-
లాపతా లేడీస్: సిమ్లా టూ బాలీవుడ్, ఎవరీ యాపిల్ బ్యూటీ (ఫొటోలు)
-
Shahnaz Habib: 'ప్రయాణాల వెనుక రాజకీయాలు'.. ఉంటాయని తెలుసా..!
వేసవి వస్తే ప్రయాణాలు గుర్తుకు వస్తాయి. విమానం ఎక్కితే మొబైల్ ఫోన్ను ఎయిర్ప్లేన్ మోడ్లో ఉంచాలి. కాని ఈ ప్రయాణాల వెనుక చాలా రాజకీయాలు ఉంటాయంటోంది షెహనాజ్ హబీబ్. అమెరికాలో ప్రొఫెసర్గా ఉన్న ఈ కేరళ వనిత స్థానిక సంపదను ‘డిస్కవరీ’ చేయడానికే సామ్రాజ్యవాదులు ప్రయాణాలు చేశారని చెబుతుంది. సగటు మనిషి ప్రయాణాలకు ఎన్ని అడ్డంకులున్నాయో ఆమె పుస్తకం ‘ఎయిర్ప్లేన్ మోడ్’ విశదంగా తెలియజేస్తోంది. ట్రావెల్ రైటర్ షెహనాజ్ పరిచయం.‘ప్రయాణాల్లో కూడా వివక్ష ఉంటుంది’ అంటుంది షహనాజ్ హబీబ్. ‘మీ ఒంటి రంగు, మీ పాస్పోర్ట్ రంగు మీ ప్రయాణం సులభం చేయవచ్చో, జటిలం చేయవచ్చో నిర్ణయిస్తాయి’ అంటుందామె. అమెరికాలోని బే పాత్ యూనివర్సిటీలోప్రొఫెసర్గా పని చేసే షహనాజ్ హబీబ్ కేరళలోని ఎర్నాకుళంలో ఒక సామాన్య కుటుంబంలో జన్మించింది. కాని ఆమె నేర్చిన ఇంగ్లిష్ భాష, ఆమె వ్యక్తీకరణ ఆమెకు విశేషమైన గుర్తింపు తెచ్చి పెట్టింది. అమెరికాలోని వ్యాసకర్తల్లో ఆమెకు గుర్తింపు ఉంది. న్యూయార్క్ టైమ్స్లో షహనాజ్ హబీబ్ వ్యాసాలు వస్తాయి.కేరళ రచయిత బెన్యమిన్ రాసిన ఒక నవలను ‘జాస్మిన్ డేస్’ పేరున షహనాజ్ మలయాళంలో అనువదిస్తే ప్రతిష్టాత్మక 25 లక్షల రూపాయల జె.సి.బి. పురస్కారం లభించింది. కవిత్వం, కథలతో పాటు ట్రావెలోగ్స్ కూడా రాసే షహనాజ్ ఇటీవల వెలువరించిన యాత్రా కథనం ‘ఏరోప్లేన్ మోడ్’. అమెరికాలోనూ ఇండియాలోనూ విడుదలైన ఈ పుస్తకం యాత్రల విషయంలో కొత్త చూపును కలిగిస్తోంది.‘ప్రపంచ దేశాల పర్యటనలు తెల్లవాళ్లకు ఒక రకంగానూ రంగు తక్కువ ఆసియా, ఆఫ్రికా దేశాల వారికి ఒక రకంగానూ జరుగుతాయి. అమెరికా, యూరప్ దేశాల వారి తెల్లరంగు చూడగానే వారి ప్రయాణాలకు ఒక విలువ, గౌరవం ఉన్నాయని భావిస్తారు. వారిని అధికారులు చూసే పద్ధతి వేరుగా ఉంటుంది. అదే బ్రౌన్, బ్లాక్ కలర్ ఉన్నవారికి అన్నీ ఆటంకాలే. ఇక అమెరికా పాస్పోర్ట్ ఉండి, వారు తెల్లవారైతే వారికి వీసా క్యూలన్నీ లేనట్టే. అమెరికా పాస్పోర్ట్ ఉంటే చాలా దేశాలకు అసలు వీసాయే అక్కర్లేదు. అంటే ఒక మనిషికి ప్రయాణ గౌరవం పాస్పోర్ట్ వల్లే వస్తోందన్న మాట. దీనినే నేను పాస్పోర్టిజమ్ అంటాను’ అంటుంది షహనాజ్.సంస్కృతి, సంపదల కోసం..‘17, 18 శతాబ్దాల్లో యాత్రీకులకు యూరప్ ప్రభుత్వాలు నిధులు ఇచ్చేవి. అలా ఇచ్చేది యాత్రికులను గౌరవించడానికి కాదు. వారు దేశ దేశాలు తిరిగి అక్కడి సంస్కృతులు, పంటలు, డబ్బు, బంగారం, వస్త్రాలు, మతాలు... వీటన్నింటి గురించి సమాచారం తెస్తే ఏ దేశాన్ని ఏ విధంగా కబళించవచ్చో ఆ ప్రభువులకు తెలిసేది. ఖండాలు, దేశాలు వాటిలోని ప్రజలు అనాదిగా జీవిస్తున్నా ఈ యూరోపియన్ యాత్రికులు వారిని ‘డిస్కవరీ’ చేశామని చరిత్రలు రాసుకున్నారు. కాని ఆ చరిత్రల్లో స్థానికులను ఏ విధంగా తుడిచి పెట్టారో ఉండదు.అలాగే ఇప్పుడు బ్రిటన్, యూరప్, ఆస్ట్రేలియా, జపాన్ల నుంచి ప్రపంచం తిరిగే పర్యాటకులకు వారి దేశాల్లోని పాఠ్య పుస్తకాల్లో తమ దేశాలు ఏయే దేశాలను ఎలా ఆక్రమించాయి, ఎలా దోచుకున్నాయో తెలియజేయరు. యాత్రల వెనుక చాలా చరిత్ర ఉంటుంది. అది తెలుసుకోవడం అవసరం’ అంటుంది షహనాజ్.ఎన్నో అందాలు..‘టూరిజమ్ను ఒక వ్యసనంగా మార్చారు. దీని వెనుక చాలా వ్యాపార ఎత్తుగడ ఉంది. కొత్త ప్రాంతాలు చూడకపోతే వెనుకబడతారనే భావజాలం సృష్టించారు. మా నాన్న ఎక్కడికీ తిరగడానికి ఇష్టపడేవాడు కాదు. మా అమ్మకు కొత్త ప్రాంతాలు చూడటం ఇష్టం. ఇద్దరూ కరెక్టే. ఈ టూరిజమ్లో కూడా తెల్లవారి దేశాలకే గిరాకీ ఎక్కువ. కాని ఆఫ్రికాలో ఎన్నో అందమైన దేశాలు ఉన్నాయి. ఇథియోపియాలోని అండర్గ్రౌండ్ చర్చ్లను చూస్తే మతి పోతుంది. కాని వాళ్లకు ప్రమోట్ చేసుకోవడానికి డబ్బు లేదు. ప్రతి దేశంలో సాంస్కృతిక చిహ్నాలుంటాయి. వాటి ఘన చరిత్ర ఉంటుంది. అయితే దానిని వర్తమానంలో ప్రతీకారాలకు ఉపయోగించకూడదు’ అంటుందామె. – షెహనాజ్ హబీబ్ -
అవును! అతను.. విమానాల్లో లోకం చుట్టిన వీరుడు..!
విమానాల్లో అత్యధిక దూరం ప్రయాణించిన ఈ పెద్దమనిషి పేరు టామ్ స్టూకర్. అమెరికాలోని న్యూజెర్సీవాసి. ప్రస్తుతం ఇతడి వయసు 69 ఏళ్లు. విమాన ప్రయాణాల మీద మక్కువతో 1990లో యునైటెడ్ ఎయిర్లైన్స్ నుంచి 2.90 లక్షల డాలర్లకు (రూ.2.41 కోట్లు) లైఫ్టైమ్ పాస్ తీసుకున్నాడు.ఇక అప్పటి నుంచి తోచినప్పుడల్లా విమానాల్లో దేశాదేశాలను చుట్టేయడం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఇతగాడు విమానాల్లో ఏకంగా 20 మిలియన్ మైళ్లకు (3.21 కోట్ల కిలోమీటర్లు) పైగా ప్రయాణాలు చేశాడు. ప్రపంచంలోనే అత్యంత విరివిగా విమాన ప్రయాణాలు చేసే వ్యక్తిగా రికార్డులకెక్కాడు. లైఫ్టైమ్ పాస్ కోసం అప్పట్లో తాను పెద్దమొత్తమే చెల్లించినా, అలా చెల్లించడం వల్ల ఇప్పటి వరకు లెక్కిస్తే తనకు 2.44 మిలియన్ డాలర్లు (రూ.20.30 కోట్లు) మిగిలినట్లేనని టామ్ చెప్పడం విశేషం. అతి తక్కువ లగేజీతో తాను ప్రయాణాలు చేస్తానని, చేసే ప్రయాణాల కంటే, ప్రయాణాల్లో మనుషులను కలుసుకోవడం తనకు చాలా ఇష్టమని అతడు చెబుతాడు.ఇవి చదవండి: అరాచక పరిస్థితుల్లో జరిగిన ఓ వింత.. నేటికీ మిస్టరీయే! -
ఎముక పుచ్చిపోయింది..నడవొద్దన్నారు: ఇపుడు ఏకంగా సిక్స్ప్యాక్
అరుదైన వ్యాధి సోకింది. నడక వద్దని చెప్పారు. కానీ 43 ఏళ్ల వయసులో 10 కిలోల మేర బరువు తగ్గాడు. అంతేకాదు సిక్స్ ప్యాక్ కూడా సాధించాడు. ఈ ప్రయాణాన్ని మొత్తాన్ని ఇన్స్టాలో తన ఫాలోయర్లతో పంచుకున్నాడు. ప్రముఖ రచయిత, వ్యాపారవేత్త, కంటెంట్ క్రియేటర్ అంకుర్ వారికూ. స్ఫూర్తిదాయక మైన ఫిట్నెస్ జర్నీని, తన సిక్స్ ప్యాక్ ఫొటోలను పోస్ట్ చేశాడు. దీంతో ఇది వైరల్గా మారింది. 2012లో 32 ఏళ్ల వయసులో అవాస్క్యులర్ నెక్రోసిస్ అనే వ్యాధి బారినపడ్డాడు అంకుర్. అతని కుడి తుంటి ఎముక పుచ్చిపోయింది. దీంతో అతని వాకింగ్ చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. శస్త్రచికిత్స చేయించుకోవలసి వచ్చింది. కోలుకోవడానికి నెలల తరబడి బెడ్ రెస్ట్లో ఉన్నాడు. తరువాత 5 నెలలపాటు చేతి కర్రల సాయంతో నడిచానంటూ ఇన్స్టా పోస్ట్తో తన జర్నీని గుర్తు చేసుకున్నాడు అంకుర్. కానీ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్నాక ఫిట్నెస్పై దృష్టిపెట్టాడు. అలా జీవితంలో తొలిసారి జిమ్లో చేరాడు. మెల్లిగా రన్నింగ్ కూడా మొదలుపెట్టాడు. అంతేకాదు ఒక మారథాన్లో కూడా పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. మొదట్లో కాస్త ఇబ్బందిపడినప్పటికీ, పట్టుదలతో అనుకున్నది సాధించాడు. 10 నెలల తర్వాత 21 కిలోమీటర్ల హాఫ్ మారథాన్ పూర్తి చేసినట్లు అంకుర్ వివరించాడు. ఈ ఉత్సాహంతోనే సిక్స్ ప్యాక్ ఎందుకు సాధించకూడదు అని ఆలోచించాడు. ఆ ఆలోచన రావడమే ఆలస్యం దాన్నొక సవాల్గా స్వీకరించి చేసి చూపించాడు. View this post on Instagram A post shared by Ankur Warikoo (@ankurwarikoo)రోజూ వ్యాయామం చేయడ ఆహార నియమాలను పాటించి సిక్స్ ప్యాక్ సాధించి, 43 ఏళ్ల వయసులో తాను ఫ్యాట్ ఫ్రీగా అవతరించడం విశేషం. పదేళ్ల కిందట తన ఫిట్నెస్ను, 6 ప్యాక్ను సాధించాలనుకున్నా, సెకండ్ లైఫ్కి ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. ఆయన పోస్ట్ కు 94 వేలకు పైగా లైక్ లు లభించాయి. అయితే ఆయన పోస్ట్పై నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ఏఐ జనరేటెడ్ ఇమేజ్ అంటూ కమెంట్ చేశారు. -
నేను సాధించగలను అనే పట్టుదల ఉన్న వారికి ఏ ఫీల్డ్ అయినా ఒకటే
ఫీల్డ్ మారడం అనేది మంచి నీళ్లు తాగినంత సులభం కాదు.కాస్త అటూ ఇటూ అయితే మూడు చెరువుల నీళ్లు తాగాల్సి ఉంటుంది.‘నేను సాధించగలను’ అనే పట్టుదల ఉన్న వారికి మాత్రం ఏ ఫీల్డ్ అయినా ఒకటే. అలాంటి ప్రతిభావంతులలో తేజ ఒకరు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా పనిచేసిన తేజ ఐటీ రంగంలోకి అడుగుపెట్టి టెక్ లీడర్గా మంచి పేరు సంపాదించింది. కర్ణాటకలోని బెల్గాంలో పెరిగిన తేజ మనకమె డాక్టర్ అయిన తండ్రి నుంచి విజ్ఞానప్రపంచానికి సంబంధించిన ఎన్నో విషయాలు తెలుసుకునేది. డిఐవై (డూ ఇట్ యువర్ సెల్ఫ్) పాజెక్ట్స్ చేసేది. కర్ణాటక యూనివర్శిటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కోర్సు చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ తొలిసారిగా నాన్–మెడికల్ ఏరియాలలో మహిళల కోసం ద్వారాలు తెరుస్తున్న సమయం అది. తన సీనియర్స్ ఎయిర్ ఫోర్స్లో చేరిపోయారు. వారిని యూనిఫామ్లో చూడడం తేజాకు ఎగ్టయిటింగ్గా అనిపించింది. వారి స్ఫూర్తితోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి వచ్చింది. బెంగళూరులోని ఎయిర్ ఫోర్స్ టెక్నికల్ కాలేజీలోప్రాథమిక శిక్షణ తరువాత మౌంట్ అబూలో పాస్టింగ్ ఇచ్చారు. మౌంట్ అబూ స్టేషన్లోని ఉద్యోగులలో ఇద్దరు మాత్రమే మహిళలు. అందులో తాను ఒకరు. మహిళల కోసం ప్రత్యేక వాష్ రూమ్స్ ఉండేవి కావు. ఇలాంటి సమస్యలు ఎన్ని ఉన్నా ఎప్పుడూ నిరాశపడేది కాదు తేజ,మౌంట్ అబూ తరువాత నాసిక్, బెంగళూరులలో కూడా పనిచేసింది. మన దేశాన్ని ఐటీ బూమ్ తాకిన సమయం అది.ఐటీ ఫీల్డ్లో ఉన్న సోదరుడు తేజాతో ఆ రంగానికి సంబంధించి ఎన్నో విషయాలు పంచుకునేవాడు. దీంతో ఐటీ రంగంపై తనకు ఆసక్తి పెరిగింది. అలా ఎయిర్ ఫోర్స్ను వదిలి ఐటీ రంగంలోకి అడుగు పెట్టింది. టీసీఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్)లో డెవలపర్గా చేరింది. ఫ్రెషర్గా ఐటీ రంగంలో కెరీర్ మొదలు పెట్టిన తేజ అక్కడ ఎన్నో విషయాలు నేర్చుకుంది. ఆ తరువాత టెక్నాలజీస్లో పనిచేసింది. 2005లో డెల్ టెక్నాలజీలో మేనేజర్గా చేరింది. ఒక్కోమెట్టు ఎక్కుతూ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ (ఐటీ) స్థాయికి చేరింది. జెండర్ స్టీరియో టైప్స్ను బ్రేక్ చేస్తూ డెల్ ఐటీ–ఇండియాలో కీలక స్థానంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు ΄పోందింది.డెల్ ఫౌండేషన్లో సేల్స్ అండ్ మార్కెటింగ్, సప్లై చైన్, డేటా సైన్స్... మొదలైన విభాగాల్లో పట్టు సాధించింది. సీఎస్ఆర్ యాక్టివిటీస్పై బాగా ఆసక్తి చూపేది. ‘టెక్నాలజీ సహాయంతో ఎన్నో మంచిపనులు చేయవచ్చు’ అంటున్న తేజ రకరకాల స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఎన్నో మంచి కార్యక్రమాలు చేసింది. కోవిడ్ మహమ్మారి సమయంలో బుద్ద ఫౌండేషన్తో కలిసి వలస కార్మికులకు పునరావాసం కల్పించింది.‘ప్రతి మహిళకు ఒక రోల్మోడల్, మెంటర్ ఉండాలి. అప్పుడే ఎన్నో విజయాలు సాధించగలరు’ అంటున్న తేజ డెల్లో ‘మెంటర్ సర్కిల్ కాన్సెప్ట్’ను అమలు చేసింది. ప్రతి సర్కిల్లో కొందరు మహిళలు ఉంటారు. వారికో మెంటర్ ఉంటారు. ఈ సర్కిల్లో తమ సమస్యలను చర్చించుకోవచ్చు, సలహాలు తీసుకోవచ్చు. ఒకరికొకరు సహాయంగా నిలవచ్చు. ‘ఇంజినీరింగ్ కాలేజీలో క్లాసులో నలుగురు అమ్మాయిలు మాత్రమే ఉండేవాళ్లం. ఇప్పటి పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా కుటుంబంలో నేను ఫస్ట్ ఉమెన్ ఇంజనీర్ని. ఇప్పుడు ఎంతోమంది ఉన్నారు. ఒక ముక్కలో చెపాలంటే సమాజంలో చాలా మార్పు వచ్చింది. ఇది ఆహ్వానించదగిన మార్పు. నేను నేర్చుకున్న విషయాల ద్వారా ఇతరులకు ఏ రకంగా సహాయం చేయగలను అని ఎప్పటికప్పుడు ఆలోచిస్తుంటాను. టైమ్ మేనేజ్మెంట్కు సంబంధించి ఎన్నో సమావేశాలు నిర్వహించాను’ అంటుంది తేజ. -
ఈసారి అమర్నాథ్ యాత్ర 45 రోజులే..
అమర్నాథ్ యాత్రికులకు శుభవార్త. ప్రబుత్వం తాజాగా అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్ను విడుదల చేసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఈసారి భక్తులు సహజసిద్ధ మంచు శివలింగాన్ని 45 రోజులు మాత్రమే దర్శనం చేసుకోగలుగుతారు. అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 15 నుండి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పాల్గొనేందుకు ప్రభుత్వం పలు షరతులు విధించింది. యాత్ర చేయబోయే ప్రతివారూ శారీరకంగా దృఢంగా ఉండటం తప్పనిసరి. వారు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవడంతో పాటు పలు మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. పలు భద్రాతా ఏర్పాట్లు చేసిన తరువాతనే ప్రభుత్వం అమర్నాథ్ యాత్ర టైమ్ టేబుల్ను విడుదల చేసింది 2024 అమర్నాథ్ యాత్ర ఆషాఢ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి నాడు ప్రారంభం కానుంది. అంటే జూన్ 29వ తేదీ అష్టమి తిథి మధ్యాహ్నం 02:19 గంటలకు ఈ యాత్ర ప్రారంభం కానుంది. ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర ఆగస్టు 19తో ముగియనుంది. ప్రతి ఏటా లక్షలాది మంది భక్తులు అమర్నాథ్ యాత్రకు వెళుతుంటారు. -
Smriti Mandhana: ఆటలోనే కాదు అందంలోనూ చాంపియన్.. స్మృతి మంధాన (ఫొటోలు)
-
దేశప్రధానికే లేఖ.. ఎన్నో హేళనలు, అవమానాలు.. దేనికీ బెదరని నటి (ఫోటోలు)
-
ఈ హీరోయిన్ను గుర్తుపట్టారా? మహేశ్ సూపర్ హిట్ మూవీలో (ఫొటోలు)
-
మహిళల ప్రయాణం ఇక టీ–సేఫ్
సాక్షి, హైదరాబాద్: ఒంటరిగా ప్రయాణించే పౌరులు, ముఖ్యంగా మహిళలు సురక్షితంగా గమ్య స్థానం చేరే వరకు పర్యవేక్షించేలా దేశంలోనే మొదటి సారిగా తెలంగాణ పోలీసులు టీ–సేఫ్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి తెలిపారు. స్మార్ట్ఫోన్ లేక పోయినా, సాధారణ మొబైల్ ఫోన్ ఉన్నా..ఈ టీ–సేఫ్ సేవలను వినియోగించుకునే వీలుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదని, కీలకమైన సర్వీస్ అని అన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న మహిళా శక్తి విధానం ఆవిష్కరణలో భాగంగా మంగళవారం సచివాల యంలో టీ–సేఫ్ను సీఎం ప్రారంభించారు. మంత్రులు దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, కొండా సురేఖ, డి.అనసూయ (సీతక్క), తుమ్మల నాగేశ్వర్రావు, జూపల్లి కృష్ణారావు, సీఎస్ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 100 లేదా 112 నంబర్లకు డయల్ చేసి ఐవీఆర్ ఆప్షన్లో 8 నంబర్ను నొక్కడం ద్వారా టీ–సేఫ్ సేవలను వినియోగించుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక్కసారి సమాచారం ఇస్తే చాలు స్మార్ట్ ఫోన్లు ఉన్న వారు గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోవడం, లేదా టీ–సేఫ్ వెబ్పేజీ ద్వారా వీటిని వినియోగించుకోవచ్చని సీఎం తెలిపారు. దేశంలోనే తొలిసారిగా మహిళలు, చిన్నారుల సురక్షిత ప్రయాణం కోసం ఈ సేవలను అందుబాటులోకి తెచ్చిన తెలంగాణ పోలీస్ శాఖకు సీఎం అభినందనలు తెలిపారు. టీ–సేఫ్కు డయల్ 100 ద్వారా లేదా యాప్ ద్వారా ఒకసారి సమా చారం ఇస్తే సరిపోతుందని, మళ్లీ మళ్లీ అత్యవసర సేవల కోసం 100 నంబర్కు ఫోన్ చేయాల్సిన పని లేకుండా పోలీసులే నిర్ధారిత సమయంలోపు పౌరులను సంప్రదిస్తూ వారు సురక్షితంగా గమ్యం చేరే వరకు పర్యవేక్షిస్తారని తెలిపారు. అవసరమైతే లైవ్ ట్రాకింగ్ లింక్ ఆ పరిధిలోని ప్యాట్రో వాహ నాలకు సైతం వెళుతుందని వివరించారు. లైవ్ లొకేషన్ పంపే వీలు టీ–సేఫ్ యాప్ను వినియోగించే పౌరులు ఆపదలో ఉన్నప్పుడు వారి లైవ్ లొకేషన్ను పోలీసులకు పంపే వీలు కూడా ఉందని రేవంత్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 791 ప్యాట్రో కార్లు, 1,085 బ్లూకోల్ట్స్ వాహనాలకు టీ–సేఫ్ అనుసంధానమై ఉంటుందని చెప్పారు. భవిష్యత్తులో మరింత సురక్షిత ప్రయాణం కోసం టీ–సేఫ్ యాప్ సేవలను ఇతర క్యాబ్, ప్రైవేటు ట్రాన్స్పోర్ట్ సేవల యాప్లకు అనుసంధానిస్తామని మహిళా భద్రత విభాగం అధికారులు తెలిపారు. కార్యక్రమంలో సీఐడీ, మహిళా భద్రత విభాగం అదనపు డీజీ శిఖాగోయల్, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ శివధర్రెడ్డి, శిక్షణ విభాగం అదనపు డీజీ అభిలాష బిస్త్, శాంతిభద్రతల అదనపు డీజీ సంజయ్ జైన్, ఇతర సీనియర్ ఐపీఎస్ అధికారులు కూడా పాల్గొన్నారు. -
కొంగొత్త ఆలోచనలకు అంకురం... ఇన్నొవేషన్ యాత్ర 2024!
అటల్ కమ్యూనిటీ ఇన్నోవేషన్ సెంటర్ (ACIC-CBIT), కాకతీయ శాండ్బాక్స్ నేతృత్వంలో.. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ (TSIC) భాగస్వామ్యంతో 'ఇన్నోవేషన్ యాత్ర - 2024' (Innovation Yatra - 2024) పేరుతో ఓ ప్రత్యేకమైన కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇందులో ఎలా పాల్గొనాలి, ఈ ప్రోగ్రామ్ ఎన్ని రోజులు జరుగుతుందనే వివరాలు ఇక్కడ చూసేద్దాం.. ఇన్నోవేషన్ యాత్ర - 2024 రేపటితో ప్రారంభమై శనివారం వరకు (మార్చి 12 నుంచి 16) జరగనుంది. ఇందులో నవమ్ ఫౌండేషన్, ఎకో సిస్టం భాగస్వాములుగా Ag-Hub, అడ్వెంచర్ పార్క్, AIC-GNITS, కేజీ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, పల్లె సృజన మొదలైనవి భాగస్వాములుగా పాల్గొంటాయి. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇన్నోవేషన్ యాత్ర 5 రోజులు, 60 మంది యాత్రికులు, 6 గమ్యస్థానాలు, 800 కి.మీ సాగుతుంది. ఇది ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ స్ఫూర్తిని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న వారు ఎవరైనా ఈ యాత్రలో పాల్గొనటానికి అప్లై చేసుకోవచ్చు. ఐదు రోజులు జరిగే ఈ బస్సు యాత్రలో పాల్గొనేవారు విజవయంతమైన వ్యవస్థాపకులు, లోకల్ ఇన్నోవేటర్స్తో సమయాన్ని గడపవచ్చు. ఈ ప్రయాణంలో మంచి అనుభవాలు పొందటమే కాకుండా.. విలువైన విషయాలను తెలుసుకోగలుగుతారు. ఈ యాత్రలో పాల్గొనేవారు తెలంగాణలోని విభిన్న కమ్యూనిటీలను కలుసుకోవడం, వారి ప్రత్యేకమైన అవసరాలు.. వారు ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి లోతైన అవహగాన పొందటమే కాకుండా, వారి అనుభవాల పట్ల సానుభూతిని పెంపొందించుకోవడానికి అవకాశం ఉంది. నిజ జీవితంలో సమస్యలను పరిష్కరించడానికి కావలసిన మనస్తత్వం మీలో పెంపొందించుకోవడంలో ఈ యాత్ర తప్పకుండా తోడ్పడుతుంది. ఇన్నోవేషన్ యాత్రలో వ్యక్తిగత అభివృద్ధికి అతీతంగా.. విభిన్న నేపథ్యాలకు చెందిన 59 యాత్రికులతో కనెక్ట్ అవుతారు. దీని ద్వారా మీకు కావలసిన జ్ఞానాన్ని పొందుతారు. సవాళ్లను సృజనాత్మకంగా ఎదుర్కోవడానికి, వినూత్న పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి అవసరమైన నైపుణ్యాలు ఈ యాత్ర ద్వారా సంపాదించవచ్చు. తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలోని ఆవిష్కర్తల స్ఫూర్తిదాయకమైన కథలను ప్రదర్శించడం కూడా ఇందులో ఒక భాగం. వారు సాధించిన విజయాలు భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందనేది యాత్ర లక్ష్యం. -
ప్రియమణి గురించి ఆసక్తికర విషయాలు మీకు తెలుసా? (ఫొటోలు)
-
నేడు బీజేపీలోకి కాంగ్రెస్ దిగ్గజ నేత!
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. పలువురు కాంగ్రెస్ నేతలు పార్టీని వీడి, కమలదళంలో చేరుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ పచౌరీ కూడా కాంగ్రెస్ను వీడారు. సురేష్ పచౌరీ నేడు (శనివారం) భోపాల్లో జరగనున్న ఒక కార్యక్రమంలో బీజేపీలో చేరబోతున్నారు. 1972లో ఆయన ఇండియన్ యూత్ కాంగ్రెస్లో చేరి, తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 1981లో మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. 1983 వరకు ఈ పదవిలో కొనసాగారు. రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదుగుతూ పచౌరీ 1984లో యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎన్నికై, ఏడాదిపాటు ఈ పదవిలో కొనసాగారు. కాంగ్రెస్ నేత సురేష్ పచౌరీ 1984,1990, 1996, 2002లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. అలాగే కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షునిగానూ పనిచేశారు. -
రూ.300 జీతం.. ఎన్నో కష్టాలు.. సొంతంగా వ్యాపారం - ధీరుభాయ్ అంబానీ గురించి ఆసక్తికర విషయాలు (ఫొటోలు)
-
వాలైంటైన్స్ డే స్పెషల్.. 9 సూపర్ హిట్ చిత్రాలు రీ రిలీజ్
ప్రేమికుల రోజు రానుంది. ఈ రోజును ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని ఇప్పటికే ప్లాన్స్ వేసే ఉంటారు. తన ప్రియురాలు/ ప్రియుడికి ఎలాంటి కానుకలు ఇవ్వాలని ఆలోచించే ఉంటారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వారు మొదట ఎక్కడ కలుసుకున్నారో ఆ నాటి స్మృతులను మరోసారి గుర్తుచేసుకుంటారు. ప్రేమించేవారిని ఎలా సర్ప్రైజ్ చేయాలో నిర్ణయానికి వచ్చి ఉంటారు. వాట్సప్ డీపీగా ఏ ఫొటో పెట్టాలో... ఫేస్బుక్ పేజీలో ఏ కవిత పోస్ట్ చేయాలో... ఇన్స్టాగ్రాంలో ఏ చిత్రం పంచుకోవాలో.. సిద్ధంగా ఉంచుకునే ఉంటారు. ఇలా చాలా మంది ప్రేమికులకు సినిమా అనేది ఒక భాగం. అందుకే ప్రేమ గురించి గతంలో లెక్కలేనన్ని సినిమాలు వచ్చేశాయి. అలా ప్రేమికులను మెప్పించిన ఆ సినిమాలు మళ్లీ రీరిలీజ్ అవుతున్నాయి. వాలెంటైన్స్ డే నాడు వచ్చే చిత్రాలు ఏంటో చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, గౌతమ్ వాసుదేవ్ మేనన్ కాంబినేషన్లో 'సూర్య సన్నాఫ్ కృష్ణన్' చిత్రం విడుదలై సూపర్ హిట్ కొట్టింది. 2008లో విడుదలైన ఈ సినిమా గతేడాదిలోనే రీ రిలిజ్ అయి భారీ కలెక్షన్స్ రాబట్టింది. ఇప్పుడు ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల అవుతుంది. ఇందులో హీరో సూర్య డ్యుయల్ రోల్లో మెప్పించాడు. హ్యారీస్ జైరాజ్ సంగీతం ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది. సిద్ధార్థ్ ప్రేమ కథా చిత్రాల్లో 'ఓయ్' చిత్రానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో షామిలీ హీరోయిన్గా అద్భుతంగా నటించింది. ఈ సినిమా 2009లో రిలీజ్ అయి మంచి లవ్ స్టోరీగా మిగిలిపోయింది. సుమారు 15 ఏళ్ల తర్వాత వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. ఈ సినిమా కోసం యూత్ బాగానే ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉంది. పాన్ ఇండియా రేంజ్లో భారీ బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం సీతారామం. 2022లో వచ్చిన ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఎమోషనల్ లవ్ స్టోరీతో ఆకట్టుకుంది. దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమా క్లాసికల్ హిట్గా నిలిచింది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న థియేటర్లలోకి మరోసారి వచ్చేస్తుంది. 1998లో బ్లాక్బస్టర్ అందుకున్న తొలిప్రేమ చిత్రం మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కరుణాకరన్ దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం ప్రేమికుల మనసులను గెలుచుకొని బ్లాక్బాస్టర్ అయింది. ఒక రకంగా పవన్కు ఈ చిత్రం స్టార్డమ్ను కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా ఇప్పటికే గతంలో రీ రిలీజ్ కావడంతో ఇప్పుడు తక్కువ సంఖ్యలో మాత్రమే థియేటర్లలోకి రానుంది. అలానే ఈ చిత్రాలతో పాటు సిద్ధార్, త్రిష జంటగా నటించిన 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా', పన్నెండేళ్ల క్రితం శర్వానంద్, అంజలి జై కాంబినేషన్లో వచ్చిన 'జర్నీ' సినిమా కూడా రీ రిలీజ్ కానున్నాయి. తెలుగులోనే కాకుండా బాలీవుడ్లోనూ పలు ప్రేమ కథా చిత్రాలు రీ రిలీజ్ కానున్నాయి. దిల్వాలే దుల్హనియా లేజాయేంగే, దిల్ తో పాగల్ హై', మొహబ్బతే వంటి హిట్ సినిమాలు కూడా రానున్నాయి. ఈ వాలెంటైన్స్ డే నాడు సినిమా అభిమానులకు పండుగే అని చెప్పవచ్చు. -
ఢిల్లీ మెట్రోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. వార్తా సంస్థ ఏఎన్ఐ విడుదల చేసిన వీడియోలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చుట్టూ భద్రతా అధికారులు నిలుచుని ఉన్నారు. మెట్రో నిర్వహణ గురించి డీఎంఆర్సీ ఉన్నతాధికారులు రాష్ట్రపతి ముర్ముకు తెలియజేస్తుండటం వీడియోలో కనిపిస్తుంది. #WATCH | President Droupadi Murmu takes a metro ride in Delhi. pic.twitter.com/Elc2pdUmHJ — ANI (@ANI) February 7, 2024 -
ఈమె స్టార్ హీరోయిన్, ఆ ఒక్క సినిమాతో చాలా ఫేమస్.. కానీ ఆ తర్వాతే!
ఈమెని చూస్తే అచ్చ తెలుగమ్మాయి అనుకుంటారు. కానీ ఈమెది తెలుగు కాదు. సొంత భాషలో కెరీర్ సంగతి పర్లేదు కానీ తెలుగులో మాత్రం ఒకే ఒక్క సినిమాతో యమ క్రేజ్ సంపాదించింది. ఆ తర్వాత మాత్రం టాలీవుడ్లో సరిగా కెరీర్ ప్లాన్ చేసుకోలేకపోయింది. భారీ బడ్జెట్ సినిమాల్లో నటించినా లాభం లేకుండా పోయింది. మరి ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా? పైన కనిపిస్తున్న బ్యూటీ పేరు అనన్య. అరె.. ఈమెని ఎక్కడో చూసినట్లు ఉందే అనుకుంటున్నారా? పర్లేదు కాస్త గుర్తుపట్టారనమాట. కేరళలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ అసలు పేరు అయిల్య గోపాలకృష్ణ. కాకపోతే సినిమాల్లోకి వచ్చేసరికి అనన్య అని పేరు మార్చుకుంది. తండ్రి నిర్మాత కావడంతో చిన్నప్పుడే ఒకటి రెండు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది. ఆ తర్వాత మళ్లీ ఇటువైపు కన్నెత్తి చూడలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?) ఇక డిగ్రీ చదువుతున్నప్పుడు ఆర్చరీలో(విలువిద్య) రాష్ట్ర స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే టైంలో ఈమెకు మూడు నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కానీ వాటికి నో చెప్పింది. కానీ కొన్నిరోజుల తర్వాత 'పాజిటివ్' అనే చిత్రంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 2008 నుంచి ఇప్పటికీ సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ.. 'జర్నీ' సినిమాతో తెలుగు ఆడియెన్స్కి దగ్గరైపోయింది. ఆ తర్వాత హీరోయిన్గా తెలుగులో 'అమాయకుడు' అని స్ట్రెయిట్ మూవీ చేసింది. కానీ ప్లాఫ్ అయింది. గత కొన్నాళ్లలో అయితే 'అఆ', 'మహర్షి' లాంటి తెలుగు సినిమాల్లో చిన్నాచితకా పాత్రలు చేసింది కానీ టాలీవుడ్లో ఇదేమంతగా ఉపయోగపడలేదు. దీంతో పూర్తిగా మలయాళ చిత్రాలకే పరిమితమైపోయింది. నటిగా కొనసాగుతూనే 2012లో ఆంజనేయన్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతానికైతే ఓవైపు ఫ్యామిలీ, మరోవైపు యాక్టింగ్ కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటోంది. అయితే చాలారోజుల తర్వాత ఈమెని చూసి నెటిజన్స్ గుర్తుపట్టలేకపోయారు. కాసేపటి తర్వాత ఈమె 'జర్నీ' హీరోయిన్ కదా అని గుర్తుపట్టారు. (ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్మెంట్పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ) View this post on Instagram A post shared by SuMaN RaMdAs 🇮🇳 (@the_art_of_photographer) -
సో బ్యూటిఫుల్..సో ఎలిగెంట్: నటి ఫిట్నెస్ జర్నీ , ఫ్యాన్స్ ఫిదా
చాలామంది మహిళల్లో ప్రెగ్నెన్సీలో బాగా బరువు పెరుగుదల కనిపిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే గర్భధారణకు ముందు ఆ తరువాత అన్నట్టు తయారవుతుంది మహిళల ఫిట్నెస్ పరిస్థితి. ప్రసవం తరువాత సహజంగా బరువు తగ్గడం అనేది చాలా కొద్దిమందికి మాత్రమే సాధ్యం. మళ్లీ మునుపటి స్థాయికి చేరాలంటే అంత సులభం కాదు. చేయాల్సిన కసరత్తు చాలానే ఉంటుంది ఒకవైపు బిడ్డకు తల్లిపాలు, ఆలన పాలనా చూసుకుంటూనే తమ ఫిట్నెస్పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. దీనికి సాధారణంగా ఆరు నెలలనుంచి రెండేళ్ల వరకు పట్టవచ్చు. కానీ బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ మూడు నెలల్లో 20 కేజీలు బరువు అందర్నీ ఆశ్చర్యపరిచ్చింది. 2022లో మగబిడ్డకు జన్మనిచ్చిన సోనమ్ సోషల్ మీడియాలో తన పోస్ట్ ప్రెగ్నెన్సీ జర్నీ గురించి చెప్పుకొచ్చింది. ప్రసవానంతర బరువు తగ్గే క్రమంలోన్నానంటూ ఇన్స్టాగ్రామ్లో బ్యూటిఫుల్ పిక్స్ షేర్ చేసింది. ఇన్స్టాలో 35.3 మిలియన్ల మంది ఫాలోవర్లు ఈ నటి “వావ్.. 20 కిలోలు తగ్గాను ... ఇంకా 6 కిలోలు తగ్గాలి అంటూ చెప్పుకొచ్చింది.మళ్లీ తనలా మారడానికి 16 నెలలు పట్టిందనే విషయాన్ని చెబుతూ లెహంగాలో అమేజింగ్లుక్లో ఉన్న కొన్ని చిత్రాలను ఫ్యాన్స్కు షేర్ చేసింది.ఎటువంటి క్రాష్ డైట్లు , క్రేజీ వర్కౌట్లు లేకుండానే తనని తాను, కొడుకును చూసుకుంటూ నిదానంగా ఈ స్థాయికి వచ్చానంటూ తన జర్నీ గురంచి పోస్ట్ చేసింది.దీంతో ఫ్యాన్స్ వావ్.. అద్భుతం అంటూ కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) View this post on Instagram A post shared by Sonam A Kapoor (@sonamkapoor) కాగా వ్యాపారవేత్త ఆనంద్ అహుజాను 2018లొ వివాహం చేసుకుందిసోనమ్.నటి చివరిగా 'బ్లైండ్ మూవీలో కనిపించిన ఈమె మంచి స్క్రిప్ట్తో ఉంటే OTT ప్లాట్ఫారమ్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానంటూ ఇటీవల ప్రకటించింది.మంచి కంటెంట్ ,మంచి సినిమాలో భాగం కావడం తనకు ముఖ్యమని తెలిపింది. -
సంక్రాంతి ప్రయాణం సాఫీగా..
చౌటుప్పల్, కోదాడ : సంక్రాంతి ప్రయాణం సాఫీగా సాగిపోయేందుకు జీఎంఆర్ సంస్థ, పోలీసు యంత్రాంగం చర్యలు చేపడుతున్నాయి. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై పండగ వేళ ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఎక్కడెక్కడో ఉన్న ప్రజలు సంక్రాంతి పండుగకు తమ స్వస్థలాలకు వెళ్తారు. ముఖ్యంగా హైదరాబాద్, ఆ పరిసర ప్రాంతాల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్లేవారితో 65వ నంబర్ హైవేపై విపరీతమైన రద్దీ ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాయలసీమ మినహా మిగతా అన్ని ప్రాంతాలకు రోడ్డుమార్గంలో వెళ్లే వారికి ఇదే ప్రధాన రహదారి. లెక్కకు మించిన వాహనాలు బారులు తీరడంతో సంక్రాంతి సమయంలో ఈ హైవేపై ట్రాఫిక్ నత్తనడకన సాగుతుంది. ఇక సంక్రాంతికి ముందు రోజైతే టోల్గేట్ల వద్ద గంటల తరబడి స్తంభించిపోతుంది. ఇక ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఇక అంతే. ఈ నేపథ్యంలో.. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు దృష్టిలో ఉంచుకుని జీఎంఆర్ సంస్థ ఇప్పటికే తగు చర్యలు చేపట్టింది. మరోవైపు పోలీసులు కూడా అవసరమైన చర్యలు చేపట్టారు. కాగా స్వస్థలాలకు బయలుదేరిన ప్రయాణికులతో గురువారం నాడే హైవేపై రద్దీ పెరిగింది. సొంతవాహనాలపైనే రాక పోకలు సంక్రాంతి సమయంలో జాతీయ రహదారిపై ప్రయాణించే వాహనాల సంఖ్య ప్రతిఏటా పెరుగుతోంది. గతంలో ప్రజలు ప్రజా రవాణా వ్యవస్థను వినియోగించుకునేవారు. ప్రస్తుతం ఎక్కువగా సొంత వాహనాల ద్వారానే రాకపోకలు సాగిస్తున్నారు. రైళ్లు, బస్సుల్లోని రద్దీని తట్టుకోలేక కొందరు అద్దె వాహనాలను తీసుకొని స్వస్థలాలకు వెళ్లి వస్తుంటారు. దీంతో హైవేపై రద్దీ ఏర్పడుతోంది. గతేడాది సంక్రాంతి పండుగ సమయంలో రోజూ 55 నుంచి 60 వేల వరకు వాహనాలు రాకపోకలు సాగించగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 70 నుంచి 75 వేల మధ్య ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బ్లాక్స్పాట్ల వద్ద భద్రంగా వెళ్లాలి హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా విస్తరించినప్పటికీ వాహనాల సంఖ్య పెరుగుతుండడంతో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు 275 కి.మీ. దూరం ఉండగా అందులో చౌటుప్పల్ మండలంలోని దండుమల్కాపురం నుంచి కృష్ణా జిల్లా నందిగామ శివారు వరకు 181 కి.మీ. మేర టోల్రోడ్డు ఉంది. కాగా ఈ మార్గంలో ప్రమాదాలు చోటుచేసుకునే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్లు) చాలా ఉన్నాయి. ఆయా ప్రాంతాలను అధికారులు గుర్తించారు. దండుమల్కాపురం, ఖైతాపురం, ధర్మోజిగూడెం, చౌటుప్పల్, అంకిరెడ్డిగూడెం, పంతంగి, రెడ్డిబావి, పెద్దకాపర్తి, చిట్యాల, గోపలాయిపల్లి, ఏపీ లింగోటం, కట్టంగూర్, పద్మానగర్ జంక్షన్, ఇనుపాముల, కొర్లపహాడ్, టేకుమట్ల, చీకటిగూడెం, సూర్యాపేట శివారు (జనగామ క్రాస్రోడ్డు), మునగాల, ముకుందాపురం, ఆకు పాముల బైపాస్, కొమరబండ వై జంక్షన్ కట్టకొమ్ముగూడెం క్రాస్రోడ్డు, రామాపురం క్రాస్రోడ్డు, నవాబ్పేట, షేర్మహమ్మద్పేట ప్రాంతాలను ప్రధాన బ్లాక్స్పాట్లుగా గుర్తించారు. ఈ ప్రాంతాల్లో జాగ్రత్తగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. ప్రమాదాల నివారణకు లైటింగ్, సైన్ బోర్డులు, వేగ నియంత్రణ చర్యలు చేపట్టారు. రేడియం స్టిక్కర్లతో కూడిన రోడ్ మార్జిన్ మార్కింగ్లూ వేశారు. ప్రతి 20 కిలోమీటర్లకుఒక అంబులెన్స్ సంక్రాంతి రద్దీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జీఎంఆర్ సంస్థ ఎన్హెచ్ఏఐ, పోలీస్, రెవెన్యూ శాఖల సమన్వయంతో ఏర్పాట్లు చేసింది. ప్రతి 20 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్తో కూడిన వైద్య బృందాన్ని అందుబాటులో ఉంచుతోంది. కొన్ని ప్రాంతాల్లో భారీ క్రేన్లను సైతం అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్కో టోల్ప్లాజా పరిధిలో షిప్టుకు 20మంది చొప్పున అదనపు సిబ్బందిని జీఎంఆర్ సంస్థ ఏర్పాటు చేసింది. ఈ హైవేపై పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు, కీసర ప్రాంతాల్లో టోల్ప్లాజాలు ఉన్నా యి. పోలీస్శాఖ ప్రతి టోల్ప్లాజా వద్ద 20 మంది పోలీస్లతో ప్రత్యేక టీమ్లను నియమించనుంది. రిస్క్ మేనేజ్మెంట్ టీమ్లను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఉన్నా 1033 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. పొద్దునే ప్రయాణం వద్దు ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఉదయం పొగమంచు అధికంగా ఉంటోంది. దీని వల్ల రహదారిపై ప్రమా దాలు చోటు చేసుకునే అవకాశం ఎక్కువ. ఉదయం పొగమంచు తగ్గిన తర్వాతే ప్రయాణాలు పెట్టుకోవాలని కూడా పోలీసులు చెపుతున్నారు. రహదారిపై ప్రమాదం జరిగే చాన్స్ ఉన్న ప్రదేశాలను ముందుగానే తెలుసుకుని జాగ్రత్తగాప్రయాణించాలని పేర్కొంటున్నారు. ఫాస్టాగ్ సరిచూసుకోండి వాహనదారులు తమ వాహనాలకు ఫాస్టాగ్ వ్యాలిడిటీ ఉందో లేదో చూసుకోవాలి. సరిపడా నగదు ఉందో లేదో గమనించాలి. బ్లాక్లిస్టులో పడితే తిరిగి అప్డేట్ కావడానికి 24 గంటల సమయం పట్టే అవకాశం ఉంటుంది. అన్నీ సక్రమంగా ఉన్నా నగదు లేకపోతే టోల్ బూత్లోకి వెళ్లాక ఆ విషయం తెలిస్తే లైన్లోనే చిక్కుకోవాల్సి వస్తుంది. అప్పటికప్పుడు రీచార్జ్ చేసినా సేవలు అందుబాటులోకి రావడానికి సమయం పడుతుంది. అక్కడ కాస్త జాగ్రత్త అబ్దుల్లాపూర్ మెట్: హైదరాబాద్లోని ఎల్బీనగర్ నుంచి చౌటుప్పల్ మండలం దండుమల్కాపూర్ వరకు 24 కిలోమీటర్ల మేర విజయవాడ జాతీయ రహదారిని ఆరులేన్లుగా విస్తరించే పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతానికి వనస్థలిపురం నుంచి దండుమల్కాపూర్ వరకు పనులు ప్రారంభంగా కాగా నల్లగొండ–రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో మాత్రమే రోడ్డు విస్తరణ పూర్తి దశకు చేరుకుంది. చాలా చోట్ల రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా ఉండడంతో వాహనాల సంఖ్య పెరిగిన సమయంలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు హైదరాబాద్ – విజయవాడ హైవేపై ప్రమాదాల నివారణకు పెట్రోలింగ్ పెంచాం. ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలపకుండా, రాంగ్ రూట్, ఓవర్ స్పీడ్ లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. జిల్లా పరిధిలో కొన్ని ప్రధాన బ్లాక్ స్పాట్స్ గుర్తించాం. ఇక్కడ ప్రమాదాలు సంభవించకుండా నిబంధనలు అమలు చేస్తున్నాం. స్పీడ్ లిమిట్ బ్లింక్ లైట్స్ ఏర్పాటుతో రోడ్డుపై లైనింగ్ వేస్తాం. హైవే వెంట ఉన్న గ్రామాల ప్రజలకు, రైతులకు రాంగ్ రూట్లో వెళ్లవద్దని చెబుతున్నాం. –రాహుల్హెగ్డే, ఎస్పీ, సూర్యాపేట జిల్లా సురక్షిత ప్రయాణానికి తగిన ఏర్పాట్లు సంక్రాంతి పండుగ రద్దీని ఇప్పటికే అంచనా వేశాం. ప్రజలు సురక్షితంగా తమ గమ్యస్థానాలకు చేరుకునేలా తగిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. – శ్రీధర్రెడ్డి, జీఎంఆర్ సంస్థ మేనేజర్ రోడ్డుపై వాహనాలు నిలపొద్దు జాతీయ రహదారిపై ప్రమాదాలు జరిగే బ్లాక్స్పాట్ల వద్ద అధికారులు వేగాన్ని, వాహనాలను నియంత్రించడానికి స్పీడ్ కంట్రోల్ స్టాపర్లను, బారికేడ్లను ఏర్పాటు చేస్తున్నారు. తక్కువ వేగంతో ప్రయాణించడంతో పాటు రోడ్డుమీద ఉన్న స్పీడ్ స్టాపర్లను గమనించాలని, అతివేగంగా వెళ్లవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లోనూ రోడ్డుపై వాహనాలను నిలపవద్దని కోరుతున్నారు. -
430 నగరాల నుంచి అయోధ్యకు నేరుగా 72 రైళ్లు..
అయోధ్యలో జనవరి 22న శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠాపన జరగనుంది. అనంతరం అయోధ్యను సందర్శించేవారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు వచ్చే భక్తులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించనున్నట్లు రైల్వేశాఖ తెలిపింది. అయోధ్య సందర్శనకు వచ్చే ప్రయాణికుల కోసం భారతీయ రైల్వే ప్రత్యేక ప్రణాళికను రూపొందించింది. ఏసీ మొదలుకొని స్లీపర్ క్లాస్, జనరల్ సౌకర్యాలతో కూడిన అన్ని రకాల రైళ్లు నడిపేందుకు సిద్ధమవుతోంది. అయోధ్య వైపు వెళ్లే రైళ్ల షెడ్యూల్ త్వరలో విడుదల కానున్నదని సమాచారం. ప్రస్తుతం అయోధ్యకు 35 రైళ్లు నడుస్తున్నాయి. రోజువారీ రైళ్లతో పాటు, వీక్లీ రైళ్లు కూడా ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న రైళ్లతో పాటు జనవరి 22 నుంచి 37 అదనపు రైళ్లను నడపనున్నారు. దీంతో దేశంలోని 430 నగరాల నుంచి మొత్తం 72 రైళ్లు అయోధ్యకు నడవనున్నాయి. దీని గురించి రైల్వే మంత్రిత్వ శాఖ సమాచార, ప్రచురణ డైరెక్టర్ శివాజీ మారుతీ సుతార్ మాట్లాడుతూ భక్తుల రాకను దృష్టిలో ఉంచుకుని అయోధ్యకు అదనపు రైళ్లను నడపనున్నట్లు తెలిపారు. మరిన్ని నగరాలను నేరుగా అయోధ్యకు అనుసంధానం చేసేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోందని అన్నారు. ఇది కూడా చదవండి: బాలరామునికి బొమ్మల బహుమానం -
ప్రేమికుల రోజు సందర్భంగా బ్లాక్ బస్టర్ సినిమా 'రీ రిలీజ్'
దాదాపు పన్నెండేళ్ల క్రితం వచ్చిన 'జర్నీ' సినిమా అప్పట్లో యూత్ను ఎంతగానో కట్టిపడేసింది. అంజలి, జై, శర్వానంద్, అనన్య జోడిగా ఈ చిత్రంలో నటించారు. ఈ సినిమాను చూసిన వారందరూ ఇప్పటి జనరేషన్లో టువంటి అమ్మాయిలు కూడా ఉంటారా? అనేంతగా సినిమా కథలో హీరోయిన్ పాత్ర ఉంటుంది. ఇందులోని ప్రేమ కథలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. మురుగదాస్ నిర్మాణం, ఎం.శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సీ.సత్య సంగీతం అందించారు. అప్పట్లో ప్రేక్షకులను ఈ సినిమా మెప్పించింది. 2011 సెప్టెంబర్ 16న థియేటర్లోకి వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఆదరించి బ్లాక్ బస్టర్ హిట్ను చేశారు. అలాంటి బ్లాక్ బస్టర్ మూవీ ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కాబోతోంది. అసలే టాలీవుడ్లో ఇప్పుడు రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ప్రతీ నెల ఏదో ఒక కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ అవుతూనే ఉంది. ఈ రీ రిలీజ్లకు థియేటర్లు షేక్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇదే క్రమంలో ఈ ఏడాది ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ‘జర్నీ’ని రీ రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. లక్ష్మీ నరసింహా మూవీస్ బ్యానర్ మీద ఏ.సుప్రియ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున మళ్లీ రీ రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరిలో జర్నీని గ్రాండ్గా మళ్లీ థియేటర్లోకి తీసుకురాబోతున్నారు. ప్రేమికులకు ఈ సినిమా మంచి ఫీస్ట్ లాంటిదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. -
ముంబయి నుంచి అయోధ్యకు ముస్లిం మహిళ పాదయాత్ర
లక్నో: రాముడు ఆదర్శపురుషుడు. సర్వవ్యాప్తమైన రాముని జీవన విధానం ఆచరణీయం. రామునిపై విశ్వాసం అందరిసొంతం అని నిరూపిస్తోంది ఓ ముస్లిం మహిళ. అయోధ్య రామున్ని దర్శించుకోవడానికి ముంబయి నుంచి కాలినడకన బయలు దేరింది. ఆమె సహచరులతో కలిసి ఏకంగా 1,425 కిలోమీటర్ల దూరం కాలినడకనే ప్రయాణిస్తోంది. ముంబయికి చెందిన షబ్నమ్కు రాముడంటే ఎంతో ఇష్టం. అయోధ్యలో కొలువుదీరనున్న రామున్ని దర్శించుకోవడానికి కాలినడకనే వెళ్లాలని నిర్ణయించుకుంది. తన సహచరులు రామన్ రాజ్ శర్మ, వినీత్ పాండేలతో కలిసి ప్రయాణాన్ని ప్రారంభించింది. ముస్లిం మహిళను అయినప్పటికీ రామున్ని పూజించడానికి అచంచలమైన భక్తి ఒక్కటే అర్హతని అంటోంది. రామున్ని పూజించడానికి హిందువు కానవసరం లేదని పేర్కొంది. మంచి మనిషిగా జీవించడమే ముఖ్యమని చెబుతోంది. ప్రస్తుతం యాత్రలో మధ్యప్రదేశ్కు చేరుకుంది. ప్రతి రోజూ 25 నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు వెల్లడించింది. సుధీర్ఘ యాత్రలో అలసట వచ్చినప్పటికీ రామునిపై ఉన్న భక్తే తమ యాత్రను కొనసాగిస్తోందని షబ్నమ్ తెలిపింది. రాముని ఆరాధన ఏ ప్రత్యేక మతం లేదా ప్రాంతానికి పరిమితం కాదని, అది సరిహద్దులను దాటి ప్రపంచం మొత్తాన్ని చుట్టుముడుతుందని షబ్నమ్ గట్టిగా నమ్ముతోంది. మతంతో సంబంధం లేకుండా రాముడు అందరివాడనే ప్రేరణ కలిగించడానికే యాత్రను చెపట్టినట్లు పేర్కొంది. అబ్బాయిలు మాత్రమే ఇలాంటి కష్టతరమైన యాత్రలు చేయగలరనే అపోహను దూరం చేస్తానంటోంది. యాత్రలో వీరిని కలిసిన పలువురు ఫొటోలు షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్గా మారారు. అయితే.. షబ్నమ్ పాదయాత్రకు సవాళ్లు తప్పలేదు. ఆమెకు భద్రత కల్పించడమే కాకుండా భోజనం, వసతి ఏర్పాట్లు కల్పించడంలో పోలీసులు కీలకంగా వ్యవహరించారు. సున్నితమైన ప్రాంతాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు పోలీసులు ఆమెకు భద్రత కల్పించారు. సోషల్ మీడియాలో కొందరు ద్వేషిస్తున్నప్పటికీ.. షబ్నమ్ తన ప్రయాణాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తోంది. ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. విశేష స్పందనలు ప్రోత్సాహాన్నిస్తున్నాయని తెలిపింది. రాముని జెండాను పట్టుకుని నడుస్తున్నప్పుడు ముస్లింలతో సహా అనేక మంది 'జై శ్రీరామ్' అని నినదించిన ఆనంద క్షణాలను అనుభవించానని షబ్నమ్ చెబుతోంది. -
ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై..
Evolution Of Google: ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో 'గూగుల్' (Google) గురించి తెలియని వారు దాదాపు ఉండరనేది అక్షర సత్యం. ఆవకాయ వండాలన్న.. అమలాపురం గురించి తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం గూగుల్. ఈ రోజు నభూతో నభవిష్యతిగా ఎదిగిన 'గూగుల్' రెండు దశాబ్దాల క్రితం ఓ సాదాసీదా సెర్చ్ ఇంజన్ మాత్రమే. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా సమాధానం అందించే జగద్గురుగా మారింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గూగుల్ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం.. చరిత్ర గురించి చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం గూగుల్ పూర్వం యుగం, గూగుల్ తర్వాత యుగం అని చదువుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తే.. గూగుల్ ఎంతలా వ్యాపించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. గూగుల్ ప్రారంభం.. 90వ దశకం చివరిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటిలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్లో ప్రావిణ్యం కలిగిన ఇద్దరు PhD స్టూడెంట్స్ ''సెర్గీ బ్రిన్, లారీ పేజ్''లు గూగుల్ ప్రారంభించాలని నిర్విరామంగా శ్రమించి మెరుగైన సర్చ్ ఇంజిన్ కోసం ఒక నమూనాను అభివృద్ధి చేశారు. 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేసుకుని.. తోటి పీహెచ్డీ స్టూడెంట్ 'క్రెయిగ్ సిల్వర్స్టీన్'ను తొలి ఉద్యోగిగా చేర్చుకుని సంస్థను అధికారికంగా ప్రారంభించారు. గూగుల్ అనే పదం ఎలా వచ్చిందంటే.. 'గూగుల్' అనే పేరు 'గూగోల్' అనే పదం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గూగోల్ అనే పదానికి అర్థం ఒకటి తర్వాత వంద సున్నాలు లేదా సరైన శోధన ఫలితాలను అందించేది. ఈ పదాన్ని జేమ్స్ న్యూమాన్ అండ్ ఎడ్వర్డ్ కాస్నర్ రాసిన 'మ్యాథమెటిక్స్ అండ్ ది ఇమాజినేషన్' అనే పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. గూగుల్ ప్రస్థానం ఇలా.. 1998లో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ అంచెలంచేలా ఎదుగుతూ కేవలం సెర్చ్ ఇంజన్గా మాత్రమే కాకుండా.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్టోర్స్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ మొదలైనవి ప్రారంభించి ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసింది. 1997 - గూగుల్.కామ్ డొమైన్ రిజిస్ట్రేషన్ 1998 - గూగుల్ అధికారికంగా ప్రారంభమైంది 1999 - గూగుల్ పేజీ ర్యాంక్ డెవెలప్ 2000 - యాహూ భాగస్వామ్యంతో.. పెద్ద యూజర్ 'ఆర్గానిక్ సెర్చ్'గా అవతరించింది. గూగుల్ టూల్ బార్ లాంచ్. కొత్తగా 10 భాషలను జోడించింది (ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, ఫిన్నిష్, స్పానిష్, పోర్చుగీస్, డచ్, నార్వేజియన్, జపనీస్, చైనీస్, కొరియన్, డానిష్). 2001 - గూగుల్ తన మొదటి ఛైర్మన్ 'ఎరిక్ ష్మిత్'ను స్వాగతించింది. గూగుల్ ఫొటోస్ ప్రారంభమైంది. 2002 - Google AdWords పరిచయం, గూగుల్ న్యూస్ మొదలైంది. గూగుల్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయి. 2003 - గూగుల్ AdSense ప్రారంభమైంది, దీనికి మొదట కంటెంట్ టార్గెటింగ్ అడ్వర్టైజింగ్ అని పేరు పెట్టారు. 2004 - జీమెయిల్ ప్రారంభం 2005 - గూగుల్ మ్యాప్స్ 2006 - Google YouTubeని కొనుగోలు చేస్తుంది 2007 - ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ అయిన డబుల్ క్లిక్ను గూగుల్ కొనుగోలు చేసింది 2008 - గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రారంభించింది 2009 - ఫోర్బ్స్ మ్యాగజైన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్లను ప్రపంచంలోని ఐదవ అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పేర్కొంది 2010 - గూగుల్ తన మొట్టమొదటి బ్రాండ్ స్మార్ట్ఫోన్ నెక్సస్ వన్ను విడుదల చేసింది. 2011 - సీఈఓగా లారీ పేజ్ నియామకం, ఎరిక్ ష్మిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. 2012 - గూగుల్ మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేసింది 2013 - గూగుల్ రీడర్ మూసివేసి.. Chromecast ప్రారంభం 2014 - హమ్మింగ్ బర్డ్ ఆల్గారిథం 2015 - సీఈఓగా సుందర్ పిచాయ్ 2016 - గూగుల్ తయారు చేసిన మొదటి ఫోన్.. గూగుల్ పిక్సెల్ లాంచ్ 2017 - HTCలో కొంత భాగాన్ని కొనుగోలు చేసింది 2018 - మొబైల్ స్పీడ్ అల్గారిథం అప్డేట్, 20 సంవత్సరాల చరిత్రలో 100 బిలియన్ డాలర్లను అధిగమించింది 2019 - బ్రాడ్ కోర్ అల్గారిథం, గూగుల్ SERPs స్టార్ట్ 2020 - నియామకాలను నెమ్మదించడం, మెషీన్లు మరియు డేటాపై ఎక్కువ దృష్టి పెట్టడం (కోవిడ్-19) 2021 - ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కంటెంట్ను ఉపయోగించుకునే హక్కు కోసం మీడియా కంపెనీలకు Google చెల్లించాల్సిన చట్టాన్ని ప్రతిపాదించింది. 2022 - క్రోమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ 2023 - గూగుల్ పిక్సెల్ 8, 8ప్రో లాంచ్, గూగుల్ జెమిని ఏఐ 1998లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన గూగుల్.. నేడు 50 దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.50 లక్షల కంటే ఎక్కువ మంది గూగుల్ సంస్థలో పనిచేస్తున్నారు. కంపెనీ నికర విలువ ప్రస్తుతం 1.675 ట్రిలియన్ అమెరికన్ డాలర్లు అని సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 13,90,95,26,62,50,000. గూగుల్ ఉపయోగాలు ప్రతి ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు అందిస్తున్న గూగుల్.. ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ప్రత్యేకంగా విద్యారంగంలో గూగుల్ పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి. 👉బ్లాగర్, యూట్యూబ్, గూగుల్ అందిస్తున్న సేవలు సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ దెబ్బకు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారిపోయింది. 👉వినోదం కోసం యూట్యూబ్ వినియోగించుకునే వారి సంగతి పక్కన పెడితే.. 10వ తరగతి చదివే ఒక విద్యార్ధి నుంచి.. IAS చదివే వ్యక్తి వరకు యూట్యూబ్ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 👉భౌతిక, రసాయనిక శాస్త్రాలు మాత్రమే కాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పాఠాలు నేర్పే గురువులకు సైతం గురువుగా మారిన గూగుల్ ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని నిస్సందేహంగా చెప్పవచ్చు. గూగుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేది గూగుల్ లేకపోతే ప్రపంచంలో జరిగే విషయాలు అందరికీ చేరటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రజల సమూహాలు చేరినప్పుడు మాత్రమే ఇతర విషయాలను చర్చించుకోవాల్సి వచ్చేది. గూగుల్ లేకుండా స్మార్ట్ఫోన్ వినియోగం కూడా ఉండేది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు స్మార్ట్ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ గూగుల్ ఉపయోగించాల్సిందే. ఇదీ చదవండి: పరుగులు పెట్టిన ఈవీ రంగం.. 2023లో ఇవే హైలెట్స్ చదువుకునే వారికి కూడా అన్ని అంశాలు అందుబాటులో ఉండేవి కాదు. ఎందుకంటే గూగుల్ ప్రమేయం లేకుండా ఏదైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ఉద్గ్రంధాలను (పుస్తకాలు) తిరగేయాల్సిందే. అంటే మనకు కావలసిన విషయం తెలుసుకోవడానికి రోజుల సమయం పట్టేది. మొత్తం మీద Google లేని ప్రపంచంలో జీవించడం ఇప్పుడు దాదాపు సాధ్యమనే చెప్పాలి. అంతే కాకుండా గూగుల్ లేదనే విషయాన్ని ఊహిస్తేనే చాలామందికి గుండె పోటు వచ్చేస్తుందేమో అన్నది ఓ నిజమేనేమో అనిపిస్తోందన్నది నా భావన. -
ఇదు శ్రీలంక: చుక్ చుక్ చుక్... నాను వోయా టూ ఎల్లా !
శ్రీలంకకు వాయుమార్గం, జలమార్గాల్లో వెళ్లవచ్చు. అక్కడి రోడ్లు నల్లగా నున్నగా మెరుస్తూ ఉంటాయంటే అతిశయోక్తి కాదు. ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైన దేశ ఇదేనా అని ఆశ్చర్యం కలుగుతుంది. విమాన ప్రయాణం, పడవ ప్రయాణం, రోడ్డు ప్రయాణం తర్వాత మిగిలింది రైలు ప్రయాణమే. శ్రీలంక ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదించాలంటే ట్రైన్లో ప్రయాణించాల్సిందే. గంటకు పాతిక కిమీమీటర్ల వేగంతో ప్రయాణించే టాయ్ ట్రైన్ జర్నీ ఆద్యతం అలరించడమే కాదు, ఆ దారిలో వచ్చే చిన్న చిన్న గ్రామాలు స్థానికుల సౌకర్యాలతో కూడిన నిరాడంబరమైన జీవనశైలిని కళ్లకు కడుతుంది. బౌద్ధ ప్రాశస్త్య్రాల పర్యటనలో భాగంగా తెలంగాణ నుంచి వెళ్లిన మా మహిళా విలేకరులమందరం ‘నాను వోయా’లో టాయ్ ట్రైన్ ఎక్కాం. పిల్లలతో ప్రయాణం టాయ్ ట్రైన్లో ఫస్ట్ క్లాస్ టికెట్లకు డిమాండ్ ఎక్కువ. ముందుగా రిజర్వ్ చేసుకోవాలి. మిగతా తరగతులు కూడా రద్దీగా ఉంటాయి. మేము వెళ్లిన రోజు ఒక స్కూల్ నుంచి దాదాపుగా డెబ్బై మంది పిల్లలు మాతో ప్రయాణించారు. వాళ్లు జురాసిక్ పార్క్ సినిమా చూడడానికి వెళ్తున్నారు. ‘ఎల్లా’ కంటే ముందు ఒక స్టేషన్లో దిగేశారు. ఆ పిల్లల పేర్లన్నీ భారతీయతతో ముడిపడినవే. సంస్కృత ద్రవిడ సమ్మేళనంగా ఉన్నాయి. అయితే నకారాంతాలుగా లేవు, అన్నీ అకారాంతాలే. పిల్లల స్కూల్ డ్రస్ మీద వాళ్ల పేర్లు కూడా ఎంబ్రాయిడరీ చేసి ఉన్నాయి. వాటిని మనసులో చదువుకుని పైకి పలుకుతుంటే ఏదో సొగసుదనం ఉంది. పిల్లలు చక్కటి ఇంగ్లిష్ మాట్లాడుతున్నారు. రైలు ప్రయాణించే దారిలో వచ్చే స్టేషన్ల పేర్లను మేము తడుముకుంటూ చదువుతుంటే మా ఉచ్చారణను సరిదిద్దుతూ మా ప్రయాణానికి మరింత సంతోషాన్నద్దారా పిల్లలు. మబ్బుల్లో విహారం నాను వోయా స్టేషన్ క్యాండీ నగరానికి 70 కిమీల దూరంలో, నువారా ఎలియాకి 60 కిలోమీటర్ల దూరంలో ఉంది. హిల్స్టేషన్ల మధ్య సాగే ప్రయాణం అది. దట్టంగా విస్తరించిన అడవుల మధ్య టక్టక్మని శబ్దం చేస్తూ వెళ్తుంది రైలు. ఆకాశాన్ని తాకడానికి పోటీ పడి పెరిగినట్లున్న వృక్షాల తలలను చూడడానికి తల వంచిన కిటికీలో నుంచి పైకి చూసే ప్రయత్నం అయితే చేస్తాం, కానీ మనకు మొదళ్లు కనిపించిన వృక్షాల తలలను చూడలేం. లోయలో నుంచి పెరిగి వచ్చిన వృక్షాల తలలను మాత్రమే చూడగలం. పచ్చటి ప్రకృతి చిత్రం చూస్తూ ఉండగానే మసకబారుతుంది. ఏంటా అని పరికించి చూస్తే మందపాటి మబ్బు ప్రయాణిస్తూ ఉంటుంది. రైలును తాకుతూ వెళ్లే మబ్బు కిటికీ లో నుంచి దూరి మనల్ని చల్లగా తాకి పలకరిస్తుంది. ఈ దారిలో కొండల మధ్య జలపాతాలు కూడా ఎక్కువే. జలపాతం సవ్వడి వినిపించనంత దూరంలో కనువిందు చేస్తుంటాయి. హాయ్ హాయ్గా... రైలు అర్ధచంద్రాకారపు మలుపుల్లో ప్రయాణించేటప్పుడు కిటికీలో నుంచి బయటకు చూస్తే లెక్కలేనన్ని చేతులు స్మార్ట్ ఫోన్లు, హ్యాండీకామ్లతో ఫొటో షూట్ చేస్తూ కనిపిస్తాయి. ఈ రైల్లో స్థానికులు వారి అవసరార్థం ప్రయాణిస్తారు. పర్యాటకులు ప్రకృతి పరవశం కోసమే ప్రయాణిస్తారు. ప్రతి విషయాన్ని స్వయంగా ఎక్స్పీరియన్స్ చేయాలనే పాశ్చాత్య పర్యాటకులు ఈ రైల్లో ఎక్కువగా కనిపిస్తారు. వాళ్లు ముందుగానే ఫస్ట్ క్లాస్లో బుక్ చేసుకుంటారు. కొండలను కలుపుతూ వేసిన వంతెనలు, కొండను తొలిచిన సొరంగాల మధ్య సాగే ఈ ప్రయాణం మన తెలుగు రాష్ట్రంలో విశాఖ– అరకు ప్రయాణాన్ని, ఊటీ టాయ్ ట్రైన్ జర్నీని తలపిస్తుంది. బ్రిటిష్ పాలకులు నిర్మించిన రైలు మార్గం ఇది. అప్పటి నుంచి నిరంతరాయంగా నడుస్తూనే ఉంది. పర్యాటకులు త్వరగా గమ్యస్థానం చేరాలనే తొందరపాటులో చేసే ప్రయాణం కాదిది. దృష్టి మరలిస్తే చూడాల్సిన వాటిలో ఏం మిస్సవుతామోనన్నంత ఉత్సుకతతో సాగే ప్రయాణం. మన స్టేషన్ త్వరగా రావాలని కూడా ఉండదు. రైల్లో ఒక బోగీలో వాళ్లకు మరో బోగీలో ఉన్న వాళ్లు ‘హాయ్’ చెప్పుకుంటూ చిన్న పిల్లల్లా కేరింతలు కొడుతూ ప్రయాణిస్తారు. – వాకా మంజులారెడ్డి (చదవండి: ఇదు శ్రీలంక: రావణ్ ఫాల్స్... ఎల్లా!) -
కృష్ణా తరంగాలపై ఆధ్యాత్మిక యాత్ర
సాక్షి, అమరావతి: జీవన వాహిని కృష్ణవేణి ప్రవాహ మార్గంలో ఆధ్యాత్మిక, చారిత్రక, పర్యాటక ప్రదేశాలు ఎన్నో.. అటువంటి కృష్ణమ్మ ఒడిలో పడవపై ఆధ్యాత్మిక యాత్రకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ)శ్రీకారం చుడుతోంది. ప్రకృతి రమణీయత, ఆధ్యాత్మిక శోభ కలయికగా ప్రాజెక్టును రూపొందిస్తోంది. విజయవాడ నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై ప్రత్యేక బోటు తిప్పేందుకు చర్యలు చేపడు తోంది. ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లోని మూడు దేవా లయాలు, 2 పర్యాటక ప్రాంతాలను ఒక్క రోజులో చుట్టివచ్చేలా ప్రయాణ మార్గాన్ని రూపొందిస్తోంది. 80 కిలోమీటర్ల ప్రయాణం ఎకో–ఆధ్యాత్మిక పర్యాటకంలో భాగంగా ఏపీటీడీసీ కృష్ణానదిలో రానుపోనూ సుమారు 80 కిలోమీటర్ల బోటు ప్రయాణాన్ని అందుబాటులోకి తేనుంది. విజయవాడలోని బెరంపార్కులో బయలుదేరే బోటు తొలుత కనకదుర్గమ్మ ఘాట్కు చేరుకుంటుంది. అమ్మవారి దర్శనం తరువాత అనంతవరంలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం, అక్కడి నుంచి పంచారామాల్లో ఒకటైన అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి దర్శనం చేయిస్తారు. మధ్యాహ్నం భోజనం తరువాత తిరుగు ప్రయాణంలో పవిత్ర సంగమం, భవానీద్వీపంలో ప్యాకేజీలు సిద్ధం చేస్తోంది. ఈ యాత్రలో ఆలయాల దర్శనంతో పాటు భో జన సదుపాయాలను ఏపీటీడీసీ ఏర్పా టు చేస్తుంది. బోటులో గైడ్ను అందుబాటులో ఉంచనుంది. నాగా ర్జున సాగర్ నుంచి తీసుకొచ్చిన డబుల్ ఇంజిన్ బోటును ఏపీటీడీసీ ఈ ప్రాజెక్టు కోసం సిద్ధం చేస్తోంది. 40–45 మంది పర్యాటకులు కూర్చునేందుకు వీలుగా ఈ బోటులో సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రయాణ సమయంలో పర్యాటకులకు బో టు లోనే ఆహారం అందుబాటులో ఉంచడంతో పాటు ఆలయాలు, పర్యాటక ప్రదేశాల్లోనూ అమృత్ కియోస్క్లను ఏపీటీడీసీ ఏర్పాటు చేయనుంది. అధికారుల బృందం అమరావతి వరకు ట్రయల్ రన్ పూర్తి చేసింది. బోటు సిద్ధమైన తరువాత అధికారికంగా మరోసారి ట్రయల్ రన్ నిర్వహించిన అనంతరం ప్రాజెక్టును ప్రారంభిస్తారు. టికెట్ రేట్లు నిర్ణయించేందుకు ఏపీటీడీసీ ప్రత్యేక కమిటీని నియమించనుంది. తొలుత వారాంతాల్లో ఒకసారే ఈ యాత్రను చేపట్టాలని భావిస్తోంది. పర్యాటకుల ఆసక్తి మేరకు నెమ్మదిగా యాత్రల సంఖ్యను పెంచనుంది. 4 వారాల్లోగా బోటును సిద్ధం చేసి కార్తీకమాసంలో యాత్రకు పచ్చజెండా ఊపేలా కసరత్తు చేస్తోంది. ఈ ప్యాకేజీలో స్పెషల్ దర్శనం పర్యాటకులకు దైవ దర్శనంతో పాటు ఆహ్లాదాన్ని పంచేలా కృష్ణానదిపై బోటు యాత్రను తీసుకొస్తున్నాం. పటిష్ట భద్రత మధ్య ప్రయాణం సంతోషంగా సాగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ వాటర్ సర్క్యూట్ టూరిజం కచ్చితంగా పర్యాటకులను ఆకట్టుకుంటుంది. బస్సులో వెళ్లి దైవ దర్శనం చేసుకోవడంతో పోల్చితే ఇది ఎంతో సులభంగా ఉంటుంది. ఈ ప్యాకేజీలో స్పెషల్ దర్శనం కల్పించడంతో పాటు ప్రసాదం అందజేస్తాం. ఆధ్యాత్మిక భావాన్ని పెంపొందించడంతో పాటు సాంస్కృతిక, వారసత్వ ప్రదేశాలకు మరింత వెలుగులు అద్దడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. – కె.కన్నబాబు, ఎండీ, పర్యాటకాభివృద్ధి సంస్థ
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement