-
కంపెనీ మారే ఆలోచనలో ఉద్యోగి.. స్వయంగా రంగంలోకి గూగుల్ కోఫౌండర్
Google employee: ఖర్చులు తగ్గించుకునే నెపంతో టెక్నాలజీ కంపెనీలు లేఆఫ్ల పేరుతో వేలాదిగా ఉద్యోగులను వదిలించుకోవడం చూస్తున్నాం. అదే సమయంలో ప్రతిభ ఉన్న ఉద్యోగులు ఇతర సంస్థలకు వెళ్లకుండా వారికి కావాల్సింది ఇచ్చి కాపాడుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. ఇలాగే కంపెనీ మారే ఆలోచనలో ఉన్న ఓ ఉద్యోగిని కాపాడుకునేందుకు నేరుగా గూగుల్ కోఫౌండర్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. ఓపెన్ ఏఐ కంపెనీ కోసం గూగుల్ను వీడేందుకు సిద్ధమైన తమ ఉద్యోగికి గూగుల్ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ వ్యక్తిగతంగా ఫోన్ చేశారు. ఉద్యోగిని పోస్ట్లో కొనసాగేలా ఒప్పించేందుకు అదనపు వేతనం ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా ఓ నివేదిక ద్వారా వెల్లడైంది. కాగా కంపెనీ మారేందుకు సిద్ధమైన ఆ ఉద్యోగి గూగుల్లో చాలా కాలంగా ఏఐ రీసెర్చర్గా పనిచేస్తున్నట్లు తెలిసింది. సదరు గూగుల్ ఉద్యోగి తమకు స్నేహితుడని, అతనికి కోసం స్వయంగా కంపెనీ కోఫౌండర్ సెర్గీ బ్రిన్ రంగంలోకి దిగడం బిగ్ టెక్ కంపెనీల్లో ఏఐ టాలెంట్కు ఉన్న డిమాండ్ ట్రెండ్ను సూచిస్తోందని ఓ అజ్ఞాత వ్యక్తి తెలిపారు. ప్రస్తుతం అధునాతన ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ బిగ్ టెక్ కంపెనీల్లో అత్యధికంగా ఉంది. ఇదీ చదవండి: సందట్లో సడేమియా.. ఐటీ కంపెనీలకు వల వేస్తున్న కేరళ! -
Viral Video: స్కూటీ నడుపుతూ వర్క్ కాల్.. ఈ ఐటీ ఉద్యోగి కష్టం చూడండి..
ఏ ఉద్యోగంలో అయినా పని ఒత్తిడి మామూలే. అయితే ఇది ఐటీ పరిశ్రమలో మరీ ఎక్కువగా కనిపిస్తోంది. బెంగళూరులో ఓ వ్యక్తి ల్యాప్టాప్లో వర్క్ కాల్లో అటెండ్ అవుతూ స్కూటర్ నడుపుతున్న వీడియో వైరల్గా మారింది. దీన్ని చూసిన తర్వాత వర్క్-లైఫ్ బ్యాలెన్స్, 70 గంటల వర్క్ వీక్ చర్చ సోషల్ మీడియాలో తిరిగి మొదలైంది. పీక్ బెంగుళూరు అనే హ్యాండిల్పై ‘ఎక్స్’ (ట్విటర్)లో షేర్ చేసిన ఈ క్లిప్ దేశ ఐటీ రాజధాని మూసచిత్రాన్ని చూపించింది. ఇక్కడ టెక్ నిపుణులు బహిరంగ ప్రదేశాల్లో తమ ల్యాప్టాప్లపై పనిలో నిమగ్నమై ఉండటం సర్వసాధారణమే. అయితే ఈ ఉద్యోగి మాత్రం ఓ వైపు స్కూటర్ నడుపుతూ.. మరోవైపు ల్యాప్టాప్ను ఒళ్లో పెట్టుకుని వర్క్ కాల్ అటెండ్ అవుతున్న తీరు చర్చనీయాంశంగా మారింది. వైరల్గా మారిన ఈ వీడియోపై నెటిజనులు పలు విధాలుగా స్పందించారు. "బ్రో ఐటీ కంపెనీలో ఉండాలంటే పని చేస్తూనే ఉండాలి. వారానికి 70 గంటల సమయం కూడా సరిపోదు" అని ఓ యూజర్ కామెంట్ చేశారు. "క్లయింట్ కాల్, మరణం ఎప్పుడైనా రావచ్చు" అని మరో యూజర్ చమత్కారంగా రాసుకొచ్చారు. "ఈ రోజుల్లో పని ఒత్తిడి చాలా ఎక్కువే. అయినా ఇలా మాత్రం చేయొద్దు" అని ఇంకొక యూజర్ హితవు పలికారు. Bengaluru is not for beginners 😂 (🎥: @nikil_89) pic.twitter.com/mgtchMDryW — Peak Bengaluru (@peakbengaluru) March 23, 2024 -
షాకింగ్ లేఆఫ్.. ఇంతకంటే దారుణమైన తొలగింపు ఉంటుందా?
Google shocking layoff: టెక్ పరిశ్రమలో ఇప్పుడు తొలగింపులు సాధారణంగా మారిపోతున్నాయి. అయితే గూగుల్ లాంటి దిగ్గజ కంపెనీలు సైతం లేఆఫ్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నాయి. గూగుల్ తనను ఎంత దారుణంగా తొలగించిందో ఓ ఉద్యోగి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. ముందు యాక్సెస్ పోయింది.. తర్వాత మెసేజ్ జెమిని ఏఐ మోడల్ అల్గారిథమ్లపై పని చేసే తనను గూగుల్ తొలగించిన క్రమాన్ని అలెక్స్ కోహెన్ అనే ఉద్యోగి ‘ఎక్స్’ (గతంలో ట్విటర్)లో షేర్ చేసిన పోస్ట్లో వివరించారు. "గూగుల్ నన్ను ఈ రోజు తొలగించిందని పంచుకోవడం విచారంగా ఉంది. జెమిని కోసం అల్గారిథమ్ల రూపకల్పనకు ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న నాకు ఈరోజు ఉన్నట్టుండి హ్యాంగ్అవుట్స్, గూగుల్ డ్రైవ్కు యాక్సెస్ పోయింది. ఆ తర్వాత నన్ను తొలగించినట్లు మేనేజర్ నుంచి మెసేజ్ వచ్చింది" అని అలెక్స్ కోహెన్ వాపోయాడు. అయితే తాను 12 నెలల తొలగింపు పరిహారాన్ని (సుమారు రూ.22 కోట్లు ) అందుకుంటున్నానని, ఇది చేతికందిన తర్వాత తాను తదుపరి ఏమి చేయాలో నిర్ణయించుకుంటానని అలెక్స్ కోహెన్ తెలియజేశారు. అయితే గత 5 నెలల్లో ఎల్ఎల్ఎంల గురించి, ఏఐ గురించి ఎంతో నేర్చుకున్నానని, ఆ ప్రయాణం బాగుందని రాసుకొచ్చారు. కాగా ఇంతకుముందు గూగుల్ ఒకప్పుడు ఏఐ విభాగంతో ప్రత్యక్ష ప్రమేయం లేని 'సెర్చ్ టీమ్'లో భాగమైన ఒక ఉద్యోగికి జీతంలో 300 శాతం పెంపును అందించిందని పర్ప్లెక్సిటీ ఏఐ సీఈవో అరవింద్ శ్రీనివాస్ పేర్కొన్నారు. పెట్టుబడుల సామర్థ్యాన్ని పెంచుకునేందుకు కంపెనీ "కఠినమైన ఎంపికలు" చేయాల్సిన అవసరం ఉన్నందున మరిన్ని ఉద్యోగాల కోతలు ఉంటాయని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ స్పష్టం చేశారు. Sad to share that I was laid off from Google today. I was in charge of making the algorithms for Gemini as woke as possible. After complaints on Twitter surfaced today, I suddenly lost access to Hangouts and Google Drive, and my manager (he/him), texted me to let me know that i… — Alex Cohen (@anothercohen) February 22, 2024 -
సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
-
కారు ఢీకొని ఐటీ ఉద్యోగి దుర్మరణం.. భార్య నిండు గర్భిణి
విశాఖపట్నం: కారు ఢీకొని ఓ ఐటీ ఉద్యోగి దుర్మరణం చెందాడు. రెండు మూడు రోజుల్లో మృతుని భార్య ప్రసవించనుండగా ఈ దుర్ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రక్తం పంచుకుని పుట్టబోయే బిడ్డను చూడకుండానే ఈ లోకాన్ని వీడిపోయాడని గుండెలవిసేలా రోదిస్తున్నారు. పీఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిఽధిలో ఆదివారం చోటుచేసుకున్న ప్రమాదానికి సంబంధించి స్థానిక సీఐ వై.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అడవివరం వెంకటాద్రినగర్కు చెందిన బోడ సూరిబాబు, భార్య నిర్మలకు వివాహితులైన ఇద్దరు కుమారులు సందీప్, ఉదయ్ కుమార్ సంతానం. ప్రస్తుతం వీరంతా కలిసి నివసిస్తున్నారు. సింహాద్రి అప్పన్న కొండపై ప్లాస్టిక్ బొమ్మలు దుకాణం నడుపుతూ కుమారులు ఇద్దరినీ చదివించడంతో వారు ప్రయోజకులై ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు ఉదయ్ కుమార్ (32) బెంగళూరులో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు. కొన్నాళ్లుగా వర్క్ హోమ్ నేపథ్యంలో ఇంటి వద్దనే ఉంటున్నాడు. ఏడాది కిందటే అతనికి సరిహ అనే యువతితో వివాహం జరిగింది. ప్రస్తుతం ఆమె నిండు గర్భిణి. రెండుమూడు రోజుల్లో ప్రసవిస్తుందని వైద్యులు నిర్ధారించారు. ఈ క్రమంలో మధురవాడలోని మిత్రుడిని కలిసేందుకు మరో స్నేహితుడు జగన్ను తీసుకుని ద్విచక్ర వాహనంపై ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి ఉదయ్కుమార్ బయలుదేరాడు. క్రికెట్ స్టేడియం ఎదురుగా ఉన్న జాతీయ రమదారిపై వెళ్తూ ఎంవీవీ సిటీ ముందు గల రోడ్డు మలుపు తిరుగుతుండగా వెనుక నుంచి వస్తున్న కారు బలంగా ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఉదయ్ కుమార్ అక్కడికక్కడే మరణించగా అతని స్నేహితుడు జగన్కు గాయాలుయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. క్షతగాత్రుని ఆస్పత్రికి తరలించారు. మృతుని సోదరుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారకుడైన కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నామని సీఐ తెలిపారు. -
ఐటీ ఉద్యోగాలని ముంచేశారు
అనంతపురం క్రైం: ఓ సాఫ్ట్వేర్ కంపెనీ పేరిట నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన ఉదంతం అనంతపురంలో వెలుగు చూసింది. బాధితులు సోమవారం అనంతపురం జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ను ‘స్పందన’లో కలసి జరిగిన మోసంపై ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాప్తాడుకు చెందిన టీడీపీ నేత కనుసన్నల్లో అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన శశి, ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన గుర్రం వెంకటరామ్, భానుచంద్రతో పాటు మరికొంత మంది ఘరానా కేటుగాళ్లు.. సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల పేరిట బీటెక్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు వల వేశారు. ప్రధానంగా కంప్యూటర్ శిక్షణ కేంద్రాల వద్ద పాగా వేసిన వీరు అనతి కాలంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 150 మందికి పైగా నిరుద్యోగులను ముగ్గులోకి దింపారు. శాలరీ ప్యాకేజీని బట్టి ధర ఉంటుందంటూ ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల నుంచి రూ.4 లక్షల దాకా వసూలు చేశారు. ఇలా రూ. 5 కోట్లకు పైగా దండుకున్నారు. డబ్బిచ్చిన వారికి ఆరు నెలల శిక్షణ కూడా ఇస్తామన్నారు. శిక్షణ కాలంలో రూ.10 వేల నుంచి రూ.18 వేల దాకా గౌరవ వేతనం కూడా చెల్లిస్తామని నమ్మబలికారు. నకిలీ కంపెనీ పెట్టి... బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీలో ‘సార్టీస్ టెక్నాలజీ లిమిటెడ్’ పేరుతో నకిలీ కంపెనీ ఏర్పాటు చేశారు. నిజమని నమ్మి డబ్బు కట్టిన వారు అదే ప్రాంతంలో అద్దెకు గదులు తీసుకుని ఆరు నెలల పాటు వారు చెప్పిన పని చేసుకుంటూ వచ్చారు. అయితే.. వారికి కంపెనీ పనులు పూర్తి కాలేదంటూ గౌరవ వేతనం కూడా చెల్లించలేదు. చేసేది లేక చాలా మంది నిరుద్యోగులు ‘ఎలాగూ ఇన్ని నెలలు ఉన్నాం కదా?! మిగిలిన కాలం పూర్తి చేస్తే ఉద్యోగం దొరుకుతుంద’న్న ఆశతో అప్పులు చేసి మరీ కాలం గడిపారు. తీరా నిర్వాహకులు రాత్రికి రాత్రే కంపెనీకి తాళాలు వేసి అనంతపురానికి చేరుకున్నారు. బాధితులు బెంగళూరు నుంచి ఇళ్లకు రాలేక, అయిన వారికి ముఖం చూపించలేక నరకయాతన అనుభవించారు. నాన్న ఆరోగ్యం బాగోలేదన్నా కనికరించలేదు పుట్టపర్తికి చెందిన ఓ యువకుడు తండ్రికి తెలియకుండా లక్షలాది రూపాయలు అప్పుగా తెచ్చి వారికి చెల్లించాడు. ప్రస్తుతం తండ్రి ఆరోగ్యం బాగా క్షీణించి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంది. దీంతో అతను అనంతపురం వచ్చి వారిని కాళ్లా వేళ్లా పడినా డబ్బివ్వలేదు. పైగా మరోసారి వస్తే నీపైనే ఎదురు కేసు పెట్టి లోపలేయిస్తామని బెదిరించారు. డబ్బడిగితే బెదిరిస్తున్నారు! నిరుద్యోగులను వంచించిన వారు అనంతపురంలో జల్సాలు చేసుకుంటూ తిరుగుతున్నారు. వారిని బాధితులు కలసి తమ డబ్బు తిరిగివ్వాలని కోరితే... బెదిరింపులకు దిగుతున్నారు. ‘మా వెనుక రాప్తాడుకు చెందిన టీడీపీ నేతలు ఉన్నారు. ఖబడ్దార్’ అంటూ దాడులకు సైతం తెగబడుతున్నారు. రెండు రోజుల క్రితం జిల్లా పరిషత్లోని చిత్రావతి అతిథి గృహం వద్దకు బాధితులను పిలిపించుకుని టీడీపీ నేతలు బెదిరింపులకు దిగారు. ‘అన్నీ మూసుకుని వెళతారా? లేక తన్నులు తింటారా’ అంటూ బెదిరించారు. డబ్బు తిరిగివ్వకపోగా బెదిరింపులు ఎక్కువ కావడంతో కొంత మంది బాధితులు సోమవారం జిల్లా ఎస్పీని కలసి ఫిర్యాదు చేశారు. -
అప్పుల భాదతో ఐటీ ఉద్యోగి కుటుంబం ఆత్మహత్య!
సాక్షి, చైన్నె: కరోనా రూపంలో ఎదురైన కష్టాలతో అప్పుల పాలైన ఐటీ ఉద్యోగి తన తల్లిదండ్రులకు, భార్య, కుమారుడితో విషపు మాత్రలను మింగిచ్చి తానూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయాన్నే స్పృహలోకి వచ్చిన తల్లి ఇంటిలోని దృశ్యాలను చూసి పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు తరలి వచ్చి ఆమెను ఆస్పత్రికి తరలించారు. వివరాలు.. సేలం జిల్లా గోరిమేడు న్యాయ కళాశాల సమీపంలోని ఎంజీఆర్ నగర్లో శివరామన్(85), వసంత(56) దంపతుల కుటుంబం నివాసం ఉంటోంది. శివరామన్ బెంగళూరు విమానాశ్రయంలో పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ దంపతులకు చంద్ర(40), తిలక్(38) కుమారులు. చంద్ర బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. తిలక్ చైన్నెలోని ఓ ఐటీ సంస్థలో పనిచేసేవాడు. తిలక్కు భార్య మహేశ్వరి(35), సాయి కిషోర్ ప్రశాంత్(6) కుమారుడు ఉన్నారు. కరోనా పరిస్థితుల అనంతరం తిలక్కు వర్క్ ఫ్రం హోం విధులను కేటాయించారు. జీతం తగ్గడంతో పాటు మాటలు రాని స్థితిలో ఉన్న తన కుమారుడికి వైద్య చికిత్స తిలక్కు భారంగా మారింది. దీంతో పలు చోట్ల అప్పులు చేశాడు. అందరికీ విషం ఇచ్చి.. మంగళవారం సాయంత్రం భార్య మహేశ్వరితో కలిసి తిలక్ మార్కెట్కు వెళ్లాడు. వారికి కావాల్సిన వస్తువులను కొని తెచ్చాడు. ఫుడ్ కూడా ఆర్డర్ చేసి మరీ తెప్పించాడు. రాత్రి అందరూ కలిసి భోజనం చేశారు. బుధవారం ఉదయం ఏడు గంటల సమయంలో ఈ ఇంట్లో నుంచి వసంత పెట్టిన కేకలతో ఇరుగు పొరుగు వారు పరుగులు తీశారు. ఓ గదిలో నురగలు కక్కిన స్థితిలో శివరామన్, మరో గదిలో మహేశ్వరి, సాయి కిషోర్ పడి ఉండటం, అదే గదిలో తిలక్ ఉరివేసుకుని వేలాడుతుండంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ దృశ్యాలన్నీ చూసిన వసంత స్పహ తప్పింది. ఆమెను చికిత్స నిమిత్తం సేలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టానికి తరలించారు. ఆ ఇంట్లో ఆంగ్లంలో తిలక్ రాసి పెట్టిన లేఖబయట పడింది. వర్క్ఫ్రం హోం రూపంలో ఎదురైన పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, కుమారుడి ఆరోగ్య పరిస్థితి, అప్పుల భారం పెరగడం వెరసి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పేర్కొన్నాడు. తల్లిదండ్రుల తో నిద్ర మాత్రలుగా పేర్కొంటూ, విషపు మాత్రలను మింగిచ్చినట్లు అందులో వివరించాడు. భార్యకు ఆహారంతో పాటు, కుమారుడికి యథా ప్రకారం ఇచ్చే మాత్రలతో కలిపి విషపు మాత్రలను మింగిచ్చినట్లు పేర్కొన్నారు. తానూ ఆత్మహత్య చేసుకుంటున్నానని ముగించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు. బెంగళూరులో ఉన్న పెద్దకుమారుడు చంద్రకు సమాచారం అందించారు. -
సింగపూర్లో ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు
సాక్షి, సింగపూర్/ హైదరాబాద్: ఆగస్టు 6వ తేదీన సింగపూర్లో జరగనున్న ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలలో పాల్గొని విజయవంతం చేయాలని సింగపూర్లోని ప్రవాస తెలుగు వారికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు టెకీలకు సింగపూర్లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ పిలుపునిచ్చారు. మహాసభలకు పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ కుమార్ మఖ్తల నాయకత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. సింగపూర్ ప్రభుత్వ సహకారం అందించేందుకు కృషి చేస్తానని సింగపూర్లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ భరోసా ఇచ్చారు. సింగపూర్ పర్యటనలో ఉన్న ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందం నేడు కుమరన్తో సమావేశం జరిపింది. ఈ సందర్భంగా తెలుగు ఐటీ పరిశ్రమకు చెందిన నిపుణులు, ఇన్వెస్టర్లు, స్టార్టప్లు, టెక్నోక్రాట్స్ ఇటు పరిశ్రమ అభివృద్ధి అటు స్వరాష్ట్రంలో పెట్టుబడులు అనే అంశంపై విస్తృత అవకాశాలు అందించేందుకు సింగపూర్లో అంతర్జాతీయ మహాసభలను నిర్వహిస్తున్న విషయాన్ని బృందం వివరించింది. దాదాపు 100కు పైగా దేశాల నుంచి ప్రతినిధులు హాజరుకానున్న ఈ మహాసభ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారి సత్తాను చాటి చెప్పనున్నారని పేర్కొంటూ, తెలుగు రాష్ట్రాలు ప్రవేశ పెట్టిన ముఖ్యమైన విధానాలు, నిర్ణయాలకు సంబంధించి ఉన్నతాధికారుల నుంచి తెలుసుకునే అవకాశం ఉంటుందని తెలిపింది. టెక్నికల్ ప్రజెంటేషన్, థాట్ ప్రొవొకింగ్ డిస్కషన్స్ వంటివి ఈ మహాసభల్లో భాగం చేయడం వల్ల కేవలం ప్రొఫెషనల్ నెట్వర్క్ విస్తరించుకోవడమే కాకుండా వారి సాంకేతిక పరిజ్ఞానం సైతం పెంపొందించుకునే అవకాశం దక్కుతుందని వెల్లడించింది. సింగపూర్ వేదికగా ప్రపంచ తెలుగు ఐటీ మహాసభలు జరగడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన సింగపూర్లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్ తమ పూర్తి మద్దతు ఇస్తామని ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల నాయకత్వంలోని బృందానికి హామీ ఇచ్చారు. తెలుగు రాష్ట్రాలకు, ఇండియాకు, సింగపూర్కు మధ్య అనుసంధానత కల్పించనుందని సంతోషం వ్యక్తం చేశారు. సింగపూర్లోని తెలుగు టెక్నోక్రాట్స్ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వాన్ని భాగం చేస్తామని, సింగపూర్ ఐటీ మంత్రిని పాల్గొనేలా తాను సహకరిస్తామని హైకమిషనర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రోగ్రాం ఫ్లయర్ను సింగపూర్లోని ఇండియన్ హై కమిషనర్ కుమరన్, ప్రపంచ తెలుగు సమాచార సాంకేతిక మండలి చైర్మన్ సందీప్ మఖ్తల తదితరులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండలి సభ్యులు రాకేష్, సింగపూర్ మండలి సభ్యులు కోటి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: ప్రత్యేక ఆకర్షణగా నాటా విమెన్ ఫోరమ్) -
ఐటీ ఉద్యోగిని.. ఎన్జీవో.. ఓ డేటింగ్ యాప్.. వీళ్ల ప్లానే వేరు..
గురుగ్రామ్: ఇటీవలి కాలంలో హానీట్రాప్ కేసులు పెరుగుతున్నాయి. ఎరక్కపోయి కొందరు కిలేడీల చేతికి చిక్కి మోసపోతున్నారు. తాజాగా ఐటీ కంపెనీలో పనిచేస్తున్న ఓ కిలేడీ డేటింగ్ యాప్లో ఓ వ్యక్తిని పరిచయం చేసుకుని హోటల్కు తీసుకెళ్లింది. అక్కడ సదరు వ్యక్తికి అనుకోని అనుభవం ఎదురైంది. అనంతరం, లైంగిక వేధింపులకు పాల్పడినట్టు డ్రామా క్రియేట్ చేసి డబ్బు కాజేయాలని ప్లాన్ వేసింది. ఈ క్రమంలో హానీట్రాప్కు దిగిన జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన గురుగ్రామ్లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్కు చెందిన బినితా కుమారి(27) గురుగ్రామ్లోని ఓ ఐటీ కంపెనీలో పనిచేస్తోంది. అలాగే, హర్యానా రోహతక్లోని భాలతో గ్రామానికి చెందిన 30 ఏళ్ల మహేశ్ ఫోగట్ ఓ ఎన్జీవోలో పని చేస్తున్నాడు. వీరిద్దరు కలిసి డేటింగ్ యాప్(బంబుల్ డేటింగ్ యాప్)లో అమాయకులకు గాలం వేసి డబ్బులు వసూలు చేస్తున్నారు. కాగా, డేటింగ్ యాప్లో బినితా కుమారి.. ఓ వ్యక్తితో పరిచయం పెంచుకుంది. ఈ క్రమంలో గురుగ్రామ్ సెక్టార్-23లోని ఓ హోటల్కు రావాలని ఆఫర్ ఇచ్చింది. దీంతో, దొరికిందిలే ఛాన్ అని బాధితుడు హోటల్కు వెళ్లాడు. అయితే, హోటల్కు వెళ్లిన తర్వాత మనోడికి ఊహించని విధంగా షాక్ తగిలింది. బినితా కుమారి సదరు వ్యక్తిని బీర్ తాగమని బలవంతం చేసింది. తాను ఊహించినదానికి పరిస్థితులు వేరుగా కనిపించడంతో బాధితుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా, ఆ తర్వాత ఆయనకు ఫోన్ చేసి తనతో అసభ్యంగా ప్రవర్తించావని, లైంగికంగా వేధించావని బెదిరించింది. రూ. 5 లక్షలు ఇవ్వాలని లేదంటే.. పోలీసు కేసు పెడతానని వార్నింగ్ ఇచ్చింది. She is Binita Kumari Known as B on Bumble Befriended men on dating apps Chose hotel as meeting place Said she wants to have "beer & fun" Few minutes into meeting cried Rape Went to police & filed complaint NGO guy then called to "strike deal" The gang Extorted LACS ARRESTED!! pic.twitter.com/rXDmX95HvM — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 అనంతరం, ఆమె గురించి ఆలోచించేలోపే మహేష్ ఫోగట్ నుంచి బాధితుడికి ఫోన్ వెళ్లింది. రూ. 5 లక్షలు ఇస్తేనే సమస్య సెటిల్మెంట్ అవుతుందని బెదిరింపులకు దిగాడు. దీంతో, కంగారుపడిన బాధితుడు చేసేదేమీలేక డీల్కు ఒప్పుకుంటూ రూ.2 లక్షలు మాత్రమే ఇవ్వగలనని చెప్పాడు. ఈ క్రమంలోనే వారిద్దరికీ రూ. 50 వేలు ఇచ్చి భరోసా ఇచ్చాడు. మిగిలిన డబ్బులు త్వరలోనే ఇస్తానని చెప్పాడు. ఆ తర్వాత పోలీసులను ఆశ్రయించాడు. భాదితుడి ఫిర్యాదు మేరకు వీరిద్దరిపై డీఎల్ఎఫ్ ఫేజ్-3 పోలీసు స్టేషన్లో కేసు ఫైల్ అయింది. I was previously contacted by a victim in October too. Same modus operandi. Girl was different in that case. So we don't yet know how big is the gang or how many total victims Their latest victims got in touch We approached higher authorities and @gurgaonpolice swung in action pic.twitter.com/qlVB0b7auk — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) June 8, 2023 కాగా, ఈ కేసుపై రంగంలోకి దిగిన పోలీసులు.. మిగిలిన డబ్బులు తీసుకోవడానికి మౌల్సరి మార్కెట్ సమీపంలోని సాయి టెంపుల్కు రావాలని బాధితుడు ఆ ఇద్దరికీ కాల్ చేశాడు. డబ్బులు తీసుకుంటుండగా మహేష్ను పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఆ తర్వాత బినితా కుమారిని డీఎల్ఎఫ్-3 యూ బ్లాక్ నుంచి అరెస్టు చేసి తీసుకెళ్లారు. ఇక, వీరిద్దరూ ఇప్పటి వరకు 12 మందిని మోసం చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఇది కూడా చదవండి: వీడియో: అప్సరను పూజారి సాయికృష్ణ అందుకే చంపాడు.. షాకింగ్ విషయాలు వెల్లడి -
వర్క్ ఫ్రం హోం: మాకొద్దు మహా ప్రభో ఆఫీసుకు వచ్చేస్తాం.. అసలేం జరిగింది!
మళ్లీ ఆఫీసుల్లో ప్రత్యక్షంగా విధుల నిర్వహణకు ఉద్యోగులు సై అంటున్నారు. సహోద్యోగులతో సరదా సంభాషణలు, మాట్లాడుతూనే విధులు నిర్వర్తించడం, అంతా కలిసి కాఫీ, టీ బ్రేక్లు తీసుకోవ డం, వీకెండ్ ఎంజాయ్మెంట్లు..ఆ మజానే వేరు అని అధికశాతం మంది అభిప్రాయపడుతున్నారు. కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రత్యక్ష, పరోక్ష రూపాల్లో తలెత్తిన పరిస్థితులతో ఐటీ కంపెనీలు మూడేళ్లకు పైగా వర్క్ ఫ్రం హోం, ఇటీవలి కాలంలో హైబ్రిడ్, ఇతర పని విధానాలు అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని కంపెనీలు ఇప్పటికీ వర్క్ ఫ్రం హోంనే కొనసాగిస్తుండగా, మూన్లైటింగ్ (2 లేదా అంతకు మించి ఉద్యోగాలు చేయడం) వెలుగులోకి రావడంతో కొన్ని కంపెనీలు హైబ్రిడ్ విధానాన్ని చేపట్టాయి. మరికొన్ని ఉద్యోగుల్ని పూర్తిగా ఆఫీసులకు రప్పిస్తున్నాయి. హైబ్రిడ్ విధానంలో టెకీలు 2,3 రోజులు ఆఫీసుకు వెళుతూ, మిగతా రోజుల్లో ఇంటి నుంచి పని చేస్తున్నారు. అయినప్పటికీ 86 శాతం మంది భారతీయ వృత్తి నిపుణులు, టెకీలు రెగ్యులర్గా ఆఫీసుకు వెళ్లడం పైనే ఆసక్తి కనబరుస్తున్నట్లు తేలింది. రోజూ ప్రత్యక్షంగా తమ తోటి ఉద్యోగుల్ని కలుసుకోవాలని, వారితో స్నేహ సంబంధాలు కొనసాగించాలని 78% కోరుకుంటున్నట్లు వెల్లడైంది. ఆఫీసులకు వెళితే మనోబలం, మానసికస్థైర్యం పెరుగుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ‘సెన్సస్ వైడ్’అధ్యయనం ఆధారంగా ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ సైట్ లింక్డ్ ఇన్ రూపొందించిన తాజా నివేదికలో పలుఅంశాలు వెల్లడయ్యాయి. నివేదికలో ముఖ్యాంశాలు... ► వర్క్ ప్లేసెస్లో ‘చాయ్ బ్రేక్ బాండింగ్’ (కలిసి టీ తాగే మంచి సమయం) మిస్సవుతున్నామన్న 72 శాతం మంది. ► వర్క్ ఫ్రం హోం విధానానికే పరిమితమైతే ‘కెరీర్ గ్రోత్’(వృత్తి పరమైన ఎదుగుదల) తగ్గిపోతుందనే భావనలో 63% ఉన్నారు. ► ఆఫీసులో గురువారం కల్లా మొత్తం పని పూర్తిచేసుకుని, ఆ రోజునే ‘న్యూ ఫ్రైడే’గా మార్చుకోవాలని, శుక్రవారం ఆఫీసుకు వెళ్లకుండా లాంగ్ వీకెండ్ గడపాలని 79 శాతం మంది కోరుకుంటున్నారు. ► శుక్రవారాల్లో మరింత ఎక్కువ సమయం కుటుంబం, మిత్రులతో గడపాలని 50 శాతం మంది భావిస్తున్నారు. ► రిమోట్ వర్కింగ్ పద్ధతి వల్ల తమ వృత్తులపై ప్రతికూల ప్రభావం పడలేదని 63 శాతం మంది పేర్కొన్నారు. ► కేవలం కొలీగ్స్తో సోషల్ ఇంటరాక్షన్ కోసం ఆఫీసుకు వెళ్లాలనుకుంటున్నట్లు 43 శాతం మంది చెప్పారు. ► సహోద్యోగులతో ముఖాముఖి, ఆఫీసు మీటింగ్లు మరింత కార్యదక్షతతో పని చేసేందుకు దోహదపడతాయని 42 శాతం మంది చెప్పారు. మంచి స్నేహ సంబంధాలు పెరుగుతాయని 41 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► శని, ఆదివారాల బ్రేక్ తర్వాత మొదలయ్యే సోమవారాన్ని ‘మోస్ట్ ఫోకస్డ్ డే’గా 39% మంది పేర్కొన్నారు. నైతిక బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు వృత్తి నిపుణులు, టెకీల వంటి వారు ఫ్లెక్సిబుల్ పని విధానాన్ని కోరుకుంటున్నారు. అదే సమయంలో ఆఫీసులకు రావడానికి అత్యంతప్రాధాన్యతనివ్వడంతో పాటు టీమ్వర్క్ ద్వారా తమ నైతిక బలం పెరుగుతుందని విశ్వసిస్తున్నారు. చాయ్ బ్రేక్లు, కొలీగ్స్తో సరదా చర్చలు తమను చైతన్యపరచడంతో పాటు మరింత మెరుగైన ఫలితాల సాధనకు దోహదపడతాయని భావిస్తున్నారు.– నిరజిత బెనర్జీ, లింక్డ్ఇన్(ఇండియా) మేనేజింగ్ ఎడిటర్ -
తిరుపతిలో దారుణం.. వివాహేతర సంబంధమే కారణం!
సాక్షి, తిరుపతి: తిరుపతి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చంద్రగిరిలోని గంగుడుపల్లెలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ నాగరాజు హత్యకు గురయ్యాడు. కారులో ఉన్న నాగరాజుపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అతను అక్కడే సజీవ దహనమయ్యాడు. అయితే, నాగరాజు హత్యకు తన తమ్ముడి వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల ప్రకారం.. బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజు.. తిరుపతి నుంచి వెళ్తుండగా గంగుడుపల్లె దగ్గర ఆయన కారు మంటల్లో కాలి బూడిదైంది. నాగరాజు ఆ కారులోనే సజీవ దహనం అయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అక్కడున్న వస్తువులు, కారు నంబర్ ప్లేట్ ఆధారంగా మృతుడు నాగరాజుగా గుర్తించారు. ఘటనా స్థలంలో క్లూస్ టీమ్ సాయంతో విచారణ కొనసాగుతోంది. అయితే, నాగరాజును సర్పంచ్ చాణిక్య హత్య చేసినట్టు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివాహేతర సంబంధం కారణంగా పంచాయితీ పేరుతో నాగరాజును సర్పంచ్ తీసుకెళ్లాడు. అనంతరం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, నాగరాజు తమ్ముడు పురుషోత్తం అదే గ్రామానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సర్పంచ్ చాణిక్య సోదరుడు వితింజయ్ భార్యతో పురుషోత్తంకు అక్రమ సంబంధం ఉండటంతో దీనిపై ఘర్షణలు జరుగుతున్నాయి. ఈ విషయమై శివరాత్రి రోజు కూడా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం.. పంచాయితీ పెట్టించినట్టు సమాచారం. అక్రమ సంబంధం కారణంగా రెండు కుటుంబాల మధ్య కొద్దిరోజులుగా పంచాయితీ నడుస్తోంది. ఇందులో భాగంగా గ్రామ సర్పంచ్ చాణిక్య.. తాజాగా నాగరాజుతో మాట్లాడాలని పిలిపించాడు. ఈ క్రమంలోనే మాటల సందర్భంగా ఆగ్రహంతో సర్పంచ్ చాణిక్య.. ఈ దారుణానికి పాల్పడినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇక, సర్పంచ్ చాణిక్య ప్రస్తుతం పరారీలో ఉన్నాడు. పోలీసులు అతడి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. కాగా, నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. మరణ వార్త తెలుసుకొని వారంతా బోరునవిలపిస్తున్నారు. ఈ సందర్బంగా నాగరాజు భార్య సులోచన సంచలన వ్యాఖ్యలు చేశారు. నా భర్తను గోపి, రుపేంజయ, చాణిక్య, సుబ్రహ్మణ్యం చంపేశారు. రాజీచేస్తామని పిలిచి కారుతో సహా కాల్చారు. నాకు న్యాయం చేయకపోతే వారిని కూడా చంపేస్తాం అని ఆవేదనలో సీరియస్ కామెంట్స్ చేశారు. -
వీధి కుక్కలకు తిండి పెడుతోందని మహిళా టెక్కీపై
బనశంకరి(బెంగళూరు): పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు జంతు ప్రేమికురాలికి దౌర్జన్యం ఎదురైంది. వీధి కుక్కలకు తిండి పెడుతోందని మహిళా టెక్కీ పై ఇద్దరు దాడికి పాల్పడిన బెంగళూరు ఆనేకల్ తాలూకా జిగణిలో చోటుచేసుకుంది. బృందావన లేఔట్లో గల వరుణ్ అపార్టుమెంట్ నివాసి మీరా తివారి బాధితురాలు. జిగణిలోని బృందావన లేఔట్లో వీధి కుక్కలు ఉన్నాయి. మహిళా టెక్కీ మీరా తివారి సొంత ఖర్చుతో వీధికుక్కలకు తిండి పెట్టేవారు. దీనిపై కొందరు ముందు నుంచి గుర్రుగా ఉన్నారు. కోడిగుడ్లు తేవడానికి వెళ్లగా మీరా తివారి కోడిగుడ్లు తీసుకురావడానికి సమీపంలోని కిరాణా అంగడికి వెళ్లగా అనుసరిస్తూ వీధి కుక్కలు కూడా వెళ్లాయి. ఈ సమయంలో షెడ్లో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు ఆమెతో గొడవకు దిగారు. కట్టెలతో దాడికి పాల్పడడంతో కేకలు వేయగా ఆమె తల్లి పరుగున రావడంతో దుండగులు ఉడాయించారు. తరువాత బాధితురాలు 112 నంబరుకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించింది. బాధితురాలి ఆక్రోశం పోలీసులు చేరుకుని మీరా తివారిని ఆసుపత్రికి తరలించారు. కుక్కలకు సాయం చేస్తోందని గత మూడేళ్లలో మీరాతివారిపై దాడికి పాల్పడటం ఇది రెండోసారి. పోలీసులు దుండగులను అరెస్ట్ చేయడానికి బదులు కట్టుకథలు చెబుతున్నారని మీరా తివారి ఆరోపించింది. నిమ్హాన్స్ ఆసుపత్రిలో చికిత్సపొందిన అనంతరం ఆమె బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ వివాదం భాష రంగు పులుముకోవడం గమనార్హం. నేను కన్నడలో బాగా మాట్లాడానని, కానీ నేను నాన్ లోకల్ అని, అహంకారి అని దూషించారని ఆమె తెలిపింది. నేను బెంగళూరులో పుట్టి పెరిగానని, 2018 నుంచి లేఔట్లో అద్దె ఇంట్లో ఉంటున్నానని పేర్కొంది. కేసు దర్యాప్తులో ఉందని, ఇప్పటివరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని, ఇద్దరి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
భార్యకు బీమా పత్రాలు, డెత్నోట్ వాట్సాప్ చేసి..
సాక్షి, యశవంతపుర: ఇంటికి ఆలస్యంగా వస్తానని భార్యకు చెప్పాడు, తరువాత బీమా పత్రాలను, డెత్నోట్ను వాట్సప్ చేసి నడుస్తున్న రైలు కిందకు దూకి కేంద్ర ఆదాయపు పన్ను (ఐటీ) శాఖ ఇన్స్పెక్టర్ ఒకరు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు... ఉత్తరప్రదేశ్కు చెందిన దేవేంద్ర దూబె 10 ఏళ్ల నుంచి బెంగళూరులో ఐటీ శాఖలో ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ఆయన యశవంతపురలోని బీడీఏ ఆఫీసు వద్ద నడుస్తున్న రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానిక పోలీసులు శనివారం తెలిపారు. సుమారు 10 రోజుల కిందటే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని చెప్పారు. దూబె చివరిసారిగా యూపీలో ఉంటున్న తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి తరువాత బెంగళూరులో భార్య ఆరతి మాళవికి కాల్ చేసి మాట్లాడి, ఇంటికి ఆలస్యంగా వస్తానని చెప్పాడు. కొంతసేపటికి తన ఇన్సూరెన్స్ పత్రాల కాపీలను, సూసైడ్ నోట్ను భార్యకు వాట్సాప్ చేశాడు. నా మరణానికి నాదే బాధ్యత అని డెత్నోటులో రాశాడు. తన భర్త కనిపించడం లేదంటూ భార్య యశవంతపుర పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు గాలించగా రైలు పట్టాల వద్ద మృతదేహం కనిపించింది. మృతిపై పలు అనుమానాలు వ్యక్తం కావటంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. (చదవండి: అనుమానిత ఉగ్రవాది బెంగళూరులో అరెస్టు) -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య.. కారణం అదేనా?
కృష్ణరాజపురం: మానసిక ఆందోళనతో మహిళా టెక్కీ ఆత్మహత్య చేసుకుంది. కాగా, ఈ విషాద ఘటన గురువారం రాత్రి కర్నాటకలోని కృష్ణరాజపురం నగరంలోని బసవేశ్వర నగర పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. ఆత్మహత్య చేసుకున్న టెక్కీ స్వాతి (26) ఇక్కడి గ్లోబల్ విలేజ్లో విధులు నిర్వహిస్తోంది. అయితే, రెండేళ్ల క్రితం ఐటీ ఉద్యోగి దామోదర్ను వివాహం చేసుకుంది. తన ఇంటిలోనే ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
అనాథాశ్రమంలో పెళ్లి బాజా.. యువతికి తాళి కట్టిన ఐటీ ఉద్యోగి
సాక్షి, హుబ్లీ: హుబ్లీ కేశ్వాపురలోని అనాథ శరణాలయంలో గురుసిద్దమ్మ అనే యువతికి అందరూ పెద్దలై పెళ్లి చేశారు. బెంగళూరులో ఆదాయపు పన్ను (ఐటీ) శాఖలో ఉద్యోగం చేస్తున్న హేమంత్కుమార్ అనే వరుణ్ని వెతికి వైభవంగా మూడుముళ్ల వేడుక పూర్తి చేశారు.వివరాలు.. కేశ్వపుర సేవా భారతీ ట్రస్ట్లో తల్లీతండ్రీ లేని బాలిక గురుసిద్దమ్మను చిన్నప్పుడే ఎవరో చేర్పించారు. ఇటీవలే 18 ఏళ్లు నిండడంతో ఆశ్రమ నిర్వాహకులు పెళ్లి ప్రయత్నాలను ప్రారంభించారు. బెంగళూరులో సరస్వతి–నంజుండరావ్ అనే దంపతుల కుమారుడు హేమంత్తో ఖరారు చేశారు. అతడు మంచి ఉద్యోగం చేస్తున్నప్పటికీ గురుసిద్దమ్మ కులగోత్రాలతో హోదాతో సంబంధం లేకుండా పెళ్లికి అంగీకరించడం విశేషం. ఆర్ఎస్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు, గతంలో పెళ్లయి జీవితంలో స్థిరపడిన అనాథాశ్రమ యువతులు ఎంతో మంది మధ్య ఘనంగా వివాహ వేడుక జరిగింది. చదవండి: (రెండేళ్లుగా సహజీవనం.. వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని..!) -
ఐటీలో లక్షల జీతం వదిలి సాగుపై ఫోకస్.. రాజారెడ్డి సక్సెస్ స్టోరీ
నెలకు నాలుగు లక్షల రూపాయల వేతనం.. మల్టీ నేషనల్ కంపెనీలో గౌరవప్రదమైన ఉద్యోగం.. దుబాయ్లో ఆహ్లాదకరమైన జీవనం.. వీటన్నింటినీ వదులుకుని ఆయన స్వగ్రామంలో రైతుగా మారాడు. వ్యవసాయంపై మమకారంతో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచాడు. కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లా జూపాడుబంగ్లా మండలం పారుమంచాల గ్రామానికి చెందిన బోరెడ్డి రాజారెడ్డి ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో ఇంజినీరింగ్(బీటెక్) పూర్తి చేశాడు. ప్రొడక్షన్ మేనేజ్మెంటులో ఎంబీఏ కూడా చేయడంతో ఈయనకు దుబాయ్లోని ఓ మల్టీనేషనల్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్గా 2007లో ఉద్యోగం వచ్చింది. నెలకు రూ.4 లక్షల వేతనం ఇచ్చేవారు. కోవిడ్ సమయంలో ఈయన స్వగ్రామానికి వచ్చి, తనకున్న 24 ఎకరాల పొలంలో వ్యవసాయం చేసేందుకు అధ్యయనం చేశాడు. డ్రాగన్ప్రూట్ సాగు లాభదాయకమని గ్రహించి, గుజరాత్కు వెళ్లి మార్కెటింగ్ తదితర అంశాలను పరిశీలించి వచ్చాడు. మల్టీనేషనల్ కంపెనీల నుంచి ప్రత్యేక ఆఫర్లు వచ్చినా వాటిని తిరస్కరించి, వ్యవసాయం మీదనే ఆసక్తి చూపాడు. ప్రయోగాత్మకంగా 2021 ఏప్రిల్లో నాలుగు ఎకరాల్లో డ్రాగన్ ప్రూట్ సాగుకు శ్రీకారం చుట్టాడు. ఈయన శ్రమ ఫలించి, సరిగ్గా 14 నెలలకు కాపు మొదలై, మొదటి పంటలోనే పెట్టిన పెట్టుబడిలో 90 శాతం దక్కింది. సాగు ఇలా.. డ్రాగన్ప్రూట్ సాగుకు మొదటి ఏడాది మాత్రమే పెట్టుబడి వ్యయం ఎక్కువగా ఉండి, రెండో ఏడాది నుంచి తగ్గుతూ వస్తుంది. ఎకరా తోటకు 500 సిమెంటు పోల్స్ పాతుకొని, వీటి పైన బండి చక్రం లేదంటే టైరు వంటివి ఏర్పాటు చేసుకోవాలి. అంట్లు తెచ్చుకోవడంతోపాటు డ్రిప్ సమకూర్చుకోవాల్సి ఉంటుంది. వీటి కోసం రాజారెడ్డి ఎకరాకు రూ.6 లక్షల ప్రకారం నాలుగు ఎకరాలకు రూ. 24 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సీమామ్(ఎస్ఐఏఎం) రెడ్, థైవాన్ పింక్ రకాల అంట్లు ఒక్కొక్కటి రూ.100 ప్రకారం గుజరాత్ నుంచి తెచ్చుకుని, ఒక్కో సిమెంటు దిమ్మెకు 4 అంట్లు ప్రకారం ఎకరాకు 2,000 నాటుకున్నాడు. నాలుగు ఎకరాల్లో 8 వేల మొక్కలు అభివృద్ధి అయ్యాయి. డ్రాగన్ఫ్రూట్కు చీడపీడల బెడద ఉండదు. పశువులు తినే అవకాశం కూడా లేదు. బెట్టను తట్టుకుంటుంది. దిగుబడి పెంచుకోవడానికి, బరువు రావడానికి ఎరువులు మాత్రం ఇవ్వాల్సి ఉంది. దిగుబడి ఇలా.. 2021 ఏప్రిల్లో అంట్లు నాటుకోగా సరిగ్గా 14 నెలల నుంచి అంటే ఈ ఏడాది జూన్ నుంచి కాపు మొదలైంది. గులాబీ రంగులో కాయలు ఆకర్షణీయంగా ఉన్నాయి. ఇప్పటి వరకు మొదటి పంటలో 16 టన్నులు దిగుబడి వచ్చింది. మరో టన్ను వరకు వచ్చే అవకాశం ఉంది. కాయ బరువు 400 గ్రాముల నుంచి 700 గ్రాముల వరకు ఉంటోంది. టన్ను సగటున రూ.1.30 లక్షల ధరతో విక్రయించగా రూ.20.80 లక్షలు వచ్చాయి. మరో టన్ను పంట చెట్లపై ఉంది. మొత్తంగా మొదటి పంటలోనే రూ.22 లక్షల ఆదాయాన్ని రాజారెడ్డి పొందారు. పెట్టుబడి రూ.24 లక్షల పెట్టగా, మొదటి పంటలోనే 90 శాతం పెట్టుబడి వచ్చింది. డ్రాగన్ ప్రూట్ 30 ఏళ్లపాటు కాపు వస్తుంది. మొదటి ఏడాది మినహా రెండో ఏడాది నుంచి పెట్టుబడి వ్యయం ఎకరాకు గరిష్టంగా రూ.50 వేల వరకు మాత్రమే వస్తుంది. క్రమంగా దిగుబడి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కెమికల్స్కు తావు లేకుండా డ్రాగన్ ప్రూట్ పోషకాలకు నెలవు. దీనిని చిన్నారుల నుంచి వయో వృద్ధుల వరకు తింటారు. కెమికల్స్ వాడకుండా ప్రకృతి వ్యవసాయం విధానంలో ద్రవ, ఘనజీవామృతం, పశువుల ఎరువులు, కంపోస్ట్ ఎరువులు మాత్రమే వినియోగిస్తూ డ్రాగన్ ప్రూట్ సాగు చేస్తున్నట్లు రైతు రాజారెడ్డి తెలిపారు. చెట్టుకు కాయలు ఎక్కువగా రావడం, బరువు ఎక్కువగా ఉండడం కోసం తగిన మోతాదులో రసాయన ఎరువులు వినియోగిస్తున్నట్లు చెప్పారు. దీంతో మొదటి పంటలోనే ఎకరాకు 4 టన్నులకుపైగా దిగుబడి వచ్చినట్లు రాజారెడ్డి వివరించారు. ఎంతో సంతోషంగా ఉంది డ్రాగన్ఫ్రూట్ సాగు విజయవంతం కావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. మరింత పట్టుదలతో పనిచేసే అవకాశం వచ్చింది. ట్రీపుల్ఈ, ఎంబీఏ పూర్తి చేసి 13 ఏళ్లపాటు నెలకు రూ.4 లక్షల వేతనంతో దుబాయ్లో పనిచేశాను. ఎప్పుడూ ఇంత సంతృప్తి లేదు. ఎవరైనా డ్రాగన్ఫ్రూట్ సాగుకు ముందుకు వస్తే సహకరిస్తాను. తక్కువ ధరకే అంట్లు సరఫరా చేస్తాం. మిగిలిన మా పొలంలో పండ్లతోటలు అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్నాం. – బోరెడ్డి రాజారెడ్డి (91548 71980) -
ప్రాణం తీసిన సెల్ఫీ.. వినిత చౌదరి కన్నుమూత
తిరువొత్తియూరు: సెల్ఫీ మోజు నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సెల్ఫీ చేసుకుంటున్న సమయంలో కాలుజారి కల్లాడి నదిలో పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తిరుపతికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆదివారం శవమై తేలింది. వివరాల ప్రకారం.. తిరుపతికి చెందిన కట్టా వినిత చౌదరి (26) కర్ణాటకలోని బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. శని, ఆదివారం సెలవులు కావడంతో స్నేహితులతో కలిసి ఊటీ విహారయాత్రకు వచ్చారు. శనివారం సాయంత్రం కల్లాడి నది ఒడ్డుపై స్నేహితులతో కలిసి సెల్ఫీ చేసుకుంటున్న సమయంలో వినిత చౌదరి నదిలో పడిపోయారు. ఆ సమయంలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చేపట్టారు. శనివారం రాత్రి వరకూ గాలించిన ఆచూకీ దొరకలేదు. ఆదివారం ఉదయం గాలింపు చేపట్టి వినితా చౌదరి మృతదేహాన్ని బయటకు తీశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: విహారంలో విషాదం.. పడవ బోల్తాపడి ఒకే ఫ్యామిలీలో 8 మంది మృతి -
ఐటీ సిటీకి తగ్గని తలనొప్పి!
బనశంకరి(బెంగళూరు): దక్షిణాదిలోనే ఉద్యాననగరి డ్రగ్స్కు నిలయంగా మారిందని అపకీర్తిని పొందింది. వీధి కార్మికులు, విద్యార్థులు, ఐటీ బీటీ ఉద్యోగులు ఇలా అనేక వర్గాలు డ్రగ్స్ మత్తుకు అలవాటు పడ్డారని ప్రచారం ఉంది. నగరంలో వీదేశీ పెడ్లర్లదే హవా. ఈ ఏడాదిలో తొలి 4 నెలల్లో 1,734 డ్రగ్స్ కేసులు వివిధ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదుకాగా 900 కిలోలకు పైగా డ్రగ్స్ ను పోలీసులు సీజ్ చేశారు. 2019లో 1,260 మంది అరెస్ట్, 2020లో 3,673 మంది డ్రగ్స్ దందాలో పట్టుబడ్డారు. 60 శాతం బెంగళూరు వాటా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న డ్రగ్స్ దందాలో బెంగళూరు వాటా 60 శాతానికి పైనే ఉంది. ఎంత పెద్ద పోలీస్ వ్యవస్థ ఉన్నప్పటికీ ఆటకట్టించడం సాధ్యం కావడం లేదు. గత ఏడాది ఐటీ సిటీలో రూ.100 కోట్ల డ్రగ్స్ వ్యాపారం సాగినట్లు అంచనా. ఇందులో 10 శాతం మాత్రమే పోలీసులకు దొరికింది. గంజాయి, హఫీం, కొకైన్, హషిష్, హెరాయిన్, కెటామిన్, ఎండీఎంఏ మాత్రలు, ఎల్ఎస్డీకి ఎక్కువ డిమాండ్ ఉంది. మత్తు పర్యవేక్షక దళాలు ఈ నేపథ్యంలో డ్రగ్స్ ముఠాలకు పూర్తిగా అడ్డుకట్ట వేయాలని, ఇందుకోసం ప్రత్యేక డ్రగ్స్ మానిటరింగ్ సెల్ ప్రారంభించాలని పోలీసు ఉన్నతాధికారులు తీర్మానించారు. ఒక్కో మానిటరింగ్ సెల్లో ఒక ఎస్ఐ, ఏఎస్ఐ, నలుగురు కానిస్టేబుల్స్తో కూడిన బృందం నిరంతరం డ్రగ్స్ సరఫరాదారులపై కన్నేసి ఉంచుతుంది. వారిని పట్టుకుని జైలుకు తరలించడం, బెయిల్ రాకుండా చూడడం కూడా బృందం పర్యవేక్షిస్తుంది. డ్రగ్స్ కేసుల విచారణ సత్వరమే పూర్తయ్యేలా సాక్ష్యాధారాలను సేకరిస్తారు. దక్షిణ విభాగంలో ఇప్పటికే డ్రగ్స్ మానిటరింగ్ సెల్ సిద్ధమైంది. ఆన్లైన్లో మత్తు లావాదేవీలు ► సిటీలో హెణ్ణూరు, బాణసవాడి, కోరమంగల, కొత్తనూరు, రామమూర్తినగర, యలహంక, పుట్టేనహళ్లి, వైట్ఫీల్డ్, మారతహళ్లి, బెల్లందూరు ప్రాంతాల్లో డ్రగ్స్ బెడద అధికం. ► డ్రగ్స్ విక్రయాలు వాట్సాప్, టెలిగ్రాం తదితర సోషల్ మీడియా గుండా జోరుగా సాగుతున్నాయి. ఆన్లైన్లో సొమ్ము జమ చేస్తే ఇంటికి తెచ్చివ్వడం మామూలైంది. నైజీరియాతో పాటు ఆఫ్రికా దేశాల నేరగాళ్లు ఇటువంటి నెట్వర్క్లను నడిపిస్తున్నట్లు పోలీస్ వర్గాల అంచనా. ► టెక్కీలు, కాలేజీ విద్యార్థులు, శ్రీమంత యువతీ యువకులే డ్రగ్స్ విక్రయదారుల టార్గెట్ ► ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్టయి నేరం రుజువైతే కనీసం పదేళ్లు జైలుశిక్ష పడుతుంది ► సులభంగా బెయిల్ లభించడంతో జైలు నుంచి రాగానే మళ్లీ డ్రగ్స్ అమ్మడం పరిపాటి. -
భార్య , బిడ్డల్ని రంపంతో కోసి చంపేశాడు!
సాక్షి, చెన్నై : భార్య, ఇద్దరు బిడ్డల్ని చెట్లు కోసే రంపంతో కోసి చంపేసి, ఆ పై అదే రంపంతో తన గొంతు కోసుకుని ఓ ఐటీ ఉద్యోగి చెన్నైలో శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై పల్లావరం సమీపంలోని పులిచ్చలూరు వెంకటేశ్వర నగర్ వినాయక ఆలయం వీధికి చెందిన ప్రకా‹Ù(41) ఓ ప్రైవేటు సంస్థలో ఐటీ ఉద్యోగి. ఆయనకు భార్య గాయత్రి(39), కుమార్తె నిత్యశ్రీ(13), కుమారుడు హరికృష్ణ (9) ఉన్నారు. అదే ప్రాంతంలో గాయత్రి నాటు మందుల దుకాణం సైతం నడుపుతున్నారు. తొలుత అనుమానాస్పదంగా.. శనివారం ఉదయం వీరి ఇంటి తలుపులు తెరిచే ఉన్నా, ఎవ్వరు బయటకు రాకపోవడంతో ఇరుగు పొరుగు వారు ఇంట్లోకి వెళ్లి చూడగా, రక్తం ఏరులై పారుతుండడంతో ఆందోళనకు గురయ్యారు. శంకర్ నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మరణించిన వారి గొంతులు రంపంతో కోయబడి ఉండటంతో అనుమానాస్పద మరణాలుగా భావించారు. నలుగురు మరణించినా రంపం మాత్రం ఆన్లోనే ఉండటంతో అనుమానాలు బయలు దేరాయి. అయితే, అక్కడి గోడకు అంటించిన లేఖ, డైరీలో ఉన్న మరో లేఖను బట్టి.. ఇది ప్రకాష్ ఘాతుకంగా వెలుగు చూసింది. తమ నలుగురి మరణానికి ఎవ్వరూ కారకులు కాదు అని ఆలేఖలో ప్రకాష్ వివరించాడు. అప్పులు అధికం కావడంతోనే.. అప్పులు పాలైన ప్రకాష్ బలన్మరణానికి సిద్ధమయ్యాడు. ఇందు కోసం ఆన్లైన్లో ఈనెల 19వ తేదీన బ్యాటరీతో నడిచే రంపంను కొనుగోలు చేశాడు. శుక్రవారం రాత్రి పిల్లలు నిద్రకు ఉపక్రమించినానంతరం రంపంతో గొంతు కోసి చంపేశాడు. అలాగే, భార్యను కూడా చంపేసి, అదే రంపంతో తాను కూడా గొంతు కోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో లభించిన లేఖ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నట్లు తాంబరం పోలీసు కమిషనర్ రవి వెల్లడించారు. ఇది కూడా చదవండి: అత్తింటి పోరుకు బావిలో శవాలైన ముగ్గురు అక్కాచెళ్లెళ్లు, ఇద్దరు చిన్నారులు.. కారణం? -
ఇప్పటివరకు లాటరీ, క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్లు.. తాజాగా రివర్స్ పేమెంట్ పేరుతో
సాక్షి, హైదరాబాద్: నగరానికి చెందిన ఓ ఐటీ ఉద్యోగి తన ఇల్లు అద్దెకు ఇస్తానని, నెలకు రూ.20 వేల కిరాయి అని ఓ వెబ్సైట్లో ప్రకటన పెట్టాడు. అనంతరం ఓ వ్యక్తి ఆయనకు కాల్ చేసి తన పేరు రణ్దీప్సింగ్ అని, తాను సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) అధికారి అని పరిచయం చేసుకున్నాడు. పుణే నుంచి హైదరాబాద్కు బదిలీ అయిందని, తనకి ఇల్లు నచ్చిందని, అడ్వాన్స్ చెల్లిస్తానని తెలిపాడు. ఇక్కడే ఓ మెలిక పెట్టాడు. అది గుర్తించని ఐటీ ఉద్యోగి మోసపోయాడు. సీఐఎస్ఎఫ్లో రివర్స్ పేమెంట్ విధానం ఉంటుందని, తన ఖాతాకు ఒక రూపాయి బదిలీ చేస్తే వెంటనే సీఐఎస్ఎఫ్ విభాగానికి చెందిన బ్యాంక్ ఖాతా నుంచి రెట్టింపు సొమ్ము జమ అవుతుందని నమ్మించాడు. దానిని నిర్ధారించుకోవాలంటే ఒక రూపాయి బదిలీ చేయాలని కోరాడు. సరే అని యజమాని ఒక రూపాయి బదిలీ చేయగానే.. వెంటనే రెండు రూపాయలు జమయ్యాయి. దీంతో ఇది నిజమేనని నమ్మిన సదరు ఇంటి యజమాని డెబిట్ కార్డ్ నుంచి 12 లావాదేవీల్లో రూ.11.99 లక్షలు సైబర్ నేరస్తుడి ఖాతాకు బదిలీ చేశాడు. కానీ.. ఎంతకీ రెట్టింపు సొమ్ము జమ కాకపోవటంతో తాను మోసపోయానని గ్రహించి లబోదిబోమన్నాడు. ఇప్పటివరకు లాటరీ వచ్చిందని, క్రెడిట్ కార్డ్ అప్గ్రేడ్ అని రకరకాల మోసాలు చేసిన సైబర్ నేరస్తులు.. తాజాగా రివర్స్ పేమెంట్ విధానంతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇల్లు అద్దెకు తీసుకుంటామని చెప్పి, రివర్స్ పేమెంట్లో రెట్టింపు సొమ్ము జమ అవుతుందని ఆశ చూపించి మోసాలకు పాల్పడుతున్నారు. చదవండి: హైదరాబాద్లో విషాదం.. భర్త, మేనమామతో గొడవ.. న్యాయవాది ఆత్మహత్య నిందితులు ఓ చోట, ఖాతాలు మరో చోట.. రివర్స్ పేమెంట్ మోసాలు ఎక్కువగా రాజస్థాన్లోని అల్వార్, భరత్పూర్, ఉత్తర్ప్రదేశ్లోని మధుర, హరియాణాలోని నుహ్ జిల్లాల నుంచి జరుగుతున్నాయని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. సైబర్ నేరస్తులు వినియోగించే సిమ్ కార్డ్లు, బ్యాంక్ ఖాతాలు అసోం, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలలోని చిరునామాలతో ఉంటున్నాయి. మోసాలకు పాల్పడేది మాత్రమే రాజస్థాన్, యూపీ, హరియాణా బార్డర్ల నుంచి చేస్తుంటారు. దీంతో నేరస్తులను ట్రాక్ చేయడం కష్టంగా మారిపోయిందని ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. ఐటీ ఉద్యోగులు, బ్యాంకింగ్ ప్రొఫెషనల్స్, ఉన్నతోద్యోగులను లక్ష్యంగా చేసుకొని ఈ తరహా మోసాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. క్యూఆర్ కోడ్ చెల్లింపుల కోసమే.. బాధితులను నమ్మించేందుకు సైబర్ నేరస్తులు ఒకట్రెండు సందర్భాలలో రెట్టింపు సొమ్ము జమ చేస్తున్నారు. పెద్ద మొత్తంలో నగదు బదిలీ కాగానే కామ్గా సైలెంటవుతున్నారు. ఎంతకీ రెట్టింపు డబ్బు జమ కాకపోవటంతో బాధితులు మోసపోయామని గ్రహించి.. చేసేదేమీలేక పోలీసులను ఆశ్రయిస్తున్నారు. క్యూఆర్ కోడ్ అనేది కేవలం చెల్లింపులు చేసే సాంకేతిక విధానమే తప్ప డబ్బులు స్వీకరించేది కాదు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే పేమెంట్ మాత్రమే చేయాలి. అంతేతప్ప స్కాన్ చేస్తే డబ్బులు జమ అవుతాయని ఎవరైనా చెబితే అది మోసమని గ్రహించాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచిస్తున్నారు. చందానగర్లోని ఓ ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్, కూకట్పల్లికి చెందిన మరో ఐటీ ఉద్యోగి కూడా ఇదే తరహాలో సైబర్ నేరస్తుల చేతికి చిక్కారు. ఇంటి అద్దె చెల్లించేందుకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాలని చెప్పి ఖాతా నుంచి రూ.లక్షల్లో సొమ్ము పోగొట్టుకున్నారు. -
విశాఖలో స్పా సెంటర్ ఉద్యోగిని ఆత్మహత్య
సాక్షి, పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నగరంలోని ఒక స్పా సెంటర్లో పనిచేస్తున్న ఉద్యోగిని ఆత్మహత్య చేసుకుంది. మూడో పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... హైదరాబాద్కి చెందిన శర్ల జోసఫ్ (21) కొంత కాలంగా సీబీఎం కాంపౌండ్ వీఐపీ రోడ్డులో గల ఒక స్పా సెంటర్లో పనిచేస్తుంది. స్పా సెంటర్ పైభాగంలో గల గదిలో ఆమె నివసిస్తుంది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున తాను నివసిస్తున్న గదిలో ఫ్యానుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన స్పా సెంటర్ నిర్వాహకులు ఇచ్చిన సమాచారంతో మూడో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్కి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. ఈ కేసుని త్రీటౌన్ సీఐ కోరాడ రామారావు పర్యవేక్షణలో దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఉక్రెయిన్లో తనయుడి వేదన.. టీవీ చూస్తూ ఆగిన తల్లి గుండె!) -
ఐటీ ఉద్యోగి దారుణహత్య
తిరువళ్లూరు: భూతగాదాల కారణంగా సొంత అన్న కూతురిని బాబాయి దారుణంగా హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా కూవం నది పరివాహక ప్రాంతానికి చెందిన లోకనాయగి.. భర్త ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో కూతురు శివరంజనితో కలిసి నివాసం ఉంటున్నారు. బీసీఏ పూర్తి చేసిన శివరంజిని చెన్నైలోని ఐటీ కంపెనీలో పని చేస్తోంది. శివరంజిని తల్లిదండ్రులకు చిన్నాన్న బాలచంద్రన్కు మధ్య భూతగాదా ఉన్నట్లు తెలుస్తుంది. సోమవారం ఇరు కుటుంబాలు స్వల్పంగా ఘర్షణకు దిగారు. దీంతో మనస్థాపం చెందిన లోకనాయగి తన మరిది బాలచంద్రన్పై ఫిర్యాదు చేయడానికి తిరువళ్లూరు టౌన్ పోలీసు స్టేషన్కు వెళ్లింది. దీంతో బాలచంద్రన్ ఆగ్రహంతో ఇంట్లోకి చొరబడి శివరంజినిని విచక్షణా రహితంగా నరికి హత్య చేశాడు. అనంతరం పోలీసు స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. లోకనాయగి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
'లక్షల్లో ఉన్న షేర్లను కోట్లలోకి తీసుకెళ్తాం'.. ఐటీ ఉద్యోగిని..
సాక్షి, హైదరాబాద్ (హిమాయత్నగర్): ట్రేడింగ్ వెబ్సైట్లో చూశాం, మీరు చాలా షేర్లు రాబట్టుకోగలిగారు. కానీ, దానిపై ఎక్కువ టైం పెట్టలేకపోతున్నారు. మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ మాకిస్తే మేమే ట్రేడింగ్ చేసి లక్షల్లో ఉన్న షేర్లను కోట్లలోకి తీసుకెళ్తామంటూ నగర యువతిని మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. వాట్సాప్ కాల్ ద్వారా నిమిషాల పాటు మాట్లాడి, ఒప్పించారు. ఇలా తన వద్ద ఉన్న పాస్వర్డ్, యూజర్ ఐడీ తీసుకుని తన షేర్లన్నీ వాళ్ల అకౌంట్లోకి మార్చుకుని మోసం చేశారంటూ ఐటీ ఉద్యోగి గురువారం సిటీ సైబర్ క్రైం పోలీసుల్ని ఆశ్రయించింది. ఎస్ఐ ప్రశీన్రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఓ ప్రముఖ కంపెనీలో ఐటీ ఉద్యోగిగా చేస్తున్న యువతికి ట్రేడింగ్ అంటే ఇష్టం.‘జెరోధా’ అనే వెబ్సైట్లో ఆమె కొంతకాలంగా ట్రేడింగ్ చేస్తూ.. రూ. 9 లక్షల షేర్లను సంపాదించుకున్నారు. ఈ విషయాన్ని సైబర్ నేరగాళ్లు గుర్తించారు. లాగిన్ అయ్యి ఆమెకు చెందిన రూ. 9 లక్షల షేర్లను వారి అకౌంట్లలోకి మార్చుకుని మోసానికి పాల్పడ్డారు. చదవండి: (14 ఏళ్ల మేనల్లుడితో శారీరక వాంఛలు.. వీడియో రికార్డ్ చేసి..) ►ఆర్మీ అధికారినంటూ డీసీఎం డ్రైవర్ను మోసం చేశాడో సైబర్ నేరగాడు. తాను ఇల్లు షిఫ్ట్ అవుతున్నాని నమ్మించి, డీసీఎం కావాలని కోరాడు. రూ. 30 వేలకు కిరాయి మాట్లాడుకున్నాడు. అయితే రూ. లక్ష అకౌంట్లో ఉంటేనే తమకు చెందిన డబ్బులు వస్తాయని డ్రైవర్ను నమ్మించాడు. దీంతో డ్రైవర్ రూ. 70 వేలు సదరు అ వ్యక్తికి పంపగా.. రూ. లక్ష అకౌంట్లోకి వచ్చాయి. కానీ.. నువ్వు పంపిన రూ. 70 వేలు రాలేదంటూ చెప్పి పలు దఫాలుగా రూ. 4.50 లక్షలు స్వాహా చేశాడు. ►ఎస్బీఐ అకౌంట్ ఫ్రీజ్ అయ్యిందంటూ నమ్మించి ఓ వ్యక్తిని మోసం చేశారు సైబర్ చీటర్స్. బాధితుడికి ఫోన్ చేసి కేవైసీ అప్డేట్ చేయాలని నమ్మబలికి ఓటీపీలు అడిగి రూ. 2.50 లక్షలను లూటీ చేశారు. ►ఇండియామార్ట్ వెబ్సైట్లో ఉన్న ఫోన్ నంబర్కు కాల్ చేసి టీవీలు ఆర్డర్ పెట్టగా.. తనని ఓ వ్యక్తి మోసం చేశాడంటూ వ్యాపారి ఫిర్యాదు చేశాడు. నగరంలోని టీవీల వ్యాపారి ఆర్మీ క్యాంటీన్లకు టీవీలు సప్లై చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇండియా మార్ట్లో ఓ వ్యక్తి అతి తక్కువ ధరకు టీవీలను అమ్ముతామంటూ యాడ్ పెట్టాడు. అది చూసి మాట్లాడగా.. ఎన్వోసీ కూడా పంపాడు. ఆ తర్వాత రూ. 1.50 లక్షలు పంపగా.. ఇప్పటి వరకు టీవీలు రాలేదు. ఆయా కేసుల్లో బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రశీన్రెడ్డి వివరించారు. చదవండి: (భూత్ బంగ్లాలతో భయం భయం.. అసాంఘిక కార్యకలాపాలకు..) -
ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య
తిరువొత్తియూరు: కుటుంబ కలహాలతో ఐటీ సంస్థ మహిళా అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నై కొళత్తూరు సుబ్రమణియ 3వ వీధికి చెందిన వినోద్కుమార్ ప్రైవేటు సంస్థ ఉద్యోగి. అతని భార్య అనిత (45) తాంబరంలో ఉన్న ప్రైవేటు ఐటీ సంస్థలో పని చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం దంపతుల మధ్య గొడవ జరిగింది. విరక్తి చెందిన అనిత ఇంటి మిద్దెపై ఉన్న గదిలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. టవర్ ఎక్కి మహిళ ఆత్మహత్యాయత్నం టవర్ ఎక్కి మహిళ ఆత్మహత్యకు యత్నించిన సంఘటన పూందమల్లి మహిళా పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. తిరువేర్కాడుకు చెందిన రాజేష్ (42), రాజులా పూందమల్లి పోలీసు స్టేషన్ పరిధిలో నివాసం ఉంటున్నారు. వీరికి పిల్లలు లేరు. కుటుంబ కలహాలతో రాజులా భర్త నుంచి విడిపోయింది. ఈ క్రమంలో ఆమెకు భర్తతో గొడవలు ఏర్పడ్డాయి. దీనిపై పూందమల్లి మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళ్లింది. టవర్పైకి ఎక్కిన రాజులా పోలీసులు ఫిర్యాదు తీసుకోవడానికి ఆలస్యం చేయడంతో ఆమె పోలీసుస్టేషన్ పక్కన వున్న 200 అడుగుల ఎత్తు ఉన్న వాకీ, టాకీ టవర్పైకి ఎక్కింది. తనకు న్యాయం చేయకపోవతే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. పోలీసులు మూడు గంటలు శ్రమించి ఆమెను కిందకు దించారు. చదవండి: తన ఇద్దరు చిన్నారులను చిదిమేసి ఆపై.. -
మద్యం కోసం ఐటీ ఉద్యోగి వీరంగం
సాక్షి, జగద్గిరిగుట్ట: జగద్గిరిగుట్ట పరిధిలోని ఓ వైన్ షాపు వద్ద మద్యం ఖరీదు చేయడానికి వచ్చిన ఐటీ ఉద్యోగి ఒకరు.. అక్కడ రద్దీ చూసి కంగుతిన్నాడు. క్యూతో సంబంధం లేకుండా మద్యం పొందడానికి తన వాహనానికి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న పోలీసు సైరన్ మోగించాడు. అదేమని ప్రశ్నించిన స్థానికులకు తన వద్ద ఉన్న ఎయిర్గన్ చూపించి బెదిరించాడు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సదరు ఐటీ ఉద్యోగిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. (బాయ్ఫ్రెండ్తో చాటింగ్: తమ్ముడిని చంపి, స్టోర్రూంలో) ఆల్విన్ కాలనీకి చెందిన కె.చంద్రహర్షారెడ్డి అలియాస్ హరీష్ ఐటీ కంపెనీలో ఉద్యోగి. షూటింగ్పై మక్కువ ఉన్న ఇతగాడు గచ్చిబౌలిలో ఉన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలోని ఫైరింగ్ రేంజ్లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. మంగళవారం తన ప్రాక్టీసు ముగించుకుని ఎయిర్ గన్తో తన కారులో బయలుదేరారు. ఈ వాహనం ఎల్లమ్మబండ మీదుగా కూకట్పల్లి వైపు వెళ్తుండగా..రాత్రి 11 గంటల ప్రాంతంలో లాస్య వైన్స్ వద్ద మద్యం ఖరీదు చేయడానికి ఆపాడు. ఆ సమయంలో మద్యం దుకాణం రద్దీగా ఉండటం, మూసివేసే సమయం సమీపిస్తుండటంతో ‘తేలిగ్గా’ తన పని పూర్తి చేసుకోవాలని భావించాడు. అక్కడ ఉన్న వారిని చెదరగొట్టాలనే ఉద్దేశంతో హరీష్ తన కారుకు అక్రమంగా అమర్చుకున్న పోలీసు సైరన్ను మోగించాడు. సమీపంలో పాన్ షాప్ వద్ద నిలుచున్న దిలీప్ అనే వ్యక్తి సైరన్ ఎందుకు మోగించావంటూ హరీష్ను నిలదీశాడు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగడంతో సహనం కోల్పోయిన హరీష్ తన కారులో ఉన్న ఎయిర్ గన్ను బయటకు తీసి చంపుతానంటూ బెదిరించాడు. కొద్దిసేపు గాల్లో ఎయిర్ గన్ను ఊపుతూ హంగామా చేశాడు. దీంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న జగద్గిరిగుట్ట పోలీసులు ఘటనాస్థలికి వచ్చారు. హరీష్ను అదుపులోకి తీసుకుని వాహనంతో పాటు ఎయిర్గన్ను స్వాధీనం చేసుకున్నారు. అనుమతి లేకుండా పోలీసు సైరన్ వినియోగించడంతో పాటు ఎయిర్గన్తో బెదిరింపులకు దిగిన ఆరోపణలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
డిప్యూటీ సీఎంను చేసి పిఠాపురానికి పంపుతా
"గీతమ్మను గెలిపిస్తే.." పిఠాపురం ప్రజలకి బంపర్ ఆఫర్
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
బాలయ్య బాబు కి బలమైన కౌంటర్లు పిఠాపురం సాక్షిగా దత్తపుత్రుడి పరువు..!
గీతమ్మను, సునీల్ ను ఆశీర్వదించండి..
పిఠాపురంలో దత్తపుత్రుడిపై సీఎం జగన్ పవర్ పంచ్..
కుందనపు బొమ్మలా ప్రియాంకా జైన్ ఫొటోలు
పొరపాటున గెలిస్తే పవన్ కుబుసం విడిచి కాట్లు వేస్తాడు..!
పిఠాపురం: సీఎం జగన్ ప్రచార సభలో ఎటుచూసినా జనసంద్రం (ఫొటోలు)
గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
తప్పక చదవండి
- బీజేపీ అధికారం కోల్పోనుంది: కేజ్రీవాల్
- గవర్నర్.. నీ దాదాగిరి పని చేయదు: మమతా బెనర్జీ
- వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎంని చేస్తా: సీఎం జగన్
- బీజేపీ గెలిస్తే ‘యోగి’ అవుట్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్
- ప్రధాని నరేంద్ర మోదీ అబద్ధాల మాస్టర్
- మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాపాడుకోండి: కైకలూరులో సీఎం జగన్
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- అచ్చం బాబు స్టైల్లోనే.. చెప్పేదొకటి! చేసేదొకటి!!
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- ఏపీకి మహా ప్రమాదకారిగా బాబు & కో
Advertisement