-
నేనొక భారత ముస్లింని గర్వంగా చెబుతా.. నన్ను ఎవరు ఆపుతారు: షమీ
వన్డే వరల్డ్కప్-2023 సందర్భంగా మైదానంలో నమాజ్ చేశాడని టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీని కొంతమంది నెటిజన్లు ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయంపై స్పందించిన షమీ.. తనపై విమర్శల చేసిన వారికి గట్టి కౌంటరిచ్చాడు. తాను గర్వించదగిన భారత ముస్లింనని, నమాజ్ చేయాలనుకుంటే అడ్డుకునేవారు ఎవరని సీరియస్ అయ్యాడు. అసలేం ఏం జరిగిందంటే? వన్డే ప్రపంచకప్లో మహ్మద్ షమీ అద్బుతమైన ప్రదర్శన కనబరిచాడు. కేవలం 7 మ్యాచ్ల్లో 24 వికెట్లు పడగొట్టి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. కాగా ఈ మెగా టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్లతో చెలరేగాడు. ఈ క్రమంలో తన ఐదు వికెట్ల హాల్ను అందుకోగానే షమీ మెకాలిపై కూర్చోని రెండు చేతులతో నేలను తాకుతూ సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. అయితే షమీ సెలబ్రేషన్స్ను కొంతమంది అభిమానులు తప్పుబట్టారు. షమీ మైదానంలో నమాజ్ చేశాడని ఆరోపిస్తూ అతడిని ట్రోలు చేశారు. నన్ను ఆపేవారు ఎవరు? "నేను నమాజ్ చేయాలనుకుంటే నన్ను ఎవరు అడ్డుకుంటారు? నేను ప్రార్థన చేయాలనుకుంటే చేస్తా. ఇందులో ఉన్న సమస్య ఏంటి? నేను ఒక భారతీయ ముస్లింనని గర్వంగా చెబుతాను. నమాజ్ చేయడానికి ఎవరో అనుమతి తీసుకోవాలంటే.. నేను ఈ దేశంలో ఎందుకు ఉంటాను? ఇంతకు ముందు కూడా నేను చాలా సార్లు 5 వికెట్లు సాధించాను. అప్పుడు ఎప్పుడైన నేను నమాజ్ చేయడం మీరు చూశారా? ఇటువంటి పిచ్చి పనులు మానుకోండి. నేను ఇప్పుడు ఎక్కడ ప్రార్థన చేయాలో చెప్పండి. అక్కడికి వెళ్లి నమాజ్ చేస్తాను. శ్రీలంకతో మ్యాచ్లో వికెట్ల కోసం 200 శాతం ఎఫర్ట్ పెట్టి బౌలింగ్ చేశాను. దీంతో కాస్త అలసటకు గురై మోకాళ్లపై కూర్చున్నాని ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో షమీ పేర్కొన్నాడు. కాగా షమీ ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్కు సిద్దమవుతున్నాడు. -
భారత జట్టు శ్రీలంక పర్యటన.. ఎప్పుడంటే?
టీ20 ప్రపంచకప్-2024 ముగిసిన తర్వాత టీమిండియా శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది. వచ్చే ఏడాది జూలైలో వైట్ బాల్ సిరీస్ కోసం శ్రీలంకలో భారత జట్టు పర్యటించనుంది. తమ జాతీయ జట్టు వచ్చే ఏడాది ఫ్యూచర్ టూర్ పొగ్రామ్ను శ్రీలంక క్రికెట్ బుదవారం ప్రకటించింది. ఇందులో భాగంగానే భారత పర్యటను సంబంధించిన వివరాలను శ్రీలంక క్రికెట్ వెల్లడించింది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య శ్రీలంకతో మూడు టీ20లు, వన్డే సిరీస్లో భారత్ తలపడనుంది. ఇక వచ్చే ఏడాదిలో శ్రీలంక మొత్తం 52 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడనుంది. ఇందులో 10 టెస్టులు, 21 వన్డేలు, 21 టీ20లు ఉన్నాయి. అదే విధంగా టీ20 వరల్డ్కప్-2024లో కూడా శ్రీలంక ఆడనుంది. జనవరిలో స్వదేశంలో జింబాబ్వేతో సిరీస్తో శ్రీలంక క్రికెట్ జట్టు తమ కొత్త ఏడాదిని మొదలపెట్టనుంది. కాగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీ వెస్టిండీస్, అమెరికా వేదికలగా జరగనుంది. Sri Lanka Men’s 2024 Future Tours Program Announced! 📢 The Sri Lanka National Team will commence its 2024 international cricket calendar with a home series against Zimbabwe in January, which will consist of three ODIs and three T20i series. It would be followed by a series… pic.twitter.com/6BRRUCNhCs — Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) November 29, 2023 -
WC 2023: శ్రీలంక క్రీడా మంత్రి సంచలన నిర్ణయం.. క్రికెట్ బోర్డు రద్దు
వన్డే ప్రపంచకప్-2023 టోర్నీలో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసిన శ్రీలంకకు గట్టి షాక్ తగిలింది. ఆటగాళ్ల అత్యంత చెత్త ప్రదర్శన నేపథ్యంలో ఆ దేశ క్రీడా మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. శ్రీలంక క్రికెట్ బోర్డు సభ్యులందరిపై వేటు వేసింది. ఈ క్రమంలో బోర్డు తాత్కాలిక పాలనాధ్యక్షుడిగా మాజీ కెప్టెన్ అర్జున రణతుంగను నియమించింది. ఈ మేరకు శ్రీలంక క్రీడా మంత్రి రోషన్ రణసింఘే తన నిర్ణయాన్ని ప్రకటించారు. శ్రీలంక క్రికెట్ బోర్డు ఎగ్జిక్యూటివ్ కమిటీని రద్దు చేస్తూ నోటీసులు జారీ చేసిన ఆయన.. కఠిన చర్యలకు ఉపక్రమించారు. గతేడాది ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్ నుంచి ఇప్పటిదాకా బోర్డు అధికారులకు సంబంధించిన ఆడిట్ రిపోర్టుపై విచారణ చేపడతామని రోషన్ రణసింఘే ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా శ్రీలంక క్రీడా మంతిత్వ శాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక కమిటిలో మొత్తం ఏడుగురు సభ్యులు ఉండగా వీరిలో ముగ్గురు రిటైర్డ్ జడ్జీలు. ఇక వరల్డ్కప్-2023 టోర్నీలో భాగంగా వాంఖడేలో టీమిండియా చేతిలో శ్రీలంక చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. భారత బౌలర్ల ధాటికి తాళలేక లంక బ్యాటింగ్ ఆర్డర్ బెంబేలెత్తిపోయింది. కేవలం 55 పరుగులకే ఆలౌట్ అయి చెత్త రికార్డులు మూటగట్టుకుంది. దీంతో అభిమానులు, మాజీ క్రికెటర్ల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కార్యదర్శి మోహన డి సిల్వ తన పదవి నుంచి తప్పుకొన్నారు. మిగిలిన సభ్యులందరిపై వేటు వేస్తూ క్రీడా మంత్రి రోషన్ రణసింఘే సోమవారం నిర్ణయం తీసుకున్నారు. ఘోర ఓటమికి బాధ్యత వహిస్తూ క్రికెట్ బోర్డు సభ్యులు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కోరినప్పటికీ ఫలితం లేకపోవడంతో రోషన్ ఇలా తానే స్వయంగా రంగంలోకి దిగారు. కాగా 1996 వరల్డ్కప్ విజేత అయిన శ్రీలంక భారత్ వేదికగా తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు ఏడు మ్యాచ్లు ఆడి కేవలం రెండింట గెలిచింది. ఇప్పటికే సెమీస్ అవకాశాలు కోల్పోయి చతికిలపడింది. మిగిలిన రెండు మ్యాచ్లలో ఓడి.. ఒకవేళ పాయింట్ల పట్టికలో టాప్-7కు చేరకపోతే చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించే అవకాశం కూడా కోల్పోతుంది. -
WC 2023: టీమిండియా చేతిలో చావుదెబ్బ! బాధ్యులు మీరే.. బదులివ్వండి
ICC ODI WC 2023: వన్డే వరల్డ్కప్-2023 శ్రీలంకకు అస్సలు కలిసి రావడం లేదు. నేరుగా టోర్నీకి అర్హత సాధించని కారణంగా క్వాలిఫయర్స్ ఆడి ఐసీసీ ఈవెంట్లో అడుగుపెట్టిన ఈ మాజీ చాంపియన్కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. స్టార్లు దూరం గాయాల కారణంగా కెప్టెన్ దసున్ షనక సహా స్టార్ ఆల్రౌండర్ వనిందు హసరంగ, పేసర్లు లాహిరు కుమార, మతీశ పతిరణ జట్టుకు దూరమయ్యారు. ఇలాంటి తరుణంలో జట్టు పగ్గాలు చేపట్టిన కుశాల్ మెండిస్ జట్టును విజయవంతంగా ముందుకు నడపడంలో విఫలమవుతున్నాడు. టీమిండియా చేతిలో చావుదెబ్బ దీంతో ఇప్పటికే సెమీస్ రేసు నుంచి నిష్క్రమించిన శ్రీలంక(అనధికారికంగా).. వాంఖడేలో టీమిండియా చేతిలో ఘోర ఓటమిని చవిచూసింది. ముంబైలో గురువారం నాటి మ్యాచ్లో 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెండిస్ బృందం మరీ ఘోరంగా 55 పరుగులకే కుప్పకూలింది. View this post on Instagram A post shared by ICC (@icc) టీమిండియా పేసర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ధాటికి టాపార్డర్ కకావికలం కాగా.. మరో ఫాస్ట్బౌలర్ మహ్మద్ షమీ ఏకంగా ఐదు వికెట్లతో చెలరేగి మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. దీంతో లంక 302 పరుగుల భారీ తేడాతో చిత్తు చిత్తుగా ఓడింది. ‘సమిష్టి వైఫల్యం’ ఇదిలా ఉంటే.. ఆరంభంలో సౌతాఫ్రికాతో మ్యాచ్లో లంక బౌలర్లు ఏకంగా 428 పరుగులు సమర్పించుకున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో బౌలర్ల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడితే.. టీమిండియాతో మ్యాచ్లో బ్యాటర్లు విఫలమైన తీరు విమర్శలకు దారితీసింది. ఈ నేపథ్యంలో జట్టు ఆట తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న శ్రీలంక క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఘోర వైఫల్యాలకు గల కారణాలేమిటో వెల్లడించాలంటూ సెలక్టర్లు, కోచ్, ఆటగాళ్లకు నోటీసులు ఇచ్చింది. షాకింగ్ ఓటములు ఈ మేరకు.. ‘‘ఇప్పటి వరకు ఓవరాల్ ప్రదర్శన.. ఇటీవల విస్మయకరరీతిలో భారీ పరాజయాలను చూసిన తర్వాత మెగా టోర్నీకి జట్టు సన్నద్ధతపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నారన్న విషయం చర్చనీయాంశమైంది. నిబంధనలకు అనుగుణంగా ప్రొఫెషనల్ స్టాఫ్ విషయంలో బోర్డు ఏమాత్రం జోక్యం చేసుకోదు. వారి విధులు, బాధ్యతలకు ఆటంకం కలిగించదు. బాధ్యులు మీరే.. బదులివ్వండి కానీ.. మీ నుంచి మేము జవాబుదారీతనం, పారదర్శకత కోరుకుంటున్నాం. ఇలాంటి కఠిన పరిస్థితుల నుంచి ఎలా బయట పడాలన్న అంశంపై దృష్టి పెట్టండి. మన జట్టు ఎంపిక, సన్నద్ధత.. తుదిజట్టు కూర్పు విషయంలో ఎలాంటి ప్రణాళికలు రచించారో వివరించండి. జట్టుతో పాటు ప్రతి ఒక్క ఆటగాడి వ్యక్తిగత ప్రదర్శనను అంచనా వేసి.. వారి బలాలు, బలహీనతలు ఏమిటో తెలుసుకోండి. View this post on Instagram A post shared by ICC (@icc) దృష్టి సారించండి ఆటగాళ్ల గాయాలు, ఫిట్నెస్ గురించి ఎలాంటి సమస్యలు ఉన్నా ముందే మా దృష్టికి తీసుకురండి. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫలితాన్ని విశ్లేషించి భవిష్యత్తులో పొరపాట్లు దొర్లకుండా చూసుకోండి. కోచింగ్ టీమ్ ఈ విషయంమై లోతుగా అధ్యయనం చేయాలి’’ అంటూ శ్రీలంక క్రికెట్ బోర్డు తమ ప్రకటనలో పేర్కొంది. మాజీ చాంపియన్కు ఏమిటీ దుస్థితి? కాగా ముంబైలోని వాంఖడేలో 2011లో ఫైనల్లో టీమిండియాకు గట్టిపోటీనిచ్చిన లంక.. ఈసారి అదే వేదికపై 55 పరుగులకే ఆలౌట్ కావడం అభిమానులతో పాటు లంక మాజీ ఆటగాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారు. సెమీస్ మాట పక్కన పెడితే మరీ ఇంత అధ్వాన్న రీతిలో ఓడిపోవాలా? మాజీ చాంపియన్కు ఏమిటీ దుస్థితి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా 1996 ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి శ్రీలంక టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. అదే విధంగా 2007, 2011లో వరుసగా రెండుసార్లు ఫైనల్ చేరి సత్తా చాటింది. చదవండి: WC 2023: టీమిండియాకు భారీ షాక్! ఐసీసీ ప్రకటన విడుదల -
WC 2023: టీమిండియాకు భారీ షాక్! ఐసీసీ ప్రకటన విడుదల
ICC WC 2023- Hardik Pandya Ruled Out: వన్డే వరల్డ్కప్-2023లో సెమీస్ చేరిన సంతోషంలో ఉన్న టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ! స్టార్ ఆల్రౌండర్, వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టోర్నీ మొత్తానికి దూరమయ్యాడు. ప్రకటన విడుదల చేసిన ఐసీసీ చీలమండ గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో మెగా ఈవెంట్ నుంచి నిష్క్రమించాడు. ఈ నేపథ్యంలో పాండ్యా స్థానాన్ని బీసీసీఐ యువ పేసర్ ప్రసిద్ కృష్ణతో భర్తీ చేసినట్లు అంతర్జాతీయ క్రికెట్ మండలి వెల్లడించింది. ఈ మేరకు శనివారం ప్రకటన విడుదల చేసింది. బంగ్లాదేశ్తో మ్యాచ్లో గాయపడ్డ హార్దిక్ పాండ్యా పట్టుతప్పి పడిపోయి కాగా ప్రపంచకప్-2023 లీగ్ దశలో భాగంగా పుణెలో బంగ్లాదేశ్తో మ్యాచ్ సందర్భంగా హార్దిక్ పాండ్యా గాయపడిన విషయం తెలిసిందే. తన బౌలింగ్లో బంగ్లా బ్యాటర్ బాదిన షాట్ను అడ్డుకునే క్రమంలో పట్టుతప్పి కింద పడిన పాండ్యా కాలికి గాయమైంది. దీంతో అతడు ఓవర్ పూర్తి చేయకుండానే క్రీజును వీడగా.. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి(రైట్ఆర్మ్ పేసర్) పాండ్యా స్థానంలో బరిలోకి దిగాడు. అయితే, గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో పాండ్యా మళ్లీ బ్యాటింగ్కు కూడా రాలేదు. సెమీస్ వరకు ఒకే.. కానీ కీలక సమయంలో ఇలా ఈ నేపథ్యంలో స్కానింగ్కు వెళ్లిన పాండ్యా గాయం తీవ్రత ఎక్కువగా ఉండటంతో మరుసటి రెండు మ్యాచ్లకు అతడు దూరమైనట్లు బీసీసీఐ వెల్లడించింది. జాతీయ క్రికెట్ అకాడమీలో బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నట్లు తెలిపింది. కానీ.. పూర్తిగా కోలుకోని కారణంగా సెమీస్ చేరాలంటే కీలకమైన శ్రీలంకతో మ్యాచ్కూ దూరమయ్యాడు. అయితే, టీమిండియా అద్బుత ప్రదర్శనతో 302 పరుగుల భారీ విజయంతో సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. View this post on Instagram A post shared by ICC (@icc) #Prasidh Krishna- కర్ణాటక పేసర్కు లక్కీ ఛాన్స్ తదుపరి.. లీగ్ దశలో టీమిండియా రెండు నామమాత్రపు మ్యాచ్లు మాత్రమే ఆడాల్సి ఉంది. అయితే, సెమీస్లో మాత్రం హార్దిక్ పాండ్యా లాంటి కీలక ఆల్రౌండర్ సేవలు కోల్పోవడం తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో కీలక సమయంలో రోహిత్ సేనకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది. ఇదిలా ఉంటే.. హార్దిక్ పాండ్యా గాయం కారణంగా ఊహించని రీతిలో కర్ణాటక పేసర్ ప్రసిద్ కృష్ణను అదృష్టం వరించింది. సొంతగడ్డ మీద తొలిసారి వన్డే వరల్డ్కప్ టోర్నీలో భాగమయ్యే అవకాశం దక్కింది. చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ -
CWC 2023: వచ్చాడయ్యో ‘షమీ’.. ‘వారసత్వాన్నే’ నిలబెట్టంగా.. జట్టును ఫైనల్కు చేర్చంగా!
ఉత్తరప్రదేశ్లోని ఓ కుగ్రామం.. సహాస్పూర్కు చెందిన తౌసీఫ్ అలీ యువకుడిగా ఉన్న సమయంలో ఫాస్ట్బౌలర్గా గుర్తింపు పొందాడు.. మరి తనకున్న ఐదుగురు పిల్లల్లో ‘క్రికెట్’ వారసుడు అయ్యేదెవరు? ఒక్కగానొక్క కూతురు సబీనా అంజుమ్తో పాటు ముగ్గురు కుమారులకు అంతగా ఆసక్తి లేదు. మిగిలిన ఆ ఒక్కడిపైనే నాన్న నమ్మకం.. 15 ఏళ్ల వయసులో అతడిని మొరదాబాద్లోని క్రికెట్ కోచింగ్ సెంటర్లో చేర్పించాడు. ఇంటి నుంచి అక్కడికి దాదాపు 30 కిలో మీటర్ల దూరం.. అయినా వెనక్కి తగ్గలేదు.. కొడుకును సైకిల్ మీద కూర్చోబెట్టుకుని మరీ తనే స్వయంగా అక్కడి దాకా తీసుకువెళ్లేవాడు. రైతుగా వచ్చే సంపాదనలో అగ్రభాగం అతడి కోసమే ఖర్చు పెట్టేవాడు.. నాన్న నమ్మకం వమ్ము చేయొద్దనే సంకల్పంతో ఆ పిల్లాడు అహర్నిషలు శ్రమించాడు.. కఠిన శ్రమకోర్చాడు.. కొత్త బంతితో మ్యాజిక్ చేయడం మాత్రమే కాదు.. పాత బంతిని ఉపయోగించి రివర్స్ స్వింగ్ రాబట్టే నైపుణ్యాలు పెంపొందించుకున్నాడు. దేశవాళీ క్రికెట్లో సొంతరాష్ట్రానికి ఆడే అవకాశం కోసం ఎదురుచూశాడు కానీ.. సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోలేదు. దీంతో అతడి కోచ్ బుద్రుద్దీన్ సిద్ధిఖీ అతడిని కోల్కతాకు పంపించాడు. అక్కడ దేవవ్రత దాస్ యూపీ కుర్రాడి బౌలింగ్ స్కిల్క్స్కు ఫిదా అయ్యాడు. తన క్లబ్లో జాయిన్ చేసుకోవడమే గాకుండా.. తనతో పాటే తన ఇంట్లోనే ఉండేలా ఏర్పాట్లు చేశాడు. అంతేకాదు బెంగాల్ సెలక్టర్లతో మాట్లాడి అండర్-22 జట్టుకు ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించాడు. అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ మోహన్ బగన్ క్రికెట్ క్లబ్కు ఆడే అవకాశం దక్కించుకున్న ఆ యూపీ అబ్బాయి.. టీమిండియా మాజీ సారథి సౌరవ్ గంగూలీకి ఈడెన్ గార్డెన్స్లో నెట్స్లో బౌలింగ్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు. దాదా కూడా అతడి ఆటకు ఫిదా అయ్యాడు. టీమ్కు సెలక్ట్ చేసేలా సిఫారసు చేశాడు. అలా 2010- 11లో బెంగాల్ తరఫున అరంగేట్రం చేసిన సదరు పేసర్.. 2010లో టీ20 జట్టుకు ఆడిన తొలి మ్యాచ్లోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఫస్ట్క్లాస్ క్రికెట్లోనూ అడుగుపెట్టి ప్రతిభను చాటుకున్నాడు. 2012లో ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు. అలా అంచెలంచెలుగా ఎదిగి ఇండియా-ఏ జట్టుకు ఆడే అవకాశం దక్కించుకున్నాడు. అద్భుతమైన ఆటతీరుతో సర్ప్రైజ్ ప్యాకేజ్గా నిలిచి నాటి కోచ్ లాల్చంద్ రాజ్పుత్ను ఇంప్రెస్ చేశాడు. ఇక ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఫస్ట్క్లాస్ క్రికెట్, ఇండియా- ఏ జట్టు తరఫున సత్తా చాటుతూ.. టీమిండియా సెలక్టర్ల దృష్టిలో పడ్డాడు. 2013లో పాకిస్తాన్తో వన్డే సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. ఆ మ్యాచ్లో 9 ఓవర్లు బౌలింగ్ చేసి ఒక వికెట్ తీశాడు. ఆ తర్వాత మరింత మెరుగైన ప్రదర్శన కనబరచడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి మేటి జట్లతో మ్యాచ్లు.. ఆసియా కప్-2014 జట్టులోనూ చోటు.. ఇలా పరిమిత ఓవర్ల క్రికెట్లో తనను తానూ నిరూపించుకున్న ఈ రైటార్మ్ పేసర్.. అదే ఏడాది టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.. వెస్టిండీస్తో మ్యాచ్.. టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ ఫేర్వెల్ మ్యాచ్.. మనోడు అక్కడా హిట్టే.. రివర్స్ స్వింగ్తో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా తొమ్మిది వికెట్లు పడగొట్టి తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. వివాదాల ఊబిలో చిక్కుకుపోయి అన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకున్న సమంలో గాయాల బెడద.. తీవ్ర విమర్శలు.. వైవాహిక జీవితంలో ఆటుపోట్లు.. కోర్టు కేసులు.. ఫిక్సింగ్ ఆరోపణలు.. స్త్రీలోలుడు అనే ముద్ర.. కన్నబిడ్డను తనతో పాటే ఒకే ఇంట్లో ఉంచుకోలేని దుస్థితి.. విడిపోదామని నిర్ణయించుకున్న భార్య.. కోట్లలో భరణం ఇవ్వాలనే డిమాండ్లు.. సంచలన ఆరోపణలతో విరుచుకుపడుతూ ఏకంగా సుప్రీంకోర్టు దాకా తీసుకువచ్చిన వైనం.. వెంటనే అరెస్ట్ చేయాలంటూ పిటిషన్ల మీద పిటిషన్లు.. వెరసి అతడు అరెస్టు ఖాయం.. అతడి కెరీర్కు ఎండ్కార్డ్ పడ్డట్లే అనే అభిప్రాయాలు.. కానీ.. అదృష్టం కలిసి వచ్చింది. సర్వోన్నత న్యాయస్థానంలో ఊరట లభించింది. ఇలా ఓవైపు గాయాలు.. మరోవైపు వ్యక్తిగత జీవితంలో సమస్యలు వేధిస్తున్నా ఆటపై నుంచి తన దృష్టి మరల్చలేదు. ఫిట్నెస్ను కాపాడుకునేందుకు శాయశక్తులా కృషి చేశాడు. పంటపొలాల్లో పరుగులు పేసర్ల కాళ్లు ఎంత బలంగా ఉంటే అంత మంచిది. అందుకోసం అతడు ఏకంగా తన పొలంలోనే రన్నింగ్ ట్రాక్ ఏర్పాటు చేసుకున్నాడు. పొలాల వెంట పరుగులు తీస్తూ మరింత ఫిట్గా తయారయ్యేందుకు శ్రమించాడు. కట్చేస్తే.. జట్టులో పునరాగమనం... అటు ఐపీఎల్-2023లోనూ టాప్ వికెట్ టేకర్గా సత్తా.. 17 ఇన్నింగ్స్ ఆడి 28 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్కప్-2023 జట్టులో చోటు.. అయితే, పేస్ విభాగంలో మూడో ప్రాధాన్యంగానే అతడి పేరు.. జట్టు కూర్పు దృష్ట్యా తొలి నాలుగు మ్యాచ్లలో మొండిచేయే.. అప్పుడు రాకరాక వచ్చిందో ఛాన్స్.. పటిష్ట న్యూజిలాండ్తో మ్యాచ్.. వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుని ఏకంగా ఐదు వికెట్లు కూల్చాడు. వచ్చీ రాగానే ప్రపంచప్లో 5 వికెట్ల హాల్ నమోదు చేశాడు. అంతేనా.. మరొసటి మ్యాచ్లో ఇంగ్లండ్ మీద 4 వికెట్ల హాల్.. ఆపై.. తన కెరీర్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చారిత్రాత్మక వాంఖడేలో అత్యద్భుత ప్రదర్శన.. 5 ఓవర్ల బౌలింగ్లో 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి.. వన్డే వరల్డ్కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా సరికొత్త చరిత్ర.. అతడి పేరు మహ్మద్ షమీ.. 33 ఏళ్ల రైట్ఆర్మ్ ఫాస్ట్ మీడియం పేసర్.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చెప్పినట్లు.. షమీ నిజంగానే అతడికి వచ్చిన అవకాశాన్ని రెండుచేతులా ఒడిసిపట్టి అద్భుతాలు చేయగలడు!! వన్డే వరల్డ్కప్-2023 సెమీ ఫైనల్లో ఈ మాటను మరోసారి నిజం చేశాడు. న్యూజిలాండ్తో మ్యాచ్లో ఏకంగా ఏడు వికెట్లు కూల్చి.. జట్టును ఫైనల్కు చేర్చి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. అంతేకాదు వన్డే వరల్డ్కప్ సింగిల్ ఎడిషన్లో మూడుసార్లు ఐదు వికెట్ల హాల్ నమోదు చేసిన తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు షమీ. అదే విధంగా తాజా ఎడిషన్లో ఇప్పటి వరకు 23 కూల్చి వికెట్ల వీరుల జాబితాలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. -సుష్మారెడ్డి యాళ్ల View this post on Instagram A post shared by ICC (@icc) View this post on Instagram A post shared by ICC (@icc) -
భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారు.. పాక్ మాజీ సంచలన అరోపణలు
ఐసీసీ, బీసీసీఐలపై పాకిస్తాన్ మాజీ ఆటగాడు హసన్ రజా సంచలన ఆరోపణలు చేశాడు. ప్రస్తుత ప్రపంచకప్లో భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నారంటూ ఆరోపించారు.. ఇలా జరగడం వల్లే భారత పేసర్లు ఇతర బౌలర్లతో పోలిస్తే అధిక సీమ్ను, స్వింగ్ను రాబట్టగలుగుతున్నారని తీవ్రస్థాయి ఆరోపణలు చేశాడు. ఈ విషయమై సమగ్ర తనిఖీలు జరగడంతో పాటు విస్తృత స్థాయి చర్చ జరగాలని కోరాడు. భారత్-శ్రీలంక మధ్య గురువారం జరిగిన మ్యాచ్ అనంతరం పాక్ టీవీ ఛానల్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలపై భారత మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా దీటుగా స్పందించాడు. ‘హసన్ రజా మతి ఉండే మాట్లాడుతున్నాడా’ అంటూ స్ట్రాంగ్ కౌంటరిచ్చాడు. ‘అసలు అతను పాల్గొన్నది సీరియస్ క్రికెట్ షోనేనా’ అని ప్రశ్నించాడు. Is it a serious cricket show? If not, please mention ‘satire’ ‘comedy’ in English somewhere. I mean…it might be written in Urdu already but unfortunately, I can’t read/understand it. 🙏🏽 https://t.co/BXnmCpgbXy — Aakash Chopra (@cricketaakash) November 3, 2023 కాగా, హసన్ రజా చేసిన వ్యాఖ్యలను భారత క్రికెట్ అభిమానులు తేలిగ్గా తీసుకుంటున్నారు. కనీస క్రికెట్ పరిజ్ఞానం లేని వ్యక్తి కామెంట్లకు స్పందించడం వేస్ట్ అని అంటున్నారు. జాతీయ జట్టుకు ఆడిన వ్యక్తి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని వ్యాఖ్యానిస్తున్నారు. కొందరు అభిమానులు హసన్ రజాను క్రికెట్ అజ్ఞాని అని, భారతపై పాక్కు ఉన్న అక్కసు అతని మాటల్లో స్పష్టంగా కనబడుతుందని ఏకి పారేస్తున్నారు. 1996-2005 మధ్యలో పాక్ తరఫున ఏడు టెస్ట్లు, 16 వన్డేలు ఆడిన హసన్ రజా.. అతిపిన్న వయసులో (14 ఏళ్ల 233 రోజులు) అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన ఆటగాడిగా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇదిలా ఉంటే, శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్లో భారత పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం తెలిసిందే. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1) నిప్పుల వర్షం కురిపించి లంకేయులను కుప్పకూల్చారు. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు 55 పరుగులకే చాపచుట్టేసి 302 పరుగుల భారీ తేడాతో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. -
అయ్యర్ భారీ సిక్సర్! ఆమె రావడం మంచిదైంది.. కానీ! ప్రతిభను గుర్తించరా?
ICC WC 2023: వన్డే వరల్డ్కప్-2023 ఆరంభం నుంచి స్థాయికి తగ్గట్టు రాణించలేకపోయాడు టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. ప్రపంచకప్ తాజా ఎడిషన్లో ఆస్ట్రేలియాతో మ్యాచ్లో డకౌట్ అయిన ఈ ముంబై ఆటగాడు.. అఫ్గనిస్తాన్పై 25(నాటౌట్) పరుగులు చేయగలిగాడు. ఆ తర్వాత పాకిస్తాన్తో అజేయ అర్ధ శతకం(53)తో ఫామ్లోకి వచ్చినట్లు కనిపించాడు. కానీ బంగ్లాదేశ్తో మ్యాచ్లో మరోసారి విఫలమై(19) పాత కథ పునరావృతం చేశాడు. అనంతరం న్యూజిలాండ్తో మ్యాచ్లో 33 పరుగులు చేసిన శ్రేయస్ అయ్యర్.. ఇంగ్లండ్తో మ్యాచ్లో 4 పరుగులకే పెవిలియన్ చేరి మళ్లీ నిరాశ పరిచాడు. తప్పించాలంటూ డిమాండ్లు దీంతో నిలకడలేని ఫామ్తో సతమవుతున్న అయ్యర్పై వేటు వెయ్యాలంటూ విమర్శలు వెల్లువెత్తాయి. ఇలాంటి సమయంలో.. సొంతమైదానం వాంఖడేలో అద్భుతమైన ఇన్నింగ్స్తో సత్తా చాటాడు ఈ రైట్హ్యాండ్ బ్యాటర్. ఒక్క ఇన్నింగ్స్తో దిమ్మతిరిగేలా సమాధానం పూర్తి ఆత్మవిశ్వాసం కనబరుస్తూ 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. సెంచరీ దిశగా పయనిస్తున్నాననే జాగ్రత్త పడకుండా నిస్వార్థ ఇన్నింగ్స్తో స్కోరు బోర్డును పరుగులు తీయించాడు. శుబ్మన్ గిల్ (92), విరాట్ కోహ్లి (88)లు అవుటైన తర్వాత వేగవంతమైన ఆట తీరుతో టీమిండియా 357 పరుగుల భారీ లక్ష్యం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. భారీ సిక్సర్తో రికార్డు ఈ క్రమంలో విమర్శించిన వారే అయ్యర్ను ప్రశంసిస్తూ అద్భుత ఇన్నింగ్స్ అంటూ కొనియాడుతుండటం విశేషం. ఇదిలా ఉంటే.. లంకతో మ్యాచ్ సందర్భంగా ఈ వరల్డ్కప్ ఎడిషన్లో అతి భారీ సిక్సర్ను నమోదు చేశాడు. కసున్ రజిత బౌలింగ్లో 106 మీటర్ల సిక్స్ను బాది చరిత్ర సృష్టించాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. ఇక.. ఓవైపు అయ్యర్ షాట్ ఆడిన తీరుపై ప్రశంసలు కురుస్తుండగా.. మరోవైపు కొంతమంది నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. చహల్- ధనశ్రీలపైకి బంతి విషయమేమిటంటే.. వన్డే వరల్డ్కప్-2023లో చోటు దక్కించుకోలేకపోయిన టీమిండియా లెగ్ స్పిన్నర్ యజువేంద్ర చహల్.. తన భార్య ధనశ్రీ వర్మతో కలిసి గురువారం వాంఖడే మైదానానికి వచ్చాడు. అయితే, అయ్యర్ బాదిన భారీ సిక్సర్ ఈ దంపతులు కూర్చున్న స్టాండ్స్లో ల్యాండ్ అవడం విశేషం. శ్రుతిమించిన ట్రోల్స్ దీంతో.. ‘‘పాపం చహల్పై అంత కోపమెందుకు అయ్యర్.. ఏదేమైనా ధనశ్రీ రావడంతో అయ్యర్కు లక్ కలిసివచ్చినట్లుంది’’ అంటూ క్రేజీ కామెంట్లు చేస్తున్నారు. కాగా ధనశ్రీతో కలిసి అయ్యర్ డ్యాన్స్ చేసిన వీడియోలు, వీరిద్దరు కలిసి పార్టీలకు హాజరైన ఫొటోలు వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ధనశ్రీ తన ఇన్స్టా అకౌంట్లో చహల్ ఇంటి పేరును తీసేసినపుడు.. అయ్యర్ పేరుతో ఆమె పేరును జతచేసి దారుణంగా ట్రోల్ చేశారు. అంతటితో ఆగక చహల్తో ధనశ్రీ విడిపోబోతుందంటూ వదంతులు వ్యాప్తి చేయగా.. చహల్ స్వయంగా వీటిని ఖండించాడు. చదవండి: డేగ కళ్లు’! ఒకటి నిజమని తేలింది.. ఇంకోటి వేస్ట్.. ఇకపై వాళ్లే బాధ్యులు: రోహిత్ శర్మ View this post on Instagram A post shared by ICC (@icc) ఇదిగో మళ్లీ ఇప్పుడిలా ఈ సిక్సర్ కారణంగా వాళ్లిద్దరిని ట్రోల్ చేస్తూ మీమ్స్తో రెచ్చిపోతున్నారు. అయితే, అయ్యర్ ఫ్యాన్స్ మాత్రం వీటిపై తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రతిభను గుర్తించకుండా అనవసరపు విషయాల్లోకి లాగి అయ్యర్ ఆటను తక్కువ చేయడం సరికాదని హితవు పలుకుతున్నారు. -
CWC 2023: లంకతో మ్యాచ్.. బెస్ట్ ఫీల్డర్ మెడల్ విన్నర్ ఎవరంటే..?
ప్రస్తుత ప్రపంచకప్లో ఫీల్డ్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే భారత ఆటగాళ్లకు జట్టు ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ బెస్ట్ ఫీల్డర్ మెడల్ను బహుకరిస్తున్న విషయం తెలిసిందే. శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్కు గాను ఈ మెడల్ను శ్రేయస్ అయ్యర్ గెలుచుకున్నాడు. శ్రేయస్ ఈ అవార్డును గెలుచుకోవడం ఇది రెండోసారి. న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్కు గాను శ్రేయస్ తొలిసారి ఈ అవార్డును అందుకున్నాడు. తాజాగా శ్రీలంకతో మ్యాచ్లో ఫీల్డ్లో అత్యుత్తమ ప్రదర్శనతో పాటు రెండు క్యాచ్లు అందుకున్నందుకుగాను శ్రేయస్ను ఈ అవార్డు వరించింది. విజేతను అనౌన్స్ క్రికెట్ గాడ్.. ప్రతి మ్యాచ్ అనంతరం వినూత్న రీతిలో మెడల్ విన్నర్ను అనౌన్స్ చేయించే దిలీప్.. ఈసారి ఎవరూ ఊహించని విధంగా ఓ స్పెషల్ పర్సన్తో అవార్డును అనౌన్స్ చేయించాడు. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ వర్చువల్గా శ్రేయస్ను విజేతగా ప్రకటించాడు. విజేతను ప్రకటించడంతో పాటు టీమిండియాను అభినందించి, బెస్ట్ విషెస్ చెప్పాడు. ఈ సందర్భంగా సచిన్ టీమిండియాకు తన అమూల్యమైన సందేశాన్ని కూడా ఇచ్చాడు. దీనికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్మీడియాలో పోస్ట్ చేసింది. The Medal Ceremony 🏅 in the dressing room just attained "LEGENDARY" status 🙌🏻#TeamIndia was in for a surprise when someone 𝗜𝗡𝗦𝗣𝗜𝗥𝗔𝗧𝗜𝗢𝗡𝗔𝗟 announced the best fielder award 🫡🔝#CWC23 | #MenInBlue | #INDvSL WATCH 🎥🔽 - By @28anand — BCCI (@BCCI) November 3, 2023 ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్గా నిలిచాడు. -
సచిన్ విగ్రహంపై అభిమానుల అసంతృప్తి.. స్టీవ్ స్మిత్లా ఉందంటూ కామెంట్స్
ముంబైలోని వాంఖడే స్టేడియంలో కొత్తగా ఏర్పాటైన సచిన్ టెండూల్కర్ విగ్రహంపై భారత క్రికెట్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సచిన్ విగ్రహం ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్ స్మిత్ను పోలి ఉండటంతో సచిన్ అభిమానులు పెదవి విరుస్తున్నారు. సచిన్ విగ్రహాన్ని సరిగ్గా రూపొందింలేదని విగ్రహ రూపకర్తపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యావత్ భారత దేశంతో పాటు ప్రపంచ దేశాలన్నీ కీర్తించే సచిన్ విగ్రహాన్ని తయారు చేసేప్పుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని తాయారు చేసి ఉండాల్సిందని విగ్రహ రూపకర్తను దూషిస్తున్నారు. సచిన్ అంటే గిట్టని వారు, క్రికెట్ పరిజ్ఞానం లేని వారు స్టీవ్ స్మిత్ విగ్రహం భారత్లో ఉందేందంటూ వ్యంగ్యమైన కామెంట్స్ చేస్తున్నారు. వాంఖడేలో నిన్న భారత్-శ్రీలంక మధ్య మ్యాచ్ జరిగినప్పటికీ నుంచి సచిన్ విగ్రహం పెద్ద చర్చనీయాంశమైంది. కాగా, నవంబర్ 1న ప్రతిష్టాత్మక వాంఖడే మైదానంలో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన విషయం తెలిసిందే. వాంఖడేలో సచిన్ స్టాండ్ పక్కనే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సచిన్ ఆఫ్సైడ్ షాట్ ఆడే పోజ్లో ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. అహ్మదాబాద్కు చెందిన ప్రమోద్ కాంబ్లే ఈ విగ్రహాన్ని రూపొందించారు. సచిన్తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై షా విగ్రహావిష్కరణ చేశారు. కాగా, సచిన్ తన సొంత మైదానమైన వాంఖడేలో తన ఆఖరి అంతర్జాతీయ మ్యాచ్ (నవంబర్ 16, 2013) ఆడిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్గా నిలిచాడు. -
IND VS SL: వైరలవుతున్న షమీ సెలబ్రేషన్స్.. హర్భజన్ను ఉద్దేశించి కాదు..!
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న (నవంబర్ 2) జరిగిన మ్యాచ్లో మొహమ్మద్ షమీ (5-1-18-5) అదిరిపోయే ఐదు వికెట్ల ప్రదర్శనతో టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఐదు వికెట్ల ప్రదర్శనతో పలు రికార్డులు కొల్లగొట్టిన షమీ.. ఈ ఘనత సాధించిన అనంతరం వినూత్న రీతిలో సంబురాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో షమీ తన ఐదో వికెట్ సాధించగానే బంతి తలపై రుద్దుకుంటూ డ్రెస్సింగ్ రూమ్వైపు సైగలు చేశాడు. తన ప్రదర్శన ఎవరికో అంకితం ఇస్తున్నట్లుగా షమీ సైగలు ఉన్నాయి. "Look at this Harbhajan Singh" Lord Shami the record breaker 🔥#ICCMensCricketWorldCup2023 #INDvSL #Shami #MohammedShami #IndianCricketTeam #HarbhajanSingh #ICCWorldCup2023 #viratkholi #ShubmanGill #ShreyasIyer #Siraj #MohammedSiraj pic.twitter.com/M3VtXgU4Nt — Meet Makwana (@MeetMakzz) November 2, 2023 ఈ ప్రదర్శనతో షమీ హర్భజన్ సింగ్ రికార్డును (వన్డేల్లో భారత్ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత) బ్రేక్ చేయడంతో భజ్జీని ఉద్దేశించే ఈ సైగలు చేశాడని అంతా అనుకున్నారు. హిందీ వ్యాఖ్యాతలు సైతం ఇదే అన్నారు. అయితే మ్యాచ్ అనంతరం షమీ తాను చేసుకున్న సెలబ్రేషన్స్పై వివరణ ఇచ్చాడు. తాను సైగలు చేసింది భజ్జీని ఉద్దేశించి కాదని తేల్చి చెప్పాడు. తన కెరీర్ ఎత్తుపల్లాల్లో అండగా నిలిచి, తాను స్కిల్స్ డెవలప్ చేసుకోవడంలో సాయపడిన టీమిండియా బౌలింగ్ కోచ్ పరస్ మాంబ్రేను ఉద్దేశించి సదరు సంబురాలు చేసుకున్నానని వివరణ ఇచ్చాడు. తన ఐదు వికెట్ల ప్రదర్శనను మాంబ్రేకు అంకితం ఇస్తున్నాని చెప్పడానికి అలా సైగలు చేశానని తెలిపాడు. మాంబ్రేకు తలపై జట్టు ఉండదు కాబట్టి, అలా సైగలు చేశానని చెప్పుకొచ్చాడు. ఇదే విషయాన్ని మ్యాచ్ అనంతరం శుభ్మన్ గిల్ కూడా చెప్పాడు. కాగా, లంకపై ఐదు వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన షమీ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇందులో వరల్డ్కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు (14 మ్యాచ్ల్లో 45) ప్రధానమైంది కాగా.. వన్డేల్లో భారత్ తరఫున అత్యధికసార్లు (4) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్కప్లో అత్యధికసార్లు (3) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్కప్లో అత్యధికసార్లు (7) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత వంటి పలు ఇతర రికార్డులు కూడా ఉన్నాయి. ఇదిలా ఉంటే, వాంఖడే వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్గా నిలిచాడు. -
WC 2023: సంతోషంగా ఉంది.. మా విజయాలకు ప్రధాన కారణం అదే: షమీ
వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్లో టీమిండియా పేసర్ మహ్మద్ షమీ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. వన్డే వరల్డ్కప్-2023లో ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే వేదికగా.. ఆకాశమే హద్దుగా చెలరేగిన ఈ రైట్ఆర్మ్ ఫాస్ట్బౌలర్ ఐదు వికెట్లతో మెరిశాడు. శ్రీలంక టాపార్డర్ను జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కుదేలు చేస్తే.. మిడిలార్డర్ బ్యాటర్లు ఏ దశలోనూ కోలుకోకుండా వరుసగా వికెట్లు పడగొట్టాడు షమీ. ఈ మ్యాచ్లో మొత్తంగా 5 ఓవర్లు బౌలింగ్ చేసిన ఈ వెటరన్ పేసర్ 18 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు కూల్చడం విశేషం. View this post on Instagram A post shared by ICC (@icc) తద్వారా తనకు వచ్చిన అవకాశాన్ని మరోసారి సద్వినియోగం చేసుకున్న షమీ.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘‘మా(పేసర్లు) ప్రదర్శన ఈరోజు అత్యద్భుతంగా ఉంది. పరస్పర సహకారంతో.. ఒకరి ఆటను మరొకరం ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాం. అందుకే మా బౌలింగ్ విభాగం ఇలాంటి ఫలితాలు రాబట్టగలుగుతోంది. నేను ఎల్లప్పుడూ సరైన లెంగ్త్తో రిథమ్ మిస్ కాకుండా బంతిని విసిరేందుకు ప్రయత్నిస్తా. వరల్డ్కప్ టోర్నీలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలవడం సంతోషంగా ఉంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో బంతిని ఏ ఏరియాలో విసురుతున్నామన్నదే కీలకాంశంగా ఉంటుంది. అయితే, కొత్త బంతితో బరిలోకి దిగినపుడు పిచ్ నుంచి మనకు సహకారం ఉంటేనే ఇలాంటివి సాధ్యమవుతాయి’’ అని షమీ తన ఆట తీరును విశ్లేషించాడు. ఇక ముంబైలో మ్యాచ్ ఆడటం గురించి ప్రస్తావిస్తూ.. ‘‘ఈరోజు ఇక్కడి ప్రేక్షకులు మాకు పూర్తి మద్దతుగా నిలిచారు. అభిమానులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. విదేశాల్లోనూ మాకు ఫ్యాన్స్ ఎల్లప్పుడూ మద్దతుగానే ఉంటారు’’ అని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు. అదే విధంగా.. డ్రెస్సింగ్రూం వాతావరణం అద్భుతంగా ఉందనే విషయాన్ని నేను మరోసారి చెప్పాల్సిన అవసరం లేదు’’ అంటూ మహ్మద్ షమీ సహచర ఆటగాళ్ల నుంచి తనకు సహకారం ఉందని పేర్కొన్నాడు. కాగా పేస్ త్రయం బుమ్రా, సిరాజ్, షమీ సంచలన ప్రదర్శనతో శ్రీలంకను టీమిండియా 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన విషయం తెలిసిందే. తద్వారా వరుసగా ఏడో విజయం అందుకుని.. ఈ వరల్డ్కప్ ఎడిషన్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక ప్రపంచకప్ టోర్నీ లో భారత్ సెమీఫైనల్ దశకు అర్హత సాధించడం ఇది ఎనిమిదోసారి. గతంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు కూడా ఎనిమిదిసార్లు చొప్పున సెమీఫైనల్కు చేరుకున్నాయి. View this post on Instagram A post shared by ICC (@icc) -
CWC 2023: శ్రీలంకపై 5 వికెట్ల ప్రదర్శన.. షమీ ఖాతాలో పలు రికార్డులు
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగిన మొహమ్మద్ షమీ (5-1-18-5) పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఇందులో వరల్డ్కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు (14 మ్యాచ్ల్లో 45) ప్రధానమైంది కాగా.. వన్డేల్లో భారత్ తరఫున అత్యధికసార్లు (4) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్కప్లో అత్యధికసార్లు (3) ఐదు వికెట్ల ఘనత, వరల్డ్కప్లో అత్యధికసార్లు (7) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ఘనత వంటి పలు ఇతర రికార్డులు కూడా ఉన్నాయి. వరల్డ్కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్ల రికార్డు.. షమీ నిన్నటి మ్యాచ్లో శ్రీలంకపై 5 వికెట్లు సాధించడం ద్వారా వరల్డ్కప్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు (45) సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో అతను.. జహీర్ ఖాన్ (23 మ్యాచ్ల్లో 44 వికెట్లు), జవగళ్ శ్రీనాథ్ (34 మ్యాచ్ల్లో 44 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. షమీ ఈ ఘనతను కేవలం 14 మ్యాచ్ల్లోనే సాధించడం విశేషం. వన్డేల్లో భారత్ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత.. శ్రీలంకపై ఐదు వికెట్ల ప్రదర్శనతో షమీ వన్డేల్లో భారత్ తరఫున అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. వన్డేల్లో షమీ భారత్ తరఫున నాలుగోసారి ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేయగా.. గతంలో భారత బౌలర్లు జవగల్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్ మూడు సార్లు ఈ ఘనత సాధించారు. వరల్డ్కప్లో అత్యధికసార్లు ఐదు వికెట్ల ఘనత.. షమీ నిన్నటి మ్యాచ్లో శ్రీలంకపై 5 వికెట్లతో చెలరేగడంతో వరల్డ్కప్లో అత్యధికసార్లు (3) ఐదు వికెట్ల ఘనత సాధించిన బౌలర్గా స్టార్క్తో పాటు రికార్డు షేర్ చేసుకున్నాడు. వరల్డ్కప్లో అత్యధికసార్లు నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు.. నిన్నటి మ్యాచ్లో శ్రీలంకపై 5 వికెట్లు సాధించడంతో వరల్డ్కప్లో అత్యధికసార్లు (7) నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు సాధించిన బౌలర్గా షమీ రికార్డు నెలకొల్పాడు. ప్రపంచకప్ ఏ బౌలర్ ఇన్నిసార్లు నాలుగు అంతకంటే ఎక్కవ వికెట్లు పడగొట్టలేదు. ప్రస్తుత ఎడిషన్లోనే నాలుగు అంతకంటే ఎక్కువ వికెట్లు పడగొట్టడం షమీకి ఇది మూడోసారి. ప్రస్తుత వరల్డ్కప్లో కేవలం 3 మ్యాచ్లు ఆడిన షమీ రికార్డు స్థాయి సగటుతో (6.71) 14 వికెట్లు పడగొట్టాడు. కాగా, శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్గా నిలిచాడు. -
CWC 2023 : శ్రీలంకపై 302 పరుగులతో టీమిండియా ఘనవిజయం (ఫొటోలు)
-
ప్రపంచకప్లో టీమిండియాకు రెండోసారి ఇలా..!
2023 వన్డే ప్రపంచకప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతుంది. శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన భారత్.. ప్రస్తుత ఎడిషన్లో వరుసగా ఏడో విజయాన్ని నమోదు చేసింది. తద్వారా సెమీస్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. ఈ క్రమంలో భారత్ పలు రికార్డులను నమోదు చేసింది. ఇందులో ఒకే ప్రపంచకప్లో వరుసగా ఏడు మ్యాచ్ల్లో రెండుసార్లు గెలుపొందిన రికార్డు ఒకటి. ప్రస్తుత వరల్డ్కప్లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఇంగ్లండ్, శ్రీలంకపై వరుసగా విజయాలు సాధించిన భారత్.. 2003 ప్రపంచకప్లో వరుసగా ఎనిమిది మ్యాచ్ల్లో నెగ్గింది. ఓవరాల్గా చూస్తే ఒకే వరల్డ్కప్లో అత్యధిక వరస విజయాల రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉంది. 2003 ఎడిషన్లో ఆసీస్ వరుసగా 13 మ్యాచ్ల్లో నెగ్గింది. అనంతరం 2007 ప్రపంచకప్లోనూ ఆసీస్ వరుసగా 12 మ్యాచ్ల్లో గెలిచింది. ఈ రెండు ప్రపంచకప్లలో ఆస్ట్రేలియా అజేయ జట్టుగా నిలిచింది. వరల్డ్కప్లో ఓవరాల్గా అత్యధిక వరుస విజయాల రికార్డు కూడా ఆసీస్ పేరిటే ఉంది. ఈ జట్టు వరుసగా 36 మ్యాచ్ల్లో (1999లో 7, 2003లో 13, 2007లో 12, 2011లో 4) గెలిచింది. ఆసీస్ 36 వరుస విజయాల జైత్రయాత్రకు 2011 వరల్డ్కప్లో బ్రేక్ పడింది. ఆ ఎడిషన్లో పాక్తో జరిగిన గ్రూప్ మ్యాచ్లో ఆసీస్ 36 వరుస విజయాల తర్వాత ఓడింది. ఇదిలా ఉంటే, శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్గా నిలిచాడు. -
ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డు మూటగట్టుకున్న శ్రీలంక
శ్రీలంక క్రికెట్ జట్టు వన్డే వరల్డ్కప్ చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకుంది. 2023 ప్రపంచకప్లో భాగంగా టీమిండియాతో నిన్న (నవంబర్ 2) జరిగిన మ్యాచ్లో 55 పరుగులకే కుప్పకూలిన లంకేయులు.. వరల్డ్కప్లో అత్యల్ప స్కోర్ నమోదు చేసిన ఐసీసీ ఫుల్ టైమ్ జట్టుగా (టెస్ట్ హోదా కలిగిన జట్టు) అపఖ్యాతిని మూటగట్టుకున్నారు. ఈ చెత్త రికార్డు గతంలో బంగ్లాదేశ్ పేరిట ఉండేది. 2011 వరల్డ్కప్లో వెస్టిండీస్తో జరిగిన మ్యాచ్లో బంగ్లాదేశ్ 58 పరుగులకే ఆలౌటైంది. దీనికి ముందు 1992 వరల్డ్కప్లో ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ 74 పరుగులకే చాపచుట్టేసింది. అయితే ఆ వరల్డ్కప్లో పాక్ ఛాంపియన్గా నిలవడం విశేషం. ఇదిలా ఉంటే, ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా శ్రీలంకతో నిన్న జరిగిన మ్యాచ్లో టీమిండియా 302 పరుగుల భారీ తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ గెలుపుతో భారత్ అధికారికంగా సెమీస్కు చేరింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. గిల్ (92), కోహ్లి (88), శ్రేయస్ (82) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. లంక బౌలర్లలో దిల్షన్ మధుష్క 5 వికెట్లతో సత్తా చాటాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన లంకేయులను భారత పేసర్లు దారుణంగా దెబ్బకొట్టారు. మొహమ్మద్ షమీ (5-1-18-5), మొహమ్మద్ సిరాజ్ (7-2-16-3), జస్ప్రీత్ బుమ్రా (5-1-8-1), రవీంద్ర జడేజా (0.4-0-4-1) ధాటికి శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకే ఆలౌటైంది. లంక ఇన్నింగ్స్లో ఏకంగా ఐదుగురు డకౌట్లు కాగా..14 పరుగులు చేసిన కసున్ రజిత టాప్ స్కోరర్గా నిలిచాడు. -
WC 2023: సూపర్ సెవెన్తో సెమీస్కి భారత్
మన టాప్ స్టార్లు పరుగు పెడితే... పేసర్లు పడగొడితే... ఏ ప్రత్యర్థి అయినా ఏం చేస్తుంది... చిత్తుగా ఓడటం తప్ప! మాజీ విశ్వవిజేత శ్రీలంకది కూడా అదే పరిస్థితి. మొదట... శుబ్మన్ గిల్, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్ల ధాటికి సింహళ బౌలింగ్ కళ తప్పింది. తర్వాత కొండంత లక్ష్యం ఛేదించబోతే మన పేస్ దళం నిప్పులు చెరిగింది. అంతే నాలుగో ఓవర్ అయినా ముగియకముందే శ్రీలంక 3/4 స్కోరుతో పరాభవానికి వికెట్ల గేట్లెత్తి కేవలం 55 పరుగులకే ఆలౌటై చిత్తుగా ఓడిపోయింది. ముంబై: ఈ వన్డే వరల్డ్కప్లో 10 జట్లు తలపడుతున్నాయి. నెదర్లాండ్స్, బంగ్లాదేశ్లాంటి చిన్న జట్లు... న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలాంటి మేటి టీమ్లు... ఐదుసార్లు జగజ్జేత ఆ్రస్టేలియా, డిఫెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్ బరిలో ఉన్నా... ఒకే ఒక్క జట్టు, నంబర్వన్ భారత్ అప్రతిహత జైత్రయాత్ర ముందు ఏ ఒక్కటీ నిలువలేకపోతున్నాయి. తాజాగా భారత్ బల ప్రదర్శనకు 1996 ప్రపంచ చాంపియన్ శ్రీలంక కుదేలైంది. టీమిండియా ఆల్రౌండ్ ఆటతీరుకు లంక అతలాకుతలమైంది. బ్యాటింగ్ ధాటికి తట్టుకోలేక, బౌలింగ్ దాడిని ఎదుర్కోలేక శ్రీలంక 302 పరుగుల భారీ తేడాతో భారత్ చేతిలో ఓడింది. వరుసగా ఏడో విజయంతో రోహిత్ శర్మ బృందం 14 పాయింట్లతో ఈ మెగా ఈవెంట్లో సెమీఫైనల్ బెర్త్ను అధికారికంగా ఖరారు చేసుకున్న తొలి జట్టుగా నిలిచింది. భారత్ తమ తదుపరి మ్యాచ్ను ఈనెల 5న కోల్కతాలో దక్షిణాఫ్రికా జట్టుతో ఆడుతుంది. అంతకుముందు శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ టాస్ నెగ్గి ఫీల్డింగ్ ఎంచుకోగా... తొలుత బ్యాటింగ్కు దిగిన రోహిత్ బృందం 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీస్కోరు చేసింది. గిల్ (92 బంతుల్లో 92; 11 ఫోర్లు, 2 సిక్స్లు), కోహ్లి (94 బంతుల్లో 88; 11 ఫోర్లు), అయ్యర్ (56 బంతుల్లో 82; 3 ఫోర్లు, 6 సిక్సర్లు) చెలరేగారు. మదుషంకకు 5 వికెట్లు దక్కాయి. తర్వాత శ్రీలంక కనీసం టి20 ఫార్మాట్కు తగ్గ ఓవర్లయినా ఆడలేకపోయింది. 19.4 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలి ప్రపంచకప్ చరిత్రలో తమ అత్యల్ప స్కోరును నమోదు చేసింది. పదో స్థానంలో దిగిన కసున్ రజిత (14) టాప్స్కోరర్ అంటే భారత బౌలింగ్ ప్రత్యర్థి బ్యాటర్లను ఎంతగా బయపెట్టిందో అర్థం చేసుకోవచ్చు. బుమ్రా ఇన్నింగ్స్ తొలి బంతికే శ్రీలంక పతనానికి నాంది పలికితే... మరుసటి ఓవర్లలో సిరాజ్ (3/16) చావుదెబ్బ తీశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షమీ (5/18) బంతినందుకున్నాక శ్రీలంక ఆలౌట్ కావడానికి ఎంతోసేపు పట్టలేదు. శతకం లేకపోయినా చితగ్గొట్టారు... మ్యాచ్ మొదలవకముందు టాస్ నెగ్గిన ఆనందం, భారత ఇన్నింగ్స్ ఆరంభించగానే కెప్టెన్ రోహిత్ శర్మ (2 బంతుల్లో 4; 1 ఫోర్) అవుటైన సంబరం ఈ పోరులో లంకకు లభించిన అల్ప సంతోషాలు. తదనంతరం ఓపెనర్ గిల్ దూకుడు టాపార్డర్ బ్యాటర్ కోహ్లి క్లాసిక్ ఇన్నింగ్స్ వాంఖెడేలో క్రికెట్ ప్రియుల్ని ఆనంద పరవశం చేశాయి. ఇద్దరే 29.4 ఓవర్లు బ్యాటింగ్ చేశారు. లంక బౌలర్ల పని పట్టి స్కోరు బోర్డును పరుగు పెట్టించారు. దీంతో 16వ ఓవర్లోనే భారత్ 100కు చేరింది. ముందుగా కోహ్లి (50 బంతుల్లో), కాసేపటికే గిల్ (55 బంతుల్లో) అర్ధసెంచరీలు పూర్తిచేసుకున్నారు. ఆ తర్వాత కూడా బ్యాటింగ్ ధాటి కొనసాగడం, లంక బౌలింగ్ తేలిపోవడంతో సెంచరీల దిశగా సాగారు. కానీ సఫలం కాలేకపోయారు. రెండో వికెట్కు 189 పరుగులు జోడించాక గిల్, కోహ్లి మూడు పరుగుల వ్యవధిలో పెవిలియన్ చేరారు. దీంతో వన్డేల్లో అత్యధిక సెంచరీల చేసిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ (49) పేరిట ఉన్న రికార్డును కోహ్లి సమం చేయలేకపోయాడు. అయ్యర్ సూపర్ నాలుగో స్థానంలో క్రీజులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ వాళ్లిద్దరి ఇన్నింగ్స్లను తలపించేలా బ్యాటింగ్ చేశాడు. అది కూడా దూకుడు జతచేసి! భారీ సిక్సర్లతో అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. వేగంగా 36 బంతుల్లో అర్ధసెంచరీ సాధించాడు. రాహుల్ (21; 2 ఫోర్లు), సూర్యకుమార్ (12) చేసింది తక్కువే అయినా అయ్యర్ మెరుపులతో 45వ ఓవర్లోనే భారత్ 300 మార్కు దాటింది. శ్రేయస్ చితగ్గొట్టాడు... కానీ గిల్, కోహ్లిలలాగే శతకం మాత్రం కొట్టలేకపోయాడు. జడేజా (24 బంతుల్లో 35; 1 ఫోర్, 1 సిక్స్) మెరుగ్గా ఆడాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (బి) మదుషంక 4; గిల్ (సి) మెండిస్ (బి) మదుషంక 92; కోహ్లి (సి) నిసాంక (బి) మదుషంక 88; అయ్యర్ (సి) తీక్షణ (బి) మదుషంక 82; రాహుల్ (సి) హేమంత (బి) చమీర 21; సూర్యకుమార్ యాదవ్ (సి) మెండిస్ (బి) మదుషంక 12; జడేజా (రనౌట్) 35; షమీ (రనౌట్) 2; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 20; మొత్తం (50 ఓవర్లలో 8 వికెట్లకు) 357. వికెట్ల పతనం: 1–4, 2–193, 3–196, 4–256, 5–276, 6–333, 7–355, 8–357. బౌలింగ్: మదుషంక 10–0–80–5, చమీర 10–2–71–1, కసున్ రజిత 9–0–65–0, ఎంజెలో మాథ్యూస్ 3–0–11–0, తీక్షణ 10–0– 67–0, హేమంత 8–0–52–0. శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; కరుణరత్నే (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 0; కుశాల్ మెండిస్ (బి) సిరాజ్ 1; సమరవిక్రమ (సి) అయ్యర్ (బి) సిరాజ్ 0; అసలంక (సి) జడేజా (బి) షమీ 1; మాథ్యూస్ (బి) షమీ 0; హేమంత (సి) రాహుల్ (బి) షమీ 0; చమీర (సి) రాహుల్ (బి) షమీ 0; తీక్షణ (నాటౌట్) 12; రజిత (సి) గిల్ (బి) షమీ 14; మదుషంక (సి) అయ్యర్ (బి) జడేజా 5; ఎక్స్ట్రాలు 10; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్) 55. వికెట్ల పతనం: 1–0, 2–2, 3–2, 4–3, 5–14, 6–14, 7–22, 8–29, 9–49, 10–55. బౌలింగ్: బుమ్రా 5–1–8–1, సిరాజ్ 7–2–16–3, షమీ 5–1–18–5, కుల్దీప్ యాదవ్ 2–0–3–0, జడేజా 0.4–0–4–1. ప్రపంచకప్లో నేడు అఫ్గానిస్తాన్ X నెదర్లాండ్స్ వేదిక: లక్నో మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం View this post on Instagram A post shared by ICC (@icc) -
సెమీఫైనల్కు చేరిన టీమిండియా.. ఆసీస్, న్యూజిలాండ్ రికార్డు సమం
వవన్డే ప్రపంచప్-2023లో టీమిండియా జైత్ర యాత్ర కొనసాగుతోంది. ఈ టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో 302 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఈ మెగా ఈవెంట్ సెమీఫైనల్లో రోహిత్ సేన అడగుపెట్టింది. దాంతో ఈ ఏడాది వరల్డ్కప్లో సెమీస్ చేరిన తొలి జట్టుగా టీమిండియా నిలిచింది. ఆస్ట్రేలియా, కివీస్తో సంయుక్తంగా.. ఇక వన్డే వరల్డ్కప్ సెమీఫైనల్కు టీమిండియా క్వాలిఫై కావడం ఎనిమిదో సారి. తద్వారా వరల్డ్కప్ సెమీఫైనల్స్కు అత్యధిక సార్లు అర్హత సాధించిన జట్టుగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో సంయుక్తంగా భారత్ నిలిచింది. ఆసీస్, కివీస్ కూడా ఇప్పటి వరకు 8 సార్లు వరల్డ్కప్ టోర్నీల్లో సెమీస్లో అడుగుపెట్టాయి. రెండు సార్లు వరల్డ్ ఛాంపియన్స్గా.. 8 సార్లు ప్రపంచకప్ సెమీఫైనల్స్లో అడుగుపెట్టిన భారత్.. అందులో రెండు సార్లు భారత జట్టు వరల్డ్ ఛాంపియన్స్గా నిలిచింది. 1983, 2011 వన్డే ప్రపంచకప్ టైటిల్లను భారత్ సొంతం చేసుకుంది. 2003 వరల్డ్కప్ ఫైనల్కు భారత్ చేరినప్పటికీ.. ఆస్ట్రేలియా చేతిలో ఆఖరి మెట్టుపై బోల్తాపడింది. 2003 వరల్డ్కప్ రన్నరప్గా గంగూలీ సారథ్యంలోని టీమిండియా నిలిచింది. కాగా ముచ్చటగా మూడో సారి వరల్డ్కప్ టైటిల్ను భారత్ ముద్దాడాలని అభిమానులు ఆశిస్తున్నారు. చదవండి: Rohit Sharma: అధికారికంగా అర్హత సాధించాం.. అతడు అద్భుతం.. వాళ్ల వల్లే ఇలా.. మా జైత్రయాత్రకు కారణం అదే! -
చాలా బాధగా ఉంది.. అదే మా కొంపముంచింది! వారు మాత్రం: శ్రీలంక కెప్టెన్
WC 2023- Ind Vs SL- Kushal Mendis Comments: వన్డే ప్రపంచకప్-2023లో శ్రీలంక ఘోర ఓటమి చవిచూసింది. వాంఖడే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో 302 పరుగుల తేడాతో శ్రీలంక ఘోర పరాజయం పాలైంది. 358 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక.. భారత పేసర్ల ధాటికి 55 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగగా.. సిరాజ్ ఆరంభంలోనే 3వికెట్లు పడగొట్టి లంకను చావు దెబ్బతీశాడు. వీరిద్దరితో పాటు బుమ్రా, జడేజా తలా వికెట్ సాధించారు. లంక బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్లు డకౌట్గా పెవిలియన్కు చేరారు. అంతర్జాతీయ వన్డేల్లో శ్రీలంకకు ఇది మూడో అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. ఇక ఓటమితో సెమీస్ రేసు నుంచి లంక దాదాపు నిష్క్రమించిందనే చెప్పాలి. ఈ మ్యాచ్లో మొదటి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో వికెట్ల నష్టానికి 357 పరుగుల భారీ స్కోర్ సాధించింది. భారత బ్యాటర్లలో గిల్ (92), విరాట్ కోహ్లి(88), శ్రేయస్ అయ్యర్(82) పరుగులతో అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడారు. శ్రీలంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక ఐదు వికెట్ల ఘనత సాధించాడు. ఇక దారుణ ఓటమిపై మ్యాచ్ అనంతరం శ్రీలంక కెప్టెన్ కుశాల్ మెండిస్ స్పందించాడు. ఈ ఓటమి తనను ఎంతో బాధించిందని మెండిస్ తెలిపాడు. "ఈ మ్యాచ్లో మా జట్టు ప్రదర్శన నన్ను చాలా నిరాశపరిచింది. నేను కూడా మెరుగైన ప్రదర్శన చేయలేకపోయాను. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. సెకెండ్ ఇన్నింగ్స్లో ఫ్లడ్ లైట్స్ వెలుతురులో బంతి అంత స్వింగ్ అవుతుందని అస్సలు నేను ఊహించలేదు. సెకెండ్ ఇన్నింగ్స్లో వికెట్ బ్యాటింగ్కు అనుకూలిస్తుందని బౌలింగ్ ఎంచుకున్నాను. అదే విధంగా ఫస్ట్హాఫ్లో వికెట్ స్లోగా ఉండి బౌలర్లకు మంచిగా ఉంటుందని తొలుత బౌలింగ్ చేయాలనుకున్నాను. అందుకు తగ్గట్టే మధుశంక మంచి ఆరంభం అందించాడు. అతడు అద్బుతంగా బౌలింగ్ చేశాడు. కానీ ఫీల్డింగ్లో కూడా మెరుగైన ప్రదర్శన చేయలేదు. ఆరంభంలో కోహ్లి, గిల్కు అవకాశాలు ఇచ్చేశాం. అదే మా కొంపముంచింది. వారిద్దరూ మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ తర్వాత మా బౌలర్ల కమ్బ్యాక్ ఇచ్చినప్పటికీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఎదైమనప్పటికీ క్రెడిట్ మాత్రం టీమిండియాకే ఇవ్వాలనకుంటున్నారు. వారు మూడు విభాగాల్లో అద్భుతంగా రాణించారు. మాకు ఇంకా ఈ టోర్నీలో రెండు మ్యాచ్లు మిగిలి ఉన్నాయి. రెండు మ్యాచ్ల్లో కూడా విజయం సాధించేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తామని" పోస్ట్మ్యాచ్ ప్రేజేంటేషన్లో మెండిస్ పేర్కొన్నాడు. కాగా లంకపై విజయంతో భారత్కు సెమీఫైనల్కు క్వాలిఫై అయింది. చదవండి: World Cup 2023: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. వరల్డ్కప్లోనే తొలి బౌలర్గా View this post on Instagram A post shared by ICC (@icc) -
అధికారికంగా అర్హత సాధించాం.. అతడు అద్భుతం.. వాళ్ల వల్లే ఇలా: రోహిత్ శర్మ
ICC WC 2023- India Qualifies For Semis- Rohit Sharma Comments: వన్డే వరల్డ్కప్-2023లో టీమిండియా అద్భుత విజయం సాధించింది. ముంబై వేదికగా లీగ్ దశలో శ్రీలంకను 302 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించి సెమీస్లో అడుగుపెట్టింది. తద్వారా ప్రపంచకప్ తాజా ఎడిషన్లో సెమీ ఫైనల్లో అడుగుపెట్టిన తొలి జట్టుగా నిలిచింది. ఇప్పటి వరకు ఆడిన ఏడు మ్యాచ్లలో ఏడూ గెలిచి అజేయంగా నిలిచి ఈ ఘనత సాధించింది. సొంతగడ్డపై జైత్రయాత్ర కొనసాగిస్తూ అభిమానులను సంతోషంలో ముంచెత్తింది. ఈ నేపథ్యంలో లంకపై భారీ విజయంపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ హర్షం వ్యక్తం చేశాడు. View this post on Instagram A post shared by ICC (@icc) జట్టు సమిష్టి కృషితోనే సాధ్యమైంది మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ‘‘మేము ఇప్పుడు అధికారికంగా సెమీఫైనల్లో అడుగుపెట్టాం. చెన్నై నుంచి మొదలుపెడితే ఇప్పటి దాకా.. మా జట్టు సమిష్టి కృషితో అద్భుత ప్రదర్శన కనబరుస్తూ ముందుకు సాగుతోంది. మా లక్ష్యం అదే సెమీస్లో మేమే తొలుత అడుగుపెట్టాలన్న లక్ష్యం నెరవేరింది. ఫైనల్ విషయంలోనూ మా టార్గెట్ అదే. ఈ ఏడు మ్యాచ్లలో మా ప్రదర్శన అత్యద్భుతం. జట్టులోని ప్రతి ఆటగాడు తమ వంతు పాత్ర పోషించాడు. అంతా కలిసికట్టుగా ఇక్కడిదాకా చేరుకున్నాం. వాంఖడేలో ఇలాంటి పిచ్పై 350 పరుగులంటే మామూలు విషయం కాదు. అయ్యర్ అద్భుతం మా బ్యాటర్లు అద్భుతం చేశారు. మా బౌలర్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? అయితే, ఈ రోజు శ్రేయస్ అయ్యర్ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. తన నుంచి మేము ఎలాంటి ఇన్నింగ్స్ కోరుకున్నామో అదే చేసి చూపించాడు. ఈరోజు తను కొత్తగా కనిపించాడు. కొత్త బంతిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. ఇక మా సీమర్లు మొన్న ఇంగ్లండ్పై ఇప్పుడు శ్రీలంకపై.. ఎదురులేని విజయం సాధించారు’’ అంటూ బ్యాటర్లు, బౌలర్ల సమిష్టి కృషితోనే ఈ గెలుపు సాధ్యమైందని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. సిరాజ్ సూపర్.. చెలరేగిన షమీ కాగా వాంఖడేలో గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన శ్రీలంక ఆహ్వానం మేరకు టీమిండియా తొలుత బ్యాటింగ్ చేసింది. శుబ్మన్ గిల్(92), విరాట్ కోహ్లి (88), శ్రేయస్ అయ్యర్ (56 బంతుల్లోనే 82 రన్స్) అద్భుతం గా రాణించారు. ఈ నేపథ్యంలో నిర్ణీత 50 ఓవర్లలో రోహిత్ సేన 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇక భారీ లక్ష్యంతో ఛేదనకు దిగిన శ్రీలంకను భారత పేసర్లు చిత్తు చిత్తు చేశారు. జస్ప్రీత్ బుమ్రా తొలి వికెట్ అందించగా.. సిరాజ్ మూడు, మహ్మద్ షమీ ఐదు వికెట్లతో చెలరేగారు. రవీంద్ర జడేజా ఒక వికెట్ తీశాడు. ఈ క్రమంలో భారత బౌలర్ల దెబ్బకు 19.4 ఓవర్లలో కేవలం 55 పరుగులు చేసి ఆలౌట్ అయిన శ్రీలంక ఘోర పరాభవం మూటగట్టుకుంది. షమీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. చదవండి: చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. వరల్డ్కప్లోనే తొలి బౌలర్గా View this post on Instagram A post shared by ICC (@icc) -
చరిత్ర సృష్టించిన మహ్మద్ షమీ.. వరల్డ్కప్లోనే తొలి బౌలర్గా
వన్డే ప్రపంచకప్-2023లో టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీ మరోసారి తన విశ్వరూపం చూపించాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో షమీ ఐదు వికెట్లతో చెలరేగాడు. ఈ మ్యాచ్లో 5 ఓవర్లు బౌలింగ్ చేసిన షమీ.. కేవలం 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. అందులో ఒక మెయిడిన్ కూడా ఉంది. మహ్మద్ షమీ అరుదైన ఘనత.. ఇక 5 వికెట్లతో చెలరేగిన షమీ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో టీమిండియా తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా షమీ నిలిచాడు. షమీ ఇప్పటివరకు వరల్డ్కప్ టోర్నీల్లో 45 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో భారత బౌలింగ్ దిగ్గజాలు జహీర్ ఖాన్, జవగాల్ శ్రీనాథ్ను షమీ అధిగమించాడు. వీరిద్దరూ వన్డే వరల్డ్కప్లో సంయుక్తంగా 44 వికెట్లు పడగొట్టారు. ఇక ఈ టోర్నీలో ఇప్పటివరకు కేవలం మూడు మ్యాచ్లు మాత్రమే ఆడిన షమీ 14 వికెట్లు పడగొట్టాడు. అందులో రెండు ఫైవ్ వికెట్లు హాల్, ఒక నాలుగు వికెట్ల హాల్ ఉంది. సెమీఫైనల్లో భారత్.. వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్లో 302 పరుగుల తేడాతో శ్రీలంకను భారత్ చిత్తు చేసింది. ఈ విజయంతో సెమీఫైనల్స్కు టీమిండియా ఆర్హత సాధించింది. 358 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంకేయులు 55 పరుగులకే చాపచుట్టేశారు. భారత బౌలర్లలో షమీతో పాటు సిరాజ్ మూడు, బుమ్రా, జడేజా ఒక్క వికెట్ సాధించారు. చదవండి: World cup 2023: అయ్యో శుబ్మన్.. సెంచరీ జస్ట్ మిస్! సారా రియాక్షన్ వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
WC 2023: శ్రీలంకకు దిమ్మతిరిగే షాకిచ్చిన సిరాజ్, షమీ.. సెమీస్లో టీమిండియా
ICC Cricket World Cup 2023 - India vs Sri Lanka: ఆసియా కప్-2023 ఫైనల్.. కొలంబోలో.. టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ సృష్టించిన వికెట్ల విధ్వంసం గుర్తుండే ఉంటుంది. తన బౌలింగ్ మ్యాజిక్తో శ్రీలంక బ్యాటర్లకు చుక్కలు చూపించిన ఈ హైదరాబాదీ స్టార్.. ఒకే ఓవర్లో నాలుగు వికెట్లు తీసి వారెవ్వా అనిపించాడు. అంతటితో మనోడి వికెట్ల దాహం తీరలేదు.. ఆ మరుసటి రెండో ఓవర్లో మరో వికెట్ పడగొట్టాడు. తద్వారా 16 బంతుల్లోనే ఐదు వికెట్లు తీసిన బౌలర్గా అరుదైన ఘనత సాధించాడు. అక్కడితో ఆగక.. తన పదునైన ఫాస్ట్ ఇన్స్వింగర్తో మరో వికెట్ కూడా కూల్చాడు. నాడు బుమ్రా లంక వికెట్ల పతనాన్ని ఆరంభిస్తే.. మొత్తంగా ఆరు వికెట్లు పడగొట్టి శ్రీలంకను కోలుకోకుండా చేశాడు సిరాజ్. తద్వారా టీమిండియాకు సంచలన విజయం అందించి.. ఆసియా వన్డే కప్ విజేతగా నిలిపాడు. ఇప్పుడు.. వన్డే వరల్డ్కప్-2023.. ఈసారి వేదిక ముంబై.. ప్రఖ్యాత వాంఖడే స్టేడియం.. 2011 ఫైనల్లో టీమిండియా చేతిలో ఎదురైన పరాభవం, 2023 ఆసియా కప్లో ఘోర అవమానానికి బదులు తీర్చుకోవాలని ఆరాటంతో శ్రీలంక.. అయ్యే పనేనా?! View this post on Instagram A post shared by ICC (@icc) అసలే సొంతగడ్డపై ప్రపంచకప్ టోర్నీ.. డబుల్ హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న రోహిత్ సేన.. అయినా లంకను తక్కువగా అంచనా వేయలేం... ఇదే టోర్నీలో ఢిల్లీలో సౌతాఫ్రికా విధించిన 429 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో అద్బుత పోరాట పటిమ కనబరిచింది.. అయితే, కుశాల్ మెండిస్(76), చరిత్ అసలంక(79), దసున్ షనక(68) మిగతా వాళ్లు రాణించకపోవడంతో 102 పరుగుల తేడాతో ఓటమి తప్పలేదు.. ఇక టీమిండియాతో మ్యాచ్ విషయానికొస్తే టాస్ గెలిచి.. తొలుత బౌలింగ్ ఎంచుకున్న శ్రీలంకకు పేసర్ మధుషాంక అద్భుత ఆరంభం అందించాడు. భారత ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మను 4 పరుగుల వద్దే పెవిలియన్కు పంపాడు. అయితే, లంక ఆనందం ఎంతో సేపు నిలవలేదు. టీమిండియా యువ ఓపెనర్ శుబ్మన్ గిల్(92), విరాట్ కోహ్లి(88) శ్రీలంక బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. ఇక, శ్రేయస్ అయ్యర్(56 బంతుల్లో 82) వచ్చిన తర్వాత స్కోరు బోర్డు మరింత వేగంగా పరుగులు తీసింది. View this post on Instagram A post shared by ICC (@icc) ఇలా గిల్, కోహ్లి, అయ్యర్ల విజృంభణతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన శ్రీలంకకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మొదటి బంతికే షాకిచ్చాడు. లంక ఓపెనర్ పాతుమ్ నిసాంకను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో రెండో ఓవర్ మొదటి బంతి నుంచి సిరాజ్ తన ఆట మొదలుపెట్టాడు. లంక ఓపెనర్ కరుణరత్నెను ఎల్బీడబ్ల్యూ చేశాడు. అదే ఓవర్ ఐదో బంతికి సమరవిక్రమను అవుట్ చేశాడు. దీంతో 2 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి లంక పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. అయినా.. సిరాజ్ ఏమాత్రం కనికరం చూపలేదు. నాలుగో ఓవర్ తొలి బంతికి మెండిస్ను బౌల్డ్ చేశాడు. ఇలా ఐదు ఓవర్లలోపే మూడు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ తర్వాత పదో ఓవర్ మూడో బంతికి మరో పేసర్ మహ్మద్ షమీ.. చరిత్ అసలంకను, నాలుగో బంతికి హేమంతను.. 12 వ ఓవర్ మూడో బంతికి దుష్మంత చమీరను పెవిలియన్కు పంపాడు. ఇక.. 14వ ఓవర్ తొలి బంతికి ఏంజెలో మాథ్యూస్ను షమీ బౌల్డ్ చేసిన తీరు మ్యాచ్కే హైలైట్ అని చెప్పవచ్చు. దీంతో 14 ఓవర్లలో కేవలం 36 పరుగులు చేసిన శ్రీలంక ఏకంగా 8 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో 18వ ఓవర్లో లంక టెయిలెండర్ కసున్ రజిత రూపంలో ఐదో వికెట్ దక్కించుకున్న షమీ.. టీమిండియా తరఫున వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా చరిత్రకెక్కాడు. View this post on Instagram A post shared by ICC (@icc) ఇక 19.4వ ఓవర్లో రవీంద్ర జడేజా మధుషాంక(5)ను అవుట్ చేసి విజయ లాంఛనం పూర్తి చేశాడు. ఆసియా కప్ ఫైనల్లో 50 పరుగులకు అవుటైన లంక ఈరోజు 55 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 302 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. ఇప్పటి వరకు ఆడిన ఏడింట ఏడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్కు చేరుకుంది. -
ముగ్గురు మొనగాళ్లు.. కానీ పాపం! అయితేనేం పాక్ వరల్డ్ రికార్డు బద్దలు
వన్డే వరల్డ్కప్-2023లో శ్రీలంకతో మ్యాచ్లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. వాంఖడే వేదికగా గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన లంక ఆహ్వానం మేరకు భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేసింది. ఆరంభంలోనే కెప్టెన్ రోహిత్ శర్మ(4) వికెట్ కోల్పోగా.. మరో ఓపెనర్ శుబ్మన్ గిల్, వన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి టీమిండియా ఇన్నింగ్స్ను చక్కదిద్దారు. ఇద్దరూ కలిసి 150కి పైగా పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. View this post on Instagram A post shared by ICC (@icc) సెంచరీ కోసం నువ్వా- నేనా ఈ క్రమంలో సెంచరీ సాధించేందుకు నువ్వా- నేనా అన్నట్లు గిల్ తన రోల్మోడల్ కోహ్లితో పోటీపడటం విశేషం. అయితే, ఇద్దరూ శతకానికి చేరువగా వచ్చారు గానీ.. వంద పరుగుల మార్కును అందుకోలేకపోయారు. మొత్తంగా 92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో గిల్ 92 పరుగులు చేయగా.. కోహ్లి 94 బంతుల్లో 11 ఫోర్ల సాయంతో 88 పరుగులు సాధించాడు. వీరిద్దరి వికెట్ను మధుషాంక తన ఖాతాలోనే వేసుకోవడం గమనార్హం. View this post on Instagram A post shared by ICC (@icc) సిక్సర్ల వర్షంతో విరుచుకుపడ్డ అయ్యర్ తొలుత రోహిత్ను అవుట్ చేసిన ఈ లెఫ్టార్మ్ పేసర్.. తర్వాత ఇలా గిల్, కోహ్లిల సెంచరీలకు అడ్డుపడ్డాడు. వీరిద్దరు అవుటైన అనంతరం.. నాలుగో నంబర్ బ్యాటర్, లోకల్ బాయ్ శ్రేయస్ అయ్యర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. View this post on Instagram A post shared by ICC (@icc) లంక బౌలింగ్ను చిత్తు చేస్తూ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. సిక్సర్ల వర్షం కురిపిస్తూ అభిమానులకు కనువిందు చేశాడు. ఆఖరి పది ఓవర్లలో టీమిండియా 93 పరుగులు సాధించిందంటే అది అయ్యర్ చలవే. View this post on Instagram A post shared by ICC (@icc) అయితే, మధుషాంకకు మరోసారి అదృష్టం కలిసి రావడంతో ఈజీ క్యాచ్ ఇచ్చి అయ్యర్ పెవిలియన్ చేరాడు. దీంతో గిల్, కోహ్లిలతో పాటు అతడూ సెంచరీ మిస్ అయ్యాడు. మధుషాంకకు ఐదు వికెట్లు ఇదిలా ఉంటే.. మిగతా బ్యాటర్లలో రవీంద్ర జడేజా (24 బంతుల్లో 35 పరుగులు) ఒక్కడు ఫర్వాలేదనిపించాడు. కేఎల్ రాహుల్(21). సూర్యకుమార్ యాదవ్(12) పూర్తిగా నిరాశ పరచగా.. ఆఖరి ఓవర్లో మహ్మద్ షమీ(2), జడేజా రనౌట్ అయ్యారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 357 పరుగులు సాధించింది. లంక బౌలర్లలో దిల్షాన్ మధుషాంక ఐదు వికెట్లు తీయగా.. దుష్మంత చమీర రాహుల్ రూపంలో ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా కాగా గిల్, కోహ్లి, అయ్యర్ సెంచరీలు మిస్ అయినప్పటికీ.. సమిష్టి కృషితో ప్రపంచకప్లో టీమిండియా అరుదైన రికార్డు సాధించేందుకు దోహదం చేశారు. వరల్డ్కప్ హిస్టరీలో ఒక్క బ్యాటర్ కూడా సెంచరీ చేయకుండానే అత్యధిక స్కోరు సాధించిన జట్ల జాబితాలో టీమిండియా మొదటి స్థానంలో నిలిచింది. ఈ క్రమంలో పాకిస్తాన్ పేరిట ఉన్న రికార్డు బద్దలు కొట్టింది. వరల్డ్కప్ టోర్నీ ఇన్నింగ్స్లో ఒక్క సెంచరీ నమోదు కాకపోయినా అత్యధిక స్కోర్లు సాధించిన జట్లు ఇవే: ►357/8 - భారత్ వర్సెస్ శ్రీలంక- ముంబై వాంఖడే స్టేడియం, 2023 ►348/8 - పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లండ్, నాటింగ్హాం, 2019 ►341/6 - దక్షిణాఫ్రికా వర్సెస్ యూఏఈ, వెల్లింగ్టన్, 2015 ►339/6 - పాకిస్తాన్ వర్సెస్ యూఏఈ, నేపియర్, 2015 ►338/5 - పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక, స్వన్సీ, 1983. చదవండి: అయ్యో శుబ్మన్.. సెంచరీ జస్ట్ మిస్! సారా రియాక్షన్ వైరల్ -
అయ్యర్తో అట్లంటుంది.. వరల్డ్కప్లో భారీ సిక్సర్! వీడియో వైరల్
వన్డే వరల్డ్కప్ 2022లో భారీ సిక్స్ నమోదైంది. వాంఖడే వేదికగా శ్రీలంకతో మ్యాచ్లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ ఓ భారీ సిక్సర్ కొట్టాడు. భారత ఇన్నింగ్స్ 36 ఓవర్లో రజిత వేసిన నాలుగో బంతిని లాంగాన్ మీదగా భారీ సిక్స్ర్ బాదాడు. అతను కొట్టిన షాట్కి బంతి 106 మీటర్ల దూరం వెళ్లింది. కాగా ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా స్టార్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ పేరిట ఉండేది. ఈ టోర్నీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో మ్యాక్సీ 104 మీటర్ల సిక్స్ కొట్టాడు. తాజా మ్యాచ్తో మ్యాక్సీ రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు. అయ్యర్ సూపర్ ఇన్నింగ్స్.. ఇక ఈ మ్యాచ్లో శ్రేయస్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రీలంక బౌలర్లను అయ్యర్ ఊచకోత కోశాడు. కేవలం 56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్లతో 82 పరుగులు చేసి ఔటయ్యాడు. చదవండి: World cup 2023: అయ్యో శుబ్మన్.. సెంచరీ జస్ట్ మిస్! సారా రియాక్షన్ వైరల్ View this post on Instagram A post shared by ICC (@icc) -
అయ్యో శుబ్మన్.. సెంచరీ జస్ట్ మిస్! సారా రియాక్షన్ వైరల్
వన్డే ప్రపంచకప్-2023లో భాగంగా వాంఖడే వేదికగా శ్రీలంకపై టీమిండియా ఓపెనర్ శుబ్మన్ గిల్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో తన తొలి వరల్డ్కప్ సెంచరీని గిల్ మిస్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో 92 బంతులు ఎదుర్కొన్న శుబ్మన్.. 11 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 92 పరుగులు చేసి ఔటయ్యాడు. మధుశంక బౌలింగ్లో అనవసరపు షాట్కు ప్రయత్నించి గిల్ తన వికెట్ను కోల్పోయాడు. వాంఖడేలో సారా సందడి.. కాగా ఈ మ్యాచ్ను వీక్షించేందుకు సచిన్ టెండుల్కర్ గారాల పట్టి, శుబ్మన్ గిల్ రూమర్డ్ గర్ల్ ఫ్రెండ్ సారా టెండూల్కర్ వాంఖడే స్టేడియంకు వచ్చింది. గిల్ బౌండరీలు కొట్టిన ప్రతీసారి సారా చప్పట్లు కొడుతూ కన్పించింది. కాగా గిల్ సెంచరీకి చేరువలో ఔటైన వెంటనే సారా తీవ్ర నిరాశ చెందింది. ఒక్కసారిగా సారా ముఖం వాడిపోయింది. అయితే గిల్ నడుచుకుంటూ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్తుండగా.. సారా చప్పట్లు కొడుతూ స్టాండింగ్ ఓవిషేన్ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: WC 2023: ఇదేం షాట్ రా బాబోయ్.. విరాట్ కోహ్లి షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్ I don’t know how to express this pain but same Sara didi same #INDvSL pic.twitter.com/6z8CNquRyT — Fenil Kothari (@fenilkothari) November 2, 2023 Sara Tendulkar clapping and appreciating Shubman Gill's Incredible innings. pic.twitter.com/5QKzyjjQn2 — CricketMAN2 (@ImTanujSingh) November 2, 2023 View this post on Instagram A post shared by ICC (@icc)
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement