-
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
-
జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్నారు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా జిల్లా: జూనియర్ ఎన్టీఆర్ను అణగదొక్కాలని చూస్తున్న తెలుగుదేశం పార్టీని అభిమానులు చిత్తుచిత్తుగా ఓడించాలంటూ మాజీ మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. గుడ్లవల్లేరు మండలం వేమవరం గ్రామంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి కొడాలి నాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పెద్ద ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలు అంటే తనకు, సీఎం జగన్కు అమితమైన ప్రేమ. అందుకే విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టామని తెలిపారు.‘‘పార్టీ వ్యవస్థాపకుడు అన్న ఎన్టీఆర్కు నమ్మక ద్రోహం చేసి.. పార్టీని లాక్కున్న నీచుడు చంద్రబాబు అంటూ దుయ్యబట్టారు. ‘‘అన్న ఎన్టీఆర్ వారసులు.. అభిమానులెవరు టీడీపీలో ఉండరు.. చంద్రబాబు వెంట నడవరు. పది మంది జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు జండా పట్టుకొని టీడీపీ కార్యక్రమాలకు వెళితే... ఆ పార్టీ కార్యకర్తలు తన్ని తరిమేసే పరిస్థితి అనేక చోట్ల చూశాం. మన కుటుంబ సభ్యుడైన ఎన్టీఆర్ అభిమానులపై దాడులు చేయవద్దని చంద్రబాబుగాని.. లోకేష్ గాని తమ కార్యకర్తలకు ఎప్పుడు చెప్పలేదు. అభిమానులందరూ కష్టపడి టీడీపీని గెలిపిస్తే.. జూనియర్ ఎన్టీఆర్ను తుంగలో తొక్కుతారు.. లోకేష్ను అందలం ఎక్కిస్తారు’’ అని కొడాలి పేర్కొన్నారు.‘‘పెద్ద ఎన్టీఆర్ను దొంగలాంటి చంద్రబాబు మోసం చేస్తే.. జూనియర్ ఎన్టీఆర్ను ఐటీడీపీ ద్వారా సోషల్ మీడియాలో తిట్టిస్తున్నారు. నేను తిరిగే కారుకు ఎన్టీఆర్.. వైఎస్సార్ రెండు ఫోటోలు పెట్టుకుని దమ్ముగా ధైర్యంగా తిరుగుతాను. ఎన్టీఆర్.. వైఎస్సార్ నాకు రెండు కళ్లు. తెలుగుదేశం పార్టీ గౌడ.. యాదవ.. మత్స్యకార.. ఇతర బీసీ సామాజిక వర్గాలను విస్మరించింది. కనీసం వారికి సీట్లు కూడా కేటాయించని పరిస్థితి. సీఎం జగన్ బీసీ కులాల అభివృద్ధికి కార్పొరేషన్లను ఏర్పాటు చేసి.. అనేక రాజ్యాంగ పదవులు ఇవ్వడమే కాక.. రాజ్యసభ స్థానాలు ఇస్తూ.. ఎమ్మెల్యే ఎంపీ సీట్లను సగం వారికే కేటాయించింది’’ అని కొడాలి నాని చెప్పారు.‘‘ప్రజలను నమ్ముకొని ధైర్యంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్కు.. నాకు అభిమానులు మద్దతుగా నిలవాలి. జూ.ఎన్టీఆర్ను ఒక విఐపిగా గౌరవిస్తాం’’ అని కొడాలి పేర్కొన్నారు. -
కొడాలి నాని ఎన్నికల ప్రచారం.. బ్రహ్మరథం పట్టిన గుడివాడ ప్రజలు
-
గుడివాడలో దుమ్మురేపుతున్న కొడాలి నాని ఎన్నికల ప్రచారం
-
షర్మిల ప్రచారంలో జై జగన్ నినాదాలు
-
‘ప్రజల ప్రతీ అవసరాన్ని తీరుస్తున్న ప్రభుత్వం ఇది’
గుడివాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన పరిపాలనలో స్కూల్కు వెళ్లేటువంటి పిల్లల దగ్గర్నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వా తాతల వరకూ వారికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని తీరుస్తూ వచ్చారని, అందుకే సీఎం జగన్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని స్పష్టం చేశారు. ఈ రోజు(సోమవారం) గుడివాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడిన కొడాలి నాని.. మనందరి నమ్మకం మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అని ప్రశంసించారు. ముందుగా గుడివాడ, మచిలీపట్నం నియోజకవర్గ ప్రజల తరఫున సీఎం జగన్కు స్వాగతం అంటూ కొడాలి నాని ప్రసంగం కొనసాగించారు. ఈ సిద్ధం సభ నిన్న జరగాల్సినటువంటి సభ ఒకరోజు వాయిదా పడింది అయినా కూడా ఇంత ఘనంగా సీఎం జగన్ దీవించడానికి, ఆశీర్వదించడానికి మీరందరూ రావడం ఆనందంగా ఉంది ఐదేళ్లపాటు స్కూల్ వెళ్లేటువంటి పిల్లల నుంచి వృద్ధాప్యం వచ్చిన అవ్వాతాతల వరకూ వారికి కావాల్సిన ప్రతీ అవసరాన్ని తీర్చిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. జగనన్న ప్రభుత్వం. గ్రామగ్రామన, వార్డువార్డున సచివాలయాలు ఏర్పాటు చేసి వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందించాల్సిన ప్రతి సౌకర్యాన్ని నేరుగా మధ్యలో ఎటువంటి దళారులు లేకుండా ప్రజల ముందుకే పాలన తీసుకొచ్చినటువంటి, గాంధీ గారు కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకొచ్చినటువంటి నాయకుడు జగన్మోహన్రెడ్డి. అదేవిధంగా స్కూల్ పిల్లలకు వాళ్లకు కావాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం విద్య, బట్టలు, పుస్తకాలు, తిండి అన్నీ కూడా ఒక తండ్రి స్థానంలో చూసినటువంటి వ్యక్తి సీఎం జగన్. అదేవిధంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేకమంది నిరుపేదల ప్రాణాలను కాపాడినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అయితే ఆయన చూపించినటువంటి దారి కన్నా నాలుగు అడుగులు ముందుకు వేసిన వ్యక్తి సీఎం వైఎస్ జగన్ ఈరోజు గన్నవరం నుంచి గుడివాడ వస్తుంటే అనేకమంది ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఒక్కసారి ఆయనకు కనుక చూపించినట్లైతే దానికి ఎంత ఖర్చయినా ఆయన పరిష్కారం చూపిస్తారని చెప్పి కొండంత ఆశతో ట్రీట్ మెంట్ జరుగుతున్నటువంటి పిల్లలను కూడా తీసుకువచ్చి రోడ్డు మీద ఆయనకు చూపించాలనే ఉద్దేశ్యంతో, అంత నమ్మకం పెట్టుకుని చూపిస్తున్నారంటే ఒక వ్యక్తి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు ఉన్న నమ్మకం. అదేవిధంగా సీఎం జగన్ను ఎదుర్కోలేక చంద్రబాబు నాయుడు ఒక కూటమి కట్టాడు మాయా కూటమి. ఆయన వదిన పురందేశ్వరిని బీజేపీ అధ్యక్షురాలిని చేశాడు, అదేవిధంగా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టుకున్నాడు, ఒక ఉత్త పుత్రుడ్ని ఓ పక్కన పెట్టుకున్నాడు. వీళ్లందర్నీ పెట్టుకుని కూడా సిద్ధం సభల ద్వారా సీఎం జగన్కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేక, జగన్ను రాజకీయంగా ఎదుర్కొనలేక చవటల్లాగా, దద్దమ్మల్లాగా వెనుక నుంచి జగన్ మోహన్ రెడ్డి గారిని భౌతికంగా ఇక్కడ నుంచి తొలగించాలనే ఉద్దేశ్యంతో మొన్న అర్థరాత్రి విజయవాడలో ఆయన మీద దాడి జరిగింది. అన్నా మీరు నమ్మే ఆ దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే మీకు ఒక అంగుళం పక్కకు జరగలేదు, ఒక అంగుళం కిందకు జరగలేదు. మీకు బలమైనటువంటి నుదటిమీద తగిలినా ఆ దేవుడు మిమ్మల్ని కాపాడాడు. ప్రజల ఆశీస్సులతో మీరు రాబోయే రోజుల్లో తప్పకుండా ఒక 50 రోజుల్లో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు. చంద్రబాబు కాదు కదా వాడి బాబు ఖర్జూర నాయుడు వచ్చినా కూడా మీ వెంట్రుక ముక్క కూడా పీకలేడు. మీ దమ్ము, మీ ధైర్యం మీకు ఉన్నటువంటి నిబద్ధత మేము దగ్గర నుంచి చూసినటువంటి వ్యక్తులం. మీది స్వచ్ఛమైనటువంటి చిరునవ్వు. మీరు చెప్పినటువంటి మాట తూచా తప్పకుండా నిలబడేటువంటి తత్వం మీది. ఒక ఓటు కోసం, ఒక పదవి కోసం ఒక్క చిన్న అబద్ధం కూడా మీతో చెప్పించలేనటువంటి పరిస్థితి 5 సంవత్సరాలుగా మేము మిమ్మల్ని దగ్గర నుంచి చూశాం. ఒక్క చిన్న అబద్ధం చెప్పండన్నా అని బ్రతిమాలినా కూడా ఆయనతో అబద్ధం చెప్పించలేం. ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం, క్యారెక్టర్ కోసం రాజశేఖర్రెడ్డి గారు చూపించినటువంటి దారిలో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలన్నటువంటి మనస్తత్వంతో ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని బాధలున్నా ముఖంలో చిరునవ్వు చెదరకుండా మన ముందు నిలబడేటువంటి వ్యక్తి వైఎస్ జగన్. జగనన్నకు ఈ రాష్ట్ర ప్రజలు మరొక్కసారి పట్టం కట్టాలని చెప్పి మీ అమూల్యమైనటువంటి ఓటు మీ రెండు ఓటులను ఫ్యాన్ గుర్తు మీద వేసి విజయాన్ని అందించాలని చెప్పి ఈ దుర్మార్గుడైనటువంటి, దొంగైనటువంటి, 420 అయినటువంటి, ఛీటర్ అయినటువంటి వెన్నుపోటుదారుడైనటువంటి చంద్రబాబు నాయుడికి బుద్ధి చెప్పాలి. చంద్రబాబు నాయుడు మొన్న చెప్తున్నాడన్నా.. జగన్మోహన్రెడ్డి నీ కథ తేలుస్తానని అంటున్నాడు చంద్రబాబు ఇదే నీకు ఆఖరి ఎన్నికలు. జగన్ అంతు తేల్చాలంటే నువ్వు ఇంకో జన్మ ఎత్తాలి. దేవుడు, ప్రజల ఆశీస్సులు ఉన్నటువంటి సీఎం జగన్ను అందరూ దీవించాలని, మీ అమూల్యమైన రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుపై వేసి మీ ప్రాంతంలో ఉన్నటువంటి పార్లమెంట్ సభ్యుడ్ని, శాసన సభ్యుడ్ని గెలిపించి.. జగనన్నకు మేమంతా ఉన్నాం.. మీ వెనుకే ఉన్నాం అనే మెసెజ్ ఇవ్వాలని ప్రజల్ని కోరుతున్నాను. -
జూ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరు బాబుకు కౌంటర్ల పై కౌంటర్లు
-
కొడాలినాని కొడుకుని ఓడించడం కాదు.. నీ కొడుకుని గెలిపించుకో
-
గుడివాడలో ఓటు బ్యాంకు గురించి కొడాలి నాని
-
చంద్రబాబు ఎంతటి దరిద్రుడో కేశినేని నాని ని అడిగితే చెప్తాడు
-
సీఎం జగన్ దాడిపై కొడాలి నాని షాకింగ్ నిజాలు
-
సీఎం జగన్పై దాడి.. కొడాలి నాని సంచలన కామెంట్స్
సాక్షి, కృష్ణా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కొలేకనే ఆయనపై దాడి చేశారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి కొడాలి నాని. పక్కా వ్యూహంతోనే సీఎం జగన్పై దాడి జరిగింది. చంద్రబాబు ప్రేరణతోనే గత ఎన్నికల సందర్భంగా, ఇప్పుడు దాడులు జరిగాయని తెలిపారు. కాగా, కొడాలి నాని ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు.. సీఎం జగన్ను రాళ్లతో కొట్టాలని చెప్పాడు. చంద్రబాబు మాటలు విని కులోన్మాదంతో దాడి చేశారు. చాలా పకడ్బంధీగా వ్యూహం ప్రకారం గురి చూసి గన్తో దాడి చేశారు. ప్రచారంలో కదలికల వల్ల గురి తప్పి కన్నుకు తగిలింది. దేవుడి దీవెనలు, ప్రజల ఆశీస్సులు ఉండబట్టే సీఎం జగన్తో గాయంతో బయటపడ్డారు. దీన్ని ఖండించాల్సిన కొందరు వ్యక్తులు సంస్కారహీనంగా సీఎం జగనే తనపై దాడి చేయించుకున్నారని చెప్తున్నారు. ఎన్నికల సందర్బంగా గుర్తింపు పొందిన తొమ్మిది సంస్థల సర్వేల్లో వైఎస్సార్సీపీకి భారీ మోజార్టీలు వస్తాయని చెప్పాయి. దీంతో, సీఎం జగన్ను రాజకీయంగా ఎదుర్కోలేక.. కొందరు రాజకీయ నిరుద్యోగులు ఇలా చేశారు. విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహం నెలకొల్పారన్న కక్షతో కొన్ని వర్గాలు కలిసి ఇలా దాడి చేశాయి. ఒక ముఖ్యమంత్రి ప్రాణాలు తీయడానికే ప్రయత్నం జరిగిందంటే దీని వెనుక చాలా మంది పెద్దల హస్తం ఉంది. ఎంతో పక్కగా దాడి చేయబట్టే సీఎం జగన్కు తగిలిన రాయి వెల్లంపల్లికి కూడా తగిలింది. ప్రధాని, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు రోడ్ షోగా వెళ్లేటప్పుడు పగలైనా, రాత్రి సమయంలోనైనా కరెంట్ తీసేస్తారు?. ఈ విషయం సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు తెలియదా?. చంద్రబాబు బస్సుపై రోడ్ షోలు చేసేటప్పుడు కరెంట్ తీయలేదా?. సీఎం జగనే కరెంట్ తీయించారని టీడీపీ నేత పిచ్చివాగుడు వాగుతున్నారు. అధికారులపై యాక్షన్ తీసుకోవాలని చంద్రబాబు 420 వ్యాఖ్యలు చేస్తున్నాడు. సీఎం జగన్కు బ్లాక్ క్యాట్స్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. -
జూన్ 4 న మాట్లాడుకుందాం ఎల్లో మీడియా పై కొడాలి నాని ఫైర్
-
నన్ను, సీఎం జగన్ను ఎవ్వరూ ఓడించలేరు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: ప్రజలు తనను నిలదీశారంటూ ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని టీడీపీ నేతలకు మాజీ మంత్రి కొడాలి నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తనను నిలదీశారంటూ ఎల్లోమీడియాలో వస్తున్న వార్తలను పట్టించుకోనన్నారు. గుడివాడలో తనను, రాష్ట్రంలో సీఎం జగన్ను ఎవ్వరూ ఓడించలేరని తెలపారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికల ప్రచారంలో వందలాది చోట్లకు వెళుతున్నాం. మా పార్టీ కార్యకర్తలు, అభిమానులు నాకు శిరస్సుపై నుంచి క్షీరాభిషేకాలు చేస్తానంటే వద్దని వారించాను. నేను వద్దన్నా నాపై అభిమానంతో ఒకటి రెండు చోట్ల నా కాళ్లు కడిగారు. చంద్రబాబు, పవన్, లోకేష్ వాళ్ల డప్పులు వాళ్లే కొట్టుకొంటున్నారు. వాళ్ల దండలు వారే తెచ్చుకుంటున్నట్లు, వారి తమ్ముళ్లను వాళ్లే పోగేసుకునేలా, కార్యక్రమాలు నేను చేయడం లేదు. ఎల్లో మీడియాకు కళ్ళు మూసుకుపోయాయి. చంద్రబాబును సీఎం సీట్లో కూర్చోబెట్టడానికి ఎంతకైనా దిగజారతారు. ఎన్నికల ప్రచారంలో చెంబుడు నీళ్లు కాళ్లపై పొయ్యడం పెద్ద విషయమా. నన్ను అల్లరి చేయడానికి ఏమీ లేక ఫాల్స్ న్యూస్ ప్రచారం చేస్తున్నారు. గుడివాడ నియోజకవర్గంలో ప్రజల ఇళ్ల సమస్యలు పరిష్కరించేలా.. 23 వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 12వందల కోట్లతో ఇల్లు కట్టిస్తున్నాం. రూ. 320 కోట్లతో ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నాం. మంచినీటి అవసరాల కోసం రూ. 200 కోట్లు ఖర్చు చేశాం. రూ. 200 కోట్లతో రోడ్లు వేశాం. ఎన్ని చేసినా ఎక్కడో ఒకచోట సమస్య అనేది ఉండటం సర్వసాధారణం. సమస్యలపై ఎమ్మెల్యేగా ప్రజలు నన్ను అడుగుతారు. వారికి సమాధానం చెప్పుకుంటాం. మాకు మరో అవకాశం ఇస్తే పెండింగ్ సమస్యలు కూడా పరిష్కరిస్తామని ప్రజలకు చెబుతాం. ప్రజలు నేను ముఖాముఖిగా మాట్లాడుకుంటుంటే నన్నేదో నిలదీశారంటూ ఎల్లో మీడియా హడావుడి చేస్తుంది’అని కొడాలి నాని అన్నారు. -
కొడాలి నాని కి బ్రహ్మరథం పడుతున్న గుడివాడ ప్రజలు
-
కొడాలి నాని ఎన్నికల ప్రచారం బ్రహ్మరధం పడుతున్న గుడివాడ ప్రజలు
-
ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయను.. టీడీపీకి కొడాలి నాని సవాల్
సాక్షి, కృష్ణా జిల్లా: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలన దేశ చరిత్రలోనే ఒక రికార్డని మాజీ మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు. గుడివాడ నియోజకవర్గంలో అర్హులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చామని తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్ విసిరారు. అర్హత ఉండి ఇళ్ల స్థలం రాలేదని ఒక్కరితో చెప్పించిన ఎన్నికల్లో పోటీ చేయనని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో గుడివాడలో కనీసం ఒక్క ఎకరా కూడా పేదలకు ఇవ్వలేదని విమర్శించారు. ఎమ్మెల్యే కొడాలి నాని గురువారం గుడివాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అర్హత ఉండి గుడివాడ నియోజకవర్గంలో ప్రభుత్వ సహాయం అందలేదు, ఇళ్ల స్థలాలు రాలేదని ప్రతిపక్షాలు ఒక్కరితో చెప్పించినా ఎన్నికల్లో పోటీ చేయనని తెలిపారు. 20 సంవత్సరాల పేదల ఇళ్ల స్థలాల అప్పును రూపాయి కట్టించుకొని రద్దు చేసిన చరిత్ర సీఎం జగన్ది అని పేర్కొన్నారు. 14 ఏళ్ల చంద్రబాబు పాలనలో రుణం రద్దుచేసి, పేదలకు పట్టా రిజిస్ట్రేషన్ చేశారని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు ‘సీఎం జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే టిడ్కో లబ్ధిదారులను రుణ విముక్తులను చేస్తాం. వన్ టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలన్నీ రద్దు చేసే బాధ్యత నాది. సీఎం జగన్ ది. జగన్ ప్రభుత్వ పాలన దేశ చరిత్రలోనే రికార్డు. స్వర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది.కులాలు, మతాలు, పార్టీలకతీతంగా ప్రభుత్వ సాయాన్ని ప్రతి ఒక్కరికి అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం’ అని తెలిపారు. చదవండి: మోసాల బాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి: సీఎం జగన్ -
నిరూపిస్తే ఎన్నికల నుంచి తప్పుకుంటా .. చంద్రబాబుకు మాస్ ఛాలెంజ్
-
జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు రాష్ట్రంలో ఉండదు
-
జూన్ 4 తర్వాత చంద్రబాబు పేరు రాష్ట్రంలో ఉండదు
-
జూన్ 4 తర్వాత బాబును తలుచుకునే వారెవరూ ఉండరు: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: అధికారం కోసం చంద్రబాబు గాడిద కాళ్లైన పట్టుకుంటాడని మండిపడ్డారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు ఒంటరిగాపోటీ చేస్తే గెలవలేమని తెలిసి పవన్, బీజేపీ కాళ్లు పట్టుకున్నారని విమర్శించారు. అందితే జుట్టు.. లేదంటే కాళ్లు పట్టుకునే వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. జూన్ 4 తర్వాత చంద్రబాబును తలుచుకునే వారెవరూ ఉండరని అన్నారు. గుడివాడ ఒకటవ వార్డు నుంచి ఎమ్మెల్యే కొడాలి నాని బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నాగవరప్పాడులోని శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గుడివాడలో అయిదవసారి తానే గెలవబోతున్ననని తెలిపారు. ఎన్నికల సమయంలో తనను ఓడించేందుకు బయటి వ్యక్తులను తెస్తున్నారని విమర్శించారు. ఎంతమంది వచ్చినా వైఎస్సార్సీపీ తరపున హ్యాట్రిక్ కొడతానని ధీమా వ్యక్తం చేశారు. గుడివాడ టీడీపీ అడ్డా...గాడిద గుడ్డు.. అంటూ చంద్రబాబు సొల్లు చెబుతున్నాడని మండిపడ్డారు. ‘నన్ను ఓడించాలనుకుంటున్న చంద్రబాబు, లోకేష్కు ఇదే నా సవాల్. చంద్రబాబు, లోకేష్ గుడివాడలో తన పై పోటీ చేసి గెలవాలి. టీడీపీ పుట్టిన తర్వాత గుడివాడలో టీడీపీకి 50% ఓటింగ్ మూడు సార్లు మాత్రమే వచ్చింది. నాపై పోటీకి భయపడి గంటకో వ్యక్తిని...పూటకో వ్యక్తిని తెచ్చే బతుకులు టీడీపీవి. ఈ ఎన్నికల్లో అమెరికా నుంచి వచ్చిన వ్యక్తిని చంద్రబాబు నాపై పోటీకి పెట్టాడు. వచ్చేసారికి అంతరిక్షం నుంచి తెచ్చుకుంటారు. చంద్రబాబు ఎంత 420నో చంద్రగిరి, గుడివాడ, పామర్రు ప్రజలకు తెలుసు. ఆయన తలకిందులుగా తపస్సు చేసినా నన్ను ఓడించలేడు. ఏపీలో మళ్లీ వచ్చేది వైఎస్సార్సీపీనే. గుడివాడలో గెలిచేది నేనే. మళ్లీ జగన్ సీఎం అయితేనే ప్రజలకు మేలు జరుగుతుంది. మేం ప్రజల్లోకి వెళ్లి ఇదే చెబుతున్నాం’ అని పేర్కొన్నారు. చదవండి: Memantha Siddham Day-1: మేమంతా సిద్ధం డే-1 అప్డేట్స్ -
చంద్రబాబు, లోకేష్ దమ్ముంటే గుడివాడలో పోటీ చెయ్యండి: Kodali Nani
-
కేసులు పెడితే వెళ్లి YSR కాళ్ళు పట్టుకున్నాడు.. ఈ 420 అధికారం కోసం ఎవడి బూట్లు అయిన నాకుతాడు..
-
చంద్రబాబు, పవన్, షర్మిలపై కొడాలి నాని ఫైర్
-
టీడీపీ పొత్తులపై కొడాలి నాని సెటైర్లు
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- ఐఏఎఫ్ కాన్వాయ్పై దాడి ఘటన..
- చంద్రబాబు ట్రాప్లో షర్మిల, సునీత
- ‘సూపర్ సీఎం’ పాండియన్!
- షర్మిలా.. మా బకాయిలిచ్చేయ్!
- బర్త్ డే స్పెషల్.. విజయ్ దేవరకొండ ఎక్కడ తప్పు చేస్తున్నాడు?
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- ల్యాండ్ టైట్లింగ్ చట్టం నిజాలివిగో..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement