-
Bigg Boss 7: రైతుబిడ్డ సేఫ్ గేమ్? చివరకొచ్చినా 'బిగ్బాస్' తీరు మారట్లేదు!
బిగ్బాస్ 7 గురించి హోస్ట్ నాగార్జున ఏమో గొప్పలు చెబుతున్నాడు. రియాలిటీలో మాత్రం అస్సలు అలా లేదు. తాజా ఎపిసోడే దీనికి సరైన ఉదాహరణ. అలానే రైతుబిడ్డ ఈ సీజన్లో చాలా తెలివిగా ఆడాడని అందరూ అనుకుంటున్నారు. కానీ మనోడి సేఫ్ గేమ్ ఇప్పుడు బయటపడింది. అయితే ఓ విషయంలో మాత్రం బిగ్బాస్ అస్సలు తీరు మార్చుకోవడం లేదు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 91 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. బిగ్బాస్ విన్నర్ ప్రైజ్మనీ ఫినాలే టికెట్ గెలుచుకున్న అర్జున్.. ఎలిమినేషన్ నుంచి సేవ్ అయినట్లు చెప్పడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక ఈ సీజన్లో విజేతగా నిలిస్తే ఏమేం దక్కుతాయో నాగార్జున ప్రకటించడంతో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ సీజన్ విన్నర్గా నిలిస్తే రూ.50 లక్షల నగదుతో పాటు మారుతి కార్, రూ. 15 లక్షల విలువైన డైమండ్ నెక్లెస్ సొంతమవుతుందని నాగార్జున చెప్పుకొచ్చాడు. అయితే రూ. 50 లక్షలు గెలిస్తే ఏం చేస్తారని అందరినీ నాగ్ అడిగితే.. అమ్మని ఈ డబ్బుతో హాయిగా చూసుకుంటా, తల్లిదండ్రులకు ఇల్లు కట్టిస్తా లాంటివి చెప్పారు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో పెద్దగా డ్రామా పండలేదు. మొత్తం తేలిపోయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆ కారణంతో అర్జున్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?) ప్రమోషన్స్ మధ్య ఎపిసోడ్ అయితే వీకెండ్ ఎపిసోడ్ అంటే.. హౌసులో ఉన్నవాళ్లతో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయాలి. కానీ బిగ్బాస్ టీమ్ దీనికంటే ప్రమోషన్స్పై ప్రేమ ఎక్కువైపోయింది. ప్రమోషన్స్ చేయొద్దని అనట్లేదు గానీ ఎపిసోడ్లో ఎక్కడో ఐదు నిమిషాల పాటు ప్రమోషన్ ఉంటే బాగుండేది.. ఈ ఆదివారం మాత్రం కాస్త ఎక్కువ లెంగ్త్ ఉండేసరికి చాలా బోర్ కొట్టేసింది. 'నా సామి రంగ', 'హాయ్ నాన్న' సినిమాల్ని ప్రమోట్ చేయడానికి వచ్చిన ఆషికా రంగనాథ్, నాని పర్వాలేదనిపించారు తప్పితే ఏమంత అలరించలేకపోయారు. ప్రశాంత్ సేఫ్ గేమ్? సేవింగ్లో భాగంగా ప్రియాంక, శివాజీ, యావర్ వరసగా ఎలిమినేషన్ నుంచి బయటపడ్డారు. చివరగా ప్రశాంత్, శోభా, గౌతమ్ మిగిలారు. ఇలాంటి టైంలో ఎవిక్షన్ పాస్ ఉపయోగించాల్సిందేనని నాగార్జున అల్టిమేటం జారీ చేశాడు. లేకపోతే తిరిగిచ్చేయాల్సి ఉంటుందని అన్నాడు. ఇక్కడ చాలా తెలివిగా ఆలోచించిన ప్రశాంత్.. శోభా-గౌతమ్ ఇద్దరిలో ఎవరికిచ్చినా ఇలాంటి టైంలో తను బ్యాడ్ అయిపోతానని తెలుసు. అందుకే ఎవరికి ఇచ్చేదే లేదని పదే పదే చెప్పాడు. తిరిగిచ్చేసి హీరో అయిపోదామనుకున్నాడు. కానీ ఇదంతా కూడా సేఫ్ గేమ్లా అనిపించింది తప్పితే ఇంట్రెస్టింగ్గా అయితే లేదు. ఆ తర్వాత ప్రశాంత్ సేవ్ అయ్యాడు. చివరగా శోభా బతికిపోయింది. గౌతమ్ ఎలిమినేట్ అయిపోయాడు. 13వ వారం కావడం వల్లో ఏమో గానీ మనోడి.. ఎలిమినేట్ అయిపోయినా సరే పెద్దగా బాధపడలేదు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) -
Bigg Boss 7: ఆ కారణంతో గౌతమ్ ఎలిమినేట్.. 13 వారాల రెమ్యునరేషన్ ఎంతంటే?
బిగ్బాస్ 7 నుంచి డాక్టర్బాబు ఎలిమినేట్ అయిపోయాడు. అశ్వద్ధామ 2.0 అని హడావుడి చేసిన ఇతడు.. సింగిల్గా ఆడుతూనే 13వ వారం వరకు నెట్టుకొచ్చేశాడు. అయితే ఇతడు చేసిన కొన్ని పనులు, అలానే హౌసులోని పలువురి వల్ల గౌతమ్.. బయటకొచ్చేసినట్లు అనిపిస్తోంది. ఇవన్నీ పక్కనబెడితే.. ఇన్నివారాలకు కలిపి రెమ్యునరేషన్ మాత్రం గట్టిగా ముట్టినట్లు టాక్. ఇంతకీ ఏంటి విషయం? డాక్టర్బాబు ఫెర్ఫార్మెన్స్ ఓకే డాక్టర్ కమ్ యాక్టర్ గౌతమ్ కృష్ణ.. బిగ్బాస్ హౌస్లో 13వ వారాలైతే ఉన్నాడు గానీ గుర్తింపు అయితే పెద్దగా తెచ్చుకోలేకపోయాడు. మొదటి వారం నుంచి ఇప్పటివరకు దాదాపు ఒంటరిగానే పోరాడుతూ వచ్చారు. ఈ విషయంలో మాత్రం అతడిని మెచ్చుకోవచ్చు. ఇన్ని వారాలు జరిగిన గేమ్స్లోనూ గౌతమ్ గెలిచిన దాఖలాలు అయితే లేవు. ఓ రోజు సీక్రెట్ రూంలో ఉండొచ్చి, 'అశ్వద్ధామ 2.0' అని హడావుడి చేశాడు గానీ అది పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. (ఇదీ చదవండి: హనీమూన్కి వెళ్లిన మెగా కపుల్ వరుణ్-లావణ్య?) ఎలిమినేషన్కి అదే కారణమా? ప్రారంభంలో నామమాత్రంగా ఆడిన గౌతమ్.. ఆ తర్వాత నుంచి శివాజీతో గొడవ పెట్టుకుని హైలైట్ అయ్యాడు. అప్పటి నుంచి తాజా వీకెండ్ ఎపిసోడ్ వరకు ఈ తంతే నడిచింది. అయితే శివాజీ వరస్ట్ కామందు తరహా ప్రవర్తన గురించి కాస్తో కూస్తో నిజాలు మాట్లాడిన వాళ్లలో గౌతమ్ ఒకడు. ఇదే ఇప్పుడు బిగ్బాస్ ఆర్గనైజర్స్కి నచ్చలేదు. గౌతమ్ని ఎలిమినేట్ చేసి పడేశారు. గత రెండు మూడు వారాల గేమ్ తీసుకుంటే శివాజీ, యావర్ కంటే గౌతమ్ చాలా బెటర్. కానీ శివాజీ మీద బిగ్బాసోళ్లకు ప్రేమ ఎక్కువైంది. అదే గౌతమ్కి శాపమైందని టాక్. రెమ్యునరేషన్ ఎంత? ఇకపోతే వారానికి రూ 1.5 లక్షల చొప్పున రెమ్యునరేషన్ అని గౌతమ్ డీల్ మాట్లాడుకున్నాడట. అంటే 13 వారాలకు గానూ దాదాపు రూ 19.5 లక్షలు పారితోషికంగా అందుకున్నాడని సమాచారం. అయితే ఈ విషయంపై గౌతమ్ క్లారిటీ ఇస్తే తప్ప అసలు లెక్కలు తెలియవు. ఏదేమైనా శివాజీతో పెట్టుకోవడం తనకు ప్లస్ అవుతుందని గౌతమ్ అనుకున్నాడు కానీ అదే మైనస్ అయి, ఇంటి నుంచి బయటకొచ్చేలా చేసినట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: రానా తమ్ముడి డెస్టినేషన్ వెడ్డింగ్? ఆ దేశంలో మూడు రోజుల పాటు!) -
బిగ్బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ డాక్టర్ బాబు అవుట్!
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా... ఈ పాట పాడుకునే సమయం వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ వల్ల అర్జున్ మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. ఈసారి ఈయన జెండా ఎత్తేయడం పక్కా అనుకున్నారంతా! కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన సత్తా ఏంటో చూపించాడు అర్జున్. టికెట్ టు ఫినాలే రేసులో అందరినీ వెనక్కు నెడుతూ, ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్గా ఆడి ఫినాలే అస్త్ర గెలిచాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితేనే కదా టాప్ 5లో చోటు దక్కించుకునేది అని అందరూ డౌట్ పడ్డారు. కానీ ఈ వారం మొదట సేవ్ అయింది అర్జునే! నాగార్జున ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్గా అర్జున్ను ప్రకటిస్తూ అతడిని సేవ్ చేశాడు. దీంతో ఎలిమినేషన్ గండం గౌతమ్, శోభల మెడకు చుట్టుకుంది. కానీ శోభ కోసం ఎవరినైనా బలి చేసేందుకు బిగ్బాస్ రెడీ.. కాబట్టి ఆమెకు బదులుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ను పంపించే ప్లాన్ చేశారట! టాప్5లో ఉండేందుకు అర్హత ఉన్న గౌతమ్ కృష్ణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది చూసిన డాక్టర్ బాబు అభిమానులు.. అన్ఫెయిర్ బిగ్బాస్ అంటూ సోషల్ మీడియాలో ఆర్తనాదాలు చేస్తున్నారు. చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. బిగ్బాస్ హౌస్లో నో ట్రీట్మెంట్ -
అమర్ను ఛాలెంజ్ చేసిన గౌతమ్.. అర్జున్కు అన్యాయం!
బిగ్బాస్ హౌస్లో టికెట్ టు ఫినాలే కోసం పోటీ జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆటలో వెనకబడి రేసులో నుంచి పక్కకు తప్పుకోగా ఐదుగురు ఫినాలే అస్త్ర కోసం పోటీపడుతున్నారు. మరి వీరిలో ఎవరు ఆ అస్త్రాన్ని గెలుచుకోవడానికి దగ్గర్లో ఉన్నారు? ఎవరు రేసులో వెనకబడ్డారు? అనేది తాజా ఎపిసోడ్ (నవంబర్ 30) హైలైట్స్లో చదివేద్దాం... క్రికెట్ టాస్క్.. సిక్సులు బాదిన అమర్ తక్కువ పాయింట్లు ఉన్న ప్రియాంక, శివాజీ, శోభ ఫినాలే అస్త్ర రేసు నుంచి తప్పుకున్నారు. అయితే ప్రియాంక తన పాయింట్లను గౌతమ్కు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు అమర్దీప్. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడలేదు, ఎందుకు తప్పు నిర్ణయం తీసుకున్నావంటూ బాధపడ్డాడు. ఇంతలో మిగతా ఐదుగురు ఇంటిసభ్యులకు వెరైటీ క్రికెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్లో అమర్ గెలిచాడు. తప్పించుకో రాజా టాస్క్లో రైతుబిడ్డ గెలిచాడు. తప్పు చేసిన యావర్.. నోరు విప్పని శివాజీ అయితే ఈ టాస్కులో ఎవరి కాలికి ఉన్న తాళాలకు వారు కీ వెతికి విడిపించుకోవాలి. యావర్ ఒక కీ తీసుకుని అది రాకపోవడంతో కింద పడేశాడు. దీంతో అర్జున్కు బాక్స్లో ఎంత వెతికినా సరైన కీ దొరకలేదు. కీ కింద పడేయకూడదు కదా.. సంచాలకులు చెప్పాలి కదా అని గరమయ్యాడు. యావరే కీ కింద పడేశాడని తెలిసినా శివాజీ పెదవి విప్పలేదు. ఇక పాయింట్ల పట్టికలో యావర్ దిగువన ఉండటంతో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన పాయింట్లను పల్లవి ప్రశాంత్కు ఇచ్చాడు. అమర్ విజయంపై డౌట్ తర్వాత పట్టుకో తెలుసుకో టాస్క్ జరగ్గా ఇందులో అమర్దీప్ గెలిచాడు. కానీ కళ్లు కనిపించకుండా ఇచ్చిన మాస్క్లు సరిగా పనిచేస్తున్నాయో, లేదోనని యావర్ చెక్ చేయడంతో అమర్ అసహనానికి లోనయ్యాడు. నేను గెలిచినప్పుడే అందరికీ అనుమానాలు వస్తాయని ఆవేశపడ్డాడు. తర్వాత బ్యాలెన్స్ ది బాల్ టాస్కు జరిగింది. బ్యాలెన్స్ టాస్కులకు పెట్టింది పేరైన ప్రశాంత్ ఈ గేమ్లో గెలిచాడు. ఇక ఈ టాస్కు ప్రారంభంలో నిన్ను ఓడిస్తా చూడు అని అమర్కు ఛాలెంజ్ చేశాడు గౌతమ్. అన్నట్లుగానే అమర్ ఓడిపోయిన తర్వాత గౌతమ్ ఆటలో నుంచి పక్కకు వెళ్లిపోయాడు. గౌతమ్ తనతో ఛాలెంజ్ చేసిన విషయాన్ని శోభాతో చెప్పాడు అమర్. దీంతో శోభ.. అతడు ఈ టికెట్ టు ఫినాలే రేసులో ఒక్క టాస్క్ కూడా గెలవలేదంటూ డాక్టర్ బాబును హేళన చేసి మాట్లాడింది. ఒక్క టాస్క్ కూడా గెలవని గౌతమ్ మొత్తానికి పాయింట్ల పట్టికను చూస్తుంటే అమర్- పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోటీ ఉండేట్లు కనిపిస్తోంది. పాపం.. అర్జున్ గట్టిగా ప్రయత్నిస్తున్నా తనకెవరూ పాయింట్లు దానం చేయకపోవడంతో స్కోర్ బోర్డులో వెనుకబడ్డాడు. ఇక ప్రియాంక.. గౌతమ్ను తన పాయింట్లు అమర్కే ఇవ్వాలని మాట తీసుకుంది. దీంతో అతడు అమర్కు దానం చేయడం గ్యారెంటీ! సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రైతుబిడ్డ రేసు నుంచి తప్పుకోగా అమర్ వర్సెస్ అర్జున్ మాత్రమే టికెట్ టు ఫినాలే కోసం పోటీపడనున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి! చదవండి: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. 'రౌడీ బాయ్స్' హీరో ఎంగేజ్మెంట్ -
డాక్టర్ బాబా మజాకా.. గౌతమ్ తెలివికి శివాజీ, రైతుబిడ్డ షాక్!
సీక్రెట్ టాస్క్ అంటే అర్థమేంటి? ఎవరికీ తెలియకుండా టాస్క్ పూర్తి చేయాలి. కానీ అపర చాణక్యుడిలా బిల్డప్ ఇచ్చే శివాజీకి ఈ ముక్క తెలియకపోవడమేంటో! ప్రశాంత్ మిర్చి మొక్కను పోస్ట్ డబ్బాలో దాచేయమని శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్బాస్. అయితే మొక్కను ఎలా దాచేయాలో పక్కనపెట్టి ముందుగా ప్రశాంత్ను ఓ గదిలో పెట్టి బంధించాడు. గేమ్లో అతడిని చంపేస్తున్నట్లు చెప్పి ఆ తర్వాత తీరికగా మొక్కను దాచాడు. ఖంగు తిన్న రైతుబిడ్డ ఎవరికీ ఏ అనుమానం రాలేదేమో కానీ గౌతమ్ మాత్రం ఈజీగా పసిగట్టేశాడు. ప్రశాంత్ను డెడ్ అయినట్లు ప్రకటించిన బిగ్బాస్ అతడిని దెయ్యంలా తెల్లబట్టలు వేసుకుని తిరగమన్నాడు. ఈ క్రమంలో దెయ్యంలా ఇల్లంతా తిరుగుతున్న ప్రశాంత్ను శివాజీ అన్ననే చంపాడు కదరా నిన్ను అని అడిగేశాడు. అతడి మాటతో ఖంగు తిన్న రైతుబిడ్డ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ తెలివితేటలను మాత్రం సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. పోలీసుల కన్నా ముందే పసిగట్టేశాడని మెచ్చుకుంటున్నారు. హంతకుడిని పసిగట్టిన గౌతమ్ అటు పోలీసుల ఇన్వెస్టిగేషన్లోనూ హోటల్ మేనేజర్ పాత్రలో ఉన్న శివాజీయే బిగ్బాస్ భార్యను హత్య చేసి ఉంటాడని క్లూ ఇచ్చాడు. నిజానికి ప్రశాంత్ను డెడ్ చేయాలన్న సీక్రెట్ టాస్క్తో పాటు బిగ్బాస్ భార్యను చంపింది నువ్వేనంటూ శివాజీకి ఓ నెక్లెస్ ఇచ్చాడు బిగ్బాస్. అటు గౌతమ్ ఆ రెండు పాయింట్లను కరెక్ట్గా గెస్ చేసి తనది మాస్టర్మైండ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. కాగా మొదటి నుంచీ ఏ గ్రూపులోనూ చేరకుండా సింగిల్గా ఆడుతున్నాడు గౌతమ్. శివాజీ తప్పు చేశాడనిపించినప్పుడల్లా ధైర్యంగా ఎదురెళ్తున్నాడు. ఈ లక్షణాలే గౌతమ్ను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇదే ఆట కొనసాగిస్తే అతడు టాప్ 5లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. శివాజీ ఇతడిని పిచ్చివాడు అని తీసిపారేశాడు కానీ అతడిని ఎదురించే దమ్మున్నోడు, ఆటలో సత్తా చూపే సరైనోడు అని అభిమానులు గౌతమ్ను కొనియాడుతున్నారు. చదవండి: బిగ్బాస్ ఆఫర్, ఖరీదైన కారు గిఫ్ట్.. క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క -
అప్పుడు అమర్ చేసిందే ఇప్పుడు గౌతమ్ చేశాడు.. తప్పేముంది?
బిగ్బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్లో జరిగిన రభస మామూలుగా లేదు. ఒక్కొక్కరు వీర లెవల్లో పోరాడారు. చివర్లో అమర్, ప్రియాంక ఇద్దరూ మిగలగా అంతిమంగా ప్రియాంక కెప్టెన్సీ సాధించింది. అందుకు గౌతమ్ కృష్ణ ఎంతగానో సాయపడ్డాడు. గేమ్లో కూడా అందరిముందే ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరీ ఆడాడు. కానీ అమర్.. తనను అందరూ టార్గెట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రవర్తన కొంతమందికి చికాకు తెప్పించగా ఎక్కువమందికి బాధ కలిగించింది. చేసిన సాయం అప్పుడే మర్చిపోయిన రతిక అయితే అమర్ బాధకు ప్రధాన కారణం గౌతమ్ కాదు రతిక. గతవారం జరిగిన బేబీ టాస్క్లో అమర్ను తనకోసం ఆగిపోమని వేడుకుంది. ఈ వారం తనకు చాలా అవసరమంటూ, తనను నిరూపించుకునే అవకాశం ఇవ్వమని బతిమాలుకుంది. దీంతో ఆమె కోసం వెనకడుగు వేశాడు. ఆమెను గెలిపించి తాను ఓడిపోయాడు. అందుకు కనీసం కృతజ్ఞత చూపించకుండా రతిక నిన్నటి బ్రిస్క్ టాస్కులో అమర్ను టార్గెట్ చేసింది. అతడిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ప్రియాంక కోసం ఆడటం తప్పా? అటు గౌతమ్ కూడా అమర్ అమర్చిన బ్రిస్క్ మీదకు బాల్స్ విసిరాడు. అందుకు కారణం.. అతడి మీద ఏదో పగ, ప్రతీకారాలు ఉన్నాయని కాదు. తన చెల్లిగా భావించిన ప్రియాంక గెలవాలని తాపత్రయపడ్డాడు. ఆమె కెప్టెన్ అవడం కోసం అమర్ను ఆటలో నుంచి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అందరి ముందే ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరీ గేమ్ ఆడాడు! కానీ చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. అమర్ అంత ఏడుస్తుంటే జాలి చూపించట్లేదు అని ఫీలవుతున్నారు. అతడు బాధపడుతున్నాడని అప్పటికప్పుడు ప్రియాంకను ఓడించాలని ఎందుకనుకుంటాడు? తన చెల్లిని గెలిపించాలనుకున్నాడు, అదే చేశాడు. శోభ కోసం అమర్.. ప్రియాంక కోసం గౌతమ్ నిజానికి గతంలో కెప్టెన్సీ టాస్క్లో శోభా కోసం అమర్ వీరోచిత పోరాటం చేసి ఆమెను గెలిపించాడు. అప్పుడు అమర్ను ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు ప్రియాంక కోసం పోరాడిన గౌతమ్ను మాత్రం నిందిస్తున్నారు. ఒకానొక సమయంలో డాక్టర్ బాబు ఎలిమినేట్ అవ్వాలని అతడికి వ్యతిరేకంగా ఓట్ వేశాడు అమర్. అలాంటప్పుడు గౌతమ్.. అమర్కు సపోర్ట్ చేయకపోవడంలో తప్పేముంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చదవండి: అల్లాడిపోతున్నాడంటూ అతడికి స్టేజీపై ముద్దు పెట్టిన స్టార్ హీరో, వీడియో వైరల్ -
బిగ్ బాస్ సెంటిమెంట్ ప్లాన్.. ఆ కంటెస్టెంట్కు శాపమైందా?
బిగ్ బాస్ సీజన్-7 తొమ్మిది వారాలుగా సినీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇప్పటి వరకు హాట్ హాట్గా సాగిన హౌస్.. ఈ వారం ఫుల్ ఎమోషనల్గా మార్చేశాడు బిగ్ బాస్. పదో వారంలో మొదటి రోజు నామినేషన్స్ ప్రక్రియ పూర్తయిన వెంటనే.. రెండో రోజు నుంచే కంటెస్టెంట్లకు సర్ప్రైజ్లు ఇచ్చారు. తొలిరోజే శివాజీ కుమారుడు, అర్జున్ భార్య, అశ్విని మదర్ను పంపి ఎమోషనల్ టచ్ ఇచ్చారు. ఆ తర్వాత రెండో రోజు గౌతమ్ తల్లి, ప్రియాంక ప్రియుడు శివ కుమార్, భోలే భార్యను హౌస్లో పంపి కంటెస్టెంట్స్ను ఏడిపించేశారు. (ఇది చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న హన్సిక మూవీ, స్ట్రీమింగ్ ఎక్కడంటే?) అయితే మూడో రోజు కూడా హౌస్లో ఎమోషనల్ సీన్స్ మరింత పీక్స్కు చేరాయి. మూడో రోజు అమర్ భార్య, శోభాశెట్టి తల్లి, యావర్ బ్రదర్ వచ్చి కంటెస్టెంట్స్తో పాటు ఆడియన్స్ను సైతం కంటతడి పెట్టించారు. ముఖ్యంగా ప్రిన్స్ యావర్, తన బ్రదర్ ఫుల్ ఎమోషనల్ అయ్యారు. అమ్మ ప్రేమను గుర్తు చేసుకుంటూ ఏడ్చేశారు. మొత్తానికి ఈ వారంలో టాస్కులు, గేమ్స్ లేకుండా పూర్తిగా ఫ్యామిలీ వీక్గా మార్చేశారు బిగ్ బాస్. ఇప్పటివరకు మిగిలింది ఇద్దరు కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే. హౌస్లో ఉన్న రైతుబిడ్డ, రీ ఎంట్రీ ఇచ్చిన రతికా రోజ్ కుటుంబ సభ్యులు రావాల్సి ఉంది. వీరిద్దరికి సంబంధించి శుక్రవారం సర్ప్రైజ్ ఇచ్చే అవకాశముంది. అయితే ఫ్యామిలీ ఎమోషన్ పక్కన పెడితే.. అందరి దృష్టి ఈ వారం ఎలిమినేట్ ఎవ్వరనే దానిపైనే ఉంది. గతవారంలో చివరికీ దాకా వచ్చి రతికా రోజ్ సేఫ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం నామినేషన్స్లో శివాజీ, యావర్, గౌతమ్, రతికా, భోలె మాత్రమే ఉన్నారు. ఇక ఓటింగ్కు ఒక్క రోజు మాత్రమే సమయముంది. ఈ నేపథ్యంలో ఫ్యామిలీ మెంబర్స్ ఎంట్రీతో శివాజీ, యావర్, గౌతమ్, భోలెకు గ్రాఫ్ పెరగడంతో పాటు ఓటింగ్ శాతం మెరుగయ్యే అవకాశముంది. కానీ గతవారమే తృటిలో ఎలిమినేషన్ తప్పించుకున్న రతికా కుటుంబ సభ్యులు ఇంకా హౌస్లోకి రాలేదు. దీని ప్రభావం రతికా ఎలిమినేషన్పై పడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ శుక్రవారం రతికా కుటుంబ సభ్యులు హౌస్లోకి వచ్చినా అంతగా వర్కవుట్ కాదు. ఎందుకంటే ఓటింగ్ సమయం రేపటితోనే ముగియనుంది. పల్లవి ప్రశాంత్ నామినేషన్స్లో లేడు కాబట్టి.. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడొచ్చినా ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. దీంతో ఈ ఫ్యామిలీ సెంటిమెంట్ వీక్ రతికాపైనే ఎక్కువ ప్రభావం చూపనుంది. దీంతో ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో ఆమె పేరే ముందుండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యామిలీ సెంటిమెంట్తో కంటెస్టెంట్స్ను ఏడిపించిన బిగ్ బాస్.. ఎవరినీ బయటికి పంపిస్తాడో వేచి చూద్దాం. (ఇది చదవండి: తల్లి కాళ్ల మీద పడ్డ శోభ.. ఏడిపించేసిన ప్రిన్స్ యావర్ బ్రదర్స్..) -
హౌస్మేట్స్కు గౌతమ్ తల్లి గోరుముద్దలు.. ఏడ్చేసిన ప్రిన్స్ యావర్
కంటెస్టెంట్ల మధ్య ఎంత రాగద్వేషాలు ఉన్నా ఫ్యామిలీ వీక్లో మాత్రం అవన్నీ పటాపంచలైపోతాయి. తమ కన్నవారిని, కట్టుకున్న భార్యను, కడుపున పుట్టిన పిల్లలను.. ఇలా కుటుంబసభ్యులను చూసేసరికి హౌస్మేట్స్లో ఎమోషన్స్ కట్టలు తెంచుకుంటూ వస్తాయి. రోజూ కొట్టుకుంటూ కనిపించే కంటెస్టెంట్లు ఇలా ఒక్కసారిగా ఏడ్చేసరికి వారి అభిమానులు కూడా కంటతడి పెట్టుకుంటూ ఉంటారు. ఇది ప్రతి సీజన్లోనూ జరిగేదే! బిగ్బాస్ ఏడో సీజన్లో తాజాగా ఫ్యామిలీ వీక్ మొదలైంది. నిన్నటి ఎపిసోడ్లో శివాజీ తనయుడు, అర్జున్ భార్య, అశ్విని తల్లి బిగ్బాస్ ఇంట్లో అడుగుపెట్టారు. నేడు గౌతమ్ తల్లి హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినట్లు ప్రోమో వదిలారు. తల్లిని చూడగానే గౌతమ్ ఏడ్చేశాడు. అందరినీ దగ్గరకు తీసుకున్న ఆమె ఇంట్లో అందరికీ గోరుముద్దలు తినిపించింది. చిన్నప్పుడే అమ్మను కోల్పోయిన ప్రిన్స్ యావర్ తల్లి ప్రేమను చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. దీంతో గౌతమ్ తల్లి.. నువ్వు కూడా నా కొడుకువే అంటూ అతడిని హత్తుకుంది. మరి హౌస్లోకి ఇంకా ఎవరెవరు వస్తారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: భార్యకు విడాకులు ఇవ్వనున్న విజయ్? ఈ నటి మాటల్లోనే ఆన్సర్ దొరికేసింది! -
సోఫాజీ.. శివాజీ పరువు తీసిన నాగ్.. వీళ్లు బంగారం, వాళ్లు బొగ్గు
నాగార్జునతో తేల్చుకునే సమయం కోసం తెగ ఎదురుచూశారు తేజ, గౌతమ్. ఇద్దరి ఫిర్యాదు శివాజీ గురించే! అయితే ఎప్పటిలాగే శివాజీని వెనకేసుకువచ్చే ప్రయత్నం చేశాడు నాగ్. గేమ్లో దొంగతనం చేయబోతే శివాజీ నానామాటలు తిట్టి, బెదిరించిన సంగతి తెలిసిందే కదా! అదంతా అతడి స్ట్రాటజీ అని శివాజీకి పాజిటివ్గా మాట్లాడారు. దీంతో తేజ, గౌతమ్ బిక్కమొహం వేసుకున్నారు. అటు అశ్విని కూడా గట్టిగానే కల్ఆస్ పీకాడు నాగ్. మరి నేటి(నవంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్లో ఏమేం జరిగాయో చదివేయండి.. శివాజీ ఫౌల్ గేమ్స్.. ఒప్పుకున్న యావర్ ఎప్పుడూ ప్రశాంత్, యావర్ జపం చేసే శివాజీ కెప్టెన్సీ టాస్కులో యావర్కు సపోర్ట్ చేయలేదు. అలా అని తన చేయి బాలేదని ఆడకుండా కూర్చోలేదు. ఆడి దెబ్బ తగిలితే అది సింపతీ కింద వర్కవుట్ అవుతుందని ఆలోచించాడు. ఎలాగో ఓడిపోయే గేమ్కు యావర్ తరపున ఎందుకని అర్జున్కు సపోర్ట్ చేస్తూ అతడి తరపున గేమ్ ఆడాడు. ఇది యావర్కు అస్సలు నచ్చలేదు. నాకోసం ఎందుకాడలేదు? అని నిలదీశాడు. అంతేకాదు అశ్విని దగ్గర కూడా శివాజీ అన్న ఫౌల్ గేమ్ ఆడాడని అసహనానికి లోనయ్యాడు. తేజను ఏడిపించిన శోభ మరోవైపు శోభా శెట్టి-తేజ వాష్రూమ్ ఏరియాలో గొడవపడ్డారు. అమర్ నా స్నేహితుడు కాబట్టి కెప్టెన్సీ టాస్క్లో సపోర్ట్ చేశాడు.. నువ్వెవరివి అసలు? మా ఇద్దరి మధ్య పుల్లలు పెడుతున్నావు.. నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు తెలుస్తుంది.. అని ఆవేశంతో బుసలు కక్కింది. తన మాటలతో కలత చెందిన తేజ ఒంటరిగా ఏడ్చాడు. అనంతరం జపాన్ ప్రమోషన్స్ కోసం కార్తీ బిగ్బాస్ స్టేజీ మీదకు వచ్చాడు. ఎప్పుడూ పొగుడుతూ ఉంటే నాగ్ ఈసారి కంటెస్టెంట్లపై సెటైర్లు వేస్తూ కార్తీకి పరిచయం చేశాడు. అశ్విని పుల్లలు పెడుతుందని, ప్రశాంత్ అపరిచితుడు అని, శోభ అపార్థం చేసుకుంటుందని, తేజ పక్కవారి బాధను రెట్టింపు చేస్తాడని, శివాజీ సోఫాజీ(సోఫాకే అతుక్కుపోయాడని) అని మాట్లాడాడు. కాసేపు కబుర్లాడాక కార్తీని పంపించేశాడు నాగ్. శివాజీని వెనకేసుకొచ్చిన నాగ్ ఇక బాల్స్ టాస్కులో శివాజీ దొంగతనం చేయకూడదని వాదించాడు. దాదాపు హౌస్ అంతా అతడి పెద్దరికానికి గౌరవమిచ్చి దొంగతనం ప్రయత్నం విరమించుకుంది. అలా దొంగతనాన్ని ఆపడమనేది శివాజీ స్ట్రాటజీ అని నాగ్ కవర్ చేశాడు. దొరికిందే ఛాన్సని శివాజీ కూడా అవును, అది నా స్ట్రాటజీ అంటూ ఎగిరెగిరి పడ్డాడు. కెప్టెన్సీ టాస్క్లో శివాజీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నన్ను గేమ్ నుంచి తప్పించాలని చూశాడంటూ నాగ్కు ఫిర్యాదు చేశాడు గౌతమ్. అశ్విని కూడా అదే చెప్పిందన్నాడు. నిజంగానే శివాజీ.. అందరినీ ఇన్ఫ్లూయెన్స్ చేసి కెప్టెన్సీ టాస్క్ నుంచి గౌతమ్ను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించాడా? అని ఇంటిసభ్యులను నాగ్ అడిగాడు. అయితే అలాంటిదేమీ జరగలేదని హౌస్ ముక్తకంఠంతో చెప్పింది. దీంతో గౌతమ్ తనకు క్లారిటీ వచ్చిందన్నాడు. వీళ్లు బంగారం.. వాళ్లు బొగ్గు తర్వాత హౌస్లో ఎవరెలా గేమ్ ఆడారనేదాన్ని బట్టి వారి ఫోటోలను బంగారం/మట్టి /బొగ్గు టేబుల్లో అతికించాడు. గౌతమ్ను బెస్ట్ కెప్టెన్గా అభివర్ణించిన నాగ్ అతడిని బంగారంగా పేర్కొన్నాడు. శోభ, తేజ, అమర్, అర్జున్ను, శివాజీలను సైతం బంగారం లైన్లో పెట్టాడు. భోలెను గేమ్లో స్వాప్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడని అతడిని బొగ్గు బోర్డులో పెట్టాడు. రతిక, అశ్విని గేమ్ ఆడలేదని వారిని కూడా బొగ్గు కేటగిరీలో వేశాడు. ఆటపై ఫోకస్ చేయలేదంటూ యావర్ను మట్టి కేటగిరీలో పెట్టాడు. తేజ కోసం బాగా ఆడావు, కానీ నీకోసం ఆడంటూ ప్రియాంక ఫోటోను మట్టిలో పెట్టాడు. మధ్యలో దూరిన శివాజీ ప్రశాంత్ను బంగారంలో పెట్టడంతో రైతుబిడ్డ ఏడ్చేశాడు. మాటిమాటికీ ఏడుస్తావ్.. సింపతీనా? అని అడగ్గా వెంటనే శివాజీ మధ్యలో దూరుతూ.. అతడి స్వభావమే అంత.. అని సపోర్ట్ చేశాడు. ఈరోజు క్లాసులు తీసుకోవడం మీదే ఫోకస్ పెట్టిన నాగ్ ఎవరినీ సేవ్ చేయకుండానే వెళ్లిపోయాడు. అయితే ఈ వారం తేజ ఎలిమినేట్ కానున్నాడని టాక్ నడుస్తోంది. మరి అదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: శోభ సేఫ్, తేజ ఎలిమినేట్.. చేసిన పాపం ఊరికే పోతుందా? -
ఎలిమినేట్ చేయండన్న గౌతమ్, చెప్పుతో కొట్టుకుంటానన్న అమర్దీప్
బిగ్బాస్ కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. అయితే గౌతమ్ టీమ్ను గెలిపించాలని బిగ్బాస్ బలంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. ఎరుపు, నలుపు రంగులో ఉన్న బాల్స్ గౌతమ్ సంపాదించగా వాటితో విజయం సాధించేలా బిగ్బాస్ పావులు కదిపాడు. అసలు హౌస్లో ఇంకా ఏమేం జరిగాయో తాజా(నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి.. ఆ టీమ్లోని అందరూ కంటెండర్లే బిగ్బాస్ బ్లాక్ బాల్ ఎవరి దగ్గరుందని అడిగాడు. వీరసింహాలు టీమ్ తమ దగ్గరే ఉందని బదులిచ్చారు. ఈ నల్ల బంతి సాయంతో అవతలి టీమ్ దగ్గరున్న అన్ని బంతులను తీసుకోవచ్చని భలే సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్బాస్. దీంతో వీరసింహాలు టీమ్ సభ్యులు ఎగిరి గంతేశారు. కానీ గర్జించే పులుల టీమ్లోని శివాజీ, ప్రియాంక మాత్రం ఓ రెండు బంతులకు కక్కుర్తి పడ్డారు. అన్నీ ఇచ్చేయమన్నాక ఇంకెందుకు ఆలోచిస్తున్నారని గౌతమ్ ప్రశ్నించగా మా ఇష్టమొచ్చినట్లు చేస్తామన్నాడు శివాజీ. దీంతో గౌతమ్ ఆవేశంతో ఊగిపోయాడు. ఇక అన్ని బంతులు వీరసింహాలకే దక్కి పైచేయి సాధించడంతో ఆ టీమ్లో ఉన్న అందరినీ కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్బాస్. రతికతో దూరంగా ఉండమన్న శివాజీ మరోవైపు రతికతో కాస్త దూరంగా ఉండమని యావర్ను హెచ్చరించాడు శివాజీ. మీ అతి చనువు జనాలకు నచ్చకపోవచ్చని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బంతుల టాస్కు మధ్యలో వీరసింహాలు టీమ్ తమ సభ్యులైన భోలె షావళిని అవతలి టీమ్లోని అర్జున్తో స్వాప్ చేసిన సంగతి తెలిసిందే కదా! అయితే తాను మొదట తేజ పేరు సూచించానని గౌతమ్ అన్నాడు. అదేంటి? నువ్వు భోలె పేరు చెప్పావటగా అని అశ్విని గబుక్కున అడిగేసింది. అది విని షాకైన గౌతమ్.. భోలె దగ్గరకు వెళ్లి నేను డైరెక్ట్గా మీ పేరు చెప్పలేదు.. అది టీమ్ నిర్ణయం అని క్లారిటీ ఇచ్చాడు. స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకున్న ప్రిన్స్ అనంతరం బిగ్బాస్ బీన్ బ్యాగ్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. కానీ ఇక్కడో మెలిక పెట్టాడు. వీరసింహాలు టీమ్లోని కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అవతలి టీమ్లోని కంటెస్టెంట్లు ఆడాల్సి ఉంటుందన్నాడు. అలాగే ఓ కంటెండర్ స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు. దీంతో ప్రిన్స్ యావర్ ఆట నుంచి వైదొలిగాడు. గౌతమ్ తరపున అశ్విని, అర్జున్ తరపున శివాజీ, తేజ తరపున ప్రియాంక, రతిక తరపున భోలె షావళి ఆటలో దూకారు. ఇదసలే ఫిజికల్ టాస్క్.. చేయి నొప్పి ఉన్న శివాజీ ముందే ఆటలో నుంచి వైదొలగాల్సింది. అయినా సరే తన ప్రతాపం చూపిస్తానంటూ ఆడేందుకు వెళ్లాడు. దెబ్బ తగలడంతో శివాజీ అవుట్ తీరా అక్కడ అందరూ లాక్కుని పీక్కునే క్రమంలో అతడి చేతికి దెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆటలో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఆటలో అమర్దీప్- అశ్విని కొట్టుకున్నారు. బిగ్బాస్ గీసిన వృత్తంలో నుంచి అందరూ బయటకు వచ్చారని సంచాలకుడైన ప్రశాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ గీత దాటి బయటకు వచ్చింది శివాజీ అన్న అని, కావాలంటే వీడియో చూడమన్నాడు అమర్దీప్. ఒకవేళ తాను చెప్పింది తప్పయితే చెప్పుతో కొట్టుకుంటానని సవాలు విసిరాడు. అమర్ సాయం.. కెప్టెన్గా శోభ ఇక బీన్ బ్యాగ్ టాస్కులో శోభా శెట్టి తరపున ఆడి, పోరాడి అమర్ గెలిచాడు. మొత్తానికి అమర్ సాయంతో ఈ సీజన్లో శోభా శెట్టి తొలి లేడీ కెప్టెన్గా అవతరించింది.ఇక శోభా కెప్టెన్ అయిందో, లేదో అర్జున్, తేజ ఆమెను ఏడిపించేందుకు ప్రయత్నించారు. ఎలిమినేట్ అయి వెళ్లేటప్పుడు నీ దగ్గరున్న కాయిన్స్ ఎవరికి ఇస్తావు? అని అర్జున్ అడగడంతో చిర్రుబుర్రులాడింది శోభ. కామెడీ చేయడానికి కూడా ఓ సమయం ఉంటుందని విసుక్కుంది. శివాజీపై ఫిర్యాదు తర్వాత గౌతమ్.. శివాజీ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశాడు. 'శివాజీ అన్న గేమ్ను ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు. నీతి, నిజాయితీ, ధర్మం అని మాటలు చెప్తుంటాడు.. కానీ ఆయన చాలా తప్పులు చేస్తున్నాడు. అవన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆయన చేసేదంతా చేసి మళ్లీ ఏమీ ఎరుగనట్లు తప్పించుకుంటున్నాడు. ఇలా ఆడి, గెలిచి ఆయన కప్పు కొట్టుకుంటాడేమో.. కానీ ఇది నేను భరించలేకపోతున్నాను. నేను తప్పయితే నన్ను ఎలిమినేట్ చేసేయండి' అని కెమెరాల ముందు బిగ్బాస్కు ఫిర్యాదు చేశాడు. చదవండి: రాహుల్-రతిక పెళ్లి.. అతడు పెట్టిన కండీషన్స్ వల్లే బ్రేకప్! -
హౌస్లో ఒక్కడైనా పదో తరగతి పాస్ అయిండా?.. నాగ్తోనే తేల్చుకుంటానన్న తేజ
బిగ్బాస్ హౌస్లో కెప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ నడుస్తోంది. ఇందుకోసం ఇంటిని రెండు ముక్కలు చేశాడు బిగ్బాస్. ఆటలో కొట్లాటలు సహజమే.. బిగ్బాస్ హౌస్లో కొట్లాటల మధ్యలో ఆటలు వస్తూపోతూ ఉంటాయి. అలా ఈ రోజు రతిక-అమర్ గొడవపడ్డారు. మరి నేటి(నవంబర్ 2) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. ఏడ్చి సాధించింది.. కానీ ఏం లాభం? కెప్టెన్సీ కంటెండర్షిప్ కోసం బిగ్బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. మధ్యమధ్యలో ఛాలెంజ్లు కూడా విసురుతున్నాడు. ఇక బాల్స్ టాస్క్లో రతిక- అమర్దీప్ గొడవపడ్డారు. ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇంతలో బిగ్బాస్ బ్రేక్ ఫాస్ట్.. ఎయిమ్ లో అనే చాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్లో అమర్దీప్- అర్జున్ గెలిచారు. ఇక ఆడతా.. ఆడతానంటూ అలిగి సాధించి మరీ గేమ్లో పాల్గొన్న శోభ ఓడిపోయింది. తన టీమ్లో ఎవరైనా ఓడిపోతే నానామాటలు అనే శోభ తానే ఓడిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది. చాలెంజ్ గెలిచిన టీమ్కు బిగ్బాస్ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. వేలిముద్రగాళ్లం అనుకుంటున్నారా? అవతలి టీమ్లో ఒకరిని ఆటలో నుంచి తప్పిస్తారా? లేదంటే వారి దగ్గరి నుంచి 500 బాల్స్ తీసుకుంటారా? అని అడిగాడు. బాగా ఆలోచించిన శివాజీ టీమ్ అవతలి టీమ్లో నుంచి 500 బాల్స్ తీసుకుంది. మరోవైపు అశ్విని హౌస్మేట్స్పై ఉన్న కోపాన్నంతా భోలె దగ్గర కక్కేసింది. ఇక్కడ అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు.. మనమేమో ఎల్కేజీ కూడా చదువుకోని వేలిముద్రగాళ్లం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఏం అనుకుంటున్నారో? ఏమో? ఒక్కొక్కడు పదో తరగతి కూడా పాస్ అయిండో? లేదో? ఒకరిని జడ్జ్ చేసే అధికారం వారికి ఎవరిచ్చారు? ఒక ముగ్గురు అయితే ఎంత నవ్వుకుంటున్నారో.. అని చికాకు పడింది. గేమ్కు అడ్డుపడుతున్న శివాజీ ఇంతలో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్బాస్. గోల్డెన్ బాల్ దొరికిన టీమ్.. అవతలి టీమ్లో ఒకరితో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో గౌతమ్ టీమ్ ఏకాభిప్రాయంతో తమ టీమ్లోని భోలె షావలిని అవతలి టీమ్లోకి పంపించి.. అందులో ఉన్న అర్జున్ను తమ టీమ్లోకి లాక్కుంది. రాత్రి శివాజీ టీమ్లోని బాల్స్ లాక్కుందామని ప్లాన్ వేసింది గౌతమ్ టీమ్. అయితే దొంగతనం చేయడానికి ససేమీరా కుదరదని వాదించాడు శివాజీ. డాక్టర్ అయ్యుండి ఇలా ఎథిక్స్ లేకుండా మాట్లాడతావా? అంటూ తన వృత్తిని మధ్యలోకి లాక్కొచ్చాడు. గౌతమ్ మీద ఫైర్ అయ్యాడు. దీంతో తేజ.. బాల్స్ దొంగతనం చేయొచ్చా? లేదా? అనేది నాగార్జున సర్నే అడిగి తేల్చుకుంటానన్నాడు. గౌతమ్- అశ్విని పెళ్లి చేసుకోవచ్చుగా ఇక మరుసటి రోజు అర్జున్.. అమర్ గురించి సెటైర్లు వేశాడు. వాడికి దూరంగా ఉందామంటే పదేపదే అన్నయ్యా అంటూ వస్తున్నాడంటూ తల పట్టుకున్నాడు. ఇంతలోనే బజర్ మోగడంతో మళ్లీ బాల్స్ గేమ్ మొదలైంది. అర్జున్ మీద ఎక్కి మరీ బాల్స్ పట్టుకునే ప్రయత్నం చేశాడు అమర్. అటు ప్రిన్స్ యావర్ తన టీషర్ట్లో బాల్స్ దాచుకున్నాడు. తర్వాత ప్రిన్స్.. అశ్విని-గౌతమ్లకు లింకు పెడుతూ మాట్లాడాడు. గౌతమ్.. అశ్వినిని పెళ్లి చేసుకోవచ్చుగా అని చెప్పాడు. అయితే మూడేళ్ల దాకా పెళ్లి చేసుకునే ఆలోచనే లేదన్నాడు గౌతమ్. తర్వాత ప్రశాంత్.. శోభకు గోరుముద్దలు తినిపించాడు. చదవండి: ఆహ్వానం అందినా వరుణ్- లావణ్యల పెళ్లికి హాజరు కాని జూనియర్ ఎన్టీఆర్! -
వాడో వేస్ట్గాడు, ఐటం రాజా.. అమర్పై మళ్లీ విషం కక్కిన శివాజీ
కెప్టెన్ గౌతమ్ హౌస్లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఈ వారం ఆడపిల్లలు పనే చేయక్కర్లేదని బంపరాఫర్ ఇచ్చాడు. ఇంకేముంది.. లేడీ కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. అటు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలుపెట్టాడు బిగ్బాస్. మరి నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి.. మళ్లీ విషం కక్కిన శివాజీ బద్దకస్తుడైన తేజ శవాసనం వేస్తూ నేలకు అతుక్కుపోయాడు. ఇది గమనించిన బిగ్బాస్ తేజకు ఏదైనా శిక్ష వేయమని కెప్టెన్ను ఆదేశించాడు. కెప్టెన్ గౌతమ్.. తేజ అమ్మాయిలా చీర కట్టుకోవాలని చెప్పాడు. ఇంకేముంది, శోభ.. అతడికి చీర కట్టి రెడీ చేసింది. ఇదే అదను అనుకున్న తేజ.. అందరు అమ్మాయిలకు హగ్గులిచ్చుకుంటూ పోయాడు. ఇక పెద్దమనిషిని అని చెప్పుకునే శివాజీ ఎప్పటిలాగే అమర్పై విషం చిమ్మాడు. వాడో వేస్ట్గాడు, ఐటం రాజా.. అని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ప్రతి సీజన్లో అందరూ కలిసి ఒకర్ని హీరోను చేస్తే ఈ సీజన్లో నన్ను విలన్ను చేశారు అని తనకు తానే అనుకున్నాడు అమర్. చాలెంజ్ విసిరిన బిగ్బాస్ తర్వాత బిగ్బాస్.. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. ఇందుకోసం ఇంటిసభ్యులను రెండు టీమ్లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్లో ఉన్నారు. మొదట బాల్స్ టాస్కు పెట్టాడు కానీ ఫలితాలను ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. చాలెంజ్ గెలిచిన టీమ్కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదటి చాలెంజ్కే రైతుబిడ్డ అవుట్ మొదట జంపింగ్ జపాంగ్ అనే చాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో వీరికి అవతలి టీమ్లో ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్బాస్. అందరూ చర్చించుకుని ప్రశాంత్ను గేమ్ నుంచి సైడ్ చేశారు. తనను ఆటలో నుంచి పక్కకు తోసేయడంతో రైతుబిడ్డ కంటతడి పెట్టుకున్నాడు. శివాజీ తన చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్రశాంత్ మెడలో వేశాడు. అయితే ప్రశాంత్ కంటే భోలె ఎక్కువ ఫీలైపోయాడు. ప్రియుడి కోసం ఏడ్చేసిన శోభ మరోవైపు శోభ తన ప్రవర్తన మీద తనే డౌట్ పడింది. బయట ఉన్న ప్రియుడిని ఉద్దేశిస్తూ.. వాడు నన్ను అర్థం చేసుకుంటాడంటావా? అని తేజతో కబుర్లాడింది. 'వాడు చాలా మెచ్యూర్డ్.. అర్థం చేసుకుంటాడు.. కానీ నమ్మకంతో పాటు భయం కూడా ఉంది. ఒకవేళ వాడికి నచ్చనట్లు ఏమైనా ప్రవర్తించానా? నీ విషయంలో వేరేలా ఉన్నాను. అది తనకు నచ్చకపోవచ్చేమో.. ఎవరికి తెలుసు? అయినా ఏమీ అవదనే అనుకుంటున్నాను. పొరపాటున ఏదైనా జరిగితే నేనసలు తట్టుకోలేను. వాడు బాగా గుర్తొస్తున్నాడు' అంటూ శోభ ఏడ్చేసింది. ఇక రేపటి ఎపిసోడ్లో మిగతా చాలెంజ్లు ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనేది చూడాలి! చదవండి: లావణ్య మెడలో మూడు ముళ్లు వేసిన వరుణ్ తేజ్ -
నామినేషన్స్లో రైతుబిడ్డ ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన గౌతమ్!
నామినేషన్స్ అంటేనే కంటెస్టెంట్లు హడలెత్తిపోతుంటారు. కొందరేమో దొరికిందే ఛాన్సని అవతలి వారి మీదున్న కోపాన్ని నామినేషన్స్ ద్వారా తీర్చుకుంటారు. మరికొందరేమో మండే రోజే తమలోని కళల్ని బయటకు తీస్తారు. రైతుబిడ్డగా జనాల్లో బీభత్సమైన సింపతీ తెచ్చుకున్న పల్లవి ప్రశాంత్ రెండో కేటగిరీకి చెందుతాడు. సాధారణ రోజుల్లో తన ధ్యాసంతా గేమ్ మీదే పెడతాడు.. బాగా ఆడతాడు కూడా! కానీ, పొరపాటున తనను ఆటలో నుంచి తీసేసినా.. ఎవరైనా నామినేట్ చేసినా అస్సలు భరించలేడు. విశ్వరూపం చూపిస్తాడు. ఊరోడు అన్నావ్.. మళ్లీ అనలేదని మాట మార్చావ్ నిన్నటి నామినేషన్స్లోనూ అదే జరిగింది. గౌతమ్ తనను నామినేట్ చేసేసరికి తట్టుకోలేకపోయాడు. ఎప్పటిలాగే ఊసరవెల్లిలా రంగులు మార్చాడు. సందీప్ మాస్టర్ను ఊరోడు అన్నావు.. తర్వాతేమో అనలేదని మాట మార్చావు.. అలా రెండు మాటలు మాట్లాడటం నచ్చలేదంటూ ప్రశాంత్ ఫోటోను మంటల్లో వేయబోయాడు గౌతమ్. అయితే ప్రశాంత్ మాత్రం.. నేను మాట్లాడాక నా ఫోటోను మంటల్లో వేయు. కాసేపైనా నా ఫోటో చూసుకుంటూ మాట్లాడతా.. గట్లే ఉంటదా అన్న.. ఫోటో చూపెట్టు.. ఎంత బాగుంది.. అంటూ రాగాలు తీశాడు. గౌతమ్ చెప్పిన పాయింట్ ఎలాగూ కరెక్టే కాబట్టి సరిగా ఆన్సర్ ఇవ్వలేక.. అది అయిపోయిన విషయం.. సందీప్కు సారీ చెప్పేశానంటూ అపరిచితుడిలా ప్రవర్తించాడు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావ్.. అంతేకాదు, తన మేనరిజాన్ని చూపిస్తూ అవతలివారిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నించాడు. మంటల్లో ఫోటో కాలిపోయినా నా గుండెలో మాత్రం నిప్పు వెలుగుతూనే ఉంటుంది.. అని భారీ డైలాగులు కొట్టాడు. ఈ యాక్టింగ్ చూసి నవ్వుకున్న గౌతమ్.. నువ్వెప్పుడూ నన్ను నామినేట్ చేయలేదా? అప్పుడు నేను ఇలాగే ప్రవర్తించానా? అని ప్రశ్నించగా ప్రశాంత్ దగ్గరి నుంచి సమాధానమే కరువైంది. పైగా అలాగే ఓవరాక్షన్ చేస్తుండటంతో ఎందుకురా? మంట ఆరదు, నీతి చావదు అన్న మాటలెందుకు? నీ నీతి, నిజాయితీ గురించి నేనేమీ మాట్లాడట్లేదు.. నువ్వు ఇప్పుడు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. మరి నాగార్జున సార్ అడిగినప్పుడు ఎందుకు సైలెంట్గా ఉన్నావు? ఎందుకేడ్చావు? అదంతా యాక్టింగా? అని వరుస ప్రశ్నలతో ప్రశాంత్కు ఇచ్చిపడేశాడు. వెనక్కు తగ్గని డాక్టర్ బాబు అయినా ప్రశాంత్ ఓవరాక్టింగ్ చేస్తూనే ఉండటంతో నేనేమీ ఆడిషన్ చేయట్లేదు అని కౌంటరిచ్చాడు డాక్టర్ బాబు. తర్వాత హౌస్లో అందికంటే మీరు వీక్గా ఉన్నారనిపిస్తోందంటూ భోలె షావళిని నామినేట్ చేశాడు గౌతమ్. దీనికతడు నువ్వు డాక్టర్ అయితే చేయి పట్టుకుని బీపీలు చూడు.. నేను వీక్ అని చెప్పకు అంటూ వెక్కిరిస్తూ పాటలు పాడాడు. అయినా సరే డాక్టర్ బాబు మాత్రం ఎంతో సహనంగా ఉంటూ ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేశాడు. ఇక రైతుబిడ్డ ఇలాగే అతి చేస్తే రానున్న రోజుల్లో ఎలిమినేట్ అవడం ఖాయమే! చదవండి: భగవంత్ కేసరికి సీక్వెల్.. డైరెక్ట్ ఇంట్రస్టింగ్ కామెంట్స్ -
'రాననుకున్నారా.. రాలేననుకున్నారా?.. కోపంతో ఊగిపోయిన గౌతమ్ కృష్ణ!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 2.0. ఇప్పటిదాకా జరిగిన షో ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న షో ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు ఉల్టా పుల్టా అంటూ సాగిన షో.. ఇప్పుడు ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్తో మరింత రసవత్తరంగా మారింది. బిగ్బాస్ రోజుకు ఒక షాక్ ఇస్తూ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. ఈ షో మొదలైన ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఐదో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందని.. ఇద్దరూ ఎలిమినేట్ కావొచ్చని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. శుభశ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. గౌతమ్ను సీక్రెట్ రూమ్లోకి పంపి బిగ్ షాకిచ్చారు బిగ్ బాస్. తాజా ఎపిసోడ్కు సంబంధించిన ప్రోమోను రిలీజైంది. ఈ ప్రోమోలో గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ నుంచి బయటికొచ్చేశాడు. (ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి యత్నించారు: శుభ శ్రీ) బయటకు వస్తూనే గౌతమ్ మాట్లాడుతూ..'రాననుకున్నారా.. రాలేననుకున్నారా? అంటూ సీక్రెట్ రూమ్లో ఉన్న గౌతమ్ ఎంతో ఆవేశంతో బయటకొచ్చాడు. అశ్వత్థామ ఇజ్ బ్యాక్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. 'తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు కదా.. అయినా ఈ అశ్వత్థామ చావడు. ఎలా వెళ్లానో అలానే వచ్చా. దిస్ ఇజ్ 2.0 బేబీ' అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ మాటలు చూసి కంటెస్టెంట్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత శివాజీనీ ఉద్దేశించి మాట్లాడారు. అన్న మీరు నన్ను ఎంటర్టైన్ చేయలేడేమో అన్నారు కదా? అని గౌతమ్ చెప్పడంతో.. తమ్ముడు ముందు నీ రీజన్ చెప్పు అంటూ శివాజీ అన్నారు. 'ఎంటర్టైన్ చేయడమంటే ప్యాంట్ తీసేసి తిరగడం కాదు కదన్నా.. కవర్ను చూసి బుక్ను జడ్జ్ చేయొద్దన్నారు అన్నా' గౌతమ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. 'బట్టలిప్పడం ఎంటర్టైన్మెంటా? అని ఇంతమంది ముందు అన్నావ్. 100 సినిమాల్లో చేశా బట్టలు లేకుండా.. నేను ఒక నటుడిని.. ఏమైనా చేస్తా' అన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ వెంటనే గౌతమ్.. నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను.. దీన్ని ఊపయోగించి నువ్వు ఒకరిని డైరెక్ట్గా నామినేట్ చేయొచ్చు' అని ఆప్షన్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయాలనుకున్నాడో చెప్పేలోగా ప్రోమో ముగిసింది. గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయనున్నాడో ఇవాళ ప్రసారమయ్యే ఎపిసోడ్లో క్లారిటీ రానుంది. సీక్రెట్లో రూమ్లో ఉన్న గౌతమ్కు బయటకు రావడం, స్పెషల్ పవర్ ఇవ్వడం ఈ ఎపిసోడ్లో హాట్టాపిక్గా మారింది. కాగా.. ఈ వారం అశ్విని, నయని పావని, పూజా మూర్తి, తేజ, శోభా శెట్టి, అమర్దీప్, సందీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: నామినేషన్స్లో ట్విస్ట్.. కొత్తవాళ్లకే ఛాన్స్! ఒక్కొక్కరికీ ఉంటదీ..) -
'బిగ్బాస్' 2.0.. హౌసులోకి ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్
బిగ్ బాస్ 7 ఐదు వారాలు పూర్తిచేసుకుంది. ఆదివారం ఒకరిని ఎలిమినేట్ చేయగా, మరో కంటెస్టెంట్ని సీక్రెట్ రూంలోకి పంపించేశారు. ఇకపోతే ఎన్నడూ లేని విధంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో భాగంగా ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇచ్చారు. అసలు ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 35 హైలైట్స్లో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఆదివారం ఒక్కొక్కరిని సేఫ్ చేయడంతో మొదలయ్యేది. కానీ ఈసారి మాత్రం డైరెక్ట్గా ఎలిమినేషన్తో మొదలుపెట్టారు. అలా ఐదోవారం శుభశ్రీ హౌస్ నుంచి బయటకెళ్లిపోయింది. ఆ వెంటనే గౌతమ్ని కూడా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. కానీ ట్విస్ట్ ఇచ్చిన నాగార్జున.. అతడిని సీక్రెట్ రూంలోకి పంపించారు. అక్కడ ఏం చేయాలి? ఎలా ఉండాలనేది బిగ్బాస్ చెబుతాడని నాగార్జున అన్నాడు. తొలి కంటెస్టెంట్గా అర్జున్ పలు సీరియల్స్లో నటించి గుర్తింపు తెచ్చకున్న అంబటి అర్జున్.. బిగ్ బాస్ లాంచ్ 2.0లో ఫస్ట్ కంటెస్టెంట్గా హౌసులోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే దమ్ము ఎవరు? దుమ్ము ఎవరు? అనేది చెప్పమన్నారు. దీంతో అర్జున్.. యవర్, ప్రశాంత్ ని దమ్ము కేటగిరీలో పెట్టాడు. సందీప్, అమరదీప్ దుమ్ము కేటగిరీలో పెట్టాడు. ఎవరీ అర్జున్? చూడటానికి సాఫ్ట్గా కనిపించే అర్జున్ నిజంగానే సాఫ్ట్వేర్ ఇంజనీర్. విజయవాడలో పుట్టి పెరిగిన ఇతడు ఐటీలో రెండేళ్లపాటు సాఫ్ట్వేర్ డెవలపర్గా పని చేశాడు. మోడల్గా మొదలైన తన ప్రయాణం కాస్తా నటనవైపు పరుగులు తీసింది. అర్ధనారి, గీతోపదేశం, సుందరి వంటి పలు చిత్రాల్లో అతడు నటించాడు. కానీ తనకు జనాల్లో పేరు తీసుకువచ్చింది మాత్రం సీరియల్సే! ప్రస్తుతం అతడి చేతిలో ఎటువంటి ప్రాజెక్టులు లేనట్లు తెలుస్తోంది. అందుకే మళ్లీ మంచి కంబ్యాక్ ఇవ్వడానికి బిగ్బాస్ షోను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. వచ్చీరావడంతోనే యావర్, ప్రశాంత్ దమ్మున్న గేమ్ ఆడుతున్నారని, అమర్దీప్, సందీప్ దుమ్ము దుమ్ముగా ఆడుతున్నారని చెప్పాడు. మరి ఇతడు దుమ్ము రేపేలా ఆడతాడా? ఎలా ఆడతాడనేది చూడాలి! రెండో కంటెస్టెంట్గా అశ్విని రెండో కంటెస్టెంట్గా అశ్విని శ్రీ అనే అమ్మాయి బిగ్బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చింది. దమ్ము కేటగిరిలో ప్రశాంత్, శివాజీ.. దుమ్ము కేటగిరీలో ప్రియాంక, శోభాశెట్టి అని చెప్పింది. తానొక కిక్ బాక్సర్ అని చెప్పుకొచ్చింది. ఎవరీ అశ్విని? సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అందాలు ఆరబోసేవారిలో ముందు వరుసలో ఉంటుంది అశ్విని శ్రీ. ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఈ సొట్టబుగ్గల సుందరి ఆర్టిస్ట్గా ఎదగాలని ఉవ్విళ్లూరుతోంది. అందుకు బిగ్బాస్ షోను వేదికగా ఏర్పాటు చేసుకుంది. మూడో కంటెస్టెంట్గా భోలె షావళి బిగ్బాస్ హౌసులోకి మూడో కంటెస్టెంట్గా సింగర్ కమ్ సంగీత దర్శకుడు భోలె షావళి ఎంట్రీ ఇచ్చాడు. అలానే పాటబిడ్డ అనే తనని తాను చెప్పుకొంటూ.. హౌస్ట్ నాగార్జునపై ఓ పాట క్రియేట్ చేసి పాడాడు. దమ్ము కేటగిరీలో శివాజీ, ప్రశాంత్.. దుమ్ము కేటగిరీలో అమరదీప్ అని చెప్పాడు. ఎవరీ భోలె షావళి? 'కష్టపడ్డ.. ఇష్టపడ్డ.. లవ్లో పడ్డ.. అది కాదంటే కాళ్ల మీద పడ్డ..' పాటతో భోలె షావళి పేరు మార్మోగిపోయింది. ఈ పాటతో సెన్సేషన్ సృష్టించిన భోలె షావళి సింగర్ మాత్రమే కాదు, మ్యూజిక్ డైరెక్టర్ కూడా! వెండితెరకు సైతం ఎన్నో హిట్ సాంగ్స్ అందించాడు. మహబూబాబాద్ జిల్లాలో పుట్టిపెరిగిన ఇతడు ప్రారంభంలో చక్రి దగ్గర అసిస్టెంట్గా పని చేశాడు. ఆయన దగ్గర మెళకువలు నేర్చుకున్న తర్వాత సింగర్గా, సంగీత దర్శకుడిగా ఇండస్ట్రీలో ప్రయత్నించాడు, సక్సెస్ అయ్యాడు. బతుకమ్మ, బోనాల పండగల సమయంలోనూ ప్రత్యేక గీతాలు కంపోజ్ చేస్తూ ఉంటాడు. ఈ మ్యూజిక్ డైరెక్టర్ తన టాలెంట్తో మాయ చేసేందుకు బిగ్బాస్ షోకి వచ్చాడు. మరి తన మ్యాజిక్ పని చేస్తుందా? ఎన్ని వారాలు కొనసాగుతాడు? అనేది చూడాలి. నాలుగో కంటెస్టెంట్గా పూజామూర్తి బిగ్బాస్ హౌసులోకి నాలుగో కంటెస్టెంట్గా సీరియల్ నటి పూజామూర్తి ఎంట్రీ ఇచ్చింది. అలానే సరిగ్గా ఈ షోకి రావడానికి ముందు చనిపోయారని చెబుతూ ఎమోషనల్ అయింది. ఇందులో పాల్గొని ఆయన చివరి కలని నిజం చేస్తానని చెప్పింది. దమ్మున్న వారిలో శివాజీ, సందీప్ ఉంటారని.. దుమ్ము కేటగిరీలో తేజ ఉంటారని చెప్పింది. ఎవరీ పూజామూర్తి? గుండమ్మ కథ సీరియల్తో జనాలకు దగ్గరైంది పూజా మూర్తి. ఈమె కన్నడ అమ్మాయి. కానీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతుంది. బొద్దుగా ముద్దుగా కనిపించే ఈ బ్యూటీ బిగ్బాస్ 7 ప్రారంభమైన రోజే హౌస్లో అడుగుపెట్టాల్సింది. కానీ సరిగ్గా షో ప్రారంభమయ్యే కొద్ది రోజుల ముందు ఆమె ఇంట విషాదం నెలకొంది. తండ్రి కన్నుమూయడంతో ఆమె రియాలిటీ షోలో ఎంట్రీ ఇవ్వలేకపోయింది. తాజాగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్బాస్ హౌస్లో అడుగుపెట్టింది. ఎంట్రీ బాగుంది, మరి ఆట ఎలా ఉంటుందో చూడాలి! ఐదో కంటెస్టెంట్గా నయని పావని బిగ్బాస్ హౌసులోకి ఐదో కంటెస్టెంట్గా సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ నయని పావని (సాయి పావని) ఎంట్రీ ఇచ్చింది. దమ్మున్న వాళ్లలో యవర్, ప్రశాంత్ అని దుమ్ముదుమ్ముగా ఆడుతుందని అమరదీప్, తేజ అని చెప్పింది. ఎవరీ నయని పావని? టిక్టాక్ వీడియోలతో బాగా ఫేమస్ అయింది నయని పావని. ఈమె అసలు పేరు సాయి పవని రాజ్. పక్కా తెలంగాణ అమ్మాయి. టిక్టాక్లో వీడియోలు చేస్తూ కిల్లింగ్ ఎక్స్ప్రెషన్స్తో అందరినీ బుట్టలో వేసుకుంది. సమయం లేదు మిత్రమా, ఎంత ఘాటు ప్రేమ, పెళ్లి చూపులు 2.0, మిత్రమా, బబ్లూ వర్సెస్ సుబ్బులు కేరాఫ్ అనకాపల్లి వంటి పలు షార్ట్ ఫిలింస్లోనూ నటించింది. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్కు ఇన్స్టాగ్రామ్లో 6 లక్షల మందికి పైగా అభిమానులు ఉన్నారు. ఆ మధ్య డ్యాన్స్ షో ఢీలోకి వెళ్లి మంచి గుర్తింపు పొందింది. షార్ట్ ఫిలింస్, రియాలిటీ షోలే కాదు సినిమాలు కూడా చేసింది. చిత్తం మహారాణి, సూర్యకాంతం అనే చిత్రాల్లో నటించి మెప్పించింది. అందానికి అందం, దానికి మించి టాలెంట్ ఉన్న ఈ బ్యూటీ తాజాగా బిగ్బాస్ 7లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చింది. మరి తన జర్నీ ఎలా ఉంటుంది? అందరినీ ఆటాడిస్తుందా? తన ఆట తనే ఆడుతుందా? చూడాలి! ఇక వీళ్ల ఐదుగురి ఎంట్రీతో పాటు ఈ ఎపిసోడ్లో తన 'చిన్నా' సినిమా ప్రమోషన్స్లో భాగంగా సిద్ధార్థ్.. టైగర్ నాగేశ్వరరావు ప్రమోషన్స్లో భాగంగా రవితేజ, నుపురు సనన్, గాయత్రి భరద్వాజ్ కాసేపు అలా వచ్చి సందడి చేసి వెళ్లిపోయారు. అలానే ఇప్పటివరకు అందరూ పవరస్త్ర కోసం పోటీపడ్డారు. కానీ కొత్తగా వచ్చిన ఐదుగురితో పాటు ఆల్రెడీ బిగ్బాస్లో ఉన్న ఎనిమిది మంది హౌస్మేట్స్ అయిపోయారని నాగార్జున చెప్పాడు. అలా వాళ్లలో అర్జున్, అశ్వినికి హౌస్ ఆఫ్ లగేజీ టాస్క్ ఇచ్చారు. మిగతావాళ్లలో ఎవరెవరి దగ్గర ఏ లగేజీ ఉండాలనేది వీళ్లు డిసైడ్ చేస్తారు. అలానే భోలె షావళి, పూజామూర్తి, నయనపావనికి నాగార్జున హౌస్ ఆఫ్ బెడ్స్ టాస్క్ ఇచ్చారు. దీన్నిబట్టి ఎవరు ఏ బెడ్పై పడుకోవాలనేది వీళ్లు నిర్ణయిస్తారు. అలా ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. సోమవారం ఎపిసోడ్లో నామినేషన్స్ ఉంటాయి. -
డబుల్ ఎలిమినేషన్.. ప్రోమోలో ఆ జంటనే లేపేశారుగా!
బిగ్బాస్ షోకి ఉన్న ప్రధాన సమస్య లీక్స్.. ఎపిసోడ్ ప్రారంభం అయ్యే సమయానికే ఆరోజు ఏం జరగబోతుంది? ఎవరు గొడవపడతారు? ఎవరు ఆడుతారు? ఎవరు గెలుస్తారు? ఎవరు ఎలిమినేట్ అవుతారు? ఇలా అన్నీ బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దీన్ని ఆపడం ఎవరి తరమూ కావడం లేదు. ఫలితంగా బిగ్బాస్ ఎపిసోడ్లో పస లేకుండా పోతోంది. ఈసారి కూడా అదే జరిగింది. డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని ప్రచారం జరిగింది, జరుగుతూనే ఉంది. అయినా మీరు చెప్పేదేంటి? నేనే చెప్తేస్తే ఓ పనైపోతుంది అనుకున్నారో ఏమో కానీ తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇద్దరు కంటెస్టెంట్లనే లేపేశారు. డాక్టర్బాబు గౌతమ్ కృష్ణ, శుభశ్రీ రాయగురు ఇద్దరూ ప్రోమోలో ఒక్కచోట కూడా లేకపోవడంతో వీరి ఎలిమనేషన్ దాదాపు ఖరారైపోయింది. అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. ఎలిమినేట్ అయింది ఇద్దరే కానీ, ఒకరిని నిజంగానే అవతలకు పంపించేయలేదని లేటెస్ట్ టాక్! గౌతమ్ కృష్ణను సీక్రెట్ రూమ్లోకి తీసుకెళ్లి ఎపిసోడ్ అంతా అయ్యాక తిరిగి హౌస్ లోపలకు పంపిస్తారట! మరి ఈ సీక్రెట్ రూమ్ వ్యవహారం నిజమే అయితే అది ఏమేరకు వర్కవుట్ అవుతుందో చూడాలి! ఇకపోతే సిద్దార్థ్ హౌస్లో చేసిన హంగామా మామూలుగా లేదు. అటు మాస్ మహారాజ రవితేజ సైతం రంగంలోకి దిగాడు. వీరి రచ్చ రంబోలా చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే! చదవండి: బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతున్న కామెడీ ఫిలిం.. రెట్టింపైన కలెక్షన్స్.. ఓటీటీ పార్ట్నర్ ఏదంటే? -
త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!
బిగ్బాస్ అంటేనే ఫిట్టింగ్ బాస్.. అన్నీ తేరగా ఇచ్చేయడు. కంటెస్టెంట్లను ముప్పలు తిప్పలు పెట్టి, ఏడిపించి చివరకు వారిక్కావాల్సింది ఇస్తాడు. బిగ్బాస్ ఇచ్చే అరకొరవాటి కోసం హౌస్లో నానా గొడవలే జరుగుతాయి. ఈసారి బిగ్బాస్.. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని చెప్తూనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తాజా(సెప్టెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్లో చదివేయండి.. యావర్కు తెలుగు క్లాసులు బిగ్బాస్ ఇంట్లో కెప్లెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందుకోసం ఇంట్లోవారంతా జంటలు జంటలుగా విడిపోయారు. వీరిలో ఆటలో వెనుకబడి అందరికన్నా తక్కువ స్టార్లు సొంతం చేసుకున్న శోభా శెట్టి- ప్రియాంకలను బిగ్బాస్ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు. మిగిలిన నాలుగు జంటలు అమర్ దీప్- సందీప్, శివాజీ- ప్రశాంత్, తేజ- యావర్, గౌతమ్- శుభశ్రీలు నెక్స్ట్ లెవల్కు వెళ్లారు. ఇకపోతే తెలుగు కష్టంగా మాట్లాడుతున్న యావర్కు నాలుగు తెలుగు ముక్కలు నేర్పించాలన్నాడు బిగ్బాస్. ఈ క్రమంలో తేజ, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ.. అతడికి తెలుగు క్లాసులు తీసుకున్నారు. రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఆర్డర్లు, వార్నింగ్లు.. అల్లరి విద్యార్థిగా యావర్ అదరగొట్టాడు. తెలుగు పండింతులైన తేజను ఓ ఆటాడుకున్నాడు. మరోవైపు శివాజీ ఎప్పటిలాగే అతి చేశాడు. కాఫీ కోసం బిగ్బాస్ మీదకే నిప్పులు చెరుగుతున్నాడు. కాఫీ ఇవ్వని బతుకు.. నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్ నుంచి వెళ్లిపోతా.. అని మరోసారి బెదిరింపులకు దిగాడు. కాఫీ లేకపోతే ఏం ఆలోచించలేకపోతున్నా.. కామెడీ చేయమంటే ఎలా చేస్తాం.. వీడెవడ్రా బిగ్బాస్? కాఫీ ఇవ్వనంటాడు.. అని చిందులు తొక్కాడు. ఈయన ఓవరాక్షన్ చూసిన బిగ్బాస్ అతడికి కాఫీనే పంపించలేదు. ఎమోషనల్ టాస్క్.. ఇకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్లో భాగంగా చిట్టి ఆయిరే అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లందరికీ ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని, కానీ ప్రతి జంటలో ఒకరు లెటర్ చదివితే మరొకరు త్యాగం చేయాలి.. త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఎవరైతే లెటర్ చదువుతారో వారే కెప్టెన్సీ పోటీదారుడు అవుతారన్నమాట! త్యాగం చేసిన శుభ శ్రీ ఈ టాస్క్ గురించి ప్రకటించగానే శివాజీ.. నేను ఈ టాస్క్ ఆడటం లేదు అంటూ శివాజీ మైక్ కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రశాంత్తో.. నువ్వే ఆడు, లెటర్ తీసుకో అని చెప్పాడు. మరోవైపు గౌతమ్- శుభశ్రీ.. ఎవరు లెటర్ అందుకోవాలనే దాని గురించి కాసేపు వాదులాడి చివరకు త్యాగానికి పూనుకుంది శుభ. అటు గౌతమ్ తన తండ్రి రాసిన లేఖ చదివి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తన లేఖను చించేసిన యావర్ యావర్- తేజా.. ఇద్దరూ త్యాగానికి సిద్ధపడ్డారు. ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్లలేనంటూ యావర్ తన లేఖను చింపేశాడు. దీంతో తేజా తన తండ్రి రాసిన లెటర్ చదివి చాలా ఎమోషనలయ్యాడు. ఏడవనంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి తర్వాతి ఎపిసోడ్లో ఎవరు త్యాగం చేస్తారు? ఇంకా ఎవరు కెప్టెన్సీ పోటీదారులవుతారో చూడాలి! -
బిగ్బాస్ 7: ఆ ముగ్గురు తప్ప అందరూ నామినేషన్స్లో!
బిగ్బాస్ తెలుగు ఏడో సీజన్లో చిత్రవిచిత్రమైనవి జరుగుతున్నాయి. ఈసారి కెప్టెన్సీ, లగ్జరీ బడ్జెట్ టాస్క్లాంటివి ఏమీ పెట్టడం లేదు. కెప్టెన్సీకి బదులుగా పవరాస్త్రను ప్రవేశపెట్టారు. వీకెండ్లో కింగ్ ఆడించే గేమ్స్ గెలిచిన వారికి లగ్జరీ బడ్జెట్ ఇస్తున్నారు. టాస్కులు అరకొరగానే సాగుతున్నాయి. ఏదో ఆనవాయితీ ఉన్నట్లుగా ప్రతివారం అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు కిరణ్ రాథోడ్, షకీల, దామిని, రతికా రోజ్.. ఇలా వరుసగా నలుగురు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇక శివాజీ చేస్తున్న అతికిగానూ తనకిచ్చిన పవరాస్త్రను తిరిగి వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే! దీంతో నేటి నామినేషన్స్లో హౌస్మేట్స్ అతడిపై విరుచుకుపడ్డారు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గౌతమ్ కృష్ణ.. ఓ టాస్క్లో తేజ తనను బెల్ట్తో కొట్టిన సంగతిని గుర్తు చేశాడు. ఆ టాస్క్లో తేజ అలా చేస్తుంటే ఆపలేకపోయారంటూ శివాజీని నామినేట్ చేశాడు. సందీప్ కంటెస్టెంట్గా ఉండుంటే తనకే నామినేట్ చేసేవాడినని, కానీ తను హౌస్మేట్ అయినందున తనను నామినేట్ చేసే ఛాన్స్ లేదన్నాడు. ప్రియాంక.. శివాజీ, యావర్ను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారం సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
ఆయన మనిషేనా? ఛీ, అతడికా సపోర్ట్ చేసింది.. శివాజీపై రతిక ఫైర్
కంటెస్టెంట్లు పెద్దగా గొడవపడేది నామినేషన్స్లోనే! ఇతరత్రా సందర్భాల్లో గొడవపడ్డా దాన్ని గుర్తు చేసుకుని మరీ గొడవకు దిగేది, రచ్చ చేసేది కూడా నామినేషన్స్లోనే! బిగ్బాస్ 7లో నాలుగోవారం నామినేషన్స్ రసాభాసగా జరిగాయి. ఇంతకీ ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్(సెప్టెంబర్ 25) హైలైట్స్ చదివేయాల్సిందే! అతి చేస్తున్న శివాజీ హౌస్లో తనే పెద్ద తోపు, తురుమ్ఖాన్ అన్నట్లు ప్రవర్తిస్తున్నాడు శివాజీ. ఎదుటివారిని మాట్లాడనివ్వడు, వారు ఏం చెప్పినా వినిపించుకోడు, పట్టించుకోడు. తను చెప్పిందే వేదం, తను చేసేది శాసనం అన్నట్లుగా ఓవర్ బిల్డప్ ఇస్తున్నాడు. అందరితో బాగుంటూనే అవసరం వచ్చినప్పుడు అసలు స్వరూపం చూపిస్తున్నాడు. ఈ విషయాన్ని ఆలస్యంగా పసిగట్టిన రతిక రోజ్ అతడికి దూరంగా ఉండటమే బెటర్ అని ఫీలైంది. నాగార్జునగారి దగ్గర.. ప్రశాంత్ వెనుక నేను తిరుగుతున్నా అన్నట్లుగా శివాజీ అనడం నచ్చలేదని అమర్తో చెప్పింది రతిక. ఛీ.. ఈయన్నా నేను సపోర్ట్ చేసింది: రతిక 'అసలు ఆయన్ను మనిషి అనాలా? ఇంకేమైనా అనాలా? ఆయన సేఫ్ గేమ్ ఆడుతూ అందరినీ సేఫ్ గేమ్, గ్రూప్స్ ఆడుతున్నారని చెప్తున్నాడు. ఛీ ఈయనకా నేను సపోర్ట్ చేసింది.. పైకి మంచిగా ఉంటూ మార్కులు కొట్టేస్తూ మనల్ని పిచ్చోడిని చేస్తున్నాడు' అని తన ఆవేశాన్నంతా కక్కేసింది. ఆ తర్వాత శివాజీ దగ్గరకు వెళ్లి మరీ గొడవపెట్టుకుంది. ప్రశాంత్ టాపిక్ ఎత్తుతూ.. నాగ్ సర్ ముందు అమ్మాయిగా నా క్యారెక్టర్ గురించి ఇలా అనేశాడేంటి? అనిపించింది అని తన ఆవేదన చెప్పింది. దీంతో అతడు నేనలా అనలేదు. నువ్వే మరోలా ఊహించుకుంటున్నావు.. అంటూ కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. కానీ రతిక వినకపోవడంతో సారీ చెప్పాడు. అయినా రతిక వాదిస్తుండటంతో.. ఎందుకు సాగదీస్తున్నావ్.. కాళ్లు పట్టుకోవాలా? అని సీరియస్ అవుతూ అక్కడినుంచి వెళ్లిపోయాడు. జ్యూరీ సభ్యులను కారణాలతో మెప్పిస్తేనే.. ఇక ఈ వారం నామినేషన్ ప్రక్రియ వినూత్నంగా సాగింది. పవరాస్త్ర పొందిన ముగ్గురు హౌస్మేట్స్ శోభా శెట్టి, సందీప్, శివాజీలను బిగ్బాస్ జ్యూరీ మెంబర్స్గా కూర్చోబెట్టారు. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిని బోనులో నిలబెట్టి నామినేట్ చేసి అందుకు తగిన కారణాలు చెప్పాలి. జ్యూరీ ఎవరి నామినేషన్కు మద్దతు తెలుపుతుందో వారి ఫోటోలను గిల్టీ బోర్డుపై పెట్టాలి. ఒకసారి గిల్టీ బోర్డుకు ఎక్కిన వ్యక్తిని వేరొకరు నామినేట్ చేయడానికి వీల్లేదు. ముందుగా ప్రిన్స్ యావర్.. తనను కంటెండర్గా తప్పించిందని ప్రియాంకను, టాస్కులే ఆడట్లేదంటూ తేజలను నామినేట్ చేశాడు. ప్రియాంక గురించి చెప్పింది సబబు అనిపించడంతో జ్యూరీ మెంబర్స్ ఆమె ఫోటోను గిల్టీ బోర్డుపై పెట్టారు. మళ్లీ కయ్యానికి కాలు దువ్విన యావర్ శుభశ్రీ మాట్లాడుతూ.. బిగ్బాస్ రూల్స్ ప్రకారం బయట ఉన్న సెలబ్రిటీల గురించి చెడుగా మాట్లాడకూడదు. కానీ రతిక తన ఎక్స్ గురించి చెడుగా మాట్లాడుతోందని నామినేట్ చేసింది. అలాగే గతవారం నామినేషన్స్ సొంతంగా ఆలోచించకుండా వేరొకరిని గుడ్డిగా ఫాలో అవడం కరెక్ట్ కాదని పేర్కొంది. దీంతో రతికకు మైండ్ బ్లాంక్ అయిపోయింది. నీలా గుసగుసలు ఆడటం రాదు. నా ఎక్స్ గుర్తొచ్చి ప్రియాంకతో చెప్పుకున్నాను. ఆ మాటలు విని నువ్విక్కడ చెప్తున్నావంటే నీ క్యారెక్టర్ ఏంటి? అని ప్రశ్నించింది. దీంతో శుభశ్రీ నోరు అదుపులో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ యావర్- గౌతమ్ ఫైట్ కంటెండర్గా గుండు గీయించుకోమంటే వెనుకాడాడంటూ అమర్ను నామినేట్ చేసింది. అది నా ఇష్టం, నీకేంటి బాధ? అని తనతో గొడవకు దిగాడు అమర్. జ్యూరీ.. అమర్-రతిక ఇద్దరిలో రతికను నామినేట్ చేశారు. అనంతరం గౌతమ్.. గతంలో ప్రిన్స్ తనతో అమర్యాదగా ప్రవర్తించాడని, అతడి కోపం వల్ల మనోభావాలు దెబ్బతింటున్నాయన్నాడు. ఇది వినగానే ప్రిన్స్ మళ్లీ గొడవ షురూ చేశాడు. యావర్- గౌతమ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు అరుచుకున్నారు. బోనులో నిలబడకుండా గౌతమ్పైకి వెళ్లడంతో అతడిని బోనులో నిలబడమని సందీప్ మాస్టర్, శివాజీ కోప్పడ్డారు. వారిపైనా ప్రిన్స్ నిప్పులు చెరిగాడు. పిచ్చి కారణాలంటూ శివాజీ ఓవరాక్షన్ ఈ ప్రవర్తనే నచ్చలేదని గౌతమ్ అనగా నీవన్నీ పిచ్చి కారణాలు.. మేము పిలుస్తున్నా యావర్ మా మాట లెక్కచేయలేదు కాబట్టి ఆ ప్రవర్తనకు మాత్రమే నామినేట్ చేస్తున్నాం అంటూ శివాజీ అతి చేశాడు. ఇది నచ్చని గౌతమ్ మీరు పక్షపాతంగా ఉంటున్నారంటూ శివాజీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంతలో బిగ్బాస్.. నామినేషన్లో ప్రవర్తనను బట్టి కంటెస్టెంట్లను నామినేట్ చేయకూడదు. కారణాల ఆధారంగానే వారిని ఎంపిక చేయాలి. మీ నిర్ణయాన్ని ఆలోచించి చెప్పండి అని పేర్కొన్నాడు. దీంతో ఎపిసోడ్ ముగిసింది. మరి నామినేషన్లో ఇంకా ఎన్ని గొడవలున్నాయో చూడాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన బాలీవుడ్ నటి -
పాపం గౌతమ్.. కష్టమంతా వృథా! బిగ్బాస్ ప్లాన్ అదేనా?
బిగ్బాస్ ఇంట్లో మూడో హౌస్మేట్గా ప్రమోషన్ పొందేందుకు కంటెస్టెంట్లు పోటీపడుతున్నారు. ఈ క్రమంలో చిత్రవిచిత్ర టాస్క్లుపెడుతున్నాడు బిగ్బాస్. ఇప్పటికే పవరస్త్ర కోసం సెలక్ట్ చేసిన ముగ్గురికే కాకుండా వారిని ఛాలెంజ్ చేసిన వారికి సైతం టాస్కులు ఇచ్చాడు. ఇంతకీ హౌస్లో తాజా ఎపిసోడ్లో (సెప్టెంబర్ 21) ఏమేం జరిగిందో చూసేద్దాం.. చికెన్ ముక్కల్ని లాగించిన శోభా మూడో పవరాస్త్ర కోసం బిగ్బాస్.. ప్రిన్స్ యావర్, అమర్దీప్, శోభా శెట్టిని సెలక్ట్ చేశారు. ఇప్పటికే బిగ్బాస్ ఇచ్చిన టాస్కులో గెలిచి తాను కంటెండర్గా పోటీ చేసేందుకు అర్హుడినేనని నిరూపించుకున్నాడు ప్రిన్స్. ఈరోజు మిగతా ఇద్దరి వంతు వచ్చింది. మొదటగా శోభా శెట్టిని పిలిచాడు బిగ్బాస్. అసలు కారమే అలవాటు లేని తన ముందు అత్యంత కారమైన చికెన్ ముక్కలు పెట్టి వీలైనన్ని ఎక్కువ తినాలని టాస్క్ ఇచ్చాడు. ఎంతో కారంగా ఉన్నా సరే 27 ముక్కల్ని లాగించేసింది శోభా. గౌతమ్ కదా విన్నర్? ఇక ఆమె కంటెండర్గా పోటీ చేయడాన్ని ఛాలెంజ్ చేసిన పల్లవి ప్రశాంత్, శుభశ్రీ రాయగురు, గౌతమ్ కృష్ణలకు సేమ్ టాస్క్ ఇచ్చాడు. తక్కువ సమయంలో 28 చికెన్ పీసులు తినాలని చెప్తూ సందీప్ను సంచాలకుడిగా నియమించాడు. గౌతమ్ 28 తినేసి బెల్ కొట్టాడు. అయితే అప్పటివరకు సైలెంట్గా ఉన్న సంచాలక్.. తర్వాత మాత్రం ఒక పీస్ కొద్దిగా వదిలేశావంటూ ఒక నెంబర్ తగ్గించి 27 పీసులే తిన్నట్లు పేర్కొన్నాడు. శోభా శెట్టి కంటే ఎక్కువ తినలేకపోవడంతో బిగ్బాస్ ఆమెనే కంటెండర్గా ఎంపిక చేశాడు. గుండు గీయించుకునేందుకు భయపడ్డ అమర్ ఇక శివాజీ పవరాస్త్రను కొట్టేసిన అమర్దీప్.. చివరకు దాన్ని వెనక్కు ఇచ్చేశాడు. అనంతరం అసలు సిసలైన ఫిట్టింగ్ పెట్టాడు బిగ్బాస్. అమర్దీప్ను గుండు గీయించుకోవాలన్నాడు. లేదంటే అతడిని ఛాలెంజ్ చేసిన ప్రియాంక బేబీకట్ చేయించుకోవాలన్నాడు. తను గుండు గీయించుకోవడమా? నెవర్.. ఆ ఊహే భయంకరంగా ఉందన్నట్లుగా వణికిపోయాడు అమర్. ఓపక్క ఏడుస్తూనే అమ్మాయిలకు ఇలాంటి హెయిర్కట్ అంటే మామూలు విషయం కాదంటూ హెయిర్కట్కు రెడీ అయిపోయింది ప్రియాంక. అప్పటిదాకా కన్నీళ్లు.. అద్దంలో చూసుకున్నాక.. అప్పటివరకు కన్నీళ్లు పెట్టుకున్న ఆమె తర్వాత మాత్రం.. గతంలో ఇలా చిన్నగా హెయిర్కట్ చేయించుకోవాలనుకున్నాను. క్యూట్గా ఉన్నాను అంటూ మురిసిపోయింది. ఇదంతా చూస్తుంటే ఈసారి పవరాస్త్రను బిగ్బాస్ ఎట్టిపరిస్థితుల్లోనూ అమ్మాయిలకే ఇవ్వాలని ఫిక్సయిపోయినట్లు తెలుస్తోంది. మరి నిజంగానే ప్రిన్స్ను ఓడించి శోభా, ప్రియాంకలలో ఎవరైనా ఒకరు పవరాస్త్ర గెలుచుకుని మూడో హౌస్మేట్గా ప్రమోషన్ పొందుతారా? లేదా? అనేది చూడాలి. చదవండి: ఆ వ్యాధి వల్ల సినిమాలు, ఊరు వదిలేసి వెళ్లిపోయా: మమతా -
బిగ్బాస్: నాకు న్యాయం కావాలి.. చంటిపిల్లాడిలా ఏడ్చేసిన ప్రిన్స్
బిగ్బాస్ 7 ఉల్టాపుల్టాగా సాగుతోంది. ఎవరూ ఎక్కడా తగ్గడం లేదు. ఆటలో చూపించాల్సిన ప్రతాపాన్ని ఖాళీ సమయాల్లోనే ఎక్కువగా చూపిస్తున్నారు. కొందరైతే ఫుటేజీ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం బిగ్బాస్ హౌస్లో మాయాస్త్ర టాస్క్ నడుస్తున్న సంగతి తెలిసిందే కదా! మహాబలి టీమ్లో గొడవల కారణంగా టాస్క్ కొనసా...గుతోంది. ఈ టాస్క్ గురించి అప్డేట్ ఇస్తూ తాజాగా ప్రోమో విడుదలైంది. కొట్టుకున్నంత పని చేసిన గౌతమ్, ప్రిన్స్ మాయాస్త్ర పొందేందుకు ఎవరు అనర్హులో చెప్పి, వారి దగ్గరున్న భాగాన్ని తీసుకుని అదే టీమ్లోని మరొకరికి ఇవ్వాలి. దీంతో గౌతమ్.. ప్రిన్స్ దగ్గరి నుంచి తీసుకుని శివాజీకి ఇస్తానన్నాడు. ఆ మాటతో శివాలెత్తాడు ప్రిన్స్. నువ్వు చెప్పే కారణం ఇదా.. అని అరిచాడు. గౌతమ్, ప్రిన్స్ యావర్.. ఇద్దరూ కొట్టుకున్నంత పని చేశారు. నాకు న్యాయం కావాలని ఏడ్చేశాడు ప్రిన్స్. దీంతో అమర్ అతడిని ఓదార్చే ప్రయత్నం చేశాడు. ఇంతమందిని ఏడిపించి ఏం బాగుపడుతారో నాకర్థం కాదు అని మహాబలి టీమ్పై సెటైర్లు వేశాడు. రైతుబిడ్డ అని చెప్పుకోవద్దు, కానీ నువ్వు డాక్టర్ అని చెప్పుకోవచ్చు 'ఇది బ్యాడ్ గేమ్.. నేను ఇంటికి వెళ్లాలి.. గేటు ఓపెన్ చేయండి' అని అభ్యర్థించాడు ప్రిన్స్. ఈ ప్రోమో చూసిన అభిమానులు.. ప్రిన్స్ యావర్ కష్టపడే తత్వమున్నవాడని, అతడు నిజాయితీగా ఆడుతున్నాడని కామెంట్లు చేస్తున్నారు. పల్లవి ప్రశాంత్ రైతుబిడ్డ అని చెప్పుకుంటే తిట్టారు, మరి గౌతమ్ ఎందుకు? పదేపదే డాక్టర్నని విర్రవీగుతున్నాడు. ఆయన అన్నిసార్లు డాక్టర్ అని చెప్పుకుంటుంటే ఎవరూ నోరు మెదపడం లేదేంటని ప్రశ్నిస్తున్నారు. ప్రశాంత్ చేస్తే తప్పు, గౌతమ్ చేస్తే ఒప్పా? అని నిలదీస్తున్నారు. చదవండి: రతిక శాడిజం వల్ల సీరియల్ బ్యాచ్ అవుట్.. పచ్చిబూతులు మాట్లాడిన అమర్ -
బిగ్బాస్ స్టూడియో ముందు కుక్కలా తిరిగానంటూ ఏడ్చేసిన రైతుబిడ్డ
బిగ్బాస్ హౌస్మేట్స్కు ఓ విషయం అర్థమైంది. ఇక మెతకగా ఉంటే పని అవ్వదని, అందరి కంట్లో పడాలంటే ఏదో ఒకటి చేసేయాలని తెలిసొచ్చింది. అసలే వీకెండ్లో నాగ్ కొందరు కంటెస్టెంట్లు ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చున్నారని గాలి తీసేశాడు. ఇంకేముంది, నామినేషన్స్లో ఒకరిపై మరొకరు విరుచుకుపడ్డారు. బిగ్బాస్కే బాస్ అన్నట్లుగా బిల్డప్ ఇస్తున్న శివాజీని, పదేపదే రైతుబిడ్డ అని చెప్తూ చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తూ సింపథీ కోరుకుంటున్న పల్లవి ప్రశాంత్ను ఉతికారేశారు. ముందు ఎదుటివారిని మాట్లాడనివ్వమని ప్రియాంక శివాజీకి గట్టిగానే కౌంటరిచ్చింది. అది తప్పా? అనంతరం హౌస్లో చాలామంది ప్రశాంత్ను వరుసపెట్టి నామినేట్ చేశారు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నాయనా, నాకు నువ్వు నాకు కనిపించడం లేదని షకీలా మొదట ప్రశాంత్ను నామినేట్ చేసినట్లు చూపించారు. ఇక గౌతమ్ కృష్ణ.. తనను నామినేట్ చేస్తూ కారణం చెప్తుండగా అతడిని మధ్యలోనే అడ్డుకున్నాడు ప్రశాంత్. నేను చేసే పని గర్వంగా చెప్పుకున్నా, అది తప్పా? అని నిలదీశాడు. గౌతమ్ను మాట్లాడనివ్వకపోవడంతో.. ఫస్ట్ మొత్తం విన్నాక మాట్లాడు అని ప్రశాంత్పై ఫైర్ అయింది ప్రియాంక. అదిరే ఆన్సర్ ఇచ్చిన ఆట సందీప్ ఇక అమర్దీప్ అయితే రైతుబిడ్డ అనే క్యాసెట్ వినలేక తెగ ఫ్రస్టేట్ అయ్యాడు. ప్రతిసారి రైతుబిడ్డ అనే సెంటిమెంటల్ డైలాగ్ వాడకురా అని హెచ్చరించాడు. సీరియల్లో చేసిన యాక్టింగ్ ఇక్కడ చెప్పకు అని ఎదురుతిరిగాడు ప్రశాంత్. ఇంతలో ఆట సందీప్ కలగజేసుకుంటూ భారత్లో పుట్టిన ప్రతి ఒక్కరూ రైతుబిడ్డే.. మా తాతలు కూడా రైతుబిడ్డేరా అని చెప్పాడు. కుక్కలా తిరిగినా అందరూ ఒకేసారి తనను వరుసపెట్టి వాయించడంతో ఏడ్చేశాడు ప్రశాంత్. ఆరో సీజన్ సమయంలో ఇదే స్టూడియో ముందు కుక్కలాగా తిరిగానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడే రతిక రంగంలోకి దిగుతూ.. కుక్కలాగా తిరిగే అవకాశం వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చి ఏం చేస్తున్నవ్? అని పాయింట్ లాగింది. ఆమె దగ్గరి నుంచి అటువంటి ప్రశ్న ఊహించని ప్రశాంత్ దెబ్బకు సైలైంట్ అయిపోయాడు. ఈ ప్రోమో మాత్రం ఓ రేంజ్లో వైరల్ అవుతోంది. చదవండి: Kiran Rathod: కిరణ్ రాథోడ్ ఎలిమినేషన్కు ప్రధాన కారణాలివే! వారం రోజుల్లోనే అంత సంపాదించిందా? -
మధ్య తరగతి కుర్రాడి కథ
గౌతం కృష్ణ హీరోగా, శ్వేత అవస్తి, రమ్య పసుపులేటి హీరోయిన్లుగా పి. నవీన్కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్పై సెవెన్ హిల్స్ సతీష్కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా మూడు షెడ్యూల్స్ పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా పి. నవీన్ కుమార్ మాట్లాడుతూ– ‘‘ఒక స్టూడెంట్ నుంచి కార్పొరేట్ స్థాయికి ఎదిగిన మధ్య తరగతి కుర్రాడి కథతో ఈ సినిమా రూపొందుతోంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ని మా సినిమా అలరిస్తుంది’’ అన్నారు. ‘‘త్వరలో మా సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ విడుదల చేస్తాం’’ అన్నారు సెవెన్ హిల్స్ సతీష్ కుమార్. పోసాని కృష్ణమురళి, అనితా చౌదరి, షఫీ, ఆర్కే మామ, ఆనంద్ చక్రపాణి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: త్రిలోక్ సిద్ధు, సంగీతం: జుడా శాండీ. ∙పోసాని కృష్ణ మురళి, గౌతం కృష్ణ, శ్వేత -
డాక్టర్ నుంచి యాక్టర్ అయిన హీరో
డాక్టర్ గౌతమ్ కృష్ణ బిగ్బాస్ షోలో 11వ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చాడు. గౌతమ్కు చిన్నప్పటి నుంచే రైటర్, డైరెక్టర్ కావాలని ఉండేదట. అయితే తన పేరెంట్స్కు మాత్రం సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒకరకమైన భయం. దీంతో వారికోసం చదువుపై దృష్టిపెట్టాడు. అలా డాక్టరయ్యాడు. సూర్యాపేట జిల్లాలోని బీబీగూడేం అతడి స్వస్థలం. తల్లిదండ్రులు ధరావత్ మనోజ్జాదవ్, మంగమ్మ. తండ్రి రిటైర్డ్ ఇంజినీర్, తల్లి ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. 1996 ఏప్రిల్ 13న జన్మించిన గౌతమ్ తల్లిదండ్రుల కోరిక మేరకు ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. చిన్నతనం నుంచే సినిమాలంటే ఆసక్తి. దీంతో డాక్టర్ చదువుతో పాటు ఎంబీఏ పూర్తి చేయగానే 2018లో దర్శకత్వంలో శిక్షణ పొందాడు. 2019లో ఆకాశవీధుల్లో సినిమాకు సొంతంగా కథ రాసుకుని డైరెక్షన్ చేస్తూనే హీరోగా నటించాడు. హిందీలో సిద్దూ ది రాక్స్టార్ సినిమా చేసి అక్కడా తనదైన ముద్ర వేసుకున్నాడు. తాజాగా బిగ్బాస్ హౌస్లోకి వెళ్లిన అతడు డాక్టర్ను కాబట్టి అందరికీ పనికొస్తాను, తనను నామినేట్ చేయొద్దు అంటున్నాడు. అయితే నాగార్జున మాత్రం అతడి చేతికి బేడీలు వేసి మరీ హౌస్లోకి పంపించాడు. ఇంట్లో అందంగా కనిపించే ఒక అమ్మాయికి ఈ బేడీలు వేయమన్నాడు. మరి ఈ డాక్టర్ బాబు హౌస్లో ఎన్నాళ్లు ఉంటాడో చూడాలి!
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బెస్ట్ ఏఐ టూల్స్.. పీడీఎఫ్లోని ప్రశ్నలకు ఇట్టే సమాధానం
కళ్లతోనే మాయ చేస్తున్నగోల్డెన్ గర్ల్ని గుర్తు పట్టారా? వైరల్ వీడియో
పచ్చ కుట్రపై ఈసీ యాక్షన్
భర్తతో విడాకులు.. ట్రోల్స్ చేయడం దారుణమన్న సింగర్!
మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. ఇద్దరు భారతీయుల పాస్ పోర్టులు సీజ్
హైదరాబాద్: వర్షాలపై సీఎం రేవంత్రెడ్డి సమీక్ష
ఆమెతో బ్రేకప్కు కారణం అదే.. హీరామండి నటుడు!
TS TET Hall Ticket 2024: తెలంగాణ టెట్ హాల్టికెట్లు విడుదల..
Hyderabad Heavy Rains: హైదరాబాద్లో కుండపోత వాన.. భారీగా ట్రాఫిక్ జాం (ఫొటోలు)
నమ్రతా భారీ వర్కౌట్స్ చూస్తే షాక్, ఫ్యాన్స్ ఫిదా!
తప్పక చదవండి
- Ghost Marriage: ఘోస్ట్ మ్యారేజ్లు గురించి విన్నారా! ఏకంగా మ్యాట్రిమోనియల్ సైట్లో
- ఢిల్లీ లిక్కర్ కేసు: కవిత బెయిల్ విచారణ.. సీబీఐకి నోటీసులు
- కెప్టెన్ అవుతాననుకోలేదు.. కోహ్లి తర్వాత ఇలా..: రోహిత్ శర్మ
- ముంబై హోర్డింగ్ ఘటన.. కారులోనే నలిగిన దంపతుల ప్రాణాలు
- ‘ఫ్యాన్’దే ప్రభంజనం.. సీఎం జగన్ సరికొత్త రికార్డ్!
- రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
- ఐశ్వర్యారాయ్ టోట్ బ్యాగ్ ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!
- టీడీపీ గుండాల అరాచకం.. ఫ్యాన్కు ఓటేసిందని ట్రాక్టర్తో తొక్కించబోయారు
- కొత్త మార్కును దాటిన బంగారం! ఏకంగా ఎంత ఎగిసిందంటే..
- ఏపీలో పథకాలకు నిధుల విడుదల ప్రారంభం
Advertisement