తార్ రెండు సార్లు బీఎస్పీ తరఫున ఎన్నికయ్యారు. ఆయన మృతికి ఆ పార్టీ ఎక్స్(ట్విటర్)లో సంతాపం ప్రకటించింది. అన్సారీ మృతితో యూపీ మొత్తంగా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించారు. బాందా, మౌ, ఘాజీపుర్, వారణాసి జిల్లాల్లో అదనపు పోలీసు బలగాలతో పాటు, సెంట్రల్ రిజర్వ్ బలగాలను మోహరించినట్లు యూపీ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. ముఖ్తార్ అన్సారీ మృతిపై దర్యాప్తు జరగాలి: మాయావతి జైలులో ముఖ్తార్ అన్సారీపై మృతిపై ఆయన కుటుంబం వ్యక్తం చేస్తున్న భయాలు, విష ప్రయోగానికి సంబంధించి ఆరోపణలపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ వేదిక స్పందించారు. ‘ ముఖ్తార్ మృతి దార్యప్తు జరగాలి. మృతికి సంబంధించిన వాస్తవాలు బయటకు రావాలి. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా’ అని పేర్కొన్నారు. मुख़्तार अंसारी की जेल में हुई मौत को लेकर उनके परिवार द्वारा जो लगातार आशंकायें व गंभीर आरोप लगाए गए हैं उनकी उच्च-स्तरीय जाँच जरूरी, ताकि उनकी मौत के सही तथ्य सामने आ सकें। ऐसे में उनके परिवार का दुःखी होना स्वाभाविक। कुदरत उन्हें इस दुःख को सहन करने की शक्ति दे। — Mayawati (@Mayawati) March 29, 2024 -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి
లక్నో: జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, ఉత్తరప్రదేశ్ రాజకీయ నాయకుడు ముఖ్తార్ అన్సారీ(63) గురువారం గుండెపోటుకు గురై బందా మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో మృతి చెందారు. అంతకుముందు, రాత్రి 8.25 గంటల సమయంలో అన్సారీ ఆరోగ్యం విషమించడంతో అధికారులు బందా జిల్లా జైలు నుంచి ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యుల బృందం చికిత్సలు చేస్తుండగానే ఆయన గుండెపోటుకు గురై చనిపోయినట్లు బందా మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ పీటీఐకి తెలిపారు. దీంతో, ఉన్నతాధికారులు ఆస్పత్రి వద్ద భారీగా పోలీసులను మోహరించారు. రాష్ట్రవ్యాప్తంగా సెక్షన్ 144 కింద నిషేధాజ్ఞలు విధించారు. బందా, మౌ, గాజీపూర్, వారణాసి జిల్లాల్లో ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. పొట్టలో నొప్పిగా ఉందని చెప్పడంతో మంగళవారం కూడా ఆస్పత్రిలో 14 గంటలపాటు ఉంచినట్లు అధికారులు చెప్పారు. జైలులో ఆయనపై విష ప్రయోగం జరిగిందని ఇతడి సోద రుడు, ఘాజీపూర్ ఎంపీ అఫ్జల్ అన్సారీ ఆరోపించారు. 5సార్లు ఎమ్మెల్యే.. 60కిపైగా కేసులు మౌ సదర్ స్థానం నుంచి రెండుసార్లు బీఎస్పీ తరఫున, రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి సొంతపార్టీ క్వామీ ఏక్తా దళ్ తరఫున మొత్తం ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. వివిధ ఆరోపణలపై యూపీ, పంజాబ్ జైళ్లలో 2005 నుంచి శిక్ష అనుభవిస్తున్నారు. ఈయనపై 60కి పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. యూపీలోని వివిధ కోర్టులో 2022 నుంచి ఇతడిపై ఉన్న 8 కేసుల్లో తీర్పులు వెలువరించాయి. ప్రస్తుతం బందా జైలులో ఉన్నారు. -
చర్మం ఒలిచి..చెప్పులు కుట్టించి..
మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికి చెందిన రౌనక్ గుర్జర్ అనే మాజీ గ్యాంగ్స్టర్ తన తల్లిపై ఉన్న ప్రేమను అచ్చంగా రామాయణంలో శ్రీరాముడు పేర్కొన్నట్లుగా చాటాడు. ఏకంగా తన చర్మాన్ని ఒలిచి తల్లికి చెప్పులు కుట్టించి కానుకగా ఇచ్చాడు! ఇందుకుగల కారణాన్ని అతను వివరించాడు. గతంలో నేరప్రవృత్తి కారణంగా పోలీసు కాల్పుల బారినపడ్డ గుర్జర్ ఆ తర్వాత నిత్యం రామాయణ పారాయణంతో పూర్తిగా మారిపోయినట్లు పేర్కొన్నాడు. ముఖ్యంగా శ్రీరాముని పాత్ర నుంచి ఎంతో స్ఫూర్తి పొందానని.. తల్లికి చర్మంతో చెప్పులు కుట్టించినా ఆమె రుణం తీర్చుకొనేందుకు చాలదని శ్రీరాముడు స్వయంగా పేర్కొన్న మాట తనను ఎంతగానో ఆకర్షించిందని గుర్తుచేసుకున్నాడు. అందుకే తాను తల్లికి తన చర్మంతో చెప్పులు కుట్టించాలని నిర్ణయించుకున్నట్లు గుర్జర్ చెప్పుకొచ్చాడు. ఇంట్లో వారికి చెప్పకుండా ఆస్పత్రిలో చేరి తన కాలి తొడ చర్మాన్ని సర్జరీ చేయించి తొలగించుకున్నానని.. ఆ చర్మాన్ని చెప్పులు కుట్టే వ్యక్తికి ఇచ్చి చెప్పులు చేయించానన్నాడు.గత వారం ఇంటి వద్ద నిర్వహించిన కార్యక్రమంలో తన తల్లికి ఈ చెప్పులను బహూకరించగా వాటిని చూసి ఆమె కన్నీటిపర్యంతమైందని గుర్జర్ తెలిపాడు. తల్లిదండ్రుల పాదాల చెంతనే స్వర్గం ఉంటుందనే విషయాన్ని సమాజానికి చాటిచెప్పాలనే ఈ పని చేశానన్నాడు. ‘తండ్రి స్వర్గానికి నిచ్చెనయితే తల్లి ఆ మార్గాన్ని చేరుకొనే వ్యక్తి’ అని గుర్జర్ పేర్కొన్నాడు. -సాక్షి సెంట్రల్ డెస్క్ -
ఆ మాజీ సీఎం చెప్పారనే.. 60 ఏళ్ల వయసులో పెళ్లి!
‘‘లాలూజీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాం. ఆ భార్యాభర్తలు మనస్పూర్తిగా ఆయన మమ్మల్ని ఆశీర్వదించారు.. అది చాలూ..’’ అంటూ సంతోషంగా మీడియా ముందు మాట్లాడారు 60 ఏళ్ల అశోక్ మహతో. ఈ వయసులో పెళ్లా.. దానికి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి దిగ్గజ నేత ఆశీర్వాదం ఎందుకు అనుకుంటున్నారా?.. ఎన్నికలు వస్తున్నాయి కదా.. అందుకేనట! నవాదా జిల్లాకు చెందిన అశోక్ మహతో.. మాజీ గ్యాంగ్స్టర్. సంచలన కేసుల్లో 17 ఏళ్లు జైలు శిక్ష అనుభవించి గతేడాదే విడుదలయ్యాడు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయాలని ఉవ్విళ్లూరాడు. అందుకోసం ముంగేర్ స్థానం ఎంచుకున్నాడు. ఇదే స్థానం నుంచి ప్రస్తుత ఎంపీ, జేడీయూ నేత లాలన్ సింగ్ పోటీ చేస్తున్నారు. ఎలాగూ.. ఆర్జేడీ మద్దతు ఉంది. టికెట్ దక్కే అవకాశం లేకపోలేదు. కానీ.. అన్నేళ్లు జైలు శిక్ష అనుభవించి రావడం, కొన్ని కేసులు పెండింగ్లో ఉండడంతో చట్టపరంగా సాధ్యం కావడం లేదు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితుల్లో బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ను కలిశారు. ఇక్కడే లాలూ తన మార్క్ రాజకీయం చూపించారు. ‘వివాహం చేసుకుని నీ భార్యను పోటీ చేయించు’ అని లాలూ సలహా ఇచ్చారు. అంతే.. ఢిల్లీకి చెందిన కుమారి అనిత(46) అనే మహిళను మంగళవారం రాత్రి పాట్నా శివారులో ఉన్న ఓ గుడిలో కుటుంబ సభ్యులు, తన మద్దతుదారుల మధ్య పెళ్లి చేసుకున్నారు. బుధవారం ఉదయం ఆ నవవధువు, వరుడు లాలూ ఇంటికి వెళ్లారు. మాజీ సీఎం జంట లాలూ-రబ్రీదేవీల ఆశీర్వాదం తీసుకున్నారు. బయటకు వచ్చిన ఆయన వాహనాన్ని మీడియా ప్రతినిధులు చుట్టుముట్టి.. ఆర్జేడీ టికెట్ ఇస్తుందా? లాలూ హామీ ఇచ్చారా? మీ భార్యను ఎన్నికల బరిలో దింపబోతున్నారా?.. హడావిడిగా వివాహం చేసుకోవడానికి కారణాలేంటి?.. ఇలా ప్రశ్నలతో ఆ పెళ్లి కొడుకును ఉక్కిరి బిక్కిరి చేశారు. అయితే అశోక్ మాత్రం తెలివిగా ‘ ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ఆర్జేడీ నుంచి పోటీ చేస్తాం’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ब्याह रचाने के बाद नई नवेली दुल्हन के साथ लालू का आशीर्वाद लेने पहुंचे कुख्यात अशोक महतो, टिकट के लिए 62 की उम्र में खरमास में रचाई है शादी#ASHOKMAHTO #BiharPolitics #Bihar #BiharNews pic.twitter.com/VqrEn1zeSb — FirstBiharJharkhand (@firstbiharnews) March 20, 2024 VIDEO Credits: FirstBiharJharkhand షేక్పురా జేడీయూ ఎమ్మెల్యే రణధీర్ కుమార్ సోనీపై హత్యాయత్నం ఆరోపణలతోపాటు నవాదా జైలు బద్దలుగొట్టిన కేసులో నేరస్థుడిగా అశోక్ మహతో 17ఏళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడు. 2023లో జైలు నుంచి ఆయన విడుదలయ్యాడు. ఇక.. 1997లో దాణా కుంభకోణంలో లాలూ రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు తన భార్య రబ్రీదేవిని బీహార్కు ముఖ్యమంత్రిని చేసింది తెలిసిందే. -
పోలీసుల భారీ బందోబస్తు మధ్య ఒక్కటైన గ్యాంగ్స్టర్, రివాల్వర్ రాణి
న్యూఢిల్లీ: సమాజంలో ప్రముఖ వ్యక్తుల పెళ్లిళ్లు జరిగినపుడు భారీ బందోబస్తు, కట్టుదిట్టమైన భద్రత కనిపించడం సహజం. కానీ కరడుగట్టిన నేరగాడి పెళ్లి తంతును పోలీసులే దగ్గరుండి జరిపించిన ఘటనకు దేశ రాజధాని వేదికైంది. పెరోల్పై తిహార్ జైలు నుంచి బయటికొచ్చిన గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జథేడీ వివాహ వేడుక విశేషమిది. వివరాల్లోకి వెళ్తే సందీప్ డజనుకుపైగా హత్య, హత్యాయత్నం, దోపిడీ కేసుల్లో నిందితుడు. గ్యాంగ్స్టర్ అయిన సందీప్ నాలుగేళ్లుగా లేడీ డాన్గా పేరుబడ్డ అనురాధాతో ప్రేమాయణం నడుపుతున్నాడు. మరో గ్యాంగ్స్టర్ ఆనంద్పాల్సింగ్ ముఠా సభ్యురాలైన అనురాధాపై మనీ లాండరింగ్, బెదిరింపు వసూళ్లు వంటి అరడజనుదాకా కేసులు ఉన్నాయి. బెయిల్ మీద ఇప్పటికే అనురాధా విడుదలకాగా సందీప్కు కేవలం ఆరు గంటల పెరోల్ లభించింది. ఈ సమయంలోనే పెళ్లాడాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా ఢిల్లీ ద్వారకా సెక్టార్–3లోని సంతోష్ గార్డెన్ ఫంక్షన్హాల్ను బుక్చేశారు. సందీప్ న్యాయవాది రూ.51,000కు ఈ ఫంక్షన్ను బుక్చేశారు. సందీప్, అనురాధాలు వేర్వేరు నేరముఠాలకు చెందిన వ్యక్తులు కావడంతో పెళ్లివేడుకలో గ్యాంగ్వార్ జరిగే ఆస్కారముందని పోలీసులు భావించారు. నాలుగు అంచెల రక్షణ ఢిల్లీ, హరియాణా పోలీసులు ఫంక్షన్హాల్ను శత్రుదుర్బేధ్యంగా మార్చేశారు. ప్రవేశద్వారం వద్ద మెటల్ డిటెక్టర్లు, కీలక ప్రాంతాల్లో సీసీకెమెరాలు అమర్చారు. డ్రోన్లను రంగంలోకి దింపారు. ఫంక్షన్ హాల్ పరిసరాల్లో 250కిపైగా పోలీసులు మొహరించారు. పెళ్లిరోజు రానే వచ్చింది. హరియాణాలోని సోనీపట్ నుంచి బ్లాక్ ఎస్యూవీ వాహనంలో వధువు అనురాధా, పోలీసు బందోబస్తు నడుమ వరుడు సందీప్ పెళ్లిమండపానికి చేరుకున్న విధానం అచ్చం ఓటీటీ థ్రిల్లర్ను తలపించింది. కవరేజీ కోసం చేరుకున్న మీడియా ప్రతినిధులు, రక్షణగా చుట్టుముట్టిన పోలీసులు, వధూవరుల తరఫున హాజరైన కొందరు నేరగాళ్ల సమక్షంలో మంగళవారం వివాహం ఆడంబరంగా జరిగింది. వివాహం తర్వాత సందీప్ను పోలీసులు మళ్లీ తిహార్ చెరసాలకు తీసుకెళ్లారు. పెళ్లి వేడుకలో నాలుగు అంచెల భద్రతా వలయాన్ని పోలీసులు సృష్టించారు. బంధువులు వస్తే వెంట గుర్తింపు కార్డులను తెచ్చుకోవాలి. వారి పేర్లు పోలీసుల వద్ద ఉన్న జాబితాతో సరిపోలాలి. ఆ తర్వాత వేడుకలో పాల్గొననిస్తారు. సెల్ఫోన్లను మండపంలోకి పోలీసులు అనుమతించలేదు. స్పెషల్ సెల్, క్రైమ్ బ్రాంచ్, హరియాణా క్రైమ్ ఇన్వెస్టిగేన్ ఏజెన్సీ, ఢిల్లీ స్పెషల్ వెపన్స్ టెక్నిక్స్ విభాగాల పోలీసులు భద్రతా విధుల్లో పాల్గొన్నారు. ‘రివాల్వర్ రాణి’, ‘మేడమ్ మింజ్’గా పేరొందిన 39 ఏళ్ల అనురాధాను 2020 సంవత్సరం నుంచి 40 ఏళ్ల సందీప్ ప్రేమిస్తున్నాడు. జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు ఇతను సన్నిహితుడు. అతడి తలపై రూ.7 లక్షల రివార్డ్ ఉంది. 2021లో పోలీసులు అతడిని అరెస్ట్చేశారు. గతంలో కస్టడీ నుంచి ఒకసారి సందీప్ తప్పించుకున్నాడు. అది పునరావృతం కాకూడదనే పెరోల్పై బయట ఉన్నంతసేపు సందీప్పై పోలీసులు ఓ కన్నేసి ఉంచారు. గ్యాంగ్వార్ను ఎదుర్కొనేందుకు మండపంలో పోలీసులు బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు ధరించారు. కేసుల బాధ నుంచి విముక్తి పొందాక సాధారణ జీవితం గడపాలని ఇద్దరం భావిస్తున్నట్లు అనురాధా చెప్పారు. -
250 మంది పోలీసుల బందోబస్తు మధ్య గ్యాంగ్స్టర్ల పెళ్లి..
న్యూఢిల్లీ: గ్యాంగ్స్టర్ సందీప్ అలియాస్ కాలా జాతేడి, మహిళా క్రిమినల్ అనురాధ చౌదరి అలియాస్ 'మేడమ్ మింజ్'ల వివాహం మంగళవారం ఢిల్లీఓ జరిగింది. ద్వారకా సెక్టార్-3లోని సంతోష్ గార్డెన్, బాంక్వెట్ హాల్ వీరి పెళ్లి వేదికగా మారింది.. సందీప్ తరఫు న్యాయవాది రూ.51వేలు చెల్లించి ఈ హాల్ను బుక్ చేశాడు. ఈ వివాహానికి సందీప్ కుటుంబం 150 మంది అతిథులను ఆహ్వానించాడు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న ఓ గ్యాంగ్స్టర్, బెయిల్పై ఉన్న ఓ మహిళా క్రిమినల్కు వివాహం నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఢిల్లీ పోలీసులు వ్యూహాత్మక ప్రణాళికను రూపొందించారు. గ్యాంగ్స్టర్కు ఉన్న నేర చరిత్ర, కేసులను దృష్టిలో పెట్టుకొని గ్యాంగ్వార్ జరిగే అవకాశం, లేదా కస్టడీ నుంచి నిందితుడు తప్పించుకునేందుకు తావివ్వకుండా ఢిల్లీ పోలీసులు పకడ్బందీ ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్, స్పెషల్ స్టాఫ్, క్రైమ్ బ్రాంచ్ల బృందాలు రంగంలోకి దిగాయి. డ్రోన్లు, సీసీటీవీ కెమెరాలు, మెటల్ డిటెక్టర్లు, సాయుధ బలగాల మోహరించారు. 250 మందికి పైగా పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. వేదిక ప్రవేశం వద్ద రెండు డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశామని, వివాహానికి హాజరైన ప్రతి ఒక్కరూ దాని గుండా వెళ్లాల్సి ఉంటుందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు పేర్కొన్నారు. కాగా హరియాణాలోని సోనిపట్కు చెందిన సందీప్ ఒకప్పుడు అతని తలపై రూ. 7 లక్షల రివార్డుతో వాంటెడ్ క్రిమినల్. తీహార్ జైల్లోఉ న్న సందీప్.. పెళ్లి కోసం ఢిల్లీ కోర్టు ఆరు గంటల పెరోల్ ఇచ్చింది. ఇక ‘రివాల్వర్ రాణి' గా పేరొందిన అనురాధ చౌదరి అనేక కేసుల్లో నిందితురాలిగా ఉంది. ప్రస్తుతం ఆమె బెయిల్పై ఉన్నారు. నాలుగేళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారు.. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్కు సందీప్ అత్యంత సన్నిహితుడు. ఇతడిపై దోపిడీ, హత్య, హత్యాయత్నం వంటి కేసులున్నాయి. -
Canada: భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు
ఒట్టావా: కెనడా రాజధాని నగరం ఒట్టావాలో భారత సంతతి వ్యాపారవేత్త ఇంటిపై దాడి జరిగింది. వ్యాపారవేత్త ఇంటిపై దుండగులు పలు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ దాడికి పాల్పడింది పరారీలో ఉన్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ అలియాస్ సతిందర్జిత్ సింగ్ గ్రూపునకు చెందిన మనుషులుగా అనుమానిస్తున్నారు. మాస్కులు ధరించిన వ్యక్తులు వ్యాపారవేత్త ఇంటిలోకి కాల్పులు జరుపుతున్న వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. భారత్, కెనడాలో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్గా పేరున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్తో గోల్డీ బ్రార్ గ్యాంగ్కు సంబంధాలున్నాయి. అయితే వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులకు పాల్పడింది తామేనని ఇప్పటివరకు గోల్డీ బ్రార్ గ్యాంగ్ ఎలాంటి ప్రకటన చేయలేదు. భయపెట్టి బలవంతపు వసూళ్లకు(ఎక్స్టార్షన్) పాల్పడేందుకే వ్యాపారవేత్త ఇంటిపై కాల్పులు జరిపినట్లు పోలీసులు భావిస్తున్నారు. కెనడాలో గ్యాంగ్స్టర్లు ఎక్స్టార్షన్కు పాల్పడటం ప్రస్తుతం సాధారణంగా మారిపోవడం గమనార్హం. ఇదీ చదవండి.. ట్రంప్ ప్రపంచానికే ముప్పు -
'ఇటు చెన్నై... అటు ముంబై' వార్కు దిగిన మన గ్యాంగ్స్టార్స్
బాక్సాఫీస్ను లూటీ చేయడానికి గ్యాంగ్స్టర్గా మారారు కొందరు స్టార్స్. వెండితెరపై ఈ హీరోలు గ్యాంగ్వార్ చేస్తున్నారు. గ్యాంగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రాల్లో గ్యాంగ్స్టర్స్గా మారిన ఆ కోలీవుడ్ గ్యాంగ్స్టార్స్ గురించి తెలుసుకుందాం. గ్యాంగ్స్టర్ రంగరాయ గ్యాంగ్స్టర్ రంగరాయ శక్తివేల్ నాయకర్గా మారారు కమల్హాసన్. ‘థగ్ లైఫ్’ సినిమాలో కమల్హాసన్ చేస్తున్న పాత్ర పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. 1987లో చేసిన ‘నాయకన్’ (తెలుగులో ‘నాయకుడు’) చిత్రం తర్వాత హీరో కమల్హాసన్, దర్శకుడు మణిరత్నం కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా ఇది. 37 ఏళ్ల తర్వాత కమల్, మణిరత్నం కాంబోలో వస్తున్న ఈ సినిమాలో త్రిష, దుల్కర్ సల్మాన్, ‘జయం’ రవి, నాజర్, గౌతమ్ కార్తీక్, జోజూ జార్జ్, ఐశ్వర్యా లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ‘నా పేరు రంగరాయ శక్తివేల్ నాయకర్. కాయల్ పట్టినమ్. నన్ను క్రిమినల్, గుండా, యాకుజా అని పిలుస్తారు. యాకుజా అంటే జపాన్ భాషలో గ్యాంగ్స్టర్ అని అర్థం’ అంటూ ‘థగ్ లైఫ్’లోని తన పాత్ర గురించి ఈ సినిమా టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ వీడియోలో చెప్పుకొచ్చారు కమల్. ఆర్. మహేంద్రన్, కమల్హాసన్, మణిరత్నం, ఎ. శివ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ స్వరకర్త. 2025లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. స్టూడెంట్ టు గ్యాంగ్స్టర్ ‘సూరరై పోట్రు’ (‘ఆకాశం నీ హద్దురా!’) వంటి సందేశాత్మక బయోపిక్ తీసిన తర్వాత హీరో సూర్య, దర్శకురాలు సుధ కొంగర ఓ గ్యాంగ్స్టర్ ఫిల్మ్ చేయనున్నారు. ఈ పీరియాడికల్ గ్యాంగ్స్టర్ మూవీలో సూర్యతో పాటు దుల్కర్ సల్మాన్, నజ్రియా ఫాహద్, విజయ్ వర్మ లీడ్ రోల్స్ చేస్తారు. ఈ ఏడాది వేసవిలో ఈ సినిమా చిత్రీకరణ ఆరంభం అవుతుంది. చెన్నై, తిరుచ్చి లొకేషన్స్తో పాటు హర్యానాలో కూడా కొంత షూటింగ్ ప్లాన్ చేశారట. ఇక కథ రీత్యా స్టూడెంట్ స్థాయి నుంచి గ్యాంగ్స్టర్ వరకు ఎదిగే వ్యక్తి పాత్రలో సూర్య కనిపిస్తారని కోలీవుడ్ సమాచారం. 2డీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ను ఆరంభించారు సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్కుమార్. ఇది జీవీ ప్రకాశ్కు నూరవ చిత్రం కావడం విశేషం. ఇటు చెన్నై... అటు ముంబై తమిళనాడులో ఒకటి, ముంబైలో మరొకటి... ఇలా రెండు గ్యాంగ్లు మెయిన్టైన్ చేస్తున్నట్లున్నారు హీరో ధనుష్. ముందు తమిళనాడుకు వెళితే... ధనుష్ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రాయన్’. పీరియాడికల్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సందీప్ కిషన్, కాళిదాసు, సెల్వ రాఘవన్, ప్రకాశ్రాజ్, దుషారా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ముగ్గురు అన్నదమ్ములు (ధనుష్, సందీప్ కిషన్, కాళిదాసు)ల మధ్య నార్త్ చెన్నై నేపథ్యంలో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా అట ‘రాయన్’. ధనుష్ టైటిల్ రోల్ చేస్తున్న ఈ చిత్రం, ఆయనకు కెరీర్లో యాభైవ చిత్రం కావడం విశేషం. ఓ గ్యాంగ్స్టర్ చెఫ్గా ఎందుకు కొత్త జీవితం ప్రారంభించాల్సి వచ్చింది? గ్యాంగ్స్టర్ గొడవలు అతని కుటుంబాన్ని, జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేశాయనే అంశాలు ‘రాయన్’ చిత్రంలో ఉంటాయని టాక్. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రాన్ని ఈ ఏడాదే విడుదల చేయాలనుకుంటున్నారు. మరోవైపు ముంబై గ్యాంగ్స్టర్స్ మాఫియా నేపథ్యంలో సాగే ‘డీఎన్ఎస్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారని తెలిసింది. నాగార్జున ఓ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్. కథ రీత్యా ధనుష్, నాగార్జున ఈ సినిమాలో గ్యాంగ్స్టర్స్ రోల్స్ చేస్తున్నారని ఫిల్మ్నగర్ సమాచారం. దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పుస్కూరు రామ్మోహన్, సునీల్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘ధారావి’ అనే టైటిల్ను పరిశీ లిస్తున్నారట మేకర్స్. ఈ సినిమా 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలతో పాటు గ్యాంగ్స్టర్ నేపథ్యంలో తమిళంలో మరికొన్ని చిత్రాలు రానున్నాయి. -
పెళ్లి వేడుకలో కాల్పులు.. పాక్ గ్యాంగ్స్టర్ మృతి
లాహోర్: పాకిస్థాన్లో మరో గ్యాంగ్స్టర్ దారుణ హత్యకు గురయ్యాడు. లాహోర్ అండర్వరల్డ్ డాన్, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ నెట్వర్క్ చీఫ్ అమీర్ బలాజ్ టిపును ఓ దుండగుడు కాల్చివేశాడు. ఆదివారం లాహోర్లోని చంగ్ ప్రాంతంలో ఓ వివాహ వేడుకకు హాజరైన అమీర్తోపాటు మరో ఇద్దరు అతిథులపై గుర్తు తెలియని ఓ వ్యక్తి కాల్పులు జరిపాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. అప్రమత్తమైన ఆమీర్ సహాయకులు ఎదురు కాల్పులు జరపగా ఆ కాల్పుల్లో షూటర్ అక్కడికక్కడే మరణించాడు. గాయపడిన వారిని హుటాహుటిన జిన్నా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అమీర్ ప్రాణాలు కోల్పోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఆయనపై దాడికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు. కాగా 2010లో అల్లమా ఇక్బాల్ విమానాశ్రయంలో జరిగిన ఘోరమైన తుపాకీ కాల్పుల్లో ఆమీర్ తండ్రి ఆరిఫ్ అమీర్, అలియాస్ టిప్పు ట్రక్కన్వాలా మృతిచెందాడు. బలాజ్ తాత కూడా గతంలో గొడవలో పాత్ర ఉన్నవాడే. వీరి కుటుంబం మొత్తం హింసాత్మక చరిత్రను కలిగి ఉంది. -
ఒక్క ప్లాట్ రూ.200 కోట్లు.. భారీగా ఎగబడ్డ జనం - ఎందుకో తెలుసా?
కరోనా మహమ్మారి తరువాత రియల్ ఎస్టేట్ రంగం బాగా అభివృద్ధి చెందింది. గత కొంతకాలం నుంచి ఢిల్లీ NCR, ముంబై, హైదరాబాద్, కోల్కతా, పూణే, చెన్నై, బెంగళూరు నగరాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. ఇండియాలోనే ఇలా ఉంటే.. అమెరికాలాంటి అగ్రరాజ్యాల్లో రియల్ ఎస్టేట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇటీవల USAలో ప్లాట్ ఏకంగా రూ.200 కోట్లకు పలికినట్లు ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని చాలామంది ధనవంతులు ప్లోరిడాలోని మయామీ బీచ్ దగ్గర ఇల్లు కట్టుకోవాలని కలలు కంటారు. ఇటీవల అక్కడ ఉన్న ఒక ఓపెన్ ప్లాట్ కొనుగోలు చేయడానికి వందలాదిమంది ఎగబడ్డారు. దీంతో అది 23.9 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ ఏకంగా రూ.200 కోట్లకంటే ఎక్కువ. నిజానికి రూ.200 కోట్లకు పలికిన ఆ స్థలంలో ఒకప్పుడు గ్యాంగ్స్టర్ 'ఏఐ క్యాప్వన్' నివసించాడు, అతడు చనిపోయిన తరువాత అతని భవనం నేలమట్టం చేసారు. ఆ స్థలానికి అంత రేటు పలకడానికి కారణం అక్కడ గ్యాంగ్స్టర్ నివాసముండటమే అని కొందరు భావిస్తున్నారు. ఈ స్థలం మొత్తం 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్నట్లు సమాచారం. కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ అక్కడ నివాసముండటం వల్ల ఆ స్థలం బాగా పాపులర్ అయింది. దీంతో ఆ స్థలం గురించి చాలామందికి తెలిసింది. అందులోనూ అది పూర్తిగా ఖాళీ స్థలం కావడం వల్ల ఎక్కువమంది తమకు నచ్చినట్లు ఇల్లు కట్టుకోవచ్చని ఎగబడ్డారు. 2021లో ఈ స్థలం విలువ 10.75 మిలియన్లని.. ఆ తరువాత ఇప్పుడు ఆ భూమి విలువ రెట్టింపు ధరకు పలికినట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ కొత్త పుంతలు - వాటివైపే కొనుగోలుదారుల చూపు! -
మార్కెటింగ్ స్కామ్ నేపథ్యంలో ‘గ్యాంగ్ స్టర్’
గ్రానైట్ స్లాబులను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తూ వ్యాపార రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు నిర్మాత వేలు మురుగన్. ఆయన నిర్మిస్తున్న తాజా చిత్రం ‘గ్యాంగ్ స్టర్’. రామ్ ప్రభ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మార్చి నెలలో తెలుగు, తమిళ్, హిందీ భాషలలో విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాత వేలు మురుగన్ మాట్లాడుతూ మార్కెటింగ్ స్కామ్ అనే నూతన పాయింట్ పై సినిమా అంతా నడుస్తుంది. ఇప్పటి వరకు ఇలాంటి పాయింట్ పై సినిమా రాలేదని చెప్పాలి. ఇందులో హీరోలు ఎవరు? విలన్స్ ఎవరు? అనేది క్లైమాక్స్ వరకు తెలియదు. ప్రతి పాత్ర ఎంతో ఇంట్రస్టింగ్ గా క్యూరియాసిటీ కలిగించే విధంగా ఉంటుంది. దర్శకుడు రామ్ ప్రభ సినిమాను ఎంతో ఇంట్రస్టింగ్ గా తెరకెక్కించారు. ప్రజిన్ పద్మనాభన్ , జీవా మరియు విజయ్ విశ్వ ముఖ్య పాత్రలో నటించారు. అలాగే సాయిధన్య, మోహన సిద్ధి, షాలిని హీరోయిన్స్ గా పరిచయం చేస్తున్నాం. ముగ్గురు కూడా అందంతో పాటు అభినయంతో ఆకట్టుకుంటారు. ఆర్టిస్టులందరూ తమ పాత్రలకు తగ్గట్టుగా పోటీపడుతూ నటించారు. కచ్చితంగా ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ గ్యాంగ్ స్టర్ మంచి పేరు తెచ్చే సినిమా అవుతుంది అనడంలో సందేహం లేదు’ అన్నారు. -
పెళ్లి రోజే.. సొంత ముఠా చేతిలో గ్యాంగ్స్టర్ హతం..
పుణె: గ్యాంగ్స్టర్ శరద్ మోహోల్ దారుణ హత్యకు గురయ్యారు. ఆర్ధిక వివాదాల నేపథ్యంలో సొంత ముఠా సభ్యులే ఆయన్ను కాల్చి చంపారు. ఈ ఘటన పుణెలో శుక్రవారం చోటుచేసుకుంది. హత్య దృశ్యాలు స్థానిక సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి. వివరాలు.. గ్యాంగ్స్టర్ శరద్ మోహల్ (40)కు, అతడి గ్యాంగ్ సభ్యులకు మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు తలెత్తాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల సమయంలో శరద్ మోహోల్, అతని గ్యాంగ్ పుణెలోని కొత్రుడ్ రోడ్డుపై నడస్తూ వస్తున్నారు. చిన్న సందులోకి వెళ్లిన తర్వాత శరద్పై తన ముఠా సభ్యులు తుపాకీతో కాల్పులు జరిపారు. గఅతని ఛాతీకి ఒక బుల్లెట్, భుజానికి రెండు బుల్లెట్లు తగిలి కిందపడిపోయాడు. నిందితులు వెంటనే అతన్ని పక్కకు లాక్కెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్తపు మడుగులో పడి ఉన్న శరద్ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు . కేసు నమోదు చేసిన పోలీసులు ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు తుపాకులు, మూడు మ్యగజైన్లు, అయిదు రౌండ్ల బుల్లెట్లను ను స్వాధీనం చేసుకున్నారు. శరద్ మోహల్పై ఎన్నో దోపీడి, హత్య కేసులు ఉన్నాయి. డబ్బు, భూ వివాదాల కారణంగానే అతడిని హత్య చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. .దీనిపై మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో స్పందిస్తూ.. మొహోల్ను అతని అనుచరులే చంపారని ఇది గ్యాంగ్ వార్ కాదన్నారు. -
Goldy Brar: ఇక ఉగ్రవాదిగా గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్
ఢిల్లీ: ఉగ్రవాద నిర్మూలన, తీవ్రవాద కార్యకలాపాల కట్టడిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కెనడాలో ఆశ్రయం పొందుతున్న గ్యాంగ్స్టర్ గోల్డీ బ్రార్ను ఉగ్రవాదిగా ప్రకటించింది. ఈ మేరకు అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరుస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ప్రస్తుతం కెనడాలో ఉంటున్న గోల్డీ బ్రార్కు నిషేధిత ఖలిస్థానీ ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్తో సంబంధాలు ఉన్నాయని పేర్కొంది. గోల్డీ బ్రార్కు ఉగ్రవాద సంస్థలతోపాటు పలు హత్యలతో సంబంధం ఉన్నట్లు కేంద్రం వెల్లడించింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA), 1967 ప్రకారం గోల్డీ బ్రార్ను ఉగ్రవాదిగా ప్రకటిస్తున్నట్లు హోంశాఖ తెలిపింది. దేశంలోని పలువురు ప్రముఖులను హత్య చేసేందుకు కొన్ని హంతక ముఠాలకు డ్రోన్ల ద్వారా అక్రమంగా ఆయుధాలు, పేలుడు పదార్థాలను రవాణా చేసినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. తన అనుచరులతో పంజాబ్ రాష్ట్రంలో శాంతి భద్రతలకు భంగం కలిగించాలని గోల్డీ బ్రార్ ప్రయత్నిస్తున్నట్లు కేంద్రం భావిస్తోంది. అతడిపై ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసినట్లు కేంద్రం ఈ సందర్భంగా తెలిపింది. గోల్డీ బ్రార్ నేపథ్యం.. సతీందర్ సింగ్ అలియాస్ గోల్డీ బ్రార్ పంజాబ్లోని శ్రీ ముక్త్సార్ సాహిబ్లో 1994లో జన్మించాడు. ఇతడి తండ్రి పోలీస్ ఇన్స్పెక్టర్. తొలిసారిగా సిద్ధూ మూసేవాలా హత్య కేసు దర్యాప్తులో ఇతడి పేరు వెలుగులోకి వచ్చింది. మూసేవాలా హత్య కేసులో అరెస్టయిన లారెన్స్ బిష్ణోయ్తో ఇతడికి సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ హత్య గురించి గోల్డీ బ్రార్కు ముందే తెలుసని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. -
గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ను ఉగ్రవాదిగా ప్రకటించిన భారత్
న్యూఢిల్లీ: కెనడాకు చెందిన గ్యాంగ్స్టర్ లఖ్బీర్ సింగ్ లాండాను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉగ్రవాదిగా ప్రకటించింది. 33 ఏళ్ల లఖ్బీర్ ఖలిస్తానీ గ్రూప్ ‘బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్’ (బీకేఐ)కి చెందిన గ్యాంగ్స్టర్. 2021లో మొహాలిలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్క్వార్టర్పై రాకెట్ దాడి ప్రణాళికలో భాగస్వామ్యుడు. అదే విధంగా 2022 డిసెంబరులో తరన్ తరణ్లోని సర్హాలి పోలీస్ స్టేషన్లో జరిగిన ఆర్పీజీ దాడి ఘటనలోనూ లాండా పాత్ర ఉంది. అతను అనేక ఇతర తీవ్రవాద కార్యకలాపాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. లఖ్బీర్ స్వస్థలం పంజాబ్ కాగా గత కొన్నేళ్లుగా కెనడాలో స్థిరపడ్డాడు. భారత్కు వ్యతిరేకంగా జరిగిన కుట్రల్లో అతని హస్తం ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది సెప్టెంబర్లో లఖ్బీర్ సన్నిహితులతో సంబంధం ఉన్న 48 చోట్ల జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), పంజాబ్ పోలీసులు దాడులు నిర్వహించారు. సోదాల అనంతరం కొంత మందిని అరెస్టు చేశారు. అయితే సెప్టెంబర్ 21న ఒక వ్యాపారిపై ఇద్దరు దుండగులు దాడి చేయడంతో అధికారులు ఈ చర్య తీసుకున్నారు. తాను లాండ హరికే అని చెప్పుకుంటూ ఓవ్యక్తి తనకు ఫోన్ చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు సదరు వ్యాపారి పోలీసులకు చెప్పడంతో వారు దాడులు చేపట్టారు చదవండి: డామిట్! కథ అడ్డం తిరిగింది.. నితీశ్ను తప్పించబోయి చిత్తయిన లలన్ -
సింగర్ ఎల్లీ మంగట్ హత్యకు కుట్ర..అర్షదీప్ ముఠా సభ్యుల అరెస్ట్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని మయూర్ విహార్లో సోమవారం ఉదయం జరిగిన స్వల్ప ఎదురుకాల్పుల అనంతరం గ్యాంగ్స్టర్ అర్షదీప్ సింగ్ ముఠాకు చెందిన ఇద్దరు షార్ప్షూటర్లను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వీరిని రాజ్ప్రీత్ సింగ్(25), వీరేంద్ర సింగ్(22)గా గుర్తించారు. పంజాబీ గాయకుడు ఎల్లీ మంగట్ను చంపేందుకు వీరు పథక రచన చేసినట్లు వెల్లడించారు. ఎన్కౌంటర్ సమయంలో అయిదు రౌండ్ల వరకు తుపాకీ కాల్పులు జరపగా, రెండు బుల్లెట్లు పోలీసు అధికారి బుల్లెట్ప్రూఫ్ జాకెట్ను తాకాయన్నారు. ప్రతిగా పోలీసులు ఆరు రౌండ్ల వరకు జరిపిన కాల్పుల్లో వీరేంద్ర సింగ్ కుడి కాలికి గాయమైంది. ఎన్కౌంటర్ అనంతరం నిందితులిద్దరినీ ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించామన్నారు. వీరి నుంచి రెండు రివాల్వర్లు, ఒక హ్యాండ్ గ్రెనేడ్, చోరీ చేసిన బైక్ను స్వాధీనం చేసుకున్నారు. -
గ్యాంగ్స్టర్, మాజీ ఎమ్మెల్యే అన్సారీకి షాక్, పదేళ్ల జైలు, భారీ జరిమానా
Mukhtar Ansari: యూపీకి చెందిన గ్యాంగ్స్టర్ టర్న్డ్ పొలిటీషియన్,మాజీ ఎమ్మెల్యే ముఖ్తార్ అన్సారీ మరోసారి భారీ షాక్ తగిలింది. ముఖ్తార్ అన్సారీ హత్య, హత్యాయత్నం కేసుల్లో దోషిగా తేల్చిన ఘాజీపూర్ కోర్టు శుక్రవారం పదేళ్ల జైలుశిక్ష, భారీ జరిమానా విధించింది. 2009 గ్యాంగ్స్టర్స్ యాక్ట్ కేసులో అన్సారీని గురువారం ఘాజీపూర్ జిల్లా ప్రత్యేక న్యాయమూర్తి (ఎంపీ-ఎమ్మెల్యే) అరవింద్ మిశ్రా అన్సారీని దోషిగా ప్రకటించారు. బందా జైలులో ఉన్న ముఖ్తార్ అన్సారీ విచారణను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన కోర్టు శుక్రవారం తుది తీర్పును వెలువరించింది. అన్సారీ అనుచరుడు, సోనూ యాదవ్ను కూడా దోషి తేల్చింది. సోనుకు 5 సంవత్సరాల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించింది. అయితే దీనిపై హైకోర్టులో అప్పీలు చేస్తామనీ, తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని ముఖ్తార్ అన్సారీ తరఫు న్యాయవాది లియాఖత్ తెలిపారు. 2009లో కపిల్ దేవ్ సింగ్ హత్యకు కుట్ర పన్నిన ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు మీర్ హసన్ అనే వ్యక్తిపై దాడికి సంబంధించిన మరో కేసు కూడా ఉంది. ఘాజీపూర్లోని కరంద పోలీస్ స్టేషన్లో ముఖ్తార్పై గ్యాంగ్స్టర్ కేసు నమోదైంది. అయితే 2011, 2023లో ఈ రెండు కేసుల్లో అన్సారీని కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ ఏడాది ఏప్రిల్లో అన్సారీకి 1996లో విశ్వహిందూ పరిషత్ (విహెచ్పి) నాయకుడు నందకిషోర్ రుంగ్తా, 2005లో బీజేపీ ఎమ్మెల్యే కృష్ణానంద్ రాయ్ను హత్య చేసిన కేసులో 10 సంవత్సరాల జైలు శిక్ష పడింది. ముఖ్తార్ అన్సారీ మౌ సదర్ నియోజకవర్గం నుంచి ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. #WATCH | Ghazipur additional district government counsel (criminal) Neeraj Srivastava says, "A case was registered against Mukhtar Ansari and his aide Sonu Yadav in 2010. In connection with that case, both the accused were pronounced guilty yesterday and today arguments on the… https://t.co/hVsOHFXn9a pic.twitter.com/fK2QZq71Ii — ANI UP/Uttarakhand (@ANINewsUP) October 27, 2023 -
19 ఏళ్లకే గ్యాంగ్స్టర్గా, ఎన్ఐఏకి చుక్కలు: ఇపుడు ఇంటర్ పోల్ రంగంలోకి
న్యూఢిల్లీ: హర్యానాకు చెందిన 19 ఏళ్ల గ్యాంగ్స్టర్పై ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ (ఇంటర్పోల్) రెడ్ కార్నర్ నోటీసు జారీ ఏసింది. నకిలీ పాస్పోర్ట్తో రెండేళ్ల క్రితం అమెరికాకు పారిపోయిన గ్యాంగ్స్టర్ యోగేష్ కాద్యాన్పై నేరపూరిత కుట్ర, హత్యాయత్నం లాంటి అభియోగాలతో తాజాగా ఈ నోటీసు లిచ్చింది. యోగేష్ చిన్న వయస్సులోనే ఆధునిక ఆయుధాలను ఉపయోగించడంలో నిపుణుడని సంబంధిత వర్గాలను ఉటంకిస్తూ ఎన్డీటీవీ రిపోర్ట్ చేసింది. ప్రత్యర్థి గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న గ్యాంగ్లో ఇతను కూడా చేరినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం యుఎస్లోని బాబిన్హా గ్యాంగ్లో చేరిన కాద్యాన్కు ఖలిస్తానీ ఉగ్రవాదులతో కూడా సంబంధాలున్నాయని, అత్యాధునిక ఆయుధాల వినియోగంలో ఆరితేరిపోయాడనే తీవ్ర ఆరోపణలూ ఉన్నాయి. (‘‘క్లిక్ చేసి వాట్సాప్ ఛానెల్ ఫాలో అవ్వండి’’) ఈ నేపథ్యంలోనే ఇండియాలో కాద్యాన్ ఇల్లు, ఇతర రహస్య స్థావరాలపై ఇటీవల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA)దాడులు చేసింది. అలాగే అతని ఆచూకీ తెలిపిన రూ.1.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. తాజాగా ఇంటర్పోల్ కూడా రెడ్ కార్నర్ నోటీసును జారీ చేసింది. అంతకుముందు, విదేశాలకు పారిపోయాడని భావిస్తున్న మరో గ్యాంగ్స్టర్ హిమాన్షు అలియాస్ భౌపై రెడ్ కార్నర్ నోటీసు జారీ అయింది. వీరంతా ప్రస్తుతం లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ను తొలగించి, అమెరికా, కెనడాలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలనే ప్లాన్లో ఉన్నట్టు సమాచారం. (హెలికాప్టర్ నుంచి కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడ్డ జనం) కాగా గ్యాంగ్స్టర్-టెర్రర్ నెట్వర్క్లో NIA ఇటీవల వేగం పెంచింది. దీంతోచాలా మంది గ్యాంగ్స్టర్లు అండర్ గ్రౌండ్లోకి వెళ్లిపోవడమో, లేదా యోగేష్ కడియన్ మాదిరిగా నకిలీ పాస్పోర్ట్లతో భారతదేశం నుండి పారిపోయారు. గ్యాంగ్స్టర్ బిష్ణోయ్ ప్రస్తుతం డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలపై అహ్మదాబాద్ జైలులో ఉన్నాడు. ఈ కేసును ఎన్ఐఎ దర్యాప్తు చేస్తోంది. గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్య కేసులో బిష్ణోయ్ ప్రధాన నిందితుడు. (కొవ్వు ఇంజక్షన్లు: శరీరం కుళ్లిపోయి..వికృతంగా.. చావే మేలు అనుకున్నా.!) గత నెలలో పంజాబ్కు చెందిన ఖలిస్తానీ ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ (సుఖ దునేకే) కెనడాలో తామే హత మార్చామని లారెన్స్ బిష్ణోయ్ ప్రకటించడంతో అతను ఇటీవల మళ్లీ వార్తల్లో నిలిచాడు. గతంలో కూడా పలు మార్లు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ను ఈ మెయిల్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే. -
గ్యాంగ్స్టర్ సునీల్ నాహక్ హత్య
ఒడిశా: గత కొన్ని రోజులుగా పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న గంజాం జిల్లాకు చెందిన గ్యాంగ్స్టర్ సునీల్ నాహక్ గురువారం రాత్రి కుదలాలో గుర్తు తెలియని దుండగుల చేతిలో హత్యకు గురయ్యాడు. ఏఎస్పీ రమేష్ చంద్ర సెఠి తెలిపిన వివరాల మేరకు.. అస్కా పోలీసుస్టేషన్ పరిధి బొడగాం గ్రామానికి చెందిన గ్యాంగ్స్టర్ సునీల్ నాహక్ను కుదలా పోలీసుస్టేషన్ పరిధి ధర్మగడ గ్రామంలో దుండగులు మారణాయుధాలతో హత్యచేసి పరారయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందడంతో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఎంకేసీజీ మెడికల్ కళాశాలకు తరలించారు. హత్యకు గురైన సునీల్ నాహక్ కొద్ది నెలల క్రితం అస్కాలో హనుమాన్ కోయన్కి సంబంధించి డబుల్ మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్నాడు. అలాగే ఆయనపై వివిధ పోలీసుస్టేషన్లలో పదుల సంఖ్యలో గంజాయి కేసులు, పలు నేరారోపణలు ఉన్నాయి. కేసు నమోదు చేసిన పోలీసులు పరారైన నిందితులను గాలిస్తున్నారు. -
అమెజాన్ మేనేజర్ హత్య వెనుక 'మాయా గ్యాంగ్'.. అసలేంటిది..?
ఢిల్లీ: అమెజాన్ మేనేజర్ హత్యా ఉదంతంలో భయంకర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మేనేజర్ హర్ప్రీత్ గిల్ను హత్య చేసింది కేవలం 18 ఏళ్ల వడిలో అడుగుపెట్టిన ఓ యువకుడి నాయకత్వంలోని మాయా గ్యాంగ్ పనేనని పోలీసులు గుర్తించారు. నిందితులు ఇప్పటికే పలు కేసుల్లో నేరస్థులుగా ఉన్నట్లు తెలిపారు. మహమ్మద్ సమీర్(18).. నాలుగు మర్డర్ కేసుల్లో బాల్యనేరస్థునిగా శిక్షను అనుభవిస్తున్నాడు. అతని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లోనూ తుపాకీలకు పోజులిస్తూ, కాల్చడం వంటి ఫొటోలు ఉన్నాయి. అమెజాన్ మేనేజర్ హర్ప్రీత్ను హత్యచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్టయిన ఇద్దరిలో ఒకరు సమీర్ కాగా.. మరొకరు 18 ఏళ్ల బిలాల్ గని. గని గతేడాది హత్య, దోపిడీ కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతన్ని చిల్డ్రన్స్ అబ్జర్వేషన్ హోమ్కు పంపారు. కాని బయటకు వచ్చి వెల్డింగ్ షాప్లో పని చేస్తున్నాడు. Bhajanpura murder: Delhi Police nabs 18-year-old man, says case solved Read @ANI Story | https://t.co/CwwQ54udMf#BhajanpuraCase #DelhiPolice pic.twitter.com/JjWFK7aA5M — ANI Digital (@ani_digital) August 31, 2023 అమెజాన్ మేనేజర్ హత్య.. ఢిల్లీకి చెందిన హర్ప్రీత్ గిల్ అనే 36 ఏళ్ల వ్యక్తి అమెజాన్లో మేనేజర్గా పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి 11.30 గంటలకు తన మేనమామ గోవింద్తో కలిసి సుభాష్ విహార్లోని ఇరుకైన సందులో బైక్పై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారికి ద్విచక్ర వాహనాలపై వచ్చిన కొంతమంది యువకులు ఎదురయ్యారు. ఇరుకైన సందులో ట్రాఫిక్ సమస్యపై వచ్చిన గొడవలో నిందితులు కాల్పులు జరిపారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. స్థానికులు గమనించి బాధితులను ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. హర్ప్రీత్ గిల్ అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మేనమామ గోవింద్కు చికిత్స అందిస్తున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలింపు చేపట్టినట్లు వెళ్లడించారు. ఇదీ చదవండి: ఢిల్లీలో ఘోరం.. అమెజాన్ మేనేజర్ దారుణ హత్య.. -
ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ అరెస్టు..
లక్నో: ఉమేశ్ పాల్ హత్య కేసులో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్ లాయర్ విజయ్ మిశ్రాను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. బీఎస్పీ శాసన సభ్యుడు రాజు పాల్ హత్య కేసులో ఉమేశ్ ప్రధాన సాక్షిగా ఉన్నాడు. అయితే.. ఉమేశ్ను అతీక్ అహ్మద్ కుమారుడు మరికొందరితో కలిసి హత్య చేశారు. ఈ వ్యవహారంలో ఉమేశ్ పాల్ లొకేషన్ను లాయర్ విజయ్ షేర్ చేసినట్లు గుర్తించారు. శనివారం రాత్రి లక్నోలోని తాజ్ హోటల్ బయట అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఉమేశ్ హత్య సంబంధిత వీడియోలు ఉత్తరప్రదేశ్లో గతంలో వైరల్ అయ్యాయి. దుండగులు ఉమేశ్ ఇంటి వద్దే దాడి చేసి హత్య చేశారు. ఈ హత్యపై అప్పట్లో యూపీ అసెంబ్లీలో దుమారం రేగింది. ఉత్తరప్రదేశ్లో లా అండ్ ఆర్డర్పై దేశవ్యాప్తంగా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనల అనంతరం ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. రాష్ట్రంలో మాఫియాను అంతం చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. తదనంతర కాలంలో గ్యాంగ్స్టర్ అతీక్ అహ్మద్, అతని కుమారుడు ఎన్కౌంటర్లో హత్యకు గురయ్యారు. ఉమేశ్ హత్య కేసులో అతీక్ భార్య పర్వీన్ కూడా నిందితురాలుగా ఉన్నారు. 2019లో తాను జైలులో ఉన్నప్పుడే హత్యకు కుట్ర పన్నినట్లు అతీక్ గతంలో వాంగ్మూలాన్ని ఇచ్చాడు. జైలులో ఉన్నప్పుడే పర్వీన్ సందర్శించి ఫోన్ను ఇచ్చినట్లు పేర్కొన్నాడు. ఆ ఫోన్తోనే ఉమేశ్ హత్యకు కుట్ర జరిగిందని వెల్లడించాడు. ప్రస్తుతం పర్వీన్ పరారీలో ఉంది. ఆమె కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇదీ చదవండి: కేరళలో అమానుషం.. ఐదేళ్ల చిన్నారిని రేప్ చేసి హత్య.. -
హత్య కేసులో చోటా రాజన్కు ఊరట
ముంబై: ట్రేడ్ యూనియన్ లీడర్ దత్తా సామంత్ హత్య కేసులో గ్యాంగ్స్టర్ చోటా రాజన్ను నిరపరాధిగా తేలుస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. 1997లో జరిగిన ఈ హత్యకు చోటా రాజన్ కుట్ర పన్నాడనడానికి ఎలాంటి ఆధారాలు లేవని కోర్టు వెల్లడించింది. సామంత్ తన జీపులో పంత్ నగర్ నుంచి ఘట్కోపర్ వెళుతుండగా మోటార్బైక్పై వచి్చన దుండగులు ఆయనపై 17 రౌండ్లు కాల్పులు జరిపారు. దీంతో సామంత్ అక్కడికక్కడే మరణించాడు. ఈ హత్య వెనుక చోటా రాజన్ హస్తం ఉందంటూ ప్రాసిక్యూషన్ కేసు నమోదు చేసింది. అయితే అందుకు గల సాక్ష్యాధారాలను సమరి్పంచడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో ప్రత్యేక న్యాయమూర్తి బి.డి.షెల్కె రాజన్కు కేసు నుంచి విముక్తి కలి్పంచారు. అతనిపై మరిన్ని కేసులు పెండింగ్లో ఉండడంతో విడుదలయ్యే అవకాశాల్లేవు. -
పోలీసుల కళ్లలో కారం కొట్టి.. ప్రతీకార హత్య!
క్రైమ్: పోలీసుల కళ్లలో కారం కొట్టి.. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న గ్యాంగ్స్టర్ను కాల్చి చంపింది ప్రత్యర్థి గ్యాంగ్. రాజస్థాన్ భరత్పూర్లో బుధవారం ఉదయం జరిగిన ఈ ఘటన.. రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. పోలీసులు దీనిని ప్రతీకార హత్యగానే ప్రకటించారు. కుల్దీప్ అనే గ్యాంగ్ స్టర్ బీజేపీ నేత కృపాల్ జఘిన హత్య కేసులో ప్రధాన నిందితుడు. సెప్టెంబర్ 4, 2022లో ఈ హత్య జరగ్గా.. ఆ మరుసటిరోజే ఎఫ్ఐఆర్ నమోదు చేసి కుల్దీప్ను అరెస్ట్ చేశారు. అయితే.. పోలీసుల కస్టడీలో ఉన్న కుల్దీప్, సహనిందితుడు విజయ్పాల్ను ఇవాళ జైపూర్ జైలు నుంచి భరత్పూర్ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకెళ్తున్నారు. ఈ ఓ వాహనంలో దూసుకొచ్చిన ప్రత్యర్థులు పోలీసుల కళ్లలో కారం కొట్టి.. కుల్దీప్ను కాల్చి చంపారు. మొత్తం పదిహేను రౌండ్ల కాల్పులు జరిపారు. కుల్దీప్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. విజయ్పాల్ గాయపడగా.. అతన్ని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. జైపూర్-ఆగ్రా నేషనల్ హైవేపై అమోలీ టోల్ ప్లాజా వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్పులు జరిపాక నిందితులు అక్కడి నుంచి పారిపోయారు. ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసుల బృందం.. సమీపంలోని గ్రామం నుంచి దుండగుల వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
పటిష్ట బందోబస్తు
72 ప్రత్యేక పోలింగ్ కేంద్రాలు
● రామగుండం కమిషనరేట్లో పర్యవేక్షణ కేంద్రం ● మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తం ● నిరంతరం పర్యవేక్షణ చేస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
నేడే లోక్సభ పోలింగ్
రంగంపల్లిలో ఓటు వేయనున్న కలెక్టర్
ఉరుములు.. మెరుపులు
బైక్ నడిపి.. చాయ్ తాగి
ఓటరూ.. ఒక్క నిమిషం..!
పకడ్బందీగా సిద్ధం
నేడే లోక్సభ పోలింగ్
తప్పక చదవండి
- పెత్తందారుల వెన్నులో వణకు తెప్పిస్తున్న కొత్తతరం..!
- నాడు చెప్పుతో కొట్టి.. నేడు ‘కాపు’ కాస్తానంటూ కాకమ్మ కబుర్లు!
- నాడు చదువులు ఉత్త మిథ్య.. నేడు జీవితకాల భరోసా!
- బాబు షాక్కు.. జగన్ ట్రీట్మెంట్
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- పవన్ వ్యూహానికి వంగా గీత కౌంటర్ వ్యూహమిదే..!
- సీఎం వైఎస్ జగన్ చేయూత.. పారిశ్రామికవేత్తలుగా మహిళలు
- RRRకి కమ్మటి దెబ్బ.. పరువు తీసేసిన బీజేపీ!
- దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు?
Advertisement