-
మాకొచ్చే సీట్లు !..జగ్గన్న జోకులు
-
మొన్ననే పెళ్లి చేసిండ్రు.. ఇప్పుడే పిల్లలంటే ఎట్లా?
నర్సాపూర్ (మెదక్): ‘‘మొన్ననే పెళ్లి చేసిండ్రు...అప్పుడే పిల్లలు పుడతాలేరంటే ఎలా..’’అని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర్లో చేపట్టిన బైక్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. తమకు పావలా వడ్డీ రుణం రావడం లేదని, ఇళ్లు రాలేదని తదితర హామీలను మహిళలు ప్రశ్నించగా..బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంలో మోసం చేసిందని విమర్శించారు. ప్లాట్లు ఉన్న దళితులకు తమ ప్రభుత్వం రూ.6 లక్షలు, ఇతరులకు రూ.5లక్షలు ఇస్తుందని తెలిపారు. ఈ సందర్భంగా ‘‘మొన్ననే మాకు పెళ్లి చేసిండ్రు. అప్పుడే పిల్లలు పుడుతలేరంటే ఎట్లా? మూడు నెలలే అయింది, ముచ్చటగా 3 నిద్రలు చేసినం. తొందర పడకండి, జెరా టైమియ్యిండ్రి, హామీ లన్నీ అమలు చేస్తాం’’అని జగ్గారెడ్డి చెప్పారు. -
జగ్గారెడ్డి బంగారం
-
బీఆర్ఎస్ పై జగ్గారెడ్డి నిప్పులు..
-
జగ్గారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే.. టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మళ్లీ క్రియాశీలకంగా మారారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత గత రెండు మూడు రోజులుగా చురుకుగా కనిపిస్తున్నారాయన. సంగారెడ్డిలో తాను ఓడిపోతానని ముందే ఊహించానని వ్యాఖ్యానించిన ఆయన.. తాజాగా ఇవాళ గాంధీభవన్లో మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్రావులపై మండిపడ్డారాయన. తెలంగాణ వ్యాప్తంగా మహాలక్ష్మి స్కీమ్ ఉచిత బస్సు ప్రయాణానికి అనూహ్య స్పందన లభిస్తోంది. మహిళలంతా ఈ పథకంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. హరీష్ రావు, కేటీఆర్లకు బస్సు ప్రయాణం తెలియదు. బెంజ్ కార్ల లో తిరిగే వాళ్లకు.. పేదల సమస్యలు ఏం తెలుసు?. బీఆర్ఎస్ నేతలకు తెలిసింది అమరవీరుల స్థూపం మాత్రమే. రుణమాఫీ పై మాట్లాడే నైతిక హక్కు కేటీఆర్, హరీష్ లకు లేదు. అసెంబ్లీలో కేటీఆర్, హరీష్రావు రెచ్చిపోతున్నారు నేను గెలిచి ఉంటే.. అసెంబ్లీలో వీళ్లద్దరినీ ఓ ఆట ఆడుకునేవాడ్ని. బీఆర్ఎస్ది కేసీఆర్ పాలన. కాంగ్రెస్ది ప్రజా పాలన. ప్రజాపాలన అనే సంస్కారం బీఆర్ఎస్కు లేదు. కేసీఆర్ కుటుంబానికి ఆరోగ్య శ్రీ అవసరం లేకపోవచ్చు.. కానీ పేదలకు ఆ అవసరం ఉంది. సెక్రటేరియట్ లో 9 ఏళ్ల ఫైల్స్ అన్నీ పెండింగ్ లొ ఉన్నాయి. మా మంత్రులు వాటి బూజు దులుపుతున్నారు. లక్షల కోట్లు అప్పులు చేసి పోయారు. తెలంగాణ ప్రజలు అప్పు చేయమని అడిగారా?. కేబుల్ బ్రిడ్జి కట్టి మీరే ఇంత చెప్పుకుంటే ఓఆర్ఆర్ సృష్టి కర్త వైఎస్ఆర్ గురించి మేం ఇంకెంత చెప్పాల్సి ఉంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత సోనియా గాంధీ ఇంటికి పోయింది కేసీఆర్ కుటుంబం కాదా?. బీఆర్ఎస్ మాట ఇచ్చి తప్పినందుకు కోర్టులో కేసు వేస్తాం. కేసీఆర్ కుటుంబం 420 కాబట్టే ఓడించి ఇంట్లో కూర్చో బెట్టారు. కేటీఆర్, హరీష్ రావుల కోసం 840 చట్టం తేవాలేమో అని జగ్గారెడ్డి మండిపడ్డారు. -
ఓడితే మంత్రి పదవి ఇస్తారా?
-
సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే
Updates: గంజి మైదాన్లో కాంగ్రెస్ సభ.. మల్లికార్జున ఖర్గే ప్రసంగం ►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది. ►కర్ణాటకలో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణిస్తున్నారు. ►తెలంగాణ ఎవరు ఇచ్చారు? ఎవరి కోసం ఇచ్చారు. ►తెలంగాణ ఇవ్వగానే కేసీఆర్ సోనియా ఇంటికెళ్లాడు, ఆమె కాళ్లు మొక్కాడు. ►ఆ తర్వాత రోజే మాట మార్చాడు. ►ఇందిరా గాంధీ సంగారెడ్డిలో అడుగుపెట్టి దేశమంతా కాంగ్రెస్ను గెలిపించింది. ►ఇందిరా గాంధీ హయాంలోనే BHEL, BDL, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఏర్పాటయ్యాయి. ►ఇందిరాగాంధీ ఇక్కడి నుంచి గెలవకపోయి ఉంటే ఈ సంస్థలు సాధ్యామయ్యేవా? ►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు. ►ఈ ప్రభుత్వం సంస్థలను ఆమ్మేస్తుంది ►తెలంగాణలో ప్రతీ ఒక్కరిపై 5 లక్షల అప్పు ఉంది ►కాంగ్రెస్ పేదల కోసం ఆలోచిస్తుంది. ►బ్యాంకులను జాతీయం చేసింది కాంగ్రెస్. ►రైతు కూలీల కోసం ఉపాధి హామీ పథకం తెచ్చాం. ►తెలంగాణ దగ్గర డబ్బు ఉన్నప్పుడు కేసీఆర్ తనకునచ్చింది చేశారు. ►మేము ఆరు గ్యారంటీలను ఇస్తున్నాం. ►మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతినెల మహిళలకు రూ. 2500 ఇస్తాం. ►రైతులకు రైతు భరోసా కింద 15 వేలు ఇస్తాం. ►ఓట్ల కోసం ఈ పథకాలు కాదు, అన్ని ఆలోచించి ఈ నిర్ణయాలు తీసుకున్నాం. ►మేం అన్నది చేసి చూపిస్తాం, మీరు హామిలిచ్చి వదిలేస్తారు. ►రేవంత్ రెడ్డి మీ దోస్తులకు చెప్పు, నేను బస్సు ఏర్పాటు చేస్తా. ►కర్ణాటకలో హామీలు అమలు అవుతున్నాయో లేదో బీఆర్ఎస్ నేతలను తీసుకెళ్లి చూపించండి. ►ప్రతి ఏడాది రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామి ఇచ్చారు. ►తొమ్మిదేళ్లలో 18 లక్షల ఉద్యోగాలు రావాలి. వచ్చాయా? ►ఏ ఒఒక్కరితోనూ కాంగ్రెస్ అధికారంలోకి రాదు. అందరూ కలిసి పనిచేయాలి. ►సంగారెడ్డిలోని గంజి మైదాన్లో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్ ప్రారంభమైంది. ఈ సభలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. సంగారెడ్డి సభ అనంతరం మల్లికార్జున ఖర్గే మెదక్ వెళ్లనున్నారు. సాక్షి, సంగారెడ్డి: సంగారెడ్డిలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించింది.. ఈ ర్యాలీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తారా డిగ్రీ కాలేజీ నుంచి గంజి మైదాన్ వరకు ర్యాలీ కొనసాగింది. -
అందరూ సీఎం లే..?
-
సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు
-
బీఆర్ఎస్ Vs కాంగ్రెస్.. నేతల మధ్య పొలిటికల్ వార్
సాక్షి, సూర్యాపేట: తెలంగాణ పొలిటికల్ వాతావరణం మరోసారి హీటెక్కింది. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేతలు పార్టీలపై విమర్శలు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ను మంత్రి జగదీశ్ రెడ్డి విమర్శించగా.. బీజేపీ, బీఆర్ఎస్ను కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విమర్శించారు. ఇక, మంత్రి జగదీష్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ హామీలన్నీ భోగస్. ఆచారణ సాధ్యం కాని హమీలను తెలంగాణ ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ నాయకుల మాటలు సినిమా పాత్రల్లో వేసే బఫ్యూన్ల పాత్రలాగా ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు రాసి ఇచ్చిన స్క్రిప్టును సోనియా, రాహుల్ చదివి వినిపించారు. హామీలు నెరవేర్చిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి లేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి హామీలు ఇవ్వలేదు. కర్ణాటక పరిస్థితేంటి? గతంలో 2 లక్షల రుణమాఫీ అన్నా ప్రజలు నమ్మలేదు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వకుండా ఇక్కడికి వచ్చి మాట్లాడితే తెలంగాణ ప్రజలు నమ్మరు. తెలంగాణతో సమానంగా బడ్జెట్ ఉన్న కర్ణాటకలో రైతుబంధు ఎందుకు ఇవ్వట్లేదు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ మీద ఉన్న నమ్మకం కాంగ్రెస్ నాయకులపై లేదు. ఇచ్చిన హామీలు మాత్రమే కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత కేసీఆర్కే దక్కింది. కేసీఆర్ హామీలను కాపీ కొట్టి పథకాలు ఇస్తామంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరు అంటూ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ప్లాన్.. మరోవైపు, జగ్గారెడ్డి మాట్లాడుతూ.. మొదటి సారి CWC సమావేశాలు హైదరాబాద్లో జరిగాయి. బీఆర్ఎస్కు అండగా బీజేపీ, ఎంఐఎం పనిచేస్తున్నాయని రాహుల్ గాంధీ నిన్నటి సభలో స్పష్టంగా చెప్పారు. ఈ మూడు పార్టీలు కలిసి కాంగ్రెస్ను అధికారంలోకి రానివ్వకుండా కుట్రలు చేస్తున్నాయి. దేశ ప్రజలు సంక్షేమం కోసం CWC సమావేశాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. బీజేపీ మత రాజకీయాలు చేస్తూ దేశాన్ని కలుషితం చేస్తోంది. కాంగ్రెస్ సెక్యూలర్ పార్టీ. అన్ని మతాలకు సమాన గౌరవం ఇస్తుంది. మతాలను రెచ్చగొడుతూ అధికారాన్ని కాపాడుకోవాలని బీజేపీ చూస్తోంది అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: సోనియా గాంధీ అంటే అభిమానం, గౌరవం: విజయశాంతి కామెంట్స్ -
ఆపకపోతే నా అనుచరులకి అప్పగిస్తా: జగ్గారెడ్డి ఫైర్
సాక్షి, హైదరాబాద్: పార్టీ మారడం లేదని నిన్ననే క్లారిటీ ఇచ్చా. మీడియా సమావేశం పెట్టినా.. ఇంకా పుకార్లు ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఆ గుసగుసలు ఇప్పటికైనా బంద్ కావాలి అని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సొంత పార్టీలోనే నేతలు చేస్తున్న ప్రచారంపై ఫైర్ అయ్యారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న పుకార్లపై మండిపడ్డ ఆయన.. ‘‘మళ్లీ చెప్తున్నా.. పార్టీ మారే ఉద్దేశం లేదు. నా గురించి నెగెటివ్గా ప్రచారం చేస్తే.. పార్టీలో ఫిర్యాదు చేస్తా. పరువునష్టం దావా వేస్తా. లీగల్ నోటీసు ఇస్తా. అయినా మారకపోతే నా అనుచరులకి అప్పగిస్తా’’ అంటూ మాస్ వార్నింగ్ ఇచ్చారు జగ్గారెడ్డి. ‘‘మీడియా సమావేశంలో నేను చెప్పినప్పటికి కొంతమంది గుసగుసలు పెడుతున్నారు. అనుమానం క్లియర్ చేశాను.. మళ్ళీ ఇంకో అనుమానం అంటే ఎలా?. అనుమానించే వారికీ పనేం లేదా? 41 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నా. నేను కస్టపడి రాజకీయాల్లో ఉన్నా. కొంతమంది గుసగుసలు ఇప్పటికైనా బంద్ చేయాలి. అప్పు చేసి 3సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఏం సంపాదించుకోలేదు. నా మీద నిరాధార ఆరోపణలు చేస్తే పీసీసీకి, సీఎల్పీకి పిర్యాదు చేస్తా. రేవంత్, భట్టి లతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయించి.. క్రిమినల్ కేసులు పెట్టిస్తా. పార్టీకి డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి, పరువు నష్టం దావా వేస్తా. ఇప్పటికీ నాకు స్వంత ఇల్లు లేదు. నాకు ఆస్తులు ఉన్నాయని ఒక్కటి నిరూపించండి.. అది వారికే ఇచ్చేస్తా. ధరణి లో ఒక్క ఎకరా భూమి ఉన్నట్లు చూపితే.. వారికే ఇస్తా. 90 శాతం అహింస వాదిని.. 10 శాతం భగత్ సింగ్ లాగా వేరే పాత్ర పోషిస్తా. నేను పూర్తిగా పబ్లిక్ మనిషిని అంటూ వ్యాఖ్యలు చేశారాయన. ఇదీ చదవండి: కేసీఆర్ దృష్టిలో కమ్యూనిస్ట్ పార్టీ కరివేపాకు! -
కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్...బీఆర్ఎస్ వైపు జగ్గారెడ్డి చూపు
-
కాంగ్రెస్కు షాక్.. బీఆర్ఎస్లోకి జగ్గారెడ్డి?
సాక్షి, సంగారెడ్డి: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో తెలంగాణలో కూడా హస్తం నేతలు స్పీడ్ పెంచారు. రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో కొందరు సీనియర్లను కూడా పార్టీలోకి ఆహ్వానించింది. మరోవైపు.. కొంత మంది హస్తం నేతలు కాంగ్రెస్ను వీడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. బీఆర్ఎస్లో చేరునున్నట్టు తెలుస్తోంది. కేసీఆర్ సర్కార్ వైపు జగ్గారెడ్డి మొగ్గుచూపుతున్నట్టు సమాచారం. ఇక, కొంతకాలంగా జగ్గారెడ్డి.. బీఆర్ఎస్ నేతలతో సఖ్యతగా ఉండటం విశేషం. ఇదే సమయంలో వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి జగ్గారెడ్డి సంగారెడ్డి బరిలోకి దిగే అవకాశం ఉన్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా, పార్టీ మార్పు వార్తలు రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నా.. వాటిని జగ్గారెడ్డి ఖండించకపోవడం ఆసక్తికరంగా మారింది. ఇదే, పార్టీ మార్పు అంశానికి మరింత బలాన్ని చేకూర్చుతోంది. ఇదిలా ఉండగా.. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్గా నియమించినప్పటి నుంచే జగ్గారెడ్డి సీరియస్గా ఉన్నారు. ఈ క్రమంలో బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేశారు. ఇక, కాంగ్రెస్ హైకమాండ్కు కూడా పలు సందర్భాల్లో జగ్గారెడ్డి లేఖలు రాశారు. రేవంత్ను టీపీసీసీ చీఫ్గా నియమించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇక, ఇటీవల కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పలు కార్యక్రమాల్లో కూడా జగ్గారెడ్డి యాక్టివ్గా కనిపించకపోవడం గమనార్హం. ఒకానొక సమయంలో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న పథకాలపై కూడా జగ్గారెడ్డి సానుకూలంగా స్పందించి.. గులాబీ సర్కార్ను అభినందించడం విశేషం. ఇది కూడా చదవండి: కేసీఆర్ సార్ ‘మదిలో’ ఎవరు..? అందరిలోనూ హై టెన్షన్..! -
జగ్గారెడ్డి బీఆర్ఎస్లో చేరుతున్నారా? ‘చింతా’ కోసం అత్యవసర సమావేశం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సంగారెడ్డి ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి బీఆర్ఎస్ లో చేరుతారనే ఊహాగానాల నేపథ్యంలో ఆ పార్టీ నేతలు అప్రమత్తమయ్యారు. బుధవారం సంగారెడ్డి పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాలులో అత్యవసరంగా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, అన్ని గ్రామాల సర్పంచ్లు, నామినేటెడ్ పదవులు పొందిన నాయకులు, పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు సుమారు 200 మంది అత్యవసరంగా భేటీ అయ్యారు. ఈ సమావేశానికి డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, సంగారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి వంటి ఇద్దరు ముగ్గురు మినహా మిగిలిన ముఖ్యనేతలంతా హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు తమ అభిప్రాయాలను వెల్లడించారు. చింతాకే అవకాశం ఇవ్వండి పార్టీలోకి వలస వచ్చే వారికి కాకుండా, పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్కే అవకాశం కల్పించాలని ఎక్కువ మంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైనా ప్రజలకు అందుబాటులో ఉంటున్న చింతాకు తమ మద్దతు ఉంటుందని సుమారు 80 శాతం మంది ముఖ్యనేతలు స్పష్టం చేశారు. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని పార్టీ అధినాయకత్వానికి విన్నవించాలని నిర్ణయించారు. మంత్రి హరీశ్రావు వద్దకు వెళ్లి తమ అభిప్రాయాన్ని పంచుకోవాలని అన్నారు. కాగా కొందరు నేతలు ఇందుకు భిన్నంగా తమ అభిప్రాయం వెల్లడించారు. పార్టీ అధినాయకత్వం ఎవరికి అభ్యర్థిత్వం ఖరారు చేస్తే వారి గెలుపు కోసమే తాము పనిచేస్తామని కొండాపూర్ ఎంపీపీ మనోజ్రెడ్డి, గుంతపల్లి సర్పంచ్ అనంత్రెడ్డి తదితర నేతలు స్పష్టం చేశారు. ఈ క్రమంలో పార్టీ టికెట్ కోసం తమ పేరును కూడా పరిశీలించాలని డాక్టర్ శ్రీహరి విజ్ఞప్తి చేశారు. సంగారెడ్డిలో అత్యవసర సమావేశం నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్యనేతలు సమావేశం ఆర్గనైజ్ చేసిందెవరు? సంగారెడ్డిలో బీఆర్ఎస్ ముఖ్యనేతల అత్యవసర సమావేశం నిర్వహించడం రాజకీయ వర్గాల్లో ఒకింత కలకలం రేపింది. ఈ సమావేశాన్ని ఆర్గనైజ్ చేసిందెవరనే అంశంపై చర్చ జరుగుతోంది. కాగా పార్టీ మండల, పట్టణ కార్యవర్గం అధ్యక్షులు, కార్యదర్శులు ముఖ్య నాయకులందరికీ ఫోన్లు చేసి సమావేశానికి హాజరుకావాలని కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు మంగళవారం రాత్రే సమాచారం ఇచ్చినట్లు పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ఇది ఒక మేలు కలయికే: చింతా ప్రభాకర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బీఆర్ఎస్ ముఖ్యనేతల అత్యవసర సమావేశం నేపథ్యంలో సాక్షి ప్రతినిధి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చింతా ప్రభాకర్ను ఫోన్లో సంప్రదించగా నాయకులంతా అత్యవసరంగా సమావేశం నిర్వహించినట్లు నాకు ఫోన్ చేసి చెప్పారు. జగ్గారెడ్డి అనుచరులు, కాంగ్రెస్ నుంచి గెలుపొందిన ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఆయనతో విభేదించి బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు జగ్గారెడ్డి బీఆర్ఎస్లోకి వచ్చిన పక్షంలో తమ పరిస్థితి ఏమిటనే అభద్రతా భావంతో ఉన్నారు. అందుకోసమే ఈ అత్యవసర సమావేశం నిర్వహించుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను అని పేర్కొన్నారు. -
కోమటిరెడ్డి వ్యాఖ్యలతో నష్టం లేదు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎంపీ కోమటిరెడ్డి ఒక టి మాట్లాడితే మరో విధంగా మీడియాలో వచ్చిందని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి అన్నారు. కోమటిరెడ్డి పార్టీకి నష్టం కలిగించేలా మాట్లాడలేదని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి గురువారం ఎమ్మెల్యే క్వార్టర్స్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మా ణిక్రావ్ ఠాక్రేను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, రానున్న ఎన్నికల సన్నద్ధతలపై చ ర్చించారు. అనంతరం జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ తాను కూడా త్వరలో నే పాదయాత్ర మ్యాప్ను ప్రకటిస్తానని చెప్పారు. -
సంగారెడ్డికి మెట్రో వేయండి..
సాక్షి, హైదరాబాద్: మియాపూర్ నుంచి సంగారెడ్డి రాంమందిర్ మీదుగా సదాశివపేట వరకు మెట్రో రైలును మంజూరు చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సీఎం కేసీఆర్ను కోరారు. ఈ మేరకు ఆయన ఆదివారం శాసనసభలో కేసీఆర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. తన వినతి పట్ల సీఎం సానుకూలంగా స్పందించారని, ఈ మెట్రోలైన్ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులను ఆదేశించారని జగ్గారెడ్డి విలేకరులకు తెలిపారు. అదే విధంగా గ్రూప్–1 మెయిన్స్కు 1:50 కాకుండా 1:100 నిష్పత్తిలో అభ్యర్థులకు అవకాశం ఇవ్వాలని సీఎంను కోరగా, ఇందుకు కూడా ఆయన సానుకూలంగా స్పందించారని ఆయన వెల్లడించారు. సంగారెడ్డి నియోజకవర్గంలో బాలురు, బాలికల ఉన్నత పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ భవనాల నిర్మాణానికి నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. ఈ మేరకు అసెంబ్లీ లాబీల్లోని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చాంబర్లో ఆదివారం ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. -
పంటలకు సకాలంలో కరెంట్ ఇవ్వాలి
సాక్షి, హైదరాబాద్: పంటలు కాపాడుకోవడానికి రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం గొప్పలు చెప్పకుండా సకాలంలో పంటలకు కరెంట్ ఇవ్వాలని టీపీసీసీ నేతలు డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగానికి విద్యుత్ సరఫరా అంశంపై అసెంబ్లీలో చర్చించాలన్న తమ విజ్ఞప్తిని స్పీకర్ మన్నించనందుకు నిరసనగా గురువారం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, డి.శ్రీధర్బాబు, సీతక్క, జగ్గారెడ్డి సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద నిరసన తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ కోతలతో రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఉచితంగా 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని ప్రభుత్వం డాంబికాలు చెబుతున్నా.. కనీసం 4–5 గంటలు కూడా కరెంట్ ఇవ్వట్లేదని ధ్వజమెత్తారు. ఆ కరెంట్ కూడా ఎప్పుడు ఏ సమయానికి ఇస్తున్నారో చెప్పలేని పరిస్థితి రాష్ట్రవ్యాప్తంగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందుల గురించి మాట్లాడటానికి సమయం ఇవ్వాలని సభలో పదేపదే కోరినా పట్టించుకోలేదన్నారు. తమ వైపు స్పీకర్ కనీసం చూడకుండా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించినందుకు బయటకు వచ్చామన్నారు. వ్యవసాయానికి 24 గంటల పాటు నిరవధికంగా ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, విద్యుత్ కోతలపై సభలో చర్చ జరగాలన్నారు. -
సీఎం కేసీఆర్తో కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి భేటీ
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్తో సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జగ్గారెడ్డి భేటీ అయ్యారు. గురువారం అసెంబ్లీ హాల్లో సీఎంను కలసి మాట్లాడిన ఆయన.. ఆ తర్వాత లాబీల్లోని సీఎం చాంబర్లోనూ కలిశారు. కాగా, ఈ భేటీ రాజకీయ చర్చకు దారితీసింది. సీఎంను కలసిన అనంతరం ఆయన మీడియా పాయింట్లో మాట్లా డుతూ తాను దొంగచాటుగా ముఖ్యమంత్రిని కలవలేదని పేర్కొన్నారు. తాను సీఎం కేసీఆర్ను అసెంబ్లీ హాల్లోనే కలిశానని, ఆ తర్వాత ఆయన చాంబర్లో టైం ఇవ్వడంతో అక్కడకు వెళ్లి నియోజకవర్గ సమస్యల గురించి మాట్లాడానని జగ్గారెడ్డి చెప్పారు. ప్రధానమంత్రిని కాంగ్రెస్ ఎంపీలు కలుస్తారని, అలాగే ఎమ్మెల్యేగా తాను కూడా సీఎంను కలిశానని అన్నారు. మియాపూర్ నుంచి సంగారెడ్డి, సదాశివపేట వరకు మెట్రో రైలు మంజూరు చేయాలని వినతిపత్రం ఇచ్చానని, దళితబంధు పథకం కోసం తన నియోజకవర్గంలోని 550 మంది అర్హుల జాబితా ఇచ్చానని, మహబూబ్ సాగర్ చెరువును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని, ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయించాలని అడిగానని చెప్పారు. అలాగే సిద్ధాపూర్లో 5వేల మందికి, కొండాపూర్ ఆలియాబాద్లో 4వేల మందికి ఇళ్లను అప్పగించాలని కూడా సీఎంను కోరినట్టు చెప్పారు. ఇవే వినతిపత్రాలను మంత్రి కేటీఆర్కు కూడా ఇచ్చానని తెలిపారు. తన వినతులపై సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారని చెప్పిన జగ్గారెడ్డి, నియోజకవర్గ అభివృద్ధిపై చర్చించేందుకు మరోమారు టైం ఇవ్వాలని సీఎంను కోరానని, ప్రగతిభవన్లో సమయం ఇస్తే వచ్చి కలుస్తానని చెప్పానని వెల్లడించారు. చదవండి: టీఎస్ అసెంబ్లీ: కేటీఆర్ Vs శ్రీధర్ బాబు హీటెక్కిన సభ -
చంద్రబాబు తెలంగాణకు రావడానికి కేసీఆరే అవకాశమిచ్చారు: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరుతో సీఎం కేసీఆర్ తెలంగాణను వదిలి జాతీయ రాజకీయాల్లోకి వెళుతు న్నారు కాబట్టే ఏపీకి చెందిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణకు వచ్చారని సంగారెడ్డి ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణలో స్తబ్దుగా ఉన్న టీడీపీని తిరిగి గాడినపెట్టడం కోసం చంద్రబాబు రాష్ట్రానికి రావడానికి కేసీఆరే అవకాశమిచ్చారని అన్నారు. తెలంగాణ అనే పదాన్ని తన పార్టీ నుంచి తొలగించడంతోనే కేసీఆర్ బలం పోయిందని ఆయన అభిప్రాయ పడ్డారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో జగ్గారెడ్డి విలేకరు లతో మాట్లాడుతూ కేసీఆర్ తన పార్టీ నుంచి టీ అనే అక్షరాన్ని తొలగించి తెలంగాణను అవమా నించారని విమర్శించారు. కేసీఆర్లో ఎక్కడో మూలన సమైక్య భావన నెలకొందని, అందుకే తెలంగాణ వాదాన్ని ఆయన చంపేశారని దుయ్యబట్టారు. బీఆర్ఎస్తో కేసీఆర్ సక్సెస్ కాలేరన్న జగ్గారెడ్డి... తెలంగాణలో ఇకపై సీరి యస్ పాలిటిక్స్ నడుస్తాయని, పొత్తుల గురించి ముందుముందు తెలుస్తుందని వ్యాఖ్యానించారు. రూ. 120 కోట్లు ఏ మూలకు? కాంగ్రెస్ హయాంలో చిరు వ్యాపారులకు 100 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చామని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మైనారిటీలకు స్వయం ఉపాధి రుణాలు ఇవ్వట్లేదని జగ్గారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఇటీవల మైనారిటీ కార్పొరే షన్కు ఇచ్చిన రూ. 120 కోట్లు ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. మైనారిటీ కార్పొరేషన్కు కనీసం రూ. 1,500 కోట్లు కేటాయించడంతోపాటు రుణాలదరఖాస్తు గడువును జనవరి 5 నుంచి మరో నెలపాటు పొడిగించాలని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. -
మైనారిటీ వెల్ఫేర్ లోన్స్ గురించి సీఎం కేసీఆర్కు జగ్గారెడ్డి లేఖ
-
Telidevara Bhanumurthy: కొంపలు ముంచే కొత్త దుక్నాలు
తెలంగానకు బోక శానొద్దు లైంది. ఒక్కపారి గా రాస్ట్రంకు బోయొస్తె బాగుంటదని నారదుడు అనుకుండు. తిట్టేటి నోరు, తిరిగేటి కాలు ఊకుండయి. నారదుడు తంబూర దీస్కుండు. ఒకపారి టింగ్ టింగ్ మన్నడు. చిర్తలు గొట్టుకుంట నారాయన, నారాయన అనుకుంట మొగులు మీది కెల్లి ఎల్లిండు. పట్నం దిక్కు గాయిన రాబట్టిండు. నడ్మల నర్కం దిక్కు బోతున్న యముని దున్నపోతు ఎదురైంది. ‘‘యాడికి బోతున్నవ్ నారదా’’ అని అడిగింది. ‘‘తెలంగాణల ఏమైతున్నదో ఎర్క జేస్కునే తంద్కు బోతున్న. నా సంగతి కేంగని నువ్వు పట్నం ఎందుకు బోయినవు’’ అని నారదుడు అడిగిండు. ‘‘మా దున్నపోతుల సంగం ఎలచ్చన్లు ఉంటె ఒక్క తీర్గ రమ్మని నన్ను బిలిస్తె బోయుంటి.’’ ‘‘మీ సంగం ఎలచ్చన్లు ఎట్లయినయి?’’ ‘‘సూద్దామని బోయిన నన్ను సుట్ట కుదురును జేసినయి. దున్నపోతుల సంగం ప్రెసిడెంటును జేసినయి.’’ ‘‘నర్క లోకం దున్నపోతును ప్రెసిడెంట్ నెట్ల జేస్తరని తెలంగాన దున్నపోతులు లొల్లి బెట్టలేదా?’’ ‘‘లొల్లి బెట్టెతంద్కు మా దున్నపోతులేమన్న కాంగ్రెస్ పార్టీయా?’’ ‘‘కాంగ్రెస్, బీఆర్ఎస్ అసువంటి రాజకీయ పార్టీల గాలి దాక్తె దున్నపోతులల్ల గుడ్క రాజకీయాలు షురువైతయేమో!’’ అని నారదుడు అన్నడు. ‘‘నువ్వు తక్వోనివి గావు నారదా! మా దాంట్ల రాజకీయాలు షురువైతె మేము మేము కొట్లాడు కుంటుంటె సూసి మురుద్దామనుకుంటున్నవు. గీ నడ్మ కాంగ్రెస్, బీఆర్ఎస్ కొత్త దుక్నాలు దెర్సినయి. ఇంతకుముందు తెలంగానల టీఆర్ఎస్ అనేటి కిరాన దుక్నముండేది. గా దుక్నంను హోల్సేల్ దుక్నం జేసి డిల్లిల దెర్సిండ్రు. బీఆర్ఎస్ అని పేరు బెట్టిండ్రు. దుక్నంల కేసీఆర్ గూసుండు. వాస్తు జూసి మంచి మూర్తంల దుక్నం దెర్వబట్కె గిరాకి మంచి గైతదని గాయిన అనుకుండు. గని గాయిన ఒకటను కుంటె ఒకటైంది. కుమార స్వామి, అఖిలేశ్ యాద వ్లే దుక్నం కాడ్కి వొచ్చిండ్రు. గాల్లది ఉద్దెర బ్యారమే. గాల్లు దప్పిడ్సి డిల్లిల ఎవ్వలు గా దుక్నం గురించి ముచ్చట బెట్టలే.’’ ‘‘కాంగ్రెస్ దుక్నాల సంగతేంది?’’ అని నారదుడు అడిగిండు. ‘‘గిప్పుడున్న అంగడిల ఒకల్లను జూసి ఒకల్లు ఓరుస్త లేరు. కండ్లల్ల మన్ను బోసుకుంటున్నరు. భారత్ జోడో యాత్ర జేస్కుంట ప్రేమ దుక్నాలు దెరుస్తున్న. గీ దుక్నాలు కడ్మ దుక్నాల సుంటియి గాదు. గిన్వి ఎవ్విటిని అమ్మయి, కొనయి. అందర్కి ప్రేమను పంచిస్తయి. బువ్వబెడ్తె అర్గిపోతది. బట ్టలిస్తె చిన్గిపోతయి. గని నా ప్రేమ అర్గేది గాదు అని రాహుల్ గాంధి అన్నడు.’’ ‘‘ఇంతకు గాయిన ప్రేమ నెట్ల పంచుతున్నడు?’’ ‘‘కాంగ్రెస్సోల్లు గండ్లబడ్తె గాలియెంబడి ముద్దు లిస్తున్నడు. చిన్న పోరనికి చెప్పులేస్తున్నడు. బుడ్డ పోరగాన్ని ఎత్తుకోని ముక్కు చీమిడి దీస్తున్నడు. కాలేజి పోరగాల్లకు సేకెండిస్తున్నడు. ఛాయ్ దాక్కుంట ముసలోల్ల మంచి చెడ్డ లర్సుకుంటు న్నడు. రాహుల్ గాంధి భారత్ జోడో అన్కుంట పాదయాత్ర జేస్తుంటే పార్టీ తోడో అన్కుంట తెలం గానల కాంగ్రెస్ లీడర్లు కొట్లాడుకుంటున్నరు’’ అని దున్నపోతు అన్నది. ‘‘ఎందుకు కొట్లాడుకుంటున్నరు?’’ అని నార దుడు అడిగిండు. ‘‘రేవంత్ రెడ్డి టీపీసీసీ ప్రెసిడెంట్ అయిన కాడికెల్లి తెలంగాన సీనియర్ కాంగ్రెస్ లీడర్లు లోపట లోపట మండుతున్నరు. మునుగోడుల కాంగ్రెస్ ఓడిపోంగనే గాయిన మీద్కి లేసిండ్రు. టీపీసీసీ కమిటీలు ఎయ్యంగనే రేవంత్ను తిట్టుకుంట గాల్లు శిగమూగ బట్టిండ్రు. భట్టి విక్రమార్క ఇంట్ల కాంగ్రెస్ ఎంపి ఉత్తమ్కుమార్ రెడ్డి, మధుయాష్కి, దామోదర్ రాజ నర్సింహ, జగ్గారెడ్డి, కోదండరెడ్డి, ప్రేంసాగర్ రావు అసువంటి కాంగ్రెస్ సీనియర్ లీడర్లు మీటింగ్ బెట్టిండ్రు. టీడీపీకెల్లి కాంగ్రెస్లకొచ్చిన రేవంత్ రెడ్డి టీపీసీసీ కమిటీలల్ల టీడీపీలకెల్లి వొచ్చి నోల్లకే మోక ఇచ్చిండు. ముంగటి సంది కాంగ్రెస్ల ఉన్నోల్లను పక్కకు బెట్టిండు. సేవ్ కాంగ్రెస్ అన్కుంట గాల్లు లొల్లిబెట్టబట్టిండ్రు. ‘హాత్ సే హాత్’ ప్రోగ్రాంకు డుమ్మాగొట్టిండ్రు. ఇగ దాంతోని టీపీసీసీ కుర్సిలకు సీతక్కనే గాకుంట పన్నెండుమంది కాంగ్రెస్ లీడర్లు రాజినామ జేసిండ్రు. కొట్లాడుకుంటున్న కాంగ్రెస్ లీడర్లల్ల కొంతమందిని గుంజి గాల్ల చేతులల్ల తామర పువ్వులు బెట్టెతంద్కు బీజేపీ రడీగున్నది.’’ ‘‘బీఆర్ఎస్ దుక్నం సంగతేంది?’’ ‘‘డిల్లిల బీఆర్ఎస్ హోల్సేల్ దుక్నం బెట్టినంక కేసీఆర్ పట్నమొచ్చిండు. రొండు మూడు దినా లైనంక పంజాబ్ సీఎం భగవంత్ మాన్ గాయినను గల్సిండు. ఆంద్రప్రదేస్, పంజాబ్, హర్యానా, మహా రాస్ట్ర, ఒడిసా, కర్నాటక రాస్ట్రాలల్ల బీఆర్ఎస్ దుక్నాలు దెరుస్తమని కేసీఆర్ జెప్పిండు. ఆ దుక్నాల ముంగట ‘అబ్ కీ బార్ కిసాన్ సర్కార్’ అని రాసిన బోర్డులు బెడ్తమని అన్నడు. మల్ల గలుస్త’’ అన్కుంట దున్నపోతు నర్కం దిక్కుబోయింది. నారాయన, నారాయన అన్కుంట నారదుడు వైకుంటం బోయిండు. (క్లిక్ చేయండి: మందల బడి మురుస్తాంది గొర్రె) - తెలిదేవర భానుమూర్తి సీనియర్ జర్నలిస్ట్ -
ధరణిని ఏం చేద్దాం?
సాక్షి, హైదరాబాద్: రైతులను ఇబ్బందిపెడుతున్న ధరణి పోర్టల్ను ఎలా మార్చాలన్న దానిపై ప్రజలు, రైతుల నుంచి అభిప్రాయాలు తీసుకోవాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ధరణి పోర్టల్ పనితీరుపై పార్టీ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఇచ్చిన సమాచారంతోపాటు క్షేత్రస్థాయి నుంచి సమాచారం తీసుకుని అధికారికంగా పార్టీ వైఖరిని వెల్లడించాలని భావిస్తోంది. తద్వరా వరంగల్ డిక్లరేషన్కు అనుగుణంగా ముందుకెళ్లే దిశగా కార్యాచరణ మరింత ఉధృతం చేయాలని యోచిస్తోంది. ఈ మేరకు శుక్రవారం సీఎల్పీ కార్యాలయంలో పార్టీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ నాయకులు కొప్పుల రాజు, మల్లురవి, ధరణి కమిటీ సభ్యులు హర్కర వేణుగోపాల్, ఈరవత్రి అనిల్, చెరుకు సుధాకర్, ప్రీతం తదితరులు హాజరయ్యారు. గంటన్నరపాటు సమావేశమైన వీరు ధరణి పోర్టల్ వల్ల రైతులకు కలుగుతున్న ఇబ్బందులు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన రైతు సంక్షేమ కార్యక్రమాల గురించి చర్చించారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని కొనసాగించాలా లేదా కొత్త పద్ధతిలో తీసుకెళ్లాలా అనే దానిపై చర్చించారు. దీనిపై మండలానికి ఐదుగురిని నియమించి వారితో డేటా సేకరించాలని, ఆ తర్వాత 3వేల మందితో సమావేశం నిర్వహించి అందులో వెల్లడైన సమాచారం ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని తీర్మానించారు. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుతో రాష్ట్రంలో రిజర్వేషన్లు 50 శాతం దాటాయని, ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ తరహాలో రిజర్వేషన్లు అమలు చేస్తే ఎలా ఉంటుందన్న దానిపైనా చర్చించారు. మాది తోడికోడళ్ల పంచాయితీ: రేవంత్, జగ్గారెడ్డి ధరణిపై సీఎల్పీలో జరిగిన సమావేశానికి ముందు అసెంబ్లీ ఆవరణలో ఎదురుపడిన రేవంత్రెడ్డి, జగ్గారెడ్డి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్న తర్వాత తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పే ప్రయత్నం చేశారు. తమది తోడికోడళ్ల పంచాయతీ అని, పొద్దున తిట్టుకున్నా మళ్లీ కలిసిపోతామని చెప్పారు. రేవంత్ పాదయాత్రకు తన మద్దతు ఉంటుందని చెప్పిన జగ్గారెడ్డి.. రేవంత్రెడ్డిని ఆ పదవి నుంచి దింపి పీసీసీ అధ్యక్షుడు కావాలన్నది తన అభిమతం కాదని స్పష్టంచేశారు. ఆయన దిగిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని పేర్కొన్నారు. నాపై కుట్రలు కొత్త కాదు: దామోదర నేను ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు సింహయాజిని ఎప్పుడూ కలవలేదు. ఎవరో కావాలని తనకు నష్టం కలిగించేలా ప్రచారం చేస్తున్నారు. ఈ కుట్రలు నాకు కొత్తకాదు. గతంలోనూ చాలాసార్లు జరిగాయి. కవిత, సంతోష్ను అరెస్టు చేయాలి: జగ్గారెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితతోపాటు ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్ నేరస్తులేనని... వారిని అరెస్టు చేయాలని ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సంతోశ్ను ముందుపెట్టి తెలంగాణలోని వివిధ పార్టీల నేతలను కొనేందుకు యత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. అసెంబ్లీ మీడియా హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లో చేరడం ఒక స్కీం అని, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఇతర నేతలను బీజేపీలో చేర్చుకోవాలనుకోవడం ఒక స్కాం అని అన్నారు. -
తెలంగాణ: అసెంబ్లీ ఆవరణలో సరదా సన్నివేశం
హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ పీసీసీ చీఫ్, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డికి.. సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి మధ్య నడిచే మాటల యుద్ధం గురించి ప్రత్యేకంగా తెలియంది కాదు. ఒకే ఇంట్లో సాగే టామ్ అండ్ జెర్రీ గోలలాగా.. ఒకేపార్టీలో ఉంటూ వీళ్లు ఒకరినొకరు విమర్శించుకుంటున్నారు ఈ ఫైర్బ్రాండ్స్. ఈ క్రమంలో.. ఇవాళ(శుక్రవారం) ఆసక్తికర ఘటన ఒకటి చోటు చేసుకుంది. అసెంబ్లీ అవరణలో రేవంత్ రెడ్డి, జగ్గారెడ్డి ఎదురు పడ్డారు. సీఎల్పీకి వచ్చిన వీళ్లు తారసపడడంతో మీడియా ఆసక్తిగా వీళ్ల కలయికను చిత్రీకరించే యత్నం చేసింది. అది గమనించిన ఇద్దరూ చేతిలో చెయ్యేసుకుని సరదాగా సంభాషించారు. మా ఇద్దరి మద్య ఉంది తోటికోడలు పంచాయితీనే అంటూ చమత్కరించారు వాళ్లు. ‘మా ఇద్దరి మధ్య ఎలాంటి విబేధాలు లేవు. మాది తోడికోడళ్ళ పంచాయితీ. పొద్దున తిట్టుకుంటాం.. సాయంత్రానికి మళ్లీ కలిసిపోతాం’ అని కాసేపు సరదాగా మాట్లాడుకున్నారు. కలిసి నప్పుడు నవ్వుకొవ్వొద్దా.. కాంగ్రెస్ల ఒకరిని గుంజి గద్దె ఎక్కడం కుదరదు. టీపీసీసీ చీఫ్గా రేవంత్ యాత్రకు మద్దతు ఇస్తానని చెప్పిన కదా అంటూ ఈ సందర్భంగా జగ్గారెడ్డి గుర్తు చేశారు. ఇంకా పదేళ్లు ఐనా.. రేవంత్ రెడ్డి దిగిపోయిన తర్వాతనే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ఈ సమయంలో రేవంత్, చుట్టుపక్కల ఉన్నవాళ్లంతా నవ్వులు చిందించారు. #jaggannamla #Revanthreddy pic.twitter.com/4xuXbzqY4m — S-Punna Reddy (@125PunnaReddy) December 2, 2022 -
కవిత, బీఎల్ సంతోష్ లను వెంటనే అరెస్ట్ చేయాలి - జగ్గారెడ్డి
-
‘బీఎల్ సంతోష్, కవితను వెంటనే అరెస్ట్ చేయాలి’
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు తెలంగాణలో పొలిటికల్ హీట్ను పెంచింది. లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక పాత్ర ఉన్నట్టు ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎమ్మెల్యేల ఎపిసోడ్లో బీఎల్ సంతోష్కు సిట్ నోటీసులు పంపి విచారణకు రావాలని కోరిన ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు ఆసక్తికర కామెంట్స్ చేస్తున్నారు. కాగా, లిక్కర్ స్కాం, ఎమ్మెల్యేల ఎపిసోడ్ వ్యవహారంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జగ్గారెడ్డి స్పందించారు. ఈ క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ కవితను, బీజేపీ నేత బీఎల్ సంతోష్ను వెంటనే అరెస్ట్ చేయాలి. బీఎల్ సంతోష్ను కాపాడేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ నేతలు డ్రామాలు చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద స్కాంలు చేశాయి. వారిద్దరినీ తక్షణమే అరెస్ట్ చేసి, వాస్తవాలు వెలికితీయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే బీఎల్ సంతోష్ను తెలంగాణ ప్రభుత్వం అరెస్ట్ చేస్తే మరిన్ని విషయాలు బయటికొస్తాయని కామెంట్స్ చేశారు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- పర్యాటకులకు వేసవి విడిది ప్రాంతాలు
- Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
Advertisement