-
కమల్హాసన్ 'థగ్ లైఫ్'.. ఆ హీరోను రిప్లేస్ చేశారు!
మణిరత్నం- కమల్ హాసన్ కాంబోలో వస్తోన్న భారీ చిత్రం 'థగ్ లైఫ్'. నాయగన్(1987) సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో వస్తోన్న గ్యాంగ్స్టర్ డ్రామాగా తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో త్రిష, శింబు, ఐశ్వర్యా లక్ష్మి, జోజూ జార్జ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీమ్లో కోలీవుడ్ హీరో శింబు జాయిన్ అయ్యారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను విడుదల చేశారు మేకర్స్.కారును వేగంగా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి, గన్తో ఎవరిపైనో గురి పెట్టి శింబు కాల్చుతున్నట్లుగా ఈ వీడియోలో కనిపించింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఢిల్లీలో జరుగుతోంది. కమల్హాసన్, శింబులతో పాటు ప్రముఖ నటీనటులపై ముఖ్య సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ఢిల్లీ షూటింగ్ షెడ్యూల్ పూర్తవగానే ‘థగ్ లైఫ్’ టీమ్ లండన్ వెళుతుందని కోలీవుడ్ సమాచారం. రెడ్ జెయింట్ మూవీస్, మద్రాస్ టాకీస్ పతాకాలపై నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని సమాచారం. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... ‘థగ్ లైఫ్’ సినిమా నుంచి దుల్కర్ సల్మాన్ తప్పుకున్నారని.. ఈ ప్లేస్లోనే శింబును ఎంపిక చేశారని టాక్. అలాగే జయం రవి కూడా ఈ చిత్రం నుంచి తప్పుకోగా.. ఆ పాత్రను అశోక్ సెల్వన్ చేస్తారనే టాక్ కోలీవుడ్లో వినిపిస్తోంది. -
నయన్కు మరో క్రేజీ ఆఫర్.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్!
దక్షిణాదిలో లేడీ సూపర్స్టార్ నయనతార మరో బాలీవుడ్ చిత్రానికి రెడీ అవుతున్నారా? అన్న ప్రశ్నలకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఒక పక్క పిల్లలు, భర్త అంటూ సంసార జీవితంలో ఎంజాయ్ చేస్తునే మరో పక్క నటిగా బిజీగా ఉన్న ఏకై క నటి నయన్. దక్షిణాదిలో సూపర్స్టార్గా రాణిస్తున్న నయనతార చాలా కాలంగా తరువాత ఇటీవలే బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈమె నటించిన తొలి చిత్రం జవాన్ సూపర్హిట్ అయ్యింది. ఇకపోతే ప్రస్తుతం తమిళంలో నటిస్తున్న రెండు చిత్రాల షూటింగ్ను పూర్తి చేశారు. అందులో ఒకటి మన్నాంగట్టి సిన్స్ 1960. దర్శకుడు డ్యూడ్ విక్కీ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటుడు యోగిబాబు, దేవదర్శిని, గౌరి కిషన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. శ్యాన్ లోల్డన్ సంగీతం, ఆర్డీ రాజశేఖర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ గత ఏడాది ప్రారంభమైంది. ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రంగా రూపొందుతోంది. కాగా ప్రిన్స్ పిక్చర్స్ పతాకంపై ఎస్.లక్ష్మణన్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే నయనతార తన పోర్షన్ను పూర్తి చేశారట. అలాగే ఈమె నటిస్తున్న మరో చిత్రం టెస్ట్. నటుడు మాధవన్, విజయ్ సేతుపతి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శశికాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. క్రికెట్ క్రీడ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే పూర్తి అయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా జవాన్ చిత్రంలో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి తొలి సక్సెస్ను అందుకున్న నయనతారకు అక్కడ మరో సూపర్ అవకాశం వరించినట్లు తాజా సమాచారం. సూపర్ హిట్స్ చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో ఈమె నాయకిగా నటించడానికి రెడీ అవుతున్నట్లు టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న స్టార్ హీరో!
కోలీవుడ్ స్టార్ రాఘవ లారెన్స్ మరోసారి గొప్ప మనసును చాటుకున్నారు. ఇటీవలే పేద మహిళా డ్రైవర్కు కొత్త ఆటో బహుమతిగా అందించారు. తనవంతు సాయంగా సమాజ సేవలో భాగంగా తాజాగా వికలాంగులకు బైక్స్ పంపిణీ చేశారు. దివ్యాంగులు, అనాథ బాలల కోసం పలు సేవా కార్యక్రమాలు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు లారెన్స్. వారి కోసం ప్రత్యేకంగా రూపొందించిన 13 ద్విచక్ర వాహనాలు అందజేశారు. అంతే కాకుండా వారికి ఇల్లు కట్టిస్తానని మాటిచ్చారు. త్వరలోనే వారికీ ఇళ్లు నిర్మించి ఇస్తానని లారెన్స్ తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకున్నారు. ఇది చూసిన నెటిజన్స్ సైతం రాఘవ చేస్తున్న సేవలను కొనియాడారు. రియల్ హీరో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కొరియోగ్రాఫర్ ఎంట్రీ ఇచ్చిన రాఘవ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. గతేడాది చంద్రముఖి-2, జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్రాలతో అలరించిన రాఘవ.. ప్రస్తుతం దుర్గ అనే చిత్రంలో నటిస్తున్నారు. Hatsoff @offl_Lawrence Sir தமிழர் பாரம்பரிய மல்லர் கலையில் கலக்கி வரும் #கை_கொடுக்கும்_கை மாற்றுத்திறனாளி குழுவினர் ஒவ்வொருவருக்கும் இரண்டு சக்கர வாகனம் பரிசளித்தார் மாஸ்டர் #ராகவா_லாரன்ஸ் .#RaghavaLawrence pic.twitter.com/879dQ28jLO — Actor Kayal Devaraj (@kayaldevaraj) April 18, 2024 Service is god 🙏🏼 pic.twitter.com/UBZXYFIDMQ — Raghava Lawrence (@offl_Lawrence) April 11, 2024 -
విక్రమ్ తంగలాన్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ నటించిన తాజా చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహన్, పార్వతి హీరోయిన్లుగా నటించారు. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం చాలా రోజుల ముందే తెరపైకి రావాల్సింది. అయి తే గ్రాఫిక్స్ పూర్తి కాకపోవడంతో విడుదల తేదీ రెండుసార్లు వాయిదా పడుతూ వచ్చింది. కాగా ఇప్పటికీ దర్శక, నిర్మాతలు తంగలాన్ చిత్రం విడుదల తేదీని ప్రకటించలేదు. తాజాగా ఈనెల 17న విక్రమ్ బర్త్ డే కావడంతో మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ తంగలాన్ గ్లింప్స్ను విడుదల చేశారు. ఆదివాసి ప్రాంతాలలో నటుడు విక్రమ్ గుర్రమెక్కి వెళుతున్న పోస్టర్ను విడుదల చేశారు. అందులో విక్రమ్ కొండవాసీ గెటప్లో కనిపించిన దృశ్యం తంగలాన చిత్రంపై ఆసక్తిని పెంచేస్తోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు పా.రంజిత్ మాట్లాడుతూ తంగలాన్ చిత్రాన్ని జీ స్టూడియోస్ సంస్థతో కలిసి స్టూడియో గ్రీన్ సంస్థ కె ఈ జ్ఞానవేల్ రాజా నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. నటుడు విక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం గ్లింప్స్ విడుదల చేయడం ఇంకా ఆనందంగా ఉందన్నారు. తంగలాన్ చిత్రం కోసం విక్రమ్ పూర్తిగా మేకోవర్ అయ్యాయన్నారు. ఆయన ఎంతో అంకిత భావంతో పని చేశారన్నారు. ఇతర నటీనటులు ఎంతగానో శ్రమించినట్లు చెప్పారు. ఇది గోల్డ్ మైన్స్ నేపథ్యంలో రూపొందించిన కథా చిత్రం అని చెప్పారు. చిత్ర విడుదల తేదీని త్వరలో వెల్లడించనున్నట్లు పా.రంజిత్ చెప్పారు. -
'ప్రభాస్ పెళ్లయ్యాకే చేసుకుంటా'.. స్టార్ హీరో కామెంట్స్ వైరల్!
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా క్రేజ్ దక్కించుకున్న హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీశంకర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం హీరో విశాల్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ప్రశ్నించారు. దీనికి విశాల్ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రభాస్ పెళ్లి అవ్వగానే తప్పకుండా చేసుకుంటానని తెలిపారు. అంతే కాకుండా ఫస్ట్ ఇన్విటేషన్ కూడా ప్రభాస్కే ఇస్తానని తెలిపారు. అయితే గతంలో తమిళ నిర్మాతల నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. తాజాగా మరోసారి పెళ్లి ప్రస్తావన రావడంతో విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. రత్నం మూవీ ఈనెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు. 😅 #Vishal Anna during #Rathnam movie promotions 😁 " #Prabhas anna pelli ayyaka Nen kuda pelli cheskuntanu " - @VishalKOfficial pic.twitter.com/ioVpmw8fgb — Prabhas Fan (@ivdsai) April 18, 2024 -
సినిమాలో విలన్స్ కంటే బయటే ఎక్కువ: విశాల్ హాట్ కామెంట్స్
సినిమాల్లో కంటే బయటే ఎక్కువ విలన్లు ఉన్నారని కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ పేర్కొన్నారు. ఆయన ఇటీవల హీరోగా నటించిన మార్క్ ఆంటోని చిత్రం ఘన విజయాన్ని సాధించింది. తాజాగా హరి దర్శకత్వంలో రత్నం చిత్రంలో నటించారు. నటి ప్రియా భవానీశంకర్ నాయకిగా నటించిన ఈ చిత్రం ఈనెల 26న తెరపైకి రానుంది. తాజాగా తమిళ నూతన సంవత్సరం సందర్భంగా తమిళ సినీ పాత్రికేయుల సంఘం ఆదివారం ఉదయం స్థానిక వడపళనిలోని సంగీత కళాకారుల సంఘం ఆవరణలో నిర్వహించిన వేడుకలో విశాల్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఈ కార్యక్రమంలో పాత్రికేయులతో ముచ్చటించారు. తాను తాజాగా నటించిన రత్నం చిత్రం కుటుంబసమేతంగా చూసి ఆనందించే కమర్షియల్ ఎంటర్టైనర్గా ఉంటుందన్నారు. దర్శకుడు హరి ఈ చిత్ర కథ చెప్పినప్పుడే అందులోని ముఖ్య పాయింట్ అద్భుతం అనిపించిందన్నారు. ఈ చిత్రం విడుదల తరువాత తాను స్వీయ దర్శకత్వంలో నటించే తుప్పరివాలన్- 2 చిత్రం షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పారు. మే 5తేదీన షూటింగ్ లండన్లో మొదలవుతుందని చెప్పారు. దీంతో విశాల్ కూడా దర్శకుడు అవుతున్నాడు.. కొత్తగా ఈయనే చేస్తారులే అని అనుకునేవారు ఇక్కడ ఉంటారన్నారు. అలాంటి వారి కోసమే తాను తుప్పరివాలన్–2 చేస్తున్నట్లు చెప్పారు. కాగా దక్షిణ భారత నటీనటుల సంఘం నూతన భవన నిర్మాణాన్ని ఈ ఏడాదిలో పూర్తిచేస్తామని చెప్పారు. మెరీనా తీరంలో ఎంజీఆర్ సమాధిని చూడడానికి ఎలాగైతే ప్రజలు వస్తారో.. అలా నటీనటుల సంఘం నూతన భవనాన్ని చూడడానికి వచ్చేలా దీన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. సినిమాకు సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించే విధంగానూ, కల్యాణమంటపం, రంగస్థల నటుల కోసం వేదికను వంటి పలు వసతులతో ఈ భవనం ఉంటుందని విశాల్ పేర్కొన్నారు. -
కొత్త సంవత్సరం.. కొత్త ఉత్సాహం
తమిళ నూతన సంవత్సరాది (ఏప్రిల్ 14) సందర్భంగా కోలీవుడ్లో కొత్త ఉత్సాహం కనిపించింది. స్టార్ హీరో సినిమాల కొత్త లుక్లు, సరికొత్త అనౌన్స్మెంట్లతో తమిళ చిత్ర పరిశ్రమ కళకళలాడింది. ఈ విశేషాలపై కథనం.. భారతీయుడు వస్తున్నాడు భారతీయుడు మళ్లీ వస్తన్నాడు. హీరో కమల్హాసన్ , దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘ఇండియన్ ’ (తెలుగులో ‘భారతీయుడు’) సినిమా 1996లో విడుదలై బ్లాక్బస్టర్గా నిలిచింది. తాజాగా ‘ఇండియన్ ’ సినిమాకు సీక్వెల్స్గా ‘ఇండియన్ 2’, ‘ఇండియన్ 3’ చిత్రాలను రూ΄÷ందించారు కమల్హాసన్ , శంకర్. లైకా ప్రోడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ పతాకాలపై సుభాస్కరన్ నిర్మించారు. ‘ఇండియన్ 2’ (‘భారతీయుడు 2’) చిత్రానికి సంబంధించిన పోస్ట్ప్రోడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరులో ‘ఇండియన్ 2’ ట్రైలర్, జూన్ లో సినిమా రిలీజ్కి సన్నాహాలు చేస్తున్నామని చిత్రయూనిట్ పేర్కొంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్స్ను విడుదల చేశారు మేకర్స్. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ‘ఇండియన్ 2’ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ప్రీత్ సింగ్, ప్రియాభవానీ శంకర్, ఎస్జే సూర్య, బాబీ సింహా కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందించారు. ఈ ఏడాదే కంగువ సూర్య హీరోగా నటించిన పీరియాడికల్ సోషియో ఫ్యాంటసీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘కంగువ’. శివ దర్శకత్వంలో రూ΄÷ందిన ఈ సినిమాలో దిశా పటానీ, బాబీ డియోల్, యోగిబాబు కీలక పాత్రల్లో నటించారు. కేఈ జ్ఞానవేల్రాజా, వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కానున్నట్లు చిత్రయూనిట్ స్పష్టం చేసింది. డిఫరెంట్ టైమ్లైన్స్లో జరిగే ఈ చిత్రంలో సూర్య నాలుగైదు గెటప్స్లో కనిపిస్తారనే ప్రచారం సాగుతోంది. తాజాగా ఈ సినిమా కొత్త పోస్టర్ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. విజిల్ పోడు విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ చిత్రంలో మీనాక్షీ చౌదరి ఓ హీరోయిన్ గా నటిస్తున్నారు. విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించిన ఈ సినిమా నుంచి ‘విజిల్ పోడు..’ అనే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మదన్ కర్కే లిరిక్స్ అందించిన ఈ పాటను విజయ్, వెంకట్ప్రభు, యువన్ శంకర్ రాజా, ప్రేమ్గీ ఆలపించారు. ఏజీఎస్ ఎంటర్టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 5న విడుదల కానుంది. రాయన్ రెడీ ధనుష్ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాయన్’. నార్త్ చెన్నై బ్యాక్డ్రాప్లో సాగే ఈ చిత్రంలో సందీప్ కిషన్, కాళిదాసు జయరాం లీడ్ రోల్స్ చేయగా, సెల్వరాఘవన్, ప్రకాష్రాజ్, దుషారా విజయన్, అపర్ణా బాలమురళి, వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ను విడుదల చేసి, త్వరలోనే పాటలను రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది. సన్పిక్చర్స్ నిర్మించిన ఈ చిత్రం ధనుష్ కెరీర్లో 50వ చిత్రం కావడం విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ‘రాయన్’ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుందని కోలీవుడ్ సమాచారం. డబుల్ ధమాకా తమిళ కొత్త సంవత్సరంలో జోష్ పెంచారు రాఘవా లారెన్స్. ఆయన హీరోగా రెండు కొత్త సినిమాలను ప్రకటించారు. వాటిలో ఒక మూవీకి ‘హంటర్’ అనే టైటిల్ ఖరారైంది. రాఘవా లారెన్స్ కెరీర్లో 25వ సినిమాగా తెరకెక్కనున్న ఈ యాక్షన్ అడ్వెంచరస్ ఫిల్మ్కు వెంకట్ మోహన్ దర్శకత్వం వహిస్తారు. గోల్డ్మైన్ టెలీ ఫిలింస్, మనీష్ షా, సత్యజ్యోతి ఫిలింస్ నిర్మించనున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. అలాగే ‘బెంజ్’ అనే కొత్త సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు లారెన్స్. దర్శకుడు లోకేష్ కనగరాజ్ ఈ సినిమాకు కథ అందించారు. బక్కియరాజ్ కన్నన్ దర్శకత్వం వహించనున్న ఈ మూవీని సుధన్ సుందరం, లోకేష్ కనగరాజ్, జగదీష్ పళనిస్వామి నిర్మించనున్నారు. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. తమిళ నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని మరికొన్ని సినిమాల అప్డేట్స్ కూడా వచ్చాయి. -
విజయ్ పొలిటికల్ ఎంట్రీ.. చివరి చిత్రం డైరెక్టర్గా ఎవరంటే?
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ 69వ చిత్రంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇందుకు ప్రధాన కారణం రాజకీయరంగ ప్రవేశం చేస్తున్న విజయ్ నటించే చివరి చిత్రం ఇదేననే ప్రచారం జరుగుతోంది. విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఆయన తండ్రి, కుమారుడిగా ద్విపాత్రాభియనం చేస్తున్నారు. కొడుకు పాత్ర కోసం ఆధునికి టెక్నాలజీని వాడుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో విజయ్ 69వ చిత్రానికి దర్శకుడెవరనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. ఈ విషయంలో చాలా మంది దర్శకుల పేర్లు కోలీవుడ్లో వినిపిస్తున్నాయి. వీరిలో ఓ టాలీవుడ్ డైరెక్టర్తో పాటు, వెట్రిమారన్, కార్తీక్సుబ్బరాజ్ పేర్లు వినిపిస్తున్నాయి. వీరందరికీ విజయ్తో చిత్రం చేయాలన్నది ఆశే. తాజాగా హెచ్.వినోద్ పేరు వెలుగులోకి వచ్చింది. ఇంతకు ముందు చతురంగవేట్టై, ధీరన్ అధికారం ఒండ్రు, తుణివు వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించారు. తాజాగా కమలహాసన్ హీరోగా చిత్రం చేయడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన కథా చర్చలు జరిపారు. చిత్రం ప్రారంభమే ఆలస్యం అనుకుంటున్న తరుణంలో ఆ చిత్రం డ్రాప్ అయ్యారు. అలాంటి పరిస్థితుల్లో విజయ్ తన 69వ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం వైరలవుతోంది. దీని గురించి ఇటీవల ఓ భేటీలో నటుడు విజయ్ హీరోగా చేస్తే అది ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నకు హెచ్.వినోద్ బదులిస్తూ కచ్చితంగా రాజకీయ నేపథ్యంలోనే ఉంటుందని చెప్పారు. విజయ్ హీరోగా రాజకీయ నేపథ్యంలో చిత్రం చేయాలన్నది తన కోరిక అని పేర్కొన్నారు. తాను ఆయనకు చెప్పిన కథలన్నీ అలాంటివేనన్నారు. కాగా విజయ్ 69వ చిత్రానికి హెచ్.వినోద్ దర్శకుడు అయితే అది కచ్చితంగా ఆయన రాజకీయ జీవితానికి ప్రయోజన కరంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాలంటే మరి కొద్ది రోజులు ఆగాల్సిందే. -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్తో జతకట్టనున్న కోలీవుడ్ హీరో..!
కోలీవుడ్లో ఓ ఆసక్తికరమైన వార్త సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. గతేడాది కార్తీ నటించిన 25వ చిత్రం జపాన్ పూర్తిగా నిరాశపరచడంతో ఆయన ఇప్పుడు స్పీడ్ పెంచారు. చిత్రాల విషయంలో జెడ్ స్పీడ్లో పరుగెడుతున్నారనే చెప్పాలి. ప్రస్తుతం నలన్ కుమారస్వామి దర్శకత్వంలో వా వాద్ధియారే, 96 చిత్రం ఫేమ్ ప్రేమ్కుమార్ దర్శకత్వంలో మరో చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల షూటింగ్ చివరి దశకు చేరుకుంది. తదుపరి ఖైదీ 2, సర్ధార్ 2 చిత్రాలు లైన్లో ఉన్నాయి. వీటిలో సర్ధార్ -2 చిత్ర పూజా కార్యక్రమాలు ఇటీవల జరిగాయి. కాగా ఇలాంటి పరిస్థితుల్లో కార్తీ మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. కాగా.. అర్జున్రెడ్డి, యానిమల్తో సంచలన హిట్స్ కొట్టిన దర్శకుడు సందీప్రెడ్డి వంగా దర్శకత్వంలో నటించనున్నారన్నదే లేటేస్ట్ టాక్. మరోవైపు ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే చిత్రాన్ని తెరకెక్కించడానికి సందీప్ సన్నాహాలు చేస్తున్నారు. ఆ తరువాత నటుడు కార్తీ హీరోగా ఓ చిత్రం చేయనున్నట్లు ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడినట్లు వైరలవుతోంది. అయితే ఈ క్రేజీ కాంబోలో రూపొందే చిత్రానికి ఇంకా చాలా టైమ్ ఉంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన రావాల్సి ఉంది. -
స్టార్ హీరోతో టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ చిత్రం.. !
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్కు తనకంటూ ప్రత్యేక శైలి, స్థానం సంపాదించుకున్నారు. అగ్రస్టార్గా కొనసాగుతున్న అజిత్ ఇటీవల నటించిన చిత్రాలన్నీ విజయాలను సాధించడంతో పాటు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి. అలా ఇంతకుముందే అజిత్ కథానాయకుడిగా నటించిన చిత్రం తుణివు. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ప్రస్తుతం విడాయమర్చి చిత్రంలో నటిస్తున్నారు. నటి త్రిష నాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీంతో అజిత్ తన తదుపరి 63వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. దీనిని ప్రముఖ టాలీవుడ్ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తోంది. ఇటీవల విశాల్ హీరోగా మార్క్ ఆంటోని వంటి సక్సెస్ఫుల్ చిత్రాన్ని తెరకెక్కించిన అధిక్ రవిచంద్రన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రానికి ఇటీవల గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ ఖరారు చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ చిత్రాన్ని 2025 సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాలు ప్రకటించాయి. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇందులో అజిత్ త్రిపాత్రాభినయం చేయబోతున్నట్లు తాజా సమాచారం. ఈ విషయం గురించి చిత్ర వర్గాలు అధికారికంగా ప్రకటించకపోయినా టైటిల్ చూస్తుంటే అర్థమవుతోంది. నటుడు అజిత్ ఇంతకుముందు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో వరలారు అనే చిత్రంలో త్రిపాత్రాభినయం చేశారన్నది గమనార్హం. ఆ చిత్రం 2006లో విడుదలై మంచి విజయాన్ని సాధించింది. కాగా దాదాపు 18 ఏళ్ల తరువాత అజిత్ మళ్లీ ఇప్పుడు గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో మూడు పాత్రల్లో అలరించునున్నారు. ఇది నిజమైతే ఆయన అభిమానులకు ఇక పండగే. -
కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ బ్రో.. ఇంత అందాన్ని మర్చిపోయారా?
కోలీవుడ్ భామ ఇటీవలే హనుమాన్ సినిమాతో అలరించారు. తేజ సజ్జాకు అక్కా పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. గతేడాది టాలీవుడ్లో వీరసింహారెడ్డి, కోటబొమ్మాళి పీఎస్ చిత్రాలతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకున్నారు. అయితే గతంలో చాలా ఇంటర్వ్యూల్లో తన పెళ్లి గురించి దాటవేస్తూ వచ్చిన బ్యూటీ.. ఇటీవలే ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్కు షాకిచ్చింది. ముంబైకి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయి సచ్దేవ్ అనే వ్యక్తిని మార్చి 1న ముంబైలో నిశ్చితార్థం చేసుకుంది. ఈ ఏడాదిలోనే పెళ్లి పీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. ఆమెనే లేడీ విలన్గా గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మీ శరత్ కుమార్. అయితే తాజాగా ఈ ముద్దుగుమ్మ ఐపీఎల్ మ్యాచ్లో తళుక్కున మెరిసింది. చెన్నై, గుజరాత్ మధ్య జరిగిన మ్యాచ్లో వరలక్ష్మి సందడి చేసింది. చెపాక్ స్టేడియంలోని స్టాండ్స్లో వరలక్ష్మి నిలబడి మ్యాచ్ను ఎంజాయ్ చేస్తున్న వీడియోను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. వీడియోతో పాటు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇవాళ మ్యాచ్లో కెమెరామెన్ ఫోకస్ ఎక్కడ పెట్టారు.. ఈ అందాన్ని గుర్తించడం ఎలా మరిచిపోయారు? అంటూ క్యాప్షన్ రాసుకొచ్చారు. ఆ వీడియో ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. Cameraman ka focus Aaj kahan hai 🙄🤪Itna glamor nahi notice kiya ? pic.twitter.com/bJqvmluOo8 — aCute 📐 (@chaoticalm_090) March 26, 2024 -
ఎన్నాళ్లో వేచిన హృదయం.. ఆ స్టార్ హీరో క్రేజ్ చూశారా?
కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోలీవుడ్తో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉంది. అంతే కాకుండా దక్షిణాదిలో అన్ని రాష్ట్రాల్లోనూ అభిమానులు ఉన్నారు. అయితే ఇవాళ దాదాపు 14 ఏళ్ల తర్వాత దళపతి విజయ్ కేరళలో అడుగుపెట్టారు. ప్రస్తుతం గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసమే ఆయన తిరువనంతపురం చేరుకున్నారు. ఎయిర్ పోర్టు చేరుకున్న దళపతి విజయ్కు ఫ్యాన్స్ ఘనస్వాగతం పలికారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తిరువనంతపురం ఎయిర్ పోర్టు నుంచి విజయ్ బయటకు రాగానే ఒక్కసారిగా అందరూ కేకలు వేస్తూ సందడి చేశారు. దళపతి.. విజయ్.. విజయ్.. అంటూ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగిపోయింది. దీంతో కారులో నుంచి సన్రూఫ్ ద్వారా నిలబడి అభిమానులను విజయ్ అభివాదం చేశారు. చేతులు ఊపుతూ అభిమానులను పలకరించారు. కేరళలో విజయ్ క్రేజ్ చూసి చాలా మంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ భారీ స్థాయిలో రావడంతో ఎయిర్ పోర్ట్ పరిసరాల్లో రోడ్లు బ్లాక్ అయిపోయాయి. భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్ కావడంతో కిలోమీటర్ల వాహనాలు నిలిచిపోయాయి. కాగా.. గతంలో 2011లో కావలాన్ మూవీ షూటింగ్ కోసం చివరగా కేరళకు వెళ్లారు. మళ్లీ ఇన్నేళ్లకు అక్కడికి వెళ్లడంతో ఆయనకు స్వాగతం పలికారు. కాగా.. గోట్ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో డ్యుయల్ రోల్లో దళపతి విజయ్ నటించనున్నారు. Road block completely 🙏🙏#VijayStormHitsKeralapic.twitter.com/cjkzEGUdlk — Vijay Fans Trends 🐐 (@VijayFansTrends) March 18, 2024 HD Video of Thalapathy’s entry in Trivandrum 🥁 #VijayStormHitsKerala pic.twitter.com/Ga6Qc5KZix — Vijay Fans Trends 🐐 (@VijayFansTrends) March 18, 2024 -
ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో.. అసలు కారణం ఇదే!
తమిళ స్టార్ హీరో గతేడాది తునివు(తెగింపు) చిత్రంతో ప్రేక్షకులను అలరించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం అజిత్ కుమార్ విడాయమర్చి అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా వస్తోన్న ఈ సినిమా త్రిష హీరోయిన్గా కనిపించనుంది. ఇదిలా ఉండగా అజిత్ సడన్గా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. గురువారం చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చేరారు. ఇంతకీ తమ హీరోకు అసలు ఏమైందంటూ ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. మరోవైపు ఆయన కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే వచ్చారంటూ సన్నిహితులు వెల్లడించారు. కానీ తాజాగా ఆయన హెల్త్ అప్డేట్ గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆయన నరాల వాపుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. చెవిని మెదడుకు కలిపే నరంలో వాపు రావడం వల్ల చికిత్స కోసం ఆస్పత్రిలో చేరారని అజిత్ ప్రతినిధి సురేష్ చంద్ర తెలిపారు. అంతే కాకుండా బ్రెయిన్ సిస్ట్తో బాధపడుతున్నట్లు వచ్చిన వార్తలను ఆయన తోసిపుచ్చారు. అజిత్ సర్జరీ గురించి వచ్చిన కథనాలు అవాస్తవమని.. రెండు రోజుల్లో డిశ్చార్జ్ అవుతారని సురేష్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స పూర్తయిందని.. ఆరోగ్యంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. -
Ajith Kumar: ఆస్పత్రిలో చేరిన స్టార్ హీరో
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడీయాలో తెగ వైరలవతున్నాయి. ఇంతకీ తమ స్టార్ హీరోకు ఏమైందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అజిత్ కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. అయితే కేవలం రెగ్యులర్ చెకప్ కోసమే ఆయన ఆస్పత్రికి వెళ్లినట్లు సమాచారం. త్వరలోనే ఆయన డిశ్చార్జ్ అవుతారని సన్నిహత వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయన విడాయమర్చి చిత్రంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ కోసం ఆయన త్వరలోనే విదేశాలకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. అందుకే రెగ్యులర్ మెడికల్ చెకప్ కోసం వెళ్లారని అజిత్ సన్నిహితులు చెబుతున్నారు. ఆయన ఆరోగ్యంపై ఎలాంటి రూమర్స్ అభిమానులు నమ్మవద్దని కోరుతున్నారు. త్వరలోనే బయటికి వస్తారని వెల్లడించారు. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తోన్న విడాయమర్చి చిత్రానికి మాగిజ్ తిరుమేని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను భారీ బడ్జెట్తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో అజిత్కు జోడీగా త్రిష హీరోయిన్గా నటిస్తోంది. గతంలో అజిత్, త్రిష కలిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే సినిమా చేశారు. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ జతకట్టారు. AK Sir Visited To Apollo Hospital For Regular Health Check-up... #AjithKumar #VidaaMuyarchi pic.twitter.com/4Pbht78oqU — Ajith Seenu 2 👑 DARK DEVIL... தல..தாய்..தாரம்.. (@ajith_seenu) March 7, 2024 AK has admitted to Apollo hospital just for a regular checkup 👍#VidaaMuyarchi .. #AjithKumar pic.twitter.com/RPZFZGG1K7 — 𒆜Harry Billa𒆜 (@Billa2Harry) March 7, 2024 -
ప్రీ వెడ్డింగ్లో రజినీకాంత్.. మరి ఇంత చీపా?
కోలీవుడ్ సూపర్ స్టార్ తలైవా ఇటీవలే లాల్ సలామ్ చిత్రంతో ప్రేక్షకులను అలరించారు. ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ప్రస్తుతం తలైనా వెట్టైయాన్ అనే చిత్రంలో నటించనున్నారు. ఈ సినిమాకు టీజీ జ్ఞానవేల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల గుజరాత్లోని జామ్నగర్లో ముకేశ్ అంబానీ- నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ- రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో తన ఫ్యామిలీతో కలిసి రజినీకాంత్ సందడి చేశారు. తన భార్య లతా, కూతురు ఐశ్వర్యతో కలిసి తలైవా హాజరయ్యారు. మూడు రోజుల పాటు కొనసాగిన ఈ వేడుకలు ఆదివారంతో ముగిశాయి. కాగా.. వేడుకలకు వెళ్తున్న రజినీకాంత్ తన ఫ్యామిలీతో కలిసి ఫోటోలకు పోజులిచ్చారు. అయితే అదే సమయంలో ఓ మహిళ వారి వెనకాలే నడుస్తూ వచ్చింది. అయితే ఆమెను రజినీకాంత్ పక్కకు వెళ్లు అనేలా తన చేతులతో సంజ్ఞ చేస్తూ కనిపించారు. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ మహిళ పట్ల రజినీకాంత్ వ్యవహించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓ నెటిజన్ రాస్తూ.. 'కండక్టర్ స్థాయి నుంచి వచ్చారు.. కానీ పేద ప్రజలకు, అల్లుడికి కూడా మర్యాద ఇవ్వరంటూ రాసుకొచ్చారు. మరో నెటిజన్స్ రాస్తూ..' స్టార్ హీరో ఒక మహిళతో ఎలా వ్యవహరిస్తున్నాడో చూడండి.. ఆయన అభిమానిగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నా' అంటూ కామెంట్ చేశారు. 'అదే ఆయన అసలు రంగు' అని ఒకరు రాయగా.. రజినీకాంత్ చీప్ బిహేవియర్' అంటూ మరొక నెటిజన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. Cheapest behaviour from #Rajinikanth!pic.twitter.com/uw0opzNdsZ — Kolly Censor (@KollyCensor) March 3, 2024 -
లియో డైరెక్టర్ సూపర్ హిట్ మూవీ.. సీక్వెల్పై క్రేజీ అప్డేట్!
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ గతంలో నటించిన చిత్రం ఖైదీ. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్స్ సంస్థ నిర్మించింది. హీరోయిన్ అంటూ ఎవరూ లేని ఈ చిత్రం రగ్గడ్ పాత్రలో నటించిన కార్తీలోని మరో నటుడిని ఆవిష్కరించింది. 2019లో విడుదలైన ఖైదీ చిత్రం బ్లాక్ బస్టర్గా నిలిచింది. అయితే దీనికి సీక్వెల్ ఉంటుందని.. దర్శకుడు లోకేశ్ కనకరాజ్, కార్తీ చెబుతూ వస్తున్నారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నారు. రియో చిత్రం తరువాత దర్శకుడు లోకేశ్ కనకరాజ్ సూపర్స్టార్ రజనీకాంత్ 171వ చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక నటుడు కార్తీ చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఆయన ఇటీవల నటించిన జపాన్ చిత్రం నిరాశ పరిచినా.. ప్రస్తుతం నలన్ కుమారసామి దర్శకత్వంలో వావాద్థియారే అనే చిత్రంతోపాటు 96 చిత్రం ఫేమ్ ప్రేమ్కుమార్ దర్శకత్వంలో చేస్తున్నారు. దీని తరువాత సర్ధార్– 2 చిత్రం లైన్లో ఉన్నట్లు సమాచారం. దీంతో ఖైదీ 2 చిత్రం ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న ప్రశ్నకు ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొన్న నటుడు కార్తీ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం తాను అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసిన తరువాత ఖైదీ-2 చిత్రంలో నటిస్తానని చెప్పారు. ఈ లోగా దర్శకుడు లోకేశ్కనకరాజ్ రజనీకాంత్ హీరోగా నటించే చిత్రాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. కాగా ఖైదీ– 2 చిత్రం వచ్చే ఏడాది ప్రారంభం అవుతుందని కార్తీ స్పష్టం చేశారు. -
ఓటీటీకి వచ్చేసిన సూపర్ హిట్ మూవీ.. దాదాపు ఐదేళ్ల తర్వాత!
కోలీవుడ్ స్టార్ కమెడియన్ సంతానం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు చిత్రాలు ఉన్నాయి. ఇటీవలే హీరోగా వడక్కుపట్టి రామస్వామి చిత్రంలో సూపర్ హిట్ అందుకున్నారు. ప్రస్తుతం ఇంగ నాన్ తాన్ కింగ్(ఇక్కడ నేనే కింగ్) అనే సినిమా చేస్తున్నారు. ఫుల్ కమర్షియల్ చిత్రాలు చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. అయితే గతంలో సంతానం హీరోగా నటించిన కామెడీ ఎంటర్టైనర్ చిత్రం ఏ1. తమిళంలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది. దాదాపు ఈ మూవీ థియేటర్లలో విడుదలైన ఐదేళ్ల తర్వాత తెలుగులోను అందుబాటులోకి వచ్చేసింది. అయితే థియేటర్లలో కాకుండా డైరెక్ట్గా ఓటీటీకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ ఏ1 చిత్రం చూడాలంటే మాత్రం డబ్బులు చెల్లించాల్సిందే. రెంటల్ విధానంలో తెలుగు వర్షన్ రిలీజ్ చేశారు. ఈ మూవీని చూడాలంటే అమెజాన్ ప్రైమ్ సబ్స్క్రిప్షన్తో పాటు రూ.79 చెల్లించాల్సిందే. కాగా.. రొమాంటిక్ కామెడీ చిత్రం ద్వారా జాన్సన్ కే దర్శకుడిగా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ చక్కటి వసూళ్లను దక్కించుకున్నది. సంతానం తన కామెడీ టైమింగ్తో అభిమానులను అలరించాడు. స్టార్ హీరోల సినిమాలతో పోటీపడి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల్ రాబట్టింది. అయితే ఇప్పటికే తమిళ వర్షన్ సన్ నెక్ట్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. -
యంగ్ హీరోయిన్తో జతకట్టిన స్టార్ కమెడియన్.. ఆసక్తిగా టైటిల్!
కోలీవుడ్లో హాస్యానికి మరో పేరు సంతానం. టాలీవుడ్లో బ్రహ్మనందంలాగే పంచ్ డైలాగులు చెప్పడంలో ఆయన స్టైలే వేరు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రానికి ఇంగ నాన్ దాన్ కింగ్ (ఇక్కడ నేనే కింగ్) అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని గోపురం ఫిలిమ్స్ పతాకంపై జీఎన్ అన్భచెలియన్ సమర్పణలో ఈయన కుమార్తె సుస్మిత అన్భచెల్లియన్ నిర్మిస్తున్నారు. ఇంగ నాన్ దాన్ కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న చిత్రానికి ఆనంద్ నారాయణన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ను కమలహాసన్ రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో అతనికి జంటగా ప్రియాలయ నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. నటుడు తంబి రామయ్య, మనోబాల, వైవిధ్య భరిత పాత్రలు పోషించిన ఇందులో మనీష్ కాంత్, వివేక్ ప్రసన్న ముఖ్యపాత్రల్లో నటించారు. ఇది వినోదంతో కూడిన మంచి కథా చిత్రం అని దర్శకుడు చెప్పారు. చిత్ర షూటింగ్ను చైన్నె పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ సినిమాకు ఇమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్ స్పెషల్గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్ వర్గాలు వెల్లడించాయి. எனது அன்புக்குரிய நண்பர், கோபுரம் பிலிம்ஸ் அன்புசெழியன் வழங்கும், சுஸ்மிதா அன்புசெழியன் தயாரிக்கும், தம்பி சந்தானம் நடிக்கும் புதிய படத்தின் பெயரையும், போஸ்டரையும் வெளியிடுவதில் மகிழ்கிறேன்.#IngaNaanThaanKingu#GNAnbuchezhian @Sushmitaanbu @gopuramfilms @Gopuram_Cinemas… pic.twitter.com/Jn2629UVP3 — Kamal Haasan (@ikamalhaasan) February 28, 2024 -
'త్రిషపై వ్యాఖ్యలను ఖండించడం ఇష్టం లేదు'.. విశాల్ ట్వీట్ వైరల్!
స్టార్ హీరోయిన్ త్రిషపై అన్నాడీఎంకే మాజీ లీడర్ చేసిన కామెంట్స్ కోలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. త్రిషను ఉద్దేశించి ఏవీ రాజు చేసిన కామెంట్స్ తీవ్ర దుమారానికి దారితీశాయి. తాజాగా దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున వైరలైంది. ఈ నేపథ్యంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు త్రిష కూడా ట్వీట్ చేసింది. దీనిపై మా లీగల్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకుంటుందని తెలిపింది. ఏవీ రాజు వ్యాఖ్యలపై పలువురు సినీ తారలు మండిపడుతున్నారు. త్రిషకు మద్దతుగా ట్వీట్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై హీరో విశాల్ స్పందించారు. ఇలాంటి కామెంట్స్పై ట్విటర్ వేదికగా మండిపడ్డారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన ఒక మూర్ఖుడు మా ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా.. ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే చేస్తారని నాకు తెలుసు అన్నారు. సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. భూమిపై ఉన్న అలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించిందని విశాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాల్ తన ట్వీట్లో రాస్తూ..'ఒక రాజకీయ పార్టీకి చెందిన తెలివితక్కువ మూర్ఖుడు. మన సినీ వర్గానికి చెందిన ఒకరి గురించి చాలా అసహ్యంగా మాట్లాడారని విన్నా. ఇది పబ్లిసిటీ కోసం చేశారని నాకు తెలుసు. కాబట్టి మీ పేరును ప్రస్తావించను. మీరు టార్గెట్ చేసిన తన పేరును కూడా ప్రస్తావించను. ఎందుకంటే మేము మంచి స్నేహితులం మాత్రమే కాదు.. సినిమాల్లో సహచరులం కూడా. మీరు చేసిన పని తర్వాత మీ ఇంట్లో ఉన్న స్త్రీలు క్షేమంగా ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నా.' అని రాసుకొచ్చారు. ఆ తర్వాత ప్రస్తావిస్తూ..' ఈ భూమిపై ఉన్న ఇలాంటి రాక్షసుడిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ట్వీట్ చేయడం నాకు నిజంగా బాధ కలిగించింది. మీరు చేసిన పనిని చెప్పేందుకు కూడా మాటలు రావడం లేదు. నిజాయితీగా చెప్పాలంటే నాకు నిన్ను ఖండించడం ఇష్టం లేదు.. ఎందుకంటే నీకు ఇది చాలా తక్కువే అవుతుంది. అందుకే మీరు నరకంలో కుళ్లిపోవాలని కోరుకుంటున్నా. కళాకారుల సంఘం ప్రధాన కార్యదర్శిగా ఈ ప్రకటన చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ ఒక మనిషిగా చెబుతున్నా. మీరు భూమిపై ఉన్నంత వరకు మనిషిలాగా ఎప్పటికీ ఉండలేరు. ప్రస్తుతం సెలబ్రిటీల గురించి నెగిటివ్ ప్రచారం చేసి డబ్బు సంపాదించడం ఒక ట్రెండ్గా మారింది. డబ్బు కోసమే అయితే మంచి ఉద్యోగం సాధించండి. లేదా కనీసం ప్రాథమిక క్రమశిక్షణ నేర్చుకోవడానికి బిచ్చగాడిగానైనా కెరీర్ ప్రారంభించండి' అంటూ తనదైన శైలిలో విశాల్ కౌంటరిచ్చారు. I just heard that a stupid idiot from a political party spoke very ill and disgustingly about someone from our film fraternity. I will not mention your name nor the name of the person you targeted because I know you did it for publicity. I definitely will not mention names… — Vishal (@VishalKOfficial) February 20, 2024 -
స్వీయ దర్శకత్వంలో మరో స్టార్ హీరో.. ఆకట్టుకుంటోన్న ఫస్ట్ లుక్!
ఇటీవలే కెప్టెన్ మిల్లర్తో సూపర్ కొట్టిన కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్గా నిలిచింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఇదిలా ఉండగా ధనుశ్ మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ధనుశ్-50 అనే వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీ టైటిల్తో పాటు ఫస్ట్ లుక్ను మేకర్స్ రివీల్ చేశారు. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా పంచుకున్నారు. ధనుశ్ కెరీర్లో 50వ సినిమాగా నిలవనుంది. తాజాగా రిలీజైన ఫస్ట్లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు రాయన్ అనే టైటిల్ ఖరారు చేశారు మేకర్స్. ఈ సినిమా కథను తానే రాయడంతోపాటు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ఈ మూవీకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు ధనుశ్. ఈ చిత్రంలో కెప్టెన్ మిల్లర్లో కీలక పాత్ర పోషించిన సందీప్ కిషన్ కూడా నటిస్తున్నారు. ఇదే కాకుండా టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెలుగు సినిమాలో ధనుష్ నటిస్తున్నారు. ఇది ఆయన కెరీర్లో 51వ చిత్రం. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్ర పోషిస్తున్నారు. రష్మిక హీరోయిన్గా నటిస్తోన్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. #D50 is #Raayan 🔥 🎬 Written & Directed by @dhanushkraja 🎵 Music by @arrahman Releasing in Tamil | Telugu | Hindi@omdop @editor_prasanna @kalidas700 @sundeepkishan @PeterHeinOffl @jacki_art @kavya_sriram @kabilanchelliah @theSreyas @RIAZtheboss #D50FirstLook pic.twitter.com/vfemOIRKIX — Sun Pictures (@sunpictures) February 19, 2024 -
కమల్ క్రేజీ ప్రాజెక్ట్.. ఇక శుభం కార్డ్ పడినట్లేనా?
గతేడాది విక్రమ్ సినిమాతో హిట్ కొట్టిన కమల్ హాసన్ అదే జోరు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మణిరత్నం ప్రాజెక్ట్ థగ్ లైఫ్తో బిజీగా ఉన్నారు. కమల్– మణిరత్నం కాంబోలో ‘నాయగన్’–1987 (నాయకుడు) తర్వాత 37 ఏళ్లకు రూపొందిస్తున్న ఈ చిత్రంపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. దీంతో పాటు కమల్ హాసన్ మరో ప్రాజెక్ట్లో నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. అయితే తాజాగా దీనిపై నెట్టింట మరో చర్చ మొదలైంది. అదేంటో ఓసారి తెలుసుకుందాం. కమల్కు చెందిన నిర్మాణసంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై హెచ్.వినోద్ దర్శకుడిగా గతేడాది ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే. కమల్హాసన్ 233వ ప్రాజెక్ట్గా ఇది ప్రచారంలో ఉంది. కమల్ కోసం వినోద్ పవర్ఫుల్ పాత్ర సిద్ధం చేసినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో తమ బ్యానర్లో రానున్న చిత్రాలను ఉద్దేశించి రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ ట్విటర్ పోస్ట్ ఆ వార్తలకు బలం చేకూర్చుతోంది. ట్విటర్లో రాస్తూ..' థగ్ లైఫ్’, కమల్ 237, శివకార్తికేయన్ 21, శింబు 48 త్వరలో తమ బ్యానర్ నుంచి విడుదల కానున్నట్లు వెల్లడించింది. అయితే ఈ లిస్ట్లో కమల్-233 ప్రాజెక్ట్ లేకపోవడంతో అభిమానుల్లో చర్చ మొదలైంది. దీంతో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ నెట్టింట తెగ వైరలవుతోంది. ఇదిలా ఉండగా ఈ విషయంపై చిత్రబృందం, వినోద్ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. Rest is Action #Ulaganayagan #KamalHaasan#ThugLife #KH237 #SK21 #STR48 @ikamalhaasan @Siva_Kartikeyan @SilambarasanTR_#Maniratnam #Mahendran @anbariv @Rajkumar_KP @desingh_dp@turmericmediaTM @magizhmandram pic.twitter.com/G681xU6xsK — Raaj Kamal Films International (@RKFI) January 24, 2024 -
వైభవంగా స్టార్ హీరో కుమార్తె రిసెప్షన్, సెలబ్రిటీల సందడి (ఫొటోలు)
-
స్టార్ హీరోతో ఛాన్స్ కొట్టేసిన డైరెక్టర్ కూతురు!
వైద్య విద్య చదివి హీరోయిన్గా సినీ రంగప్రవేశం చేసిన నటి ఆదితి శంకర్. అంతే కాదు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చింది. కార్తీకి జంటగా విరుమాన్ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమైన ఆదితి శంకర్ తొలి చిత్రంతోనే విజయాన్ని అందుకున్నారు. అందులో ఈ చైన్నె చంద్రం పక్కా పల్లెటూరి యువతిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు. అంతేకాకుండా తొలి చిత్రంలోని పాటను కూడా పాడి సింగర్గా కూడా పరిచయమయ్యారు. ఆ తరువాత శివకార్తికేయన్ సరసన మావీరన్ చిత్రంలో నటించారు. ఆ చిత్రం కూడా అనూహ్య విజయాన్ని అందుకుంది. కాగా.. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాష్ మురళికి జంటగా నటిస్తున్నారు. నటుడు అధర్వ తమ్ముడు ఆకాష్ కథానాయకుడిగా పరిచయం అవుతున్న చిత్రమిది. ఈ చిత్ర నిర్మాణంలో ఉండగానే ఆదితి శంకర్ మరో లక్కీచాన్స్ తలుపు తట్టినట్టు తాజా సమాచారం. విరుమాన్ చిత్రంలో కార్తీతో జత కట్టిన ఈ బ్యూటీ ఇప్పుడు స్టార్ హీరో సూర్య సరసన నటించడానికి సిద్ధమైనట్లు సమాచారం. కాగా... నటుడు సూర్య ప్రస్తుతం కంగువా చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. శివ దర్శకత్వంలో ఈ భారీ చారిత్రక కథా చిత్రం త్రీడీ ఫార్మెట్లో తెరకెక్కుతోంది. ఈ చిత్రం ఈ ఏడాది సమ్మర్ స్పెషల్గా తెరపైకి రానుంది. కాగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడి వాసల్ చిత్ర షూటింగ్లో సూర్య 10 రోజులు పాల్గొననున్నారు. ఆ తరువాత సుధా కొంగర దర్శకత్వం వహించనున్న చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం. ఇందులో దుల్కర్ సల్మాన్ ,విజయ్వర్మ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. అదేవిధంగా ఇందులో నజ్రియా నాయకిగా నటిస్తున్నట్లు మొదట్లో ప్రచారం జరిగింది. కానీ ఆ స్థానంలో ఆదితి శంకర్ను తీసుకున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2డీ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్కుమార్ సంగీతాన్ని అందించనున్నారు. View this post on Instagram A post shared by Aditi Shankar (@aditishankarofficial) -
భారీ బడ్జెట్తో చేయగలరా అని డైరెక్టర్ను అడిగా: ధనుశ్
కోలీవుడ్ స్టార్ ధనుశ్ నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వంలో సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన ఈ భారీ పీరియాడికల్ కథా చిత్రంలో ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం పొంగల్ సందర్భంగా ఈ నెల 12న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సందర్భంగా చైన్నెలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. అయితే ఈవెంట్కు ధనుశ్ తన ఇద్దరు కుమారులు, కుటుంబసభ్యులతో పాల్గొనడం విశేషం. ఇటీవల కన్నుమూసిన నటుడు విజయకాంత్కు నివాళులు అర్పించాకే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వేదికపై ధనుష్ మాట్లాడుతూ.. 'చిన్న చినుకు పెను తుపాన్గా మారుతుందని అంటారని. అదేవిధంగా 2002లో చిన్న చినుకుగా ఈ రంగంలోకి అడుగుపెట్టిన తాను ఇప్పుడు పెను తుపాన్గా ఎదిగాను. ఇప్పుడు తాను సంపాదించుకున్న సొత్తు అభిమానులే అని పేర్కొన్నారు. ఇకపై ఈ చిత్రాన్ని చూస్తే ముందుగా గుర్తొచ్చేది శ్రమ అన్నారు. దర్శకుడు అరుణ్ మాతీశ్వరన్ను చూస్తున్నప్పుడు తనకు వెట్రిమారన్ గుర్తుకు వస్తారన్నారు. ఆయన మొదటిగా కలుసుకున్నప్పుడు ఈ తమ్ముడా దర్శకుడు అని అనిపించిందన్నారు. అయితే కథ విన్న 15 నిమిషాల తరువాత భారీ బడ్జెట్ అవుతుందిగా.. సాధ్యం అవుతుందా? అని అడిగానన్నారు. అందుకాయన అలాగే చేద్దామని చెప్పారన్నారు. ఇటీవల చిత్రాన్ని చూశానని ఆయన చెప్పినట్టుగానే ఉందని పేర్కొన్నారు. కెప్టెన్ మిల్లర్ విజయం సాధించడం తథ్యమని ధనుష్ పేర్కొన్నారు. గౌరవమే స్వాతంత్య్రం అన్నది ఈ చిత్ర ట్యాగ్ అని పేర్కొన్నారు. అయితే ఇక్కడ ఎవరికి గౌరవం ఉంది. ఎవరికి స్వాతంత్య్రం ఉంది అన్నది తనకు తెలియడం లేదన్నారు. ఏం చేసినా ఆలోచించి చేయాల్సి వస్తుందని.. అలా ఆలోచించి చేసిన మంచి పనును కూడా తప్పు పట్టేందుకు ఒక వర్గం ఉండటమే స్వాతంత్య్రమా అని ప్రశ్నించారు. తన వరకు అది స్వాతంత్య్రం కాదని ధనుష్ పేర్కొన్నారు. -
మరో చిత్రానికి కమల్ హాసన్ గ్రీన్ సిగ్నల్!
ఇటీవల విక్రమ్ చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన నటుడు కమల్ హాసన్. తదుపరి హెచ్.వినోద్ దర్శకత్వంలో హీరోగా నటించడానికి సిద్ధమయ్యారు. ఈ చిత్రాన్ని కమల్ హాసన్ తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఇటీవల ఈ చిత్రం డ్రాప్ అయినట్లు అనధికార ప్రచారం హోరెత్తుతోంది. కాగా కమలహాసన్ నాయకన్ వంటి సంచలన విజయం సాధించిన చిత్రం తరువాత తాజాగా మరోసారి మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. దీనిని మణిరత్నం మద్రాసు టాకీసు, ఉదయనిధి స్టాలిన్కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ, కమలహాసన్కు చెందిన రాజ్కమల్ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నట్లు ఇంతకు ముందే ప్రకటించారు. దీనికి థగ్స్ లైఫ్ అనే టైటిల్ను ఖరారు చేశారు. అయితే చిత్ర షూటింగ్ ఈ ఏడాది ఏప్రిల్లో ప్రారంభం అవుతుందనే ప్రచారం. కాగా తాజాగా థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్ అనుకున్న దాని కంటే ముందుగానే ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర దర్శకుడు మణిరత్నం, నటుడు కమలహాసన్, నిర్మాత ఆనంద్ కలిసి దిగిన పొటోను నూతన సంవత్సరం సందర్భంగా విడుదల చేసిన పొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. అందులో ఒక వైపు మణిరత్నం, మరో వైపు నిర్మాత చేతితో థమ్సప్ సింబల్ చూపగా కమలహాసన్ ప్రారంభిద్దామా? అన్నట్టు చూస్తున్నట్లు ఉంది. దీంతో ఈ చిత్రం ఫిబ్రవరి నెలలోనే సెట్పైకి వెళ్లే అవకాశం వున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇండియన్ –2 చిత్రాన్ని పూర్తి చేసిన కమలహాసన్ ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నటిస్తున్న కల్కి చిత్రంలో ముఖ్య పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని పూర్తి చేసి థగ్స్ లైఫ్ చిత్ర షూటింగ్లో పాల్గొంటారని సమాచారం.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
ఊళ్లకు పోటెత్తిన ఓటర్లు!
Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
ఇదేందయ్యా వెలగపూడి?
5 వేల మందితో బందోబస్తు
ఎన్నికల సామగ్రి తరలింపు
ప్రయాణికుల కోసం ఎన్నికల స్పెషల్ రైలు
పశ్చిమలో ‘గణ’ంగా ప్రలోభాలు
ఓటేసే ముందు.. ఒక్క క్షణం ఇంటి నుంచి బయలుదేరినప్పుడు నీ పరిసరాలు చూడు
ఏజెంట్లకు సూచనలివే..
ప్రత్యేక ఆకర్షణగా పింక్ పోలింగ్ స్టేషన్
తప్పక చదవండి
- నరసరావుపేటలో తీవ్ర ఉద్రిక్తత
- పల్నాట పచ్చ మూక బీభత్సకాండ
- వెచ్చని హృదయ రాగ సందేశం
- Lok Sabha Election 2024: రాయ్బరేలీ కోసం మేము.. అదానీ, అంబానీ కోసం మోదీ
- Lok Sabha Election 2024: నాలుగో దశలో 67.70% పోలింగ్
- Lok Sabha Election 2024: ఓటేస్తే ఉచిత బైక్ రైడ్
- Lok Sabha Election 2024: ఇండోర్లో ఉచిత పోహా, జిలేబీ..
- వందొస్తే టాప్ కాలేజీల్లో సీఎస్సీ!
- చురుగ్గా రబీ ధాన్యం సేకరణ
- Lok Sabha Election 2024: ఐదో విడతలోనూ మహిళలు అంతంతే
Advertisement