-
అమెరికాలో మన గిరాకీ!
భారత్ - అమెరికా బంధాలు రోజు రోజుకు గట్టిపడుతున్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా పీవీ నరసింహారావు వేసిన పునాదులపైన ఆ బంధాలు మరింత దృఢపడుతున్నాయి. అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. అగ్రరాజ్యంలో ఎవరు అధికారంలో వున్నా, భారతీయులు కీలక భూమిక పోషిస్తున్నారు. పాలనలో,రాజకీయాలలోనూ,ఐటీ పరిశ్రమలోనూ, ఆ దేశ ఆర్ధిక వృద్ధిలోనూ మన పాత్ర ప్రశంసాపాత్రంగా ఉంటోంది. తాజాగా భారత్ పై అమెరికా రాయబారి కురిపించిన ప్రశంసలు, చేసిన వ్యాఖ్యలు ఈ తీరుకు అద్దం పడుతున్నాయి. ఎవరైనా అమెరికా వెళ్లాలని ఉవ్విళ్లూరుతారు! అమెరికా రాయబారి ఎరిక్ గార్శెట్టి మాత్రం భవిష్యత్తును దర్శనం చేసుకోవాలంటే భారత్కు రండి..అంటూ పిలుపునిచ్చారు.ఎరిక్ ప్రస్తుతం అమెరికా రాయబారిగా మన దేశంలో వున్నారు. దిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన పాల్గొని ఉపన్యాసం అందించారు. అందులో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.ప్రపంచ దేశాలు అప్పుడే చర్చించుకోవడం మొదలుపెట్టాయి. "మేం ఇక్కడికి పాఠాలు బోధించేందుకు రాలేదు, నేర్చుకోవడానికి వచ్చాం " అని ఆయన అన్నారు. ఇరు దేశాల మధ్య అవగాహన కూడా బాగా పెరుగుతూ వస్తోందని చెప్పడానికి ఇది ఉదాహరణగా నిలుస్తుంది. అమెరికాలో ఖలిస్తాన్ ఉగ్రవాది గురు పత్వంత్ సింగ్ పన్నూ హత్యకు సంబంధించిన కుట్ర కేసులో భారతీయుడుపై అభియోగాలు వచ్చాయి. ఈ అంశం రెండు దేశాల బంధంపై ఎటువంటి ప్రభావం చూపిస్తుందో? అనే చర్చ పెద్దఎత్తున జరుగుతూనే వుంది.అయితే! ఈ కేసు దర్యాప్తు విషయంలో భారత్ అందిస్తున్న సహకారాన్ని అమెరికా మెచ్చుకుంటోంది. ఆ దేశ జాతీయ భద్రతా సలహాదారు జేక్ సలివాన్ కూడా అమెరికా -భారత్ బంధం పట్ల గొప్ప ఆశాభావాన్ని వ్యక్తం చేయడం కూడా గమనార్హం. రిచర్డ్ నిక్సన్ - ఇందిరాగాంధీ సమయంలో ఇరు దేశాల మధ్య బంధాలు ఏ మాత్రం బాగా ఉండేవి కాదు. పీవీ నరసింహారావు అద్భుతమైన బంధాన్ని ఏర్పరచారు. మన్మోహన్ సింగ్ అదే దారిలో నడిచారు. బుష్- సింగ్ కాలంలో ఈ స్నేహం ఎంతో వికసించింది. నరేంద్రమోదీ - డోనాల్డ్ ట్రంప్ సమయంలో మరింత ఆత్మీయంగా మారింది. జో బైడెన్ మొదటి నుంచి భారత్ పై ప్రత్యేకమైన అభిమానం,గౌరవం చూపిస్తూ వస్తున్నారు. ఆయన అధ్యక్షుడుగా అధికార పీఠం అధిరోహించినప్పటి నుంచి మరింత ప్రభావశీలంగా సాగుతోంది. బరాక్ ఒబామా పరిపాలనా కాలంలోనూ బాగా నడిచింది. డోనాల్డ్ ట్రంప్ మళ్ళీ అధ్యక్షుడుగా అధికారం చేపట్టడానికి సిద్ధమవుతున్నారు. జో బైడెన్ -ట్రంప్ మధ్య పెద్ద పోటీ నడుస్తోంది. భవిష్యత్తు ఎన్నికల్లో ఎవరు అధికారంలోకి వచ్చినా, ఇరుదేశాల ప్రయాణానికి ఎటువంటి ఢోకా ఉండదని అంచనా వెయ్యవచ్చు. వాణిజ్యం, పెట్టుబడుల పెరుగుదల, భద్రతా సహకారం మొదలైన విషయాల్లో భారత్ వైపు అమెరికా గట్టిగా నిలబడుతోంది. ప్రపంచ ఆర్ధిక, వాణిజ్య వేదికలలో భారతదేశ స్థాయిని, ప్రాతినిధ్యాన్ని పెంచడంలో అమెరికా కీలక భూమిక పోషిస్తోంది. ఎగుమతులు, సాంకేతిక భాగస్వామ్యంతో ఉమ్మడి తయారీ అంశాల్లోనూ అగ్రరాజ్యం మనకు సంపూర్ణ సహకారాన్ని అందిస్తోంది. ప్రపంచంలో తమకు ఎంతో ఇష్టమైన దేశాలలో భారత్ తొలివరుసలో ఉంటుందని అమెరికా ప్రజలు అంటున్నారు. వస్తువులు, సేవలు రెండింటిలోనూ ద్వైపాక్షిక వాణిజ్యం పెరుగుతూ రావడం శుభ పరిణామం.బ్రిటిష్ పాలనా కాలంలోనూ, స్వాతంత్ర్యానంతర భారతంలోనూ చాలా ఏళ్ళు రెండు దేశాల మధ్య బంధాలు అంత ఆరోగ్యం లేవన్నది పచ్చినిజం. ముఖ్యంగా ఈ రెండు దశాబ్దాలలో ఆరోగ్యకరమైన బంధాలు సాగుతున్నాయి. మన దేశానికి ప్రత్యక్ష పెట్టుబడులు అందించే దేశాలలో అగ్రరాజ్యానిది విశిష్టమైన స్థానం.వాణిజ్య భాగస్వామిగా అమెరికాది రెండో స్థానం.అమెరికాలో మన భారతీయుల జనాభా సుమారు 1.35 శాతం వున్నట్లు సమాచారం.ఆ దేశంలో బాగా సంపాయిస్తున్న జాతుల్లో భారత జాతీయులకు సమున్నత స్థానం వున్నది.మన తెలుగువారి స్థానం గణనీయం.అక్కడ మన దేశ భాషలు మాట్లాడేవారిలో అందరికంటే అగ్రస్థానం తెలుగు వారిదే. ఆ తర్వాత తమిళ, బెంగాలీలు వస్తారు. ఆ తర్వాతి స్థానంలో హిందీ వుంది.1910 ప్రాంతంలో అమెరికాలోని భారతీయుల జనాభా కేవలం 2,545.2020 జనాభా లెక్కల ప్రకారం సుమారు 50లక్షలమంది వున్నారు.ఈ నాలుగేళ్లలో ఇంకా పెరిగారు. సాఫ్ట్ వేర్ రంగం అభివృద్ధిలోకి వచ్చాక అమెరికాలో నివసిస్తున్న తెలుగువారి సంఖ్య గణనీయంగా పెరుగుతూ వస్తోంది.2000ప్రాంతంలో మనవారు సుమారు 90వేల మంది ఉండేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య దాదాపు 12లక్షల 40వేలకు పెరిగింది. వీరిలో ఉద్యోగస్తులతో పాటు విద్యార్థులు కూడా ఉంటారు. వివిధ రంగాల్లో అక్కడ రాణిస్తున్న మనవాళ్ళ పేర్లు చెప్పాలంటే పెద్ద జాబితా అవుతుంది. అయితే! మనవాళ్ళపై జాతి విద్వేషాలు, వైషమ్యాలు జరుగుతూనే వున్నాయి. అవి ఆగాలి. వీసా ఇబ్బందులు తీరడం లేదు.అవి తీరాలి. ఉద్యోగాల కల్పనలోనూ,జీత భత్యాల విషయంలోనూ అసమానతలు పెరుగుతూనే వున్నాయి. వీటికి చరమగీతం పాడాలి.ప్రపంచంలోనే భారత్ ది అతి పెద్ద మార్కెట్. జనాభాలో త్వరలోనే చైనాను సైతం మనం అధిగమిస్తాం. ఎల్లకాలం అగ్రరాజ్యంగా ఉండాలన్నది అమెరికా ఆశ. చైనాను దెబ్బకొట్టాలన్నది మరో వ్యూహం. ఇస్లాం తీవ్ర వాద భయాలు కూడా ఆ దేశానికి బాగా వున్నాయి. ప్రపంచ దేశాల ప్రయాణంలో భారత్ తో స్నేహం, సహకారం అమెరికాకు ఎంతో అవసరం.ఆర్ధిక, రాజకీయ, సామాజిక స్వార్థంతో, మన దేశంతో అమెరికా గట్టి బంధాలను కోరుకుంటోంది. మనకు కూడా ఆ దేశంతో ఎంతో అవసరం ఉంది. అనేక అంశాలలో రెండు దేశాలు కలిసి సాగాల్సిన చారిత్రక అవసరాలు వున్నాయి.మానవవనరుల అభివృద్ధిలో మన ప్రయాణం ఆ దేశానికి ఎంతో నచ్చింది. రెండు దేశాల మధ్య ఇచ్చిపుచ్చుకొనే ధోరణులు మరింత పెరగాలి. మనం భవిష్యత్తులో ద్వితీయ స్థానాన్ని ఆక్రమిస్తే? అప్పుడు అమెరికా మనతో ఎలా ఉండబోతుందో కాలచక్రంలోనే తెలుస్తుంది. మొత్తంగా చూస్తే, అమెరికా దృష్టిలో మన గిరాకీ పెరిగింది. -మాశర్మ -
భేషజాలు తొలగిన బంధం
జాతిహితం భారత విదేశాంగ విధానంలో ప్రచ్ఛన్న యుద్ధానంతర దిద్దుబాటు ప్రక్రియను పీవీ ప్రారంభించారు. ‘‘బలమైన, సంపన్నవంతమైన భారతదేశం.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుంద’’ని ప్రకటించడం ద్వారా మోదీ ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. చరిత్రకు సంబంధించిన శషభిషలను అధిగ మించి, భారత్–అమెరికా సంబంధాలపై ప్రధాని నరేంద్ర మోదీ చెబుతున్న పద్ధతిలో ఈ వారం కాలమ్లో అంశంగా ఎంచుకోవడానికి రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి చరిత్రలోని స్వవచన వ్యాఘాతాలు, రెండు చరిత్రలోని భేష జాల గురించి. లేదా రెండింటి గురించి కూడా. వ్యూహాత్మక సంబంధాలు చాలా కాలం తరువాత ఏర్పడినాయి గానీ, 1947 నుంచి కూడా భారత్, అమెరికా దేశాలు సహజ భాగస్వాములు, మిత్రులు అయి ఉండాలి. కానీ యుద్ధానంతర పునర్నిర్మాణ దశలో తూర్పు, పశ్చిమా లలోని ఐరోపా, జపాన్లను దాటి సంబంధాలు నెరపడం అమెరికాకు సాధ్యం కాదు. భారత నాయకత్వం మౌలికంగా బ్రిటన్ చుట్టూ పరిభ్రమిం చేది. కానీ త్వరలోనే భాగస్వాములు ఇద్దరినీ కూడా ప్రచ్ఛన్నయుద్ధం హరించి వేసింది. పాకిస్తాన్ అమెరికా వైపు మొగ్గింది. భారత్ మాత్రం అలీనోద్యమ నాయకత్వాన్ని ఆశించింది. అలీనో ద్యమం ఎప్పుడూ సోవియెట్ కూటమి వైపే మొగ్గు చూపింది. పశ్చిమదేశాల పట్ల వ్యతిరేక భావం ఉన్న ఇద్దరు ప్రముఖ భారతీయ నేతలు నెహ్రూ, ఇందిర రెండు సంక్షోభాల వేళ అమెరికాకు చేరువయ్యారు. చైనా దురాక్రమణ, ఆహార నిల్వల కొరత వచ్చినప్పుడు ఆ పరిణామం జరిగింది. తరువాత వచ్చిన ప్రధానమంత్రులంతా (నరేంద్ర మోదీ సహా) హరిత విప్లవాన్ని విజయవంతం చేయడంలో అమెరికా నిర్వహిం చిన కీలక పాత్రను గుర్తు చేస్తూనే ఉన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం –1989– పరిసమాప్తితోనే భారత్–అమెరికా సంబంధాల నూతన చరిత్ర ప్రారంభమైందని భావించడం మరింత సముచితంగా ఉంటుంది. రెండో ప్రపంచ యుద్ధానంతర ప్రపంచ చరిత్ర తర్వాత సంభవించిన గొప్ప మూల మలుపు భారత్ను నేర్పులేని ఒక మోటు స్థితిలోకి నెట్టింది. ఈ దశలో భారత్ ఆత్మవిశ్వాసం స్వల్ప స్థాయిలో ఉండటంతో ప్రచ్ఛన్న యుద్ధ పరిసమాప్తి దేశానికి ఒక అవ కాశం కంటే ఒక సంక్షోభంగానే కనిపించింది. ఆర్థిక రంగంలో యధాతథ స్థితిని భారత్ సాహసోపేతంగా బద్దలు చేసింది కాని దాని రాజకీయ నాయకత్వం మాత్రం పాత వ్యూహాత్మక మానసిక స్థితిలోనే చిక్కుకుని ఉండేది. ఆ తర్వాత ఇజ్రాయెల్తో సంబం« దాలను ఏర్పర్చుకోవడం, అమెరికాను సందర్శించడం వంటి కొన్ని దిద్దుబాట్లు జరిగాయి. చివరగా, భారత్–అమెరికా సంబంధాలు ఇంకే మాత్రం గత బంధనాలతో ఉండబోవని, కొత్త అవకాశాలకు ఆకాశమే హద్దని పీవీ నరసింహారావు కేపిటల్ హిల్లో సాహస ప్రకటన చేశారు. ఢిల్లీ, వాషింగ్టన్ మధ్య అవకాశాల కంటే చికాకులు ఎక్కువగా ఉండేవి. అయితే పీవీ.. ప్రపంచంలో జరుగుతున్న మౌలిక మార్పును మేధోవం తంగా గ్రహించి దాన్ని స్వీకరించారు. భారత విదేశాంగ విధానంలో ప్రచ్ఛన్న యుద్ధానంతర దిద్దుబాటు ప్రక్రియను పీవీ ప్రారంభించారు. బలమైన, సంపన్నవంతమైన భారత దేశం.. అమెరికా వ్యూహాత్మక ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటుం దని ప్రకటిం^è డం ద్వారా మోదీ ఇప్పుడు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. అయితే ఈ దశకు చేరడానికి భారత్ ఊగిసలాటలతో కూడిన పాతికేళ్ల సమయం తీసుకుంది. దీన్నే మోదీ చరిత్ర భేషజాలుగా అద్భుతమైన రీతిలో ఇటీవలి అమెరికా పర్యటనలో వర్ణించారు. వాస్తవానికి మూడు దశాబ్దాలకు పైగా భారత–అమెరికా సంబం« దాల పునఃస్థాపన క్రమాన్ని మనం ఒక రిలే రేస్గా చూడవచ్చు. పీవీ ఈ పరుగుపందేనికి దారి సిద్ధం చేశారు. అటల్ బిహారీ వాజ్పేయీ తొలి పరుగు ప్రారంభించి బ్యాటన్ను మన్మోహన్సింగ్కు అందించారు. సింగ్ యూపీఏ–1 హయాంలో అణు ఒప్పందం ద్వారా తుది అంగను చేరు కున్నారు. కానీ యూపీఏ–2వ హయాంలో కాంగ్రెస్ పార్టీ ఊగిసలాట వల్ల తడబడ్డారు. ఇప్పుడు ఆ బ్యాటన్ని మోదీ అందుకుని చివరి పరు గును పూర్తి చేశారు. క్షేత్రస్థాయిలో పావుశతాబ్దం కలిగించిన ప్రయోజనానికి తోడుగా మోదీ తన బలాన్ని కూడా తీసుకొచ్చారు. వీటిలో మొదటిది 282 స్థానాల మ్యాజిక్ నంబర్. అయితే మోదీకి ఇంత మెజారిటీ ఒక బహు మతిగా రాలేదనుకోండి. ఆయన దాన్ని సాధించుకున్నారు. రెండు. ప్రచ్ఛన్న యుద్ధానంతర శకంలో రూపొందిన ప్రొఫెషనల్ దౌత్యవేత్తల బృందంతో మోదీ ఇప్పుడు వ్యవహరిస్తున్నారు. మూడు, భారత కులీన వర్గాలకు చెందిన కుటుంబ సభ్యులు భారీ స్థాయిలో అమెరి కాకు వలస వెళ్లినందున అమెరికాతో భావోద్వేగ బంధం ఇంకా పెద్దది. నాలుగు.. తన పూర్వ ప్రధానులతో పోలిస్తే మోదీ అత్యంత పిన్న వయస్కు డైన ప్రధానిగా ఉన్నారు. ప్రధాని మంత్రిత్వం అనేది మరింత యుక్తవయస్సులో ఉన్నవారు చేయవలసిన పని అంటూ మన్మోహన్ సింగ్ తరచూ చెప్పేవారు. భారతదేశపు అత్యంత విజ్ఞులైన ప్రధాన మంత్రులు.. పీవీ నరసింహారావు, వాజ్పేయీ, మన్మోహన్ సింగ్ వారి జీవితాల్లో కనీసం పదేళ్లు ఆలస్యంగా ప్రధాని పదవిని చేపట్టారు. తన సమకాలీన ప్రపంచ నేతలతో పోలిస్తే మోదీ కాస్త ముసలివాడిగానే కని పించినప్పటికీ, తన వయస్సు తనకు అనుకూలంగానే ఉంటూ వస్తోంది. అయితే మోదీకున్న అతిపెద్ద బలం చెక్కుచెదరని ఆయన మనస్సే. చరిత్ర భారాలు లేదా కపటత్వాలతో ఆయన నలిగిపోవడం లేదు. ఏళ్ల తరబడి దౌత్యపరమైన అంచనాలు, కేబుల్ వార్తలు చదవడం ద్వారా కలిగే విశ్లేషణ–పక్షవాత భారానికి ఆయన గురికాలేదు. ఈ అనిశ్చితివల్లే తన ప్రభుత్వాన్ని పణంగా పెట్టి అణు ఒప్పందాన్ని అమలులోకి తీసుకు వచ్చే విషయంలో కాంగ్రెస్ పార్టీ మానసికంగా స్తంభించిపోయింది. రక్షణ సహకార ఒప్పందాల విషయంలో ముందుకెళ్లడంలో దాని స్తంభనే భీతిగా మారిపోయింది. తాను, తన పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధానాలను పూర్తిగా వ్యతిరేకించిన విషయాన్ని పక్కనబెట్టి మోదీ స్వచ్ఛ మానసిక స్థితితో, దాపరికంలేనితనంతో అధికారంలోకి వచ్చారు. అధి కారం చేపట్టిన తొలిరోజు కొత్త చరిత్రకు నాంది కావచ్చు కాబోలు. ఈ చెక్కుచెదరని మనస్సే మోదీని ప్రధానంగా దౌత్యంలో, నిర్ణ యాల రూపకల్పనలో వాస్తవిక వ్యవహార దృక్పథాన్ని చేపట్టేలా చేసి ఉంటుంది. అమెరికాతో మరింత వ్యూహాత్మక అవకాశాలను సృష్టించు కోడానికి, వ్యాపార, వాతావరణ సంప్రదింపుల్లో కూడా ఇచ్చి పుచ్చు కోవడానికి ఆయన అభిలషిస్తున్నారు. అలాగే ఆర్థిక, వాణిజ్య అవకా శాలను విస్తరించుకోవడానికి చైనాతో వ్యూహాత్మక ఎత్తుగడలకు సంబం« ధించిన అలజడిని చల్లబర్చుకోవాలని కూడా మోదీ ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో జూనియర్ బుష్ లేదా రీగన్ తరహాలో మోదీ వ్యవహ రిస్తున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. చరిత్రకు సంబంధించిన సందే హాలు – బేషజాలు– నుంచి విముక్తి చెందిన, సమస్యతో నేరుగా వ్యవ హరించే సరైన వ్యక్తిగా మోదీ ఆవిర్భవించారు. - శేఖర్ గుప్తా twitter@shekargupta
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (23-05-2024)
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
ఏపీలో చంద్రబాబు విధ్వంసం సృష్టించాడు: కాసు మహేష్రెడ్డి
రూ.46.90 లక్షల కారు లాంచ్ చేసిన బీఎండబ్ల్యూ - పూర్తి వివరాలు
ఓటీటీకి వందకోట్ల సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
పుష్ప 2 మూవీలో ఛాన్స్ వదిలేసుకున్నా: రవి కృష్ణ
ఎంటర్ప్రెన్యూర్ కమ్ ఇన్ఫ్లుయెన్సర్గా మారిన లాయర్! ఏకంగా ఆరుసార్లు కేన్స్..!
ఆర్టిస్ట్గా ఫెయిల్ అయిపోయానేమో అనుకున్నా: గెటప్ శ్రీను
Dinesh Karthik: ఆ నవ్వే నన్ను ముంచేసింది!.. ఎల్లప్పుడూ నా వాడే!(ఫొటోలు)
టైమ్కి చెక్ వస్తుంది.. రూ. 11 కోట్లు.. ఇంకెందుకు ఆడటం?
తప్పక చదవండి
- బాయ్ఫ్రెండ్తో బ్రేకప్.. తొలిసారి క్లారిటీ ఇచ్చిన శృతిహాసన్!
- ‘దాడి సమయంలో కేజ్రీవాల్ ఇంట్లోనే ఉన్నారు’
- 800 ఏళ్ల నాటి వ్యాయామం..దెబ్బకు ఒత్తిడి, అలసట మాయం!
- బీసీసీఐ ఆఫర్ నిజమే.. నేనే రిజెక్ట్ చేశా: ఆసీస్ దిగ్గజం
- ప్రపంచంలోనే తొలి తల మార్పిడి..! ఏకంగా హాలీవుడ్ మూవీని తలపించేలా..!
- టాప్ 5 దేశాలను వెనక్కి నెట్టిన భారత్!
- రూ.2.5 కోట్లకు రూ.10 కోట్లు.. విరుష్క జంటకు లాభాల పంట!
- 'స్టార్ హీరోతో లవ్.. పేరెంట్స్ బలవంతం వల్లే పెళ్లి చేసుకున్నా'
- SRH vs RR: ‘సన్రైజర్స్ కాదు!.. రాజస్తాన్కే గెలిచే ఛాన్స్’
- పీకేకు దిమ్మతిరిగే ప్రశ్న.. సహనం కోల్పోయిన రాజకీయ వ్యూహకర్త
Advertisement