-
స్నేక్ ఎఫెక్ట్.. ఆలస్యమైన బుల్లెట్ రైలు
టోక్యో: జపాన్లో బుల్లెట్ రైలు 17 నిమిషాలు ఆలస్యమవడం హాట్టాపిక్గా మారింది. సాధారణంగా బుల్లెట్ రైళ్లు నిమిషం ఆలస్యం కాకుండా షెడ్యూల్ ప్రకారం నడుస్తుంటాయి. అయితే అనూహ్యంగా బుల్లెట్ రైలు ఆలస్యమవడానికి ఓ పాము కారణమైంది. పాము రైలుపైకి ఎలా వచ్చిందనేదానిపై అధికారులు విచారణ జరుపుతున్నారు. సాధారణంగా ఈ రైళ్లలో కొన్ని జంతువులను తీసుకెళ్లడానికి మాత్రం అనుమతి ఉంటుంది. పాములను మాత్రం అనుమతించరు. ప్రయాణికుల లగేజీని మాత్రం చెక్ చేసే నిబంధన లేదు. ఎవరైనా ప్రయాణికుల లగేజీలో పాము వచ్చి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. జపాన్లో బుల్లెట్ రైలు 1964 సంవత్సరంలోనే ప్రారంభమైంది. ప్రస్తుతం దేశంలో బుల్లెట్ రైలు నెట్వర్క్ 2700కిలోమీటర్లుగా ఉంది. బుల్లెట్ రైళ్ల ఆలస్యం సగటున నిమిషానికంటే తక్కువగానే ఉంటుంది. ప్రస్తుతం బుల్లెట్ రైలు స్పీడు గంటకు 300 కిలో మీటర్లు. ఇదీ చదవండి.. జపాన్కు పోటెత్తిన పర్యాటకులు.. ఒక్క నెలలో రికార్డు -
Actor Vivek Daughter Marriage: దివంగత కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి (ఫొటోలు)
-
తెలంగాణ ఇంటర్బోర్డు కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల నేపథ్యంలో.. తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షకు ఐదు నిమిషాలు ఆలస్యమైనా విద్యార్థుల్ని పరీక్షకు అనుమతించాలని నిర్ణయించింది. ఈ మేరకు.. నిర్దిష్ట కారణాల వల్ల విద్యార్థులు పరీక్షా కేంద్రానికి ఆలస్యంగా చేరుకుంటే ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ను అనుమతించాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారులు ఆయా జిల్లాల అధికారులకు, సెంటర్ చీఫ్ సూపరింటెండెంట్లకు సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలకు విద్యార్థులు ఉదయం 8:45 గంటలకు తమ పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9 గంటల తర్వాత ఆలస్యంగా వచ్చిన విద్యార్థులకు ఐదు నిమిషాల గ్రేస్ పీరియడ్ కు అనుమతి చేస్తామన్నారు. ఇప్పటివరకు పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించకుండా వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన కారణంగా విద్యార్థులు నష్టపోతున్నారనే విమర్శలు ఎక్కువగా వినవస్తున్నాయి. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో ఓ ఇంటర్ విద్యార్థి ఈ నిబంధన కారణంగా పరీక్షకు అధికారులు అనుమతించకపోవడంతో.. తండ్రికి సూసైడ్ లేఖ రాసి బలవన్మరణానికి పాల్పడడం తీవ్ర విషాదాన్ని నింపింది. -
‘క్షమించు నాన్నా..’ ఆదిలాబాద్లో విషాద ఘటన
సాక్షి, ఆదిలాబాద్: ఇంటర్ పరీక్షల వేళ.. జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పరీక్షలు మిస్ అయ్యాయననే మనస్థాపంతో ఓ విద్యార్థి బలవనర్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర సంఘటన ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలంలో చోటు చేసుకుంది. జైనథ్ మండలం మాంగూర్ల గ్రామానికి చెందిన టేకం శివకుమార్ అనే ఇంటర్ విద్యార్థి సాత్మల ప్రాజెక్టులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరీక్షలు మిస్ చేసినందుకు తనను క్షమించాలంటూ తండ్రికి అతను రాసిన సూసైడ్ నోట్ లభించింది. ‘‘నాకోసం.. మీరు ఎంతో చేశారు.. మొదటిసారి పరీక్షకు హాజరు కాలేకపోయా. జీవితంలో ఇంతటి బాధ ఎప్పుడూ చవి చూడలేదు.. క్షమించు నాన్నా..’’ అని నోట్లో ఉంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శివకుమార్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఒక్క నిమిషం నిబంధన వల్లే.. ఇంటర్ పరీక్షలు బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఆదిలాబాద్లోని ప్రభుత్వ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల కేంద్రంలో పరీక్షకు వెళ్లాడు శివ. అయితే.. అప్పటికే మూడు నిమిషాలు ఆలస్యం అయ్యింది. ఒక్క నిమిషం ఆలస్యమైనా.. పరీక్షకు అనుమతించరాదనే నిబంధన ఉందని అధికారులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో శివ అక్కడి నుంచి వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే మనోవేదనతో.. తండ్రికి లేఖ రాసి సాత్నాల ప్రాజెక్టు డ్యాం లోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం విద్యార్థి మృతదేహాన్ని వెలికి తీశారు. సంఘటన స్థలంలో సూసైడ్ నోట్ ,విద్యార్థి చేతి వాచి,పెన్ను లభించింది. తండ్రికి రాసిన సూసైడ్ నోట్ అందరినీ కంటతడి పెట్టించింది. ప్రభుత్వం పరీక్షకు హాజరయ్యేందుకు ఒక నిమిషం నిబంధన విధించిన కారణంగానే నిండు ప్రాణం బలైందని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. శవ పంచనామా అనంతరం మృతదేహాన్ని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. కష్టపడి చదివి.. ఆందోళనగా పరీక్షకు వెళ్లిన కొడుకు శవమై తిరిగొచ్చేసరికి ఆ తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోదిస్తున్నారు. ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదు. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
డబుల్ కల నెరవేరేది ఎప్పుడు..?
మంచిర్యాల: పేదల సొంతింటి కల నెరవేర్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కేంద్రంలోని రాజీవ్నగర్లో డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించింది. నిర్మాణాలు పూర్తి కావడంతో లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. గత మార్చి 17న కలెక్టర్ బదావత్ సంతోష్ ఆధ్వర్యంలో లక్కీడ్రా పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేశారు. అయితే ఎంపిక చేసిన లబ్ధిదారులకు ఇప్పటి వరకు ఇళ్లు అప్పగించలేదు. నేడో రేపో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉండడంతో ఇప్పట్లో పేదల డబుల్ కల నెరవేరే అవకాశం కనిపించడం లేదు. షెడ్యూల్ వస్తే మరింత జాప్యం అనర్హులకు డబుల్ బెడ్రూం ఇళ్లు డ్రాలో వచ్చిందని మున్సిపల్ అధికారులకు, రెవె న్యూ అధికారులకు, కలెక్టర్కు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 85 ఫిర్యాదులను రెవెన్యూ, మున్సిపల్ అధికారులు వారి సిబ్బందితో మరోసారి సర్వే చేసి, 50 మందిని అనర్హులుగా గుర్తించారు. వారికి మినహా మిగతా వారికి డబుల్ బెడ్రూంలను ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదలయితే మరింత ఆలస్యంగా ఇళ్లు కేటాయించే అవకాశం ఉంది. పునఃపరిశీలన పేరుతో అసలైన లబ్ధిదారులకు ఇప్పటికీ ఇళ్లు అప్పగించడం లేదు. రెండు నెలలుగా కాలయాపన చేస్తున్నారు. మున్సిపల్, రెవె న్యూ అధికారులు ఉమ్మడిగా సర్వే చేస్తున్నా అనర్హులను గుర్తించడంలో ఇంకా జాప్యం జరుగుతోంది. ఎన్నికల కోడ్ రాకముందే డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 360 నిర్మాణాలు పూర్తి.. జిల్లా కేంద్రంలో 650 డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం చేపట్టగా, అందులో 360 నిర్మాణ పనులు పూర్తయ్యాయి. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసం స్థలాన్ని ప్రభుత్వానికి ఇచ్చిన 30 కుటుంబాలకు గతంలోనే 30 ఇళ్లను మంజూరు చేశారు. మిగిలిన 330 ఇళ్లు గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్నాయి. 5 వేల దరఖాస్తులు.. ఇక 330 ఇళ్ల కోసం 5 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మొదటగా 2,958 మందిని అర్హులుగా గుర్తించారు. మండల రెవెన్యూ అధికారులతోపాటు, జిల్లాస్థాయి అధికారులు రెండుసార్లు సర్వే చేసి, అర్హులు 1,616 మంది ఉన్నట్లుగా గుర్తించారు. వారికి టోకెన్లు అందించారు. మార్చి 17న జిల్లా కలెక్టర్ అధ్యక్షతన టోకెన్లు తీసుకున్న వారి సమక్షంలోనే లక్కీడ్రా పద్ధతిలో 330 మందిని ఎంపిక చేశారు. స్థలం ఉన్నవారికి, ఒకే ఇంట్లో ఇద్దరికి సైతం డబుల్ బెడ్రూం ఇళ్లు లక్కీడ్రాలో పొందారని ఆధారాలతో ఫిర్యాదు చేయగా, 50 మంది వరకు స్వచ్ఛందంగా డబుల్ బెడ్రూం ఇళ్లను వదులుకున్నారు. కానీ అన్ని అర్హతలు ఉన్నవారికి మాత్రం ఇప్పటి వరకు ఇళ్లను అప్పగించలేదు. -
మొదటి భార్య గురించి సీజేఐ చంద్రచూడ్ ఆసక్తికర విషయాలు..
బెంగళూరు: న్యాయవాద వృత్తిలో సవాళ్లపై ప్రసంగంలో సీజేఐ డీవే చంద్రచూడ్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. లాయర్ వృత్తికి సమయం గురించి చెప్పే క్రమంలో చనిపోయిన తన మొదటి భార్య గురించిన విషయాలను వెల్లడించారు. ఉపన్యాసంలో భాగం కాకపోయినప్పటికీ బుక్ నాలెడ్జ్ కంటే తన వ్యక్తిగత అనుభవ పాఠాలు విద్యార్థులకు బాగా ఉపయోగపడతాయని తెలిపారు. బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్శిటీ(ఎన్ఎల్ఎస్ఐయూ)లో 31వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. 'చనిపోయిన నా మొదటి భార్య లాయర్గా పనిచేశారు. వృత్తి జీవితంలో ఓ న్యాయవాద సంస్థకు వెళ్లినప్పుడు ఆమె పని గంటల గురించి అడిగారు. అందుకు వారు ఆమెకు 365 రోజులు 24x7 అని సమాధానమిచ్చారు. కుటుంబానికి సమయం లేదని చెప్పారు. భార్యాపిల్లలు ఉన్నవారి పరిస్థితి ఏంటని ఆమె ప్రశ్నించినప్పుడు.. ఇంటి పనులు చేసే భర్తను వెతుక్కోండని చెప్పారు' అని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు కాస్త మెరుగుపడ్డాయని సీజేఐ చంద్రచూడ్ తెలిపారు. పనిచేసే ప్రదేశంలో మహిళలకు స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పించాల్సిన అవసరాన్ని తెలిపారు. నేడు మహిళా క్లర్కులు బుుతుసమస్యల సమయంలో వర్క్ ఫ్రం హోమ్ చేయగలుగుతున్నారని చెప్పారు. సమాన అవకాశాలు ఉన్నచోట అన్ని అవసరాలను బహిరంగంగా అడగగలిగే పరిస్థితులను కల్పించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల మహిళల గౌరవానికి భంగం కలిగించకుండా, వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచేలా సుప్రీంకోర్టు డిక్షనరీని కూడా మార్చినట్లు చెప్పారు. వేశ్య, పతిత, హౌజ్వైఫ్ వంటి పదాలను తొలగించినట్లు స్పష్టం చేశారు. మహిళా సాధికారతను సాధించే దిశగా సీజేఐ చంద్రచూడ్ ఎన్నో తీర్పులను ఇచ్చారు. ఆర్మీలో శాశ్వత మహిళా కమిషన్, శబరిమలకు మహిళల ప్రవేశంతో పాటు అబార్షన్ చట్టాలను కూడా చక్కదిద్దారు. మణిపూర్లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసును కూడా ఆయన నేతృత్వంలోని ధర్మాసనమే విచారణలు జరుపుతోంది. ఇదీ చదవండి: అంబానీ కుటుంబంలో మొదటి ప్రేమ వివాహం ఎవరిది? -
స్టాఫ్ నర్స్ పరీక్షకు కఠిన నిబంధనలు.. చెప్పులు మాత్రమే వేసుకోవాలి!
సాక్షి, హైదరాబాద్: స్టాఫ్ నర్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. వచ్చే నెల రెండో తేదీన నిర్వహిస్తోన్న స్టాఫ్ నర్స్ పోస్టుల పరీక్షకు కఠిన నిబంధనలు విధించారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించేది లేదని మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ సభ్య కార్యదర్శి గోపీకాంత్రెడ్డి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మొత్తం 40,936 మందికి 40 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లో 24, ఖమ్మంలో 6, నిజామాబాద్లో 2, వరంగల్లో 8 కేంద్రాలను ఏర్పాటు చేశారు. కంప్యూటర్ ఆధారిత టెస్ట్ కాబట్టి ఆన్లైన్ సెంటర్లలో ఈ పరీక్షలు జరుగుతాయి. ఒకే రోజు మూడు సెషన్లలో పరీక్ష నిర్వహిస్తారు. ఉదయం సెషన్ పరీక్ష 9 గంటలకు ప్రారంభం అవుతుంది. అభ్యర్థులు 7.30 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. 8.45 గంటలకు గేట్ మూసేస్తారు. రెండో సెషన్ పరీక్ష మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఉదయం 11 గంటలకే చేరుకోవాలి. 12.15 గంటలకు గేట్ మూసేస్తారు. ఇక మూడో సెషన్ పరీక్ష సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుంది. దీనికి హాజరయ్యే అభ్యర్థులు మధ్యాహ్నం 2.30 గంటలకు కేంద్రానికి చేరుకోవాలి. 3.45 గంటలకు గేట్ మూసేస్తారు. అభ్యర్థుల సమాచారాన్ని బయోమెట్రిక్ పద్ధతిలో సేకరిస్తారు. కాబట్టి ముందస్తుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అభ్యర్థులకు సూచనలు అభ్యర్థులు తప్పనిసరిగా హాల్ టికెట్ను ఏ–4 సైజు పేపర్పై ప్రింటవుట్ తీసుకోవాలి. అభ్యర్థి ఫొటో, సంతకం స్పష్టంగా ఉంటేనే హాల్ టికెట్ చెల్లుబాటు అవుతుంది. హాల్ టికెట్, ఫొటో లేకుండా లేదా సంతకం లేకుండా ఉంటే అభ్యర్థి 3 పాస్పోర్ట్ సైజు ఫొటోలను తప్పనిసరిగా గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన ఒక హామీతో పాటు తీసుకురావాలి. పరీక్ష హాల్లోని ఇన్విజిలేటర్కు అందజేయాలి. లేని పక్షంలో అభ్యర్థిని పరీక్షకు అనుమతించరు. అభ్యర్థులు పాస్పోర్ట్/పాన్ కార్డ్/ఓటర్ ఐడీ/ఆధార్ కార్డ్/ ప్రభుత్వ ఉద్యోగి ఐడీ/ డ్రైవింగ్ లైసెన్స్లలో ఏదో ఒక చెల్లుబాటు అయ్యే ఫొటో గుర్తింపు కార్డును కూడా తీసుకురావాలి. రిజిస్ట్రేషన్ వద్ద అభ్యర్థుల బయోమెట్రిక్ సమాచారాన్ని సేకరిస్తారు. కాబట్టి అభ్యర్థులు తమ చేతులపై మెహందీ, ఇంక్, టాటూలు వంటివి వేయించుకోవద్దు. గేట్ మూసివేసే సమయానికి నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించరు. అభ్యర్థులు తమకు కేటాయించిన కేంద్రం, సెషన్లో మాత్రమే పరీక్ష రాయాలి. పరీక్షా కేంద్రం, సెషన్ మార్పు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. అభ్యర్థి పరీక్షా కేంద్రం లోపలకు హాల్ టికెట్, నలుపు/నీలం బాల్ పాయింట్ పెన్, చెల్లుబాటు అయ్యే గుర్తింపు కార్డులు మాత్రమే తీసుకెళ్లాలి. పారదర్శకమైన వాటర్ బాటిల్ తీసుకురావచ్చు. పరీక్ష హాలులో రఫ్ షీట్లను ఇన్విజిలేటర్ అందజేస్తారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే పోలీస్ కేసు అభ్యర్థులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్యతిరేకిస్తే, అనర్హత వేటు వేయడమే కాకుండా సంబంధిత పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ను నమోదు చేస్తారు. అభ్యర్థులు కాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, టాబ్స్, పెన్ డ్రైవ్లు, బ్లూటూత్ పరికరాలు, వాచ్, లాగ్ టేబుల్స్, వాలెట్, హ్యాండ్ బ్యాగ్లు, రైటింగ్ ప్యాడ్లు, నోట్స్, చార్ట్లు, లూజ్ షీట్లు లేదా మరే ఇతర గాడ్జెట్లను తీసుకురావడానికి అనుమతి లేదు. అలాగే ఇతర రికార్డింగ్ సాధనాలను అనుమతించరు. అభ్యర్థి చెప్పులు మాత్రమే ధరించి పరీక్షా కేంద్రానికి రావాలి. బూట్లు ధరించకూడదు. నిరీ్ణత సమయానికి ముందే అభ్యర్థులను పరీక్షా కేంద్రం నుంచి బయటకు పంపడానికి అనుమతించరు. ఖమ్మంలో ఓ పరీక్ష కేంద్రం మార్పు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఖమ్మం పట్టణంలో ఒక్క పరీక్షా కేంద్రాన్ని మార్పు చేశారు. ప్రియదర్శిని మహిళా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరీక్ష నిర్వహించే స్థితిలో లేదు. కాబట్టి దానికి బదులుగా స్వర్ణ భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఖమ్మం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్లలో పరీక్షలు జరుగుతాయి. హాల్ టికెట్ నంబర్లు అలాగే ఉంటాయి. పరీక్షా కేంద్రం మార్పును సూచించే సవరించిన హాల్ టికెట్లను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకోవాలి. -
ఎక్కడికైనా 'లేటే'..టైంకి వచ్చిందే లే!: ఇదేమైనా డిజార్డరా!
కొందరూ ఎక్కడకి వెళ్లలన్నా.. 'లేటే'. టైంకి రావడం అన్నది వారి డిక్షనరీలోనే లేదు అన్నట్లు ఉంటుంది వారి వ్యవహారం. ఇక వాళ్లకి లేట్ కామర్స్ అనే ముద్ర కూడా ఉంటుంది. పాపం వాళ్లు రావాలనుకున్నా.. రాలేరు. ఎందువల్లో గానీ వాళ్లకు తెలియకుండానే 'ఆలస్యం' అనేది వారి వెనుకే ఉందన్నట్లు ఉంటుంది వారి స్థితి. చూసేవాళ్లకు కూడా వాళ్లకి ఏమైనా జబ్బా? ఎందికిలా ప్రతిసారి లేటు అని విసుక్కుంటారు. అసలు ఇదేమైన వ్యాధా? మరేదైనానా.. వైద్య నిపుణులు ఏమంటున్నారంటే..ఇలాంటి స్థితిని 'సమయ అంధత్వం' అంటున్నారు. దీన్ని సమయపాలన లోపం లేదా సమయాన్ని సద్వినియోగం చేసుకోలేని విధానం అని అంటున్నారు. అంతేగాదు దీన్ని వైద్య పరిభాషలో 'శ్రద్ధ లేకపోవడం' లేదా 'హైపర్ యాక్టివిటీ' డిజార్డర్గా పేర్కొన్నారు. ఒకరకంగా మానసిక ఆరోగ్య సమస్యలాంటిదేనని చెబుతున్నారు. వారికి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచన లేకపోవడం, దీనికి శ్రద్ధ అనేది అస్సలు ఉండకపోవడం కారణంగానే వాళ్లు ఇలా దేనికైనా..లేటుగానే వస్తారని అన్నారు. ఆఫీస్ దగ్గర నుంచి వారు నిత్యం చేసే ప్రతిపనికి ఇలాంటి వ్యక్తులు ఆలస్యంగానే వెళ్తుంటారని పేర్కొన్నారు. దీంతో వీరు తరుచుగా వ్యక్తుల నిర్లక్ష్యానికి గురవ్వుతారు. స్నేహితులు, బంధువులు కూడా ఇలాంటి వ్యక్తులను దూరంగా ఉంచుతారు. ఇంటా, బయట వీరికి గౌరవం అనేదే ఉండదు. పాపం దీంతో వారు కూడా కాస్త అసహనానికి గురవ్వుతారు. అందుకోసం అని ఎంతలా ప్రయత్నించినా..చివరికి ఆలస్యమే అవ్వుతుంది. ఇలాంటి వ్యక్తులను ముందుగా 'లేటు' అనే పదాన్ని తొలగించుకోవాలని బలంగా అనుకోవాలి. అన్నిట్లకంటే ముందు ఆరోగ్య పరంగా హెల్తీగా ఉండాలి. సమయానికి నిద్రపోవాలి.. ఆ తర్వాత పని అని ఫిక్స్ అవ్వాలి. ఇందకోసం కొద్దిగా సాంకేతికతను వాడుకుంటూ సునాయాసంగా ఆ సమస్యను తొలగించుకోవచ్చు. అలారం పెట్టుకోవడం, ముఖ్యమైన అపాయింట్మెంట్లు, వెళ్లాల్సిన ప్రాంతాల గురించి వివరాలను ఓ పుస్తకంలో లేదా మొబైల్లోని రిమైండర్స్లో పొందుపరుచుకోవాలి. రోజు ఉదయం లేవగానే చేయాల్సినవి ఆ బుక్లో చూసుకుని తదనంతరం కార్యక్రమాలను ప్రారంభించాలి. యోగా వంటి వాటితో మనసుని ఎల్లప్పుడూ ఆహ్లాదంగా ఉంచుకోవాలి. ఏ పని పెండింగ్లో ఉండకుండా ప్రయత్నిస్తూ ఉంటే క్రమంగా ఆలస్యం అనే సమస్యను తేలిగ్గా జయించొచ్చు. అలాగే ఇలాంటి మానసిక సమస్యకు కొన్ని మాత్రలు కూడా ఉన్నాయని, వాటిని వైద్యుని పర్యవేక్షలో..వారి సలహాలు సూచనలు మేరకు వాడితే సాధ్యమైనంత తొందరగా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. (చదవండి: అలా చేయడం డైటింగ్ కాదు..ఈటింగ్ డిజార్డర్! అదోక మానసిక సమస్య) -
ఇంకా 23 శాతం రైళ్లు ఆలస్యమే!
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ రైల్వేను ఆధునికీకరిస్తున్న రైల్వే శాఖ.. కొన్ని రైళ్లు సకాలంలో గమ్యం చేరే విషయంలో మాత్రం మరింత దృస్టి సారించాల్సిన అవసరం కనిపిస్తోంది. ఇప్ప టికీ ఇంకా 23 శాతంమేర రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి. అయితే, గతంలో ఈ శాతం ఎక్కు వగా ఉండగా, ఇప్పుడు వీలైనంతమేర తగ్గించటంలో రైల్వే శాఖ విజయం సాధించిందనే చెప్పాలి. దాదాపు 76 శాతం రైళ్లు సకాలంలో గమ్యం చేరుతుండటమే దీనికి తార్కాణం. తాజాగా ఎన్ని రైళ్లు సకాలంలో చేరుతున్నాయి, ఎన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి అన్న విషయంలో దేశవ్యాప్త వివరాలను రైల్వే వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద ఆర్టీఐ కార్యకర్త ఇనగంటి రవికుమార్ కోరిన సమాచారాన్ని రైల్వే తాజాగా అందజేసింది. ఆ వివరాల ప్రకారం.. 2016 నుంచి ఈ సంవత్సరం సెప్టెంబర్ 23 వరకు దేశవ్యాప్తంగా రాజధాని, దురొంతో, శతాబ్ది, జనశ తాబ్ది ఎక్స్ప్రెస్, ప్యాసింజర్ రైళ్లు.. ఇలా కేటగిరీలు కలిపి 7689535 సర్వీసులు ఉండగా, 58,59,631 రైళ్లు సకాలంలో గమ్యం చేరాయి. 18,29,904 రైళ్లు మాత్రం ఆలస్యంగా గమ్యం చేరాయి. ప్యాసింజర్ రైళ్లే ఆలస్యం పేద, మధ్య తరగతి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణించే ప్యాసింజర్ రైళ్లలో 25.76 శాతం జాప్యం నమోదు కాగా, ధనికులు ఎక్కువగా ప్రయాణించే శతాబ్ది రైళ్లలో అతి తక్కువగా 12.45 శాతం మాత్రమే జాప్యం నమోదైంది. విచిత్రమేంటంటే రైల్వే శాఖ ఎంతో ప్రాధాన్యమిచ్చే రాజధాని సర్వీసుల్లో కూడా 25.65 శాతం జాప్యం నమోదైంది. దురొంతోలో 28.10 శాతం , జన శతాబ్దిలో 14.74 శాతం, సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో 19.05 శాతం మేర ఆలస్యంగా నడిచాయి. -
ఐఫోన్ 14 కొనుగోలు చేశారా? తాజా వార్నింగ్ ఏంటో తెలుసా?
న్యూఢిల్లీ: యాపిల్ లేటెస్ట్ ఐఫోన్ 14 కోసం ఎదురుచూస్తున్న కస్టమర్లకు సంస్థ బ్యాడ్ న్యూస్ చెప్పింది. ఐఫోన్ 14 మోడల్స్ (ఐఫోన్ 14 ప్రొ,ప్రో మ్యాక్స్) కొనుగోలు చేసిన వినియోగదారులకు మరికొంత కాలం వేచి ఉండాల్సి వస్తుందనే హెచ్చరికలను జారీచేసింది. కరోనా కారణంగా తమ వినియోగదారులకు ఐఫోన్ 14 డెలివరీ అనుకున్న దానికంటే ఆలస్యం కానుందని యాపిల్ తెలిపింది. ఇటీవల కోవిడ్ మళ్లీ విజృంభిస్తుండటం, ఆంక్షలతో ఉత్పత్తి ఆలస్యమవుతోందని వెల్లడించింది. చైనాలోని జెంగ్జౌలో కరోనా ఆంక్షలు అసెంబ్లింగ్ ప్లాంట్ను తాత్కాలింగా ప్రభావితం చేశాయని, ప్రస్తుతం చాలా తక్కువ సామర్థ్యంతో పనిచేస్తోందని వెల్లడించింది. అలాగే సప్లయ్ చెయిన్ కార్మికుల ఆరోగ్యం, భద్రకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఫలితంగా షిప్మెంట్స్ లేట్ అవుతున్నాయని తాజా ప్రకటనలో తెలిపింది. ముఖ్యంగా ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14ప్రో మ్యాక్స్ స్మార్ట్ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉందని తెలిపింది. (ఐఫోన్ లవర్స్కు గుడ్ న్యూస్: రూ.40 వేల భారీ డిస్కౌంట్) చైనాలో రానున్న ఇయర్ ఎండ్ హాలిడే సీజన్కు ముందు చాలావరకు ఎలక్ట్రానిక్స్ తయారీదారులు బిజీగా ఉంటారు. కానీ ఇదే సమయంలో కరోనా ఆంక్షలు అక్కడి ఉత్పత్తిపై తీవ్ర ప్రభావాన్ని చూపనుందని వ్యాపారవర్గాలు భావిస్తున్నాయి. సుమారు 2 లక్షలమంది ఉద్యోగులు పనిచేసే సెంట్రల్ చైనాలోని జెంగ్జౌ యాపిల్కు ఎంతో కీలకమైన ప్లాంట్లో తీవ్రమైన కోవిడ్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. చైనాలో కోవిడ్ నియంత్రణల కఠినతరంతో వచ్చే నెలలో ప్రపంచంలోని అతిపెద్ద ప్లాంట్లో ఐఫోన్ల ఉత్పత్తి 30శాతం క్షీణించనుందని రాయిటర్స్ గత నెలలో నివేదించింది. మార్కెట్ రీసెర్చ్ సంస్థ ట్రెండ్ఫోర్స్ గత వారం జెంగ్జౌ ప్లాంట్లో సమస్యల కారణంగా డిసెంబర్ త్రైమాసికంలో ఐఫోన్ షిప్మెంట్ల అంచనాను 80 మిలియన్ల నుండి 2-3 మిలియన్ యూనిట్లకు తగ్గించడం గమనార్హం. మరోవైపు అతిపెద్ద ఐఫోన్ తయారీదారు తైవాన్కు చెందిన ఫాక్స్కాన్, కరోనా నియంత్రణలతో దెబ్బతిన్న జెంగ్జౌ ప్లాంట్లో పూర్తి ఉత్పత్తిని తిరిగి ప్రారంభించడానికి కృషి చేస్తున్నట్లు సోమవారం తెలిపింది. -
దారుణం: భార్య ప్రాణం తీసిన సలాడ్..
లక్నో: భోజనంలో సలాడ్ అందించడం ఆలస్యమైందని భర్త తన భార్య దాడి చేసి హత్య చేయడమే కాకుండా కుమారుడిని తీవ్రంగా గాయపర్చిన ఘటన ఉత్తరప్రదేశ్లో కలకలం రేపింది. ఈ ఘటన షామ్లి జిల్లా గోగవన్ జలాల్పూర్లో చోటుచేసుకుంది. ఘటన జరిగిన అనంతరం నిందితుడు వెంటనే పరారయ్యాడు. ప్రస్తుతం అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. మురళి (45), సుదేశ్ భార్యాభర్తలు. రాత్రి భోజనంలో రోజు మాదిరిగా పండ్ల సలాడ్ అందిస్తుండేది. సోమవారం కూడా సలాడ్ పెట్టాలని భార్యను అడిగాడు. అయితే ఆమె వేరే పనిలో ఉండి సలాడ్ వడ్డించడంలో ఆలస్యమైంది. దీంతో ఆగ్రహానికి లోనైన మురళి భార్యతో గొడవపడ్డాడు. ఈ క్రమంలో క్షణికావేశానికి లోనైన మురళి వెంటనే అక్కడ కొడవలి తీసుకుని భార్యపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. అడ్డుకోబోయిన కుమారుడు తీవ్ర గాయాలపాలయ్యాడు. తేరుకున్న అనంతరం నిందితుడు మురళి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారం మేరకు సంఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించారు. రక్తపు మడుగులో ఉన్న సుదేశ్, ఆమె కుమారుడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందగా కుమారుడు చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. చదవండి: భార్య మృతి కేసులో ప్రముఖ యూట్యూబర్ అరెస్ట్ చదవండి: లాక్డౌన్తో పాన్ బ్రోకర్ దంపతులు ఆత్మహత్య -
కోడి కూర కోసం కొట్లాట.. దారుణ హత్య
సాక్షి, హైదరాబాద్ : నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ నిశ్చితార్థ వేడుకలో కోడి కూర కారణంగా రెండు వర్గాలు గొడవకు దిగాయి. ఈ సందర్భంగా చోటు చేసుకున్న కొట్లాటలో ఓ యువకుడు హత్యకు గురైయ్యాడు. చార్మినార్ హుస్సాయినీ అలమ్లోని ఓ పంక్షన్ హాల్లో సోమవారం ఓ నిశ్చితార్థ వేడుక జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో చికెన్ కర్రీ కోసం అతిథుల్లో కొందరు గొడవ చేశారు. ఆలస్యంగా కూరను వడ్డించారంటూ పెళ్లి వారితో వాగ్వాదానికి దిగారు. అనంతరం వాళ్లు బయటకు వెళ్లి మరో 15 మందిని వెంటపెట్టుకొచ్చి కత్తులతో పంక్షన్హాల్లో వీరంగం సృష్టించారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకోగా.. ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. గాయాలపాలైన మరో యువకుడిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. -
‘చుక్కలు’ చూపిస్తున్నారు..!
ఫై ఫోటోలోని రైతు పేరు కొల్లుబోయిన బాలమునెయ్య. ప్రొద్దుటూరు మండలం ఎర్రగుండ్లపల్లె. చాపాడు మండలంలోని తుమ్మలపాడులో 2.66 ఎకరాల పొలం ఉంది. 35ఏళ్ల క్రితం కొనుక్కున్న ఈ రైతుకు అప్పటినుంచి పాసుపుస్తకాలు ఉన్నాయి. గతేడాదిలో పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసమని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకోగా, నీ భూమి చుక్కల భూమి అని అనుమతివ్వటం కుదరదని చెప్పారు. తర్వాత చుక్కల భూములకు కూడా ప్రభుత్వం పాసుపుస్తకాలు ఇస్తారని చెప్పగా అర్జీ ఇచ్చి, ఏడాది నుంచి ఎదురుచూస్తున్నానని బాలమునెయ్య వాపోతున్నాడు. ఫై ఫోటోలోని రైతు పేరు మొగిలి రామ్మోహన్. చాపాడు మండలం పల్లవోలు గ్రామ సర్పంచ్. 3.58 ఎకరాల పొలం ఉంది. ఏడాది క్రితం వరకూ పాసుపుస్తకం ఉండేది. బ్యాంకులో రుణాలు కూడా తీసుకున్నారు. అయితే తర్వాత అది చుక్కల భూమి అని పాసుబుక్ చెల్లకుండా చేశారు. రుణం ఇవ్వలేదు. తర్వాత అధికారులు దరఖాస్తు చేసుకోండి పాసుపుస్తకం ఇస్తామని చెప్పగా, దరఖాస్తు చేసుకుని నెలలు గడుస్తున్న ఇప్పటివరకూ అతీగతీ లేదు. అధికారులు తీరుపై సర్పంచ్ రామ్మోహన్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదీ జిల్లాలో చుక్కల భూముల క్రమబద్ధీకరణ తీరు. వీరిద్దరే కాదు జిల్లావ్యాప్తంగా 3,910 మంది రైతులు అర్జీలు సమర్పిం చి, పరిష్కారం కాక కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అధికారుల తీరుతో అలసిపోతున్నారు. మామూళ్ల మత్తులో ఉన్న రెవెన్యూ అధికారులు సేవాధర్మాన్ని మరిచి అన్నదాతలను తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. కడప సెవెన్రోడ్స్/చాపాడు: ప్రభుత్వ చుక్కల భూములను సాగు చేసుకుంటున్న రైతుల పేరిట వాటిని బదలాయించడంలో రెవెన్యూ అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారు. రైతుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు జిల్లా అంతటా దుమారం రేపుతున్నాయి. పైసలు ముట్టనిదే తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లో ఫైళ్లు కదలడం లేదు. కాసులు ముట్టజెప్పకపోతే ఏదోఒక కొర్రీ వేసి ఫైళ్లను వెనక్కి పంపుతున్నారు. జిల్లాలో మొత్తం 38వేల ఎకరాల వరకు చుక్కల భూములున్నట్లు అధికారక అంచనా. అయితే ప్రభుత్వ వద్ద సరైన లెక్కలు లేవు. ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం చట్టాన్ని తీసుకొచ్చి 8 నెలలైంది. ఇప్పటివరకూ జిల్లాలో కేవలం ఒకే ఒక్క క్లైయిమ్ పరిష్కారం అయ్యిందంటే రెవె న్యూ అధికారుల పనితీరు ఎలా ఉందో అర్థం అవుతుంది. డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ(డీఎల్సీ) చైర్మన్ అయిన కలెక్టర్, జేసీ ఈ విషయంపై దృష్టిసారించకపోవడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదీ నేపథ్యం.. 1916లో రీసర్వే అండ్ సెటిల్మెంట్ ఆపరేషన్స్ జరిగాయి. కరువులు, భూమి శిస్తు అధికంగా ఉండటం వంటి పలు కారణాల వల్ల రైతులు భూములను బీళ్లుగా పెట్టుకోవాల్సి వచ్చింది. అనేకమంది గ్రామాల్లో లేకుండా వలసలు వెళ్లారు. ఈ పరిస్థితుల్లో భూములు ఎవరి అనుభవంలో ఉన్నాయో సెటిల్మెంట్ అధికారులకు సమాచారం లభించలేదు. దీంతో ఆయా సర్వేనంబర్లలో ఉన్న భూముల వద్ద రీసెటిల్మెంట్ రిజిస్టర్లలో డాట్స్ పెట్టారు. అంటే డాట్స్ ఉన్న భూములన్నీ ప్రభుత్వ భూములుగా పేర్కొన్నారు. ఈ భూములను నిషేధిత జాబితాలో చేర్చి ఆ వివరాలను రిజిస్ట్రేషన్ అధికారులకు పంపారు. అప్పటినుంచి వీటిని కొనడం, అమ్మడం చెల్లకుండా పోయింది. సెటిల్మెంట్ అధికారులకు ఆ తర్వాత తామే సాగుదారులమని పలువురు రైతులు ఆధారాలను సమర్పించారు. అప్పటికే ఆర్ఎస్ఆర్ ముద్రణ జరిగిపోయింది కనుక ఆ వివరాలను రిజిస్టర్ ఆఫ్ హోల్డిం గ్స్(ఆర్హెచ్)లలో నమోదు చేసి సబ్ రిజి స్ట్రార్ కార్యాలయాలకు పంపారు. చుక్కల భూములపై చాలా ఏళ్లుగా ప్రభుత్వాలకు, రైతులకు మధ్య న్యా యపోరాటం సాగింది. ఎట్టకేలకు ‘ది ఆంధ్రప్రదేశ్ డాటెడ్ ల్యాండ్స్(అప్డేషన్ ఇన్ రీసెటిల్మెంట్ రిజిస్టర్) యాక్టు 2017’ వచ్చింది. గత సంవత్స రం జూలై 17న ఇందుకు సంబంధించిన జీఓ 298 కూడా విడుదలైంది. క్లైయిమ్స్ పరిష్కారం ఇలా.. చుక్కల భూములను పన్నెండేళ్లుగా సాగుచేసుకుంటున్న రైతులు వాటిపై హక్కుల కోసం మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తుతోపాటు ఆర్ఎస్ఆర్, ఆర్హెచ్ నకలు, 1బీ రిజిస్టర్, అడంగళ్, రిజిస్ట్రేషన్ లింకు డాక్యుమెంట్లు వంటివి జత పరచాలి. మీసేవా ద్వారా క్లైయిమ్స్ అన్నీ నేరుగా సంబంధిత తహసీల్దార్ల లాగిన్లకు వెళ్తాయి. తహసీల్దార్ నోటీసులు జారీ చేసి ఆయా గ్రామాల్లో విచారణ నిర్వహించాల్సి ఉంటుంది. తహసీల్దార్లు తమ నివేదికను కలెక్టర్ చైర్మన్గా ఉండే జిల్లా స్థాయి కమిటీకి పంపాలి. రికార్డులన్నీ సక్రమంగా ఉంటే ఆ భూమిపై సంబంధిత రైతులకు డీఎల్సీ హక్కును కల్పిస్తుంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఉన్న నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తొలగించాలంటూ కలెక్టర్ ఆదేశాలు పంపుతారు. ఈ మొత్తం ప్రక్రియ ఆరునెలల్లో పూర్తిచేయాలని చట్టం స్పష్టం చేస్తోంది. జిల్లాలో పరిస్థితి ఇదీ! డాటెడ్ ల్యాండ్స్ చట్టం రావడంతో ఇన్నేళ్లకు తమ సమస్య పరిష్కారం అయ్యిం దని రైతులు ఎంతగానో సంబరపడ్డారు. మీసేవా కేంద్రాలకు క్యూ కట్టి దరఖాస్తులు సమర్పించారు. 2017 జూలై 17 నుంచి ఇప్పటివరకూ కడప రెవెన్యూ డివిజన్లో 1,839, జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్లో 1,630, రాజంపేట డివిజన్లో 442 వెరసి 3,911 క్లైయిమ్స్ వచ్చాయి. ఇందులో పులివెందుల మండలం కె. వెలమవారిపల్లెకు చెందిన బోరెడ్డి కాంతమ్మ అనే మహిళా రైతు క్లైయిమ్ మాత్రమే పరిష్కారమైంది. పరిష్కారానికి గడువు మీరని క్లైయిమ్స్ 3,743 ఉన్నాయి. గడువు మీరిన క్లైయిమ్స్ 5కాగా, 168 క్లైయిమ్స్ను కలెక్టర్ లాగిన్కు పంపారు. ఈ క్లైయిమ్స్ వివిధ దశల్లో ఉన్నప్పుడు ఆయా అధికారులకు మామూళ్లు ముట్టజెప్పనిదే పనులు జరగడం లేదని రైతులు వాపోతున్నారు. ప్రధానంగా ఆ రైతు సాగుబడిలోనే ఉంద ని ధ్రువీకరణ ఇచ్చేందుకు వీఆర్వోలు దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఎట్టకేలకు తహసీల్దార్ కార్యాలయ గడ ప దాటి కలెక్టర్ కార్యాలయానికి వెళ్లినా, ఆర్డీఓ రెకమెండేషన్స్ కావాలంటూ తిరిగి వాటిని వెనక్కి పంపుతున్నారు. దీంతో రైతులు మళ్లీ ఆర్డీఓ ఆఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పరిస్థితి దాపురించింది. మరి పరిష్కారం ఎప్పుడో? ఆర్డీఓల నివేదికల ఆధారంగా చర్యలు చుక్కల భూములపై రైతులకు హక్కులు కల్పించే విషయంలో ఆర్డీఓలు ఇచ్చే నివేదికల ఆధారంగానే జిల్లాస్థాయి కమిటీ నిర్ణయం తీసుకుంటుంది. రైతులు సమర్పించే అర్జీలపై తహసీల్లార్లు నివేదికలు ఇవ్వాలి. వాటిపై సంబంధిత ఆర్డీఓలు క్షేత్రాస్థాయి పరిశీలన నిర్వహించి డీఎల్సీకి నివేదిక ఇస్తే అలాంటి క్లెయిమ్స్ను పరిష్కరిస్తాం. ఇంతవరకు డీఎల్సీ వద్ద ఎలాంటి క్లెయిమ్స్ పెండింగ్లో లేవు. – బాబయ్య, జిల్లా రెవెన్యూ అధికారి, కడప -
ఇదీ చింతలపూడి..!
భూమంతా కోల్పోయారు ఈ రైతు పేరు అనపర్తి కృష్ణారావు. స్వగ్రామం పోచవరం. గోదావరికి చెంతనే ఈయనకి పొలం ఉంది. గతంలో తాడిపూడి ఎత్తిపోతల పథకంలో 1.10 ఎకరాల భూమి కోల్పోయారు. గూటాల ఎత్తిపోతల పథకంలో 15 సెంట్లు భూమి పోయింది. ఇంకా ఈ రైతుకు 2.54 ఎకరాల భూమి ఉంది. ఇప్పుడు చింతలపూడి పథకం వచ్చింది. మొదటి ఫేజ్లో ఇతని నుంచి 54 సెంట్ల భూమిని సేకరించారు. మళ్లీ ఇప్పుడు 2 ఎకరాల భూమి సర్వే చేసి రాళ్లు వేశారు. ఈయనకు ఉన్న భూమి మొత్తం ప్రభుత్వం లాగేసుకుంటోంది. గతంలో ఇదే భూమిని కుమార్తెకి కట్నంగా ఇచ్చారు. ఇప్పుడు భూమి పోయింది. ఏం చేయాలో పాలుపోవడం లేదని కృష్ణారావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా కృష్ణారావు ఒక్కరే కాదు, ఎంతో మంది రైతులు భూసేకరణలో భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. చింతలపూడి ఎత్తిపోతల వివరాలు కాలువ పొడవు 106 కిలోమీటర్లు పథకం లక్ష్యం 4.08 లక్షల ఎకరాలకు సాగునీరు ఖర్చు వివరాలు (రూ. కోట్లలో) ప్రాథమిక అంచనా వ్యయం : 1,701 సవరించిన అంచనాలతో : 4909.80 ఇప్పటివరకు చేసిన ఖర్చు : 804.82 భూసేకరణ వివరాలు (ఎకరాల్లో) అవసరమైన భూమి 22,962 రైతుల భూమి 13,403 సేకరించింది 8,815 అటవీ భూమి 9,559 సేకరించింది 1,282 కొవ్వూరు: మెట్ట ప్రాంత రైతుల సాగునీటి కష్టాలు తీర్చే చింతలపూడి ఎత్తిపోతల పథకంపై చంద్రబాబు సర్కారు శీతకన్ను వేసింది. రూ. 4,909.80 కోట్ల వ్యయం తో చేపట్టాల్సిన పథకానికి 2017–18 ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.90 కోట్లు మాత్రమే కేటాయించింది. మరో వైపు వచ్చే నవంబర్ నాటికి ఈ పథకం పూర్తి చేసి పొలాలకు నీళ్లిస్తామంటూ రైతుల్ని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. నాలుగేళ్ల కాలంలో పూర్తి కావాలని నిర్దేశించిన పథకం ఇప్పటికి ఎనిమిదేళ్లు పూర్తయినా నేటికీ ఓ కోలిక్కి రాలేదు. క్షేత్రస్థాయిలో చింతలపూడి ఎత్తిపోతల పథకం భూసేకరణ ప్రక్రియ ప్రహసనంగా మారింది. రైతులకు పరిహారం చెల్లింపుల్లో వ్యత్యాసాలు చూపుతున్నారు. రైతుల అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రభుత్వం మొండి వైఖరితో ముందుకు సాగుతోంది. భూసేకరణలో భాగంగా ఎంతోమంది చిన్న, సన్నకారు రైతులు పూర్తిగా భూములు కోల్పోయి రోడ్డున పడుతున్నారు. ఒక్కోచోట ఒక్కోరకం పరిహారం చెల్లించడాన్ని రైతులు తీవ్రంగా తప్పు బడుతున్నారు. రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్దేశించిన ఈ పథకం సామర్థ్యాన్ని 4.80 లక్షలకు పెంచారు. దీంతో నిర్మాణ వ్యయం రూ.1,701 కోట్లు నుంచి రూ.4909. 80 కోట్లకి పెరిగింది. భూసేకరణ కూడా 17,122 ఎకరాల నుంచి ఇప్పుడు 22,962 ఎకరాలకు పెరిగింది. ఇంత వరకు భూసేకరణ ప్రక్రియతో కలిపి రూ.804.82 కోట్లు విలువైన పనులు చేపట్టారు. భూసేకరణ నిమిత్తం రూ.209.86 కోట్లు, పనుల నిమిత్తం రూ.594.96 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో గత ప్రభుత్వ హయాంలో రూ.344 కోట్లు ఖర్చు చేయగా టీడీపీ నాలుగేళ్ల పాలనలో రూ.467.82 కోట్లు ఖర్చు చేశారు. ఎక్కడి పనులు అక్కడే ప్రస్తుతం ఈ పథకం పనులు నాలుగు ప్యాకేజీలుగా నడుస్తున్నాయి. మొదటి ప్యాకేజీలో మూడు పంపుహౌస్లు, లీడింగ్ ఛానల్ 0 నుంచి 13.22 కిలోమీటరు వరకు, మెయిన్ కెనాల్ 0–36 కిలోమీటరు వరకు డిస్ట్రిబ్యూటర్స్తో పాటు చేపడతారు. దీనిలో లీడింగ్ ఛానల్ 13.2 కిలో మీటర్లకి 8.3 కిలోమీటర్లు పనులు పూర్తి చేశారు. మెయిన్ కెనాల్ 36 కి.మీ.లకు గాను 27.6 కి.మీ. మేరకు పనులు చేశారు. ఈ పనులను నాలుగు కాంట్రాక్టు సంస్థలు చేస్తున్నాయి. మొదటి అంచనా ప్రకారం 110 స్ట్రక్చర్స్ నిర్మించాల్సి ఉండగా 24 నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిలో కొన్ని పూర్తయ్యాయి. మరో మూడు స్ట్రక్చర్లు నిర్మాణ దశలో ఉన్నాయి. వీటి సామర్థ్యం విస్తరిస్తున్న కాలువ సామర్ధ్యం మేరకు పెంచాల్సి ఉంది. ఇప్పుడు సామర్ధ్యం పెంచిన దృష్ట్యా లీడింగ్ ఛానల్లో 26, మొయిన్ కెనాల్లో 121 స్ట్రక్చర్స్ నిర్మాణం చేపట్టాల్సి ఉంది. రెండో ప్యాకేజీలో 36 కిలోమీటర్ నుంచి 68 కిలోమీటరు వరకు మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటర్లతో కలిపి తవ్వాల్సి ఉంది. ఈ ప్యాకేజీలో 32 కిలోమీటర్లకి గాను 28.875 కిలోమీటర్లు పనులు పూర్తి చేశారు. దీనిలో 83 స్ట్రక్చర్లకు గాను మూడు పురోగతిలో ఉన్నాయి. మూడో ప్యాకేజీ రూ.681.21 కోట్లతో పంప్ హౌస్లోను పెరిగిన సామర్థ్యం మేరకు డిస్చార్జీలను నిర్మించాల్సి ఉంది. నాలుగో ప్యాకేజీలో 68వ కిలోమీటరు నుంచి 106 కిలో మీటరు వరకు మెయిన్ కెనాల్, కొవ్వాడ, తమ్మిలేరు స్థిరీకరణ పనులు ఉన్నాయి. దీనిలో 85 స్ట్రక్చర్ల నిర్మించాల్సి ఉంది. వీటిలో ఏ ఒక్కటీ ప్రారంభం కాలేదు. రానున్న రోజుల్లో జల్లేరు జలశయం సామర్ధ్యం 8 టీఎంసీల నుంచి 20 టీఎంసీలకు పెంచనున్నారు. దీన్ని ఐదో ప్యాకేజీగా పరిగణిస్తారని అధికారులు చెబుతున్నారు. ప్రహసనంగా భూసేకరణ చింతలపూడి ఎత్తిపోతల పథకానికి మారిన అంచనా ప్రకారం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 22,962 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. దీనిలో అటవీశాఖకు చెందిన భూమి ఏకంగా 9,559 ఎకరాలుంది. ఇంత వరకు రైతుల నుంచి 8,815 ఎకరాల సేకరణ పూర్తికాగా ఇంకా 4,588 ఎకరాలు సేకరించాల్సి ఉంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అటవీ శాఖ కోల్పోతున్న భూములకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం వేరేచోట భూమి సూచించాల్సి ఉంది. దీనిలో భాగంగా ఇటీవలే విశాఖపట్నం జిల్లాలో 1,282 ఎకరాల (859 హెక్టార్లు) భూమిని అటవీ భూమిగా అభివృద్ధి పరచడానికి అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఫేజ్–1 క్లియరెన్స్ ఉత్తర్వులు ఇచ్చింది. ఇక్కడ అటవీ ప్రాంతంగా అభివృద్ధికి రూ.32 కోట్లు ఖర్చువుతుందని అంచనా వేశారు. ఇంకా 8,277 ఎకరాల అటవీ భూమికి ప్రత్యామ్నాయ భూములు చూపిస్తే తప్ప అటవీ భూముల్లో పనులు చేయడానికి వీలు ఉండదు. ఆరెకరాలకు తొంభై సెంట్లు మిగిలింది ఈయన పేరు కాకర్ల వెంకటేశ్వరరావు. తాళ్లపూడి మండలం పోచవరం గ్రామం. ఈయన ఒకప్పుడు 6.30 ఎకరాల రైతు. ఉన్న భూమంతా తాడిపూడి, చింతలపూడి ఎత్తిపోతల పథకాలకు ప్రభుత్వం తీసుకుంది. ఇప్పుడు కేవలం ముప్పై సెంట్లు మాత్రం మిగిలింది. తాడిపూడి పథకంలో ఎకరం పోయింది. చింతపూడి పథకం పేజ్–1లో 1.30 సెంట్లు, ఫేజ్–2 లో తాజాగా 3.10 ఎకరాలు పోతోంది. ఇక మిగిలింది కేవలం 90 సెంట్లు మాత్రమే. చింతలపూడి పథకం పేరుతో ఈ రైతు జీవితం తారుమారైంది. చింతలపూడి మొదటి విడతలో ఎకరాకు రూ.12.50 లక్షలు ఇస్తామని నమ్మించి అధికారులు రూ.8.35 లక్షలు చొప్పున ఇచ్చారు. రెండో విడతలో ఎకరాకి రూ.26.50 లక్షలు అన్నారు. మంత్రి రూ.28 లక్షలు ఇప్పిస్తామన్నారు. చివరికి ఎకరానికి రూ.23.74 లక్షల చొప్పున ఇచ్చారు. ఈ సొమ్ముతో మళ్లీ భూమి కొందా మంటే ఆ రేటుకు మార్కెట్లో పొలం అందుబాటులో లేదని ఆయన వాపోతున్నారు. 20 శాతం పనులు పూర్తి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు ఇరవై శాతం పూర్తయ్యాయి. పథకం విస్తరణ కారణంగా నీటి సామరŠాధ్యన్ని 15.5 టీఎంసీల నంచి 53.5 టీఎంసీలకు పెంచుతున్నారు. నీటి విడుదల రెండు వేల క్యూసెక్కుల నుంచి 6,875 క్యూసెక్కులకు పెరుగుతుంది. మొదటి విడతలో నిర్మించిన స్ట్రక్చర్లు సర్దుబాటు చేయడానికి వీలులేనివి ఉంటే తొలగిస్తాం. అటవీ భూములు ముందుగా కాలువ తవ్వకాలకు అవసరమైనవి ఇచ్చారు. రిజర్వాయర్ నిర్మాణం సమయంలో మరికొన్ని భూములు అవసరమవుతాయి. వాటిని కూడా సేకరిస్తాం. – డీఎస్ఎస్ శ్రీనివాసయాదవ్, ఎస్ఈ, చింతలపూడి ఎత్తిపోతల పథకం -
అందని సాయం..మానని గాయం
దాదాపు వంద రోజుల విచారణ, వందలాది మంది పెట్టుబడిదారుల ఆందోళన, ఇద్దరి ప్రాణార్పణ, రూ.187 కోట్ల స్వాహాపై ఇంకా కొనసాగుతున్న ఉత్కంఠ.. ఇదీ క్లుప్తంగా ట్రేడ్ బ్రోకర్ కేసు స్వరూపం. మూడు నెలల కిందట జిల్లాలో తీవ్ర ఉత్కంఠ రేపిన ఈ కేసు విచారణ ఇంకా ప్రాథమిక దశలోనే ఉంది. దీనిపై పెట్టుబడిదారులు అసంతృప్తిలో ఉన్నారు. సీఐడీ చేతికి కేసు వెళ్లినా విచారణలో పురోగతి కనిపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన నిందితుడికి బెయిల్ రావడాన్ని కూడా వారు స్వాగతించలేకపోతున్నారు. ఏ వైపు నుంచీ సాయం అందక, గుండెకు తగిలిన గాయం మానక బాధితులు నరకం చూస్తున్నారు. రాజాం: ట్రేడ్ బ్రోకర్ ఆన్లైన్ మోసం కేసు నీరుగారుతుందా..? బాధితులతో పాటు ఈ కే సును ఫాలో అవుతున్న వారి మెదళ్లను తొలిచేస్తున్న ప్రశ్న ఇది. సం తకవిటి మండలం మందరాడలో షేర్ మార్కెట్ పేరిట రూ.187 కోట్లకు ప్రజలను ముంచి వం ద రోజులు గడిచిపోయా యి. ఈ కేసు విచారణను మొదటి నుంచీ గమనిస్తు న్న వారిలో ఇప్పు డు జరుగుతున్న పరిణామాలు కొత్త అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మూడు నెలల కిందట ఈ ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. అంత పెద్ద మొత్తంలో మోసం జరిగిందా అంటూ ఆశ్చర్యపోయింది. ఇప్పుడు విచారణ చూసినా అదే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ప్రధా న నిందితునికి బెయిల్ రావడం, బాధితులు ఎంత మోసపోయారో ఇంకా గుర్తించకపోవడం, ఎంత రికవరీ చేశారో చెప్పకపోవడం వంటి అంశాలు అనుమానాలకు ఊతమిస్తున్నాయి. 900 మందికి పైగా బాధితులను, పెట్టుబడిదారులను నిలువునా ముంచినా కేసు విచారణ ఇంత నెమ్మదిగా సాగడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నవంబర్ 10న.. 2017, నవంబర్ 10వ తేదీన తాలాడ గ్రామంలో ట్రేడ్ బ్రోకర్ సిబ్బంది కార్యాలయానికి తాళా లు వేయడంతో సంచలనం ఏర్పడింది. టం కాల శ్రీరామ్ అనే పేరు ఓవర్ నైట్లో జిల్లా మొత్తం తెలిసిపోయింది. అప్పటి వరకు పెట్టుబడిదారులు అతని వద్ద రెండు మూడు కోట్లు ఉంటాయని మాత్రమే అనుకునేవారు. కానీ మోసం విలువ రూ.187 కోట్లని తెలిసి వారంతా ఆశ్చర్యపోయారు. శ్రీరామ్ కార్యాలయానికి తాళం పడడంతో బాధితులు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మొదట సంతకవిటి పోలీ స్ స్టేషన్లో బ్రోకర్ హామీల రూపంలో ఇచ్చిన చెక్లతో కేసులు పెట్టగా మొత్తం రూ.36 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టినట్లు తేలింది. అయితే అక్కడితో కథ ముగియలేదు. కొంతమంది కో ర్టును కూడా ఆశ్రయించారు. ఈ ఆధారాలతో నష్టపోయినవారి నగదు రూ. 50 కోట్లు వరకూ ఉంటుందనేది అంచనా. ఇవి కాకుండా కొంతమంది ఉద్యోగులు భయపడి కేసులు పెట్టలేదు. నవంబర్ 10న ట్రేడ్ బ్రోకర్ కార్యాలయానికి తాళాలు వేసిన అనంతరం చాలా మంది నిరుపేదలు మంచంపట్టారు. రూ. 25 లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టిన ఇద్దరు బాధితులు ఈ మోసాన్ని జీర్ణించుకోలేక మృతి చెందారు. ఏదీ పురోగతి? కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు పాలకొండ డీఎస్సీ జి. స్వరూప శరవేగంగా కేసును ముందుకు నడిపా రు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నా రు. కొంతమంది ఇచ్చిన ఫిర్యాదులు మేరకు బ్రోకర్ శ్రీరామ్తో పాటు మరో ఐదుగురిని అ రెస్టు చేశారు. దీనిపై కొందరు ఎస్పీ కార్యాల యం ఎదుట గగ్గోలు పెట్టినా పోలీసు అధికారులు పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత ఎందుకో విచారణలో స్పీడు తగ్గింది. మూడు నెలలుగా కేసులో పురోగతి ఏమీ కనిపించడం లేదు. ఇదంతా ఎవరి సొత్తు.. తాలాడ వద్ద హంగులతో నిర్మించిన ట్రేడ్ బ్రోకర్ కార్యాలయం, పక్కనే 25 ఎకరాల తోట సీఐడీ ఏం చేస్తోంది? నెలరోజుల కిందట విశాఖపట్నంకు చెందిన సీఐడీ అధికారులు కేసును తమ పరిధిలోకి తీసుకున్నారు. పలువురు ట్రేడ్ బ్రోకర్ ఉద్యోగులపై ఆరా తీశారు. ప్రత్యేక అనుమానితులను పిలు పించుకుని విచారణ చేపట్టారు. ఇదంతా జరిగి నెలరోజులు కావస్తున్నా అసలు విషయం ఇంతవరకూ బయటకు రాలేదు. ఈ మోసానికి ప్రధా న కారకులు ఒక్క శ్రీరామేనా, ఇంకెవరైనా ఉ న్నారా అన్నది ఇంతవరకూ వెల్లడికాలేదు. పె ట్టుబడిదారులు పెట్టిన పెట్టుబడులకు సంబం ధించి ఎంత రికవరీ అయ్యిందనేది పత్రికా పరంగా కూడా వెల్లడికాలేదు. అసలేం జరుగుతుందో తెలీని పరిస్థితి ఉందని పలువురు బాధితులు ఆరోపిస్తున్నారు. ఎక్కువ మంది తమ పి ల్లలకు వివాహాల కోసం, భవిష్యత్ ఉపయోగా ల కోసమే పెట్టుబడులు పెట్టారు. వీరంతా ప్రస్తుతం ఆందోళనలో ఉన్నారు. కొంతమంది మంచం పట్టారు. నీరు గారుతోందా? ప్రధాన నిందితునికి బెయిల్ రావడంపై బాధితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కేసులో పు రోగతి ఏమీ లేదని వారంటున్నారు. సీఐడీ కేసును తీసుకోవడంతో పెట్టుబడి వివరాలు తెలిసి, తమకు న్యాయం జరుగుతుందని, ఎం తో కొంత రికవరీ అవుతుందని ఆశ పడిన వా రంతా ప్రస్తుతం అయోమయంలో ఉన్నారు. అధికార పార్టీ నేతల హస్తం ఉందా? ట్రేడ్ బ్రోకర్ శ్రీరామ్ అధికార పార్టీ నేతలను కూడా ముంచినట్లు సమాచారం. పెట్టుబడులు ఎక్కువగా రాబట్టేందుకు అధికార పార్టీకి చెందిన నేతలను వినియోగించుకోవడంతో పాటు పలువురు నాయకుల నుంచి కూడా పెట్టుబడులు తీసుకుని ప్రస్తుతం వారికి కూడా ఎగనామం పెట్టినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ నేతలు శ్రీరామ్ను బయటకు వచ్చేవిధంగా ఏర్పాట్లు చేసి తాము నష్టపోయిన మొత్తంలో ఎంతో కొంత నగదును రికవరీ చేసుకునేం దుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు అంతా గోప్యంగా ఉండి, కేసుపై కదలికలు లేకుండా జాగ్రత్తలు వహిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ డబ్బు ఏమైనట్టు? బ్రోకర్ శ్రీరామ్ ఎంత డబ్బును పెట్టుబడి రూపంలో తీసుకున్నాడు? ప్రస్తుతం ఎంత ఉందనేది ఇంకా కొలిక్కిరాలేదు. పోలీసులు, సీఐడీ అధికారులు కూడా ఈ విషయాన్ని వెల్లడించడం లేదు. ప్రస్తుతం శ్రీరామ్ కుటుంబ సభ్యులు, బంధువులను, స్నేహితులను విచారిస్తున్నట్లు తెలిసింది. అయితే ఈ వివరాలు కూడా గోప్యంగా ఉన్నాయి. ఈ అక్రమ ఆస్తుల వివరాల కోసం ఎదురుచూస్తున్న బాధితులకు మాత్రం కళ్లు కాయలు కాస్తున్నాయి. ముమ్మర దర్యాప్తు ట్రేడ్ బ్రోకర్ కేసుకు సంబంధించి ముమ్మర దర్యాప్తు జరుగుతున్నట్లు విశాఖపట్నం సీఐడీ డీఎస్పీ ఎస్.నాగభూషణంనాయుడు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ఏ కోణంలో వి చారిస్తున్నామో, ఎవరెవరిని విచారిస్తున్నామన్నది గోప్యంగా ఉంచాల్సి ఉందని అన్నారు. త్వరలోనే బ్రోకర్ వద్ద పెట్టిన పెట్టుబడులతో పాటు అక్రమ ఆస్తులు వివరాలు వెల్లడించి ఉన్నతాధికారులకు నివేదించడంతో పాటు బాధితులకు న్యాయం చేస్తామని చెప్పారు. -
ఎంఎంటీఎస్ టూ...లేట్
ఘట్కేసర్ టౌన్: ఎంఎంటీఎస్ (మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్) సేవల విస్తరణలో భాగంగా రెండో దశలో శివారు ప్రాంతాలైన ఘట్కేసర్, మేడ్చల్ వరకు పొడగించాలని 2012లో ప్రతిపాదనలు చేసి 2013లో పనులను ప్రారంభించారు. మౌలాలి నుంచి ఘట్కేసర్ మధ్యన 12.20 కిలోమీటర్లు, బొల్లారం నుంచి మేడ్చల్కు 14 కిలోమీటర్ల దూరంలో ట్రాక్, విద్యుదీకరణ పనులు చేపట్టాలి. కేంద్ర ప్రభుత్వం 1/4, రాష్ట్ర ప్రభుత్వం 2/3 వంతు నిధులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గతంలో ఎంఎంటీఎస్ పనులను పరిశీలించడానికి ఘట్కేసర్కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్కుమార్ 2017 డిసెంబర్ నాటికి రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. కానీ ఇప్పటి వరకు పనులు పూర్తికాకపోవడం గమనార్హం. మరింత ఆలస్యం.. సుమారు రూ.130 కోట్లతో 12.2 కిలోమీటర్ల దూరంలో పలు చోట్ల చిన్న చిన్న వంతెనలు, ట్రాకు నిర్మించాలి. భూసేకరణలో ఇస్మాయిల్ఖాన్గూడ, యంనంపేట్ గ్రామాల్లో నష్టపరిహారం చెల్లింపు విషయంలో సమస్య తలెత్తడం, రైల్వే ప్రాజెక్టులకు18 శాతం జీఎస్టీని విధించడం సమస్యగా మారింది. పాత ప్రాజెక్టులకు పాత పన్నునే విధించాలని, పెంచిన జీఎస్టీ భారాన్ని మోయలేమని కాంట్రాక్లర్లు చేతులెత్తేసినట్లు సమాచారం. ట్రాకు నిర్మాణ పనులు, ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఫ్లాట్ఫారం, షెడ్లు, విద్యుదీకరణ పనులు నడుస్తుండటంతో మరో 5 నెలల సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది. నిరాశలో ప్రయాణికులు... ఎంఎంటీఎస్ రైళ్ల రాకతో తక్కువ సమయం, తక్కువ వ్యయంతో నగరానికి చేరుకోవచ్చని, స్టేషన్లు పెరిగి రవాణ సౌకర్యం మెరుగు పడుతుందని భావించిన విద్యార్థు«లు, ఉద్యోగులు, మధ్య తరగతి ప్రజలు నిరాశ చెంతుతున్నారు. రైళ్లు పెరిగితే ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని, ఎక్స్ప్రెస్ రైళ్లను నిలుపుతారని అనుకున్న వారి ఆశలు ఆవిరయ్యాయి. మండలంలో ఇన్ఫోసిస్, రహేజా తదితర అంతర్జాతీయ వ్యాపార సంస్థలు, వందలాది కాలనీలతో అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న ఘట్కేసర్ ఎంఎంటీఎస్ రాకతో మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. దీంతో ఎప్పుడెప్పుడా అని ఎంఎంటీఎస్ రైళ్ల రాక కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఫ్లాట్ ఫారం షెడ్డు నిర్మాణానికి వేసిన పిల్లర్లు అసంపూర్తిగా పుట్ ఓవర్ బ్రిడ్జి పనులు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి ఎంఎంటీఎస్ రాకతో రవాణ సౌకర్యం పెరుగుతుంది. డబ్బు, సమయం ఆదా అవుతుంది. మరికొన్ని రైళ్లు నిలపడంతో స్థానికులకు స్వయం ఉపాధి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం అభివృద్ధి చెందుతుంది. రైల్వే అ«ధికారులు స్పందించి ఎంఎంటీఎస్ పనులను పూర్తి చేయాలి. –పులికంటి రాజశేఖరెడ్డి, స్థానికుడు -
ఆలస్యంగా.. ఆఖరిచూపులు
పొట్టకూటికోసం దేశంకాని దేశానికి వెళ్లిన వలసజీవులు విగతజీవులుగా మారి స్వగ్రామానికి తిరిగి వస్తున్నారు. సౌదీ అరేబియాలో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలు ఆలస్యంగా రావడంతో వారి కుటుంబసభ్యులు కడసారిగా చూసి తల్లడిల్లిపోయారు. కష్టపడి నాలుగురాళ్లు సంపాదించుకుని వస్తారనుకుంటే ఇలా కానరాని లోకాలకు వెళ్లిపోయారా.. అంటూ వారు రోదించిన తీరు ప్రజలను కలిచివేసింది. హన్వాడ/గుండేడ్ (మహబూబ్నగర్): హన్వాడ మండలం నాగంబాయితండాకు చెందిన ఆంగోత్ శంకర్నాయక్(45) బతుకుదె రువు నిమిత్తం సౌదీఅరేబియాకు వెళ్లాడు. వెళ్లిన కొన్ని నెలలకు శంకర్ అకస్మాత్తుగా అస్వస్తతకు గురయ్యాడు. తోటి మిత్రులు సౌదీలోని రియాద్ ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యం అందిస్తుండగా అదే ఆస్పత్రిలో గత జనవరి 13న ప్రాణాలు విడిచాడు. అప్పటి నుంచి నేటి వరకు భార్యాపిల్లలు, బంధువులు కడసారి చూపుల కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూశారు. మృతదేహం కోసం భార్య గంగమ్మ పలుమార్లు కలెక్టర్ మొదలుకుని ఎమ్మెల్యే వరకు ప్రాధేయపడింది. ఫలితం దక్కకపోవడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతుండగా గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ వారు బాసటగా నిలిచారు. శంకర్ మృతదేహాన్ని రప్పించేందుకు జీబీడబ్ల్యూఎస్ వారిని ఆశ్రయించారు. ఇందుకోసం రూ.1.25లక్షల ఖర్చు అవుతుండగా వారే భరించి సౌదీ నుంచి ముంబాయికి, అటునుంచి హైదరాబాద్కు తెప్పిం చారు. మృతదేహాన్ని చూ సిన వెంటనే కుటుంబసభ్యులు ఒక్కసారిగా బోరుమన్నారు. బాధిత కుటుంబానికి ఆర్థికసాయం గ్లోబల్ బంజారా వెల్ఫేర్ సొసైటీ వారు బాధిత కుటుంబానికి రూ.62వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. ప్రభుత్వం కూడా ఆర్థికంగా ఆదుకోవాలని వెల్ఫేర్ ఇన్చార్జ్ డాక్టర్ ఎం.రవినాథ్ డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎస్సీ, ఎస్టీ రాష్ట్ర నూతన కమిషన్ సభ్యులు రాంబల్ నాయక్, చిలకమర్రి నర్సింహులు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వలసకూలికి అంత్యక్రియలు గండేడ్ మండలం షేక్పల్లి తండాకు చెందిన దేవిజానాయక్ (48) సౌదీ అరేబియాకు వలస వెళ్లి ఈనెల 13న మృతిచెందిన విషయం తెలిసిందే. ఆయన మృతదేహం 14 రోజుల అనంతరం స్వగ్రామానికి రాగా మంగళవారం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ శాంతీబాయి కుటుంబసభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం కుటంబాన్ని అన్నివిధాలుగా ఆదుకోవాలని కోరారు. -
ఆలస్యంగా నడుస్తున్న రైళ్లు
సాక్షి, భువనేశ్వర్: ఉత్తర భారత దేశంలో మంచు ప్రభావంతో రైళ్లు ఆలస్యంగా గమ్యం చేరుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రైళ్లు బయల్దేరే వేళల్ని సవరించి ఈస్ట్కోస్ట్ రైల్వే ఆలస్యంగా నడుపుతోంది. పూరీ నుంచి సోమవారం రాత్రి బయల్దేరాల్సిన 12801 పూరీ-న్యూఢిల్లీ పురుషోత్తం ఎక్స్ప్రెస్ మంగళవారం ఉదయం 7.15 గంటలకు బయల్దేరిందని ఈస్ట్కోస్ట్ రైల్వే ప్రకటించింది. ఈ నెల 2వ తేదీ (మంగళవారం) ఉదయం 10.55 గంటలకు బయల్దేరాల్సిన 12875 పూరీ-న్యూఢిల్లీ నీలాచల్ ఎక్స్ప్రెస్ రాత్రి 10 గంటలకు ఆలస్యంగా బయల్దేరుతుంది. సంబల్పూర్ నుంచి జమ్మూ-తావి ఎక్స్ప్రెస్ వేళను రీషెడ్యూల్ చేసి మంగళవారం మధ్యాహ్నం 3.55 గంటలకు ఆలస్యంగా నడిపిస్తున్నారు. -
ఇక ‘పునర్వసు’లోనే..
- మృగశిర కార్తెలో అందని నీరు - డెల్టాలో వరిసాగు.. జాగు - ‘ఆరుద్ర’ రాకతో నారుమళ్లలో మరింత జాప్యం - అదును దాటుతున్న ఖరీఫ్ - రబీకి తప్పని ఆలస్యం - మూడో పంట ప్రశ్నార్థకం అమలాపురం : డెల్టాలో ఏరువాకకు ఆరుద్ర కార్తె పెద్ద గుదిబండ. ఈ కాలంలో నారుమడులు వేస్తే.. తుపాన్ల సమయంలో పంట చేతికి వచ్చే అవకాశముంటుంది. ఒకవిధంగా చెప్పాలంటే ఇప్పుడు నారు వేయడమంటే గాలిలో దీపం పెట్టడమే. ఈ పరిస్థితుల్లో కుదిరితే మృగశిర.. లేదా తుపాన్లు దాటిన తరువాత పంట చేతికి వచ్చేలా పునర్వసు కార్తెలో నారుమడులు వేయడం ఖరీఫ్ సాగు చేసే డెల్టా రైతులకు పరిపాటి. అయితే, ఈ ఏడాది కూడా మృగశిర కార్తెలో నీరందించకపోవడంతో ఎప్పటిలానే ‘పునర్వసు’లో నారు వేసేందుకు ఖరీఫ్ రైతులు సిద్ధమవుతున్నారు. దీంతో ఈ ఏడాది కూడా గోదావరి డెల్టాలో ఖరీఫ్ సాగు ఆలస్యం కానుంది. ముందస్తు ఖరీఫ్కు షెడ్యూలుకంటే ముందే నీరంటూ రైతులను ఊరించిన ప్రభుత్వ పెద్దలు.. ఎప్పటిలానే పొలాలకు సాగునీరు ఆలస్యంగా విడుదల చేశారు. ఫలితంగా ఖరీఫ్ వరి సాగులో జాప్యం జరుగుతోంది. జూన్ ఒకటిన సాగునీరు విడుదల చేసినా.. ఆధునికీకరణ, నీరు - చెట్టు అంటూ కాలువలకు అడ్డుకట్ట వేస్తూ 20వ తేదీ వరకూ పొలాలకు నీరందకుండా చేశారు. ఈ కారణంగా డెల్టాలో నారుమడులు ఆలస్యమవుతున్నాయి. తూర్పు, మధ్య డెల్టాల్లో 4.80 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందన్నది అధికారుల లెక్కలు కాగా, ఇప్పటివరకు 70 శాతం పొలాల్లో కూడా నారుమడులు వేయలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మృగశిర కార్తె గత నెల 21 వరకూ ఉన్నా ఆ సమయంలో నీరందకపోవడంతో రైతులు నారుమడులు వేయలేకపోయారు. 22 నుంచి ఆరుద్ర కార్తె మొదలైంది. ఈ నెల ఏడు వరకూ ఇది ఉంటుంది. అయితే, ఐదు నెలల పంటకాలం కావడంవల్ల.. ఈ సమయంలో నారుమడులు వేస్తే అక్టోబరు నెలాఖరు నుంచి నవంబరు 15 మధ్యన పంట చేతికి వచ్చే అవకాశముంది. కానీ, ఆ సమయంలోనే ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి. తుపాన్లు వస్తుంటాయి. ఫలితంగా ఆ సమయంలో పంట నష్టపోవడం డెల్టాలోని శివారు రైతులకు పరిపాటిగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని పునర్వసు మొదలైన తరువాత అంటే ఈ నెల రెండో వారం తరువాతే రైతులు నారుమడులు వేయనున్నారు. అదే కనుక జరిగితే జూలై నెలాఖరు, ఆగస్టు మొదటి వారంలో కూడా ఖరీఫ్ నాట్లు పడే అవకాశముంటుంది. దీనివల్ల ఎప్పటిలాగానే రబీ సాగు ఆలస్యం కానుంది. దీంతో షరా మామూలుగానే మూడో పంట అపరాలు సాగు చేసే అవకాశం రైతులకు లేకుండా పోనుంది. శివారులో మరింత ఆలస్యం - తూర్పు డెల్టా పరిధిలోని రామచంద్రపురం నియోజకవర్గంలో సాధారణ సాగు విస్తీర్ణం 58 వేల ఎకరాలు కాగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు. ఇక్కడ జూలై నెలాఖరు, ఆగస్టులో నాట్లు పడే అవకాశముంది. - సామర్లకోట గోదావరి కాలువ మీద సామర్లకోట మండలంలో 20 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, 20 శాతం మాత్రమే నారుమడులు వేశారు. - కరప, కాకినాడ రూరల్ మండలాల్లో 28,700 ఎకరాల ఆయకట్టు ఉండగా, సుమారు 40 శాతం ఆయకట్టులో మాత్రమే నారుమడులు వేశారు. - మధ్య డెల్టాలో వ్యవసాయ సబ్ డివిజన్లవారీగా చూస్తే పి.గన్నవరంలో 14,900 ఎకరాలకుగాను 70 శాతం, అమలాపురం 42 వేల ఎకరాలకుగాను 30 శాతం, ముమ్మిడివరం 23,500 ఎకరాలకుగాను 25 శాతం, రాజోలు 17 వేల ఎకరాలకుగాను 10 శాతం కూడా నారుమడులు పడలేదు. రాజోలు సబ్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో రైతులు సాగు చేస్తారనే నమ్మకం కలగడం లేదు. దీనికితోడు నారుమడులు వేసిన శివారు ప్రాంతాల్లో కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నారు నీట మునిగిన విషయం తెలిసిందే. ముంపునీరు దిగే అవకాశం లేదని ఇక్కడ రైతులు పంట విరామానికి మొగ్గు చూపుతున్నారు. వీటన్నింటి నేపథ్యంలో ఈ ఏడాది డెల్టాలో ఖరీఫ్ సాగు ఆరంభంలోనే ఒడుదొడుకులకు లోనవుతోంది. ఎగువన కొంతవేగం - తూర్పు డెల్టాలోని అనపర్తి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో 48 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇప్పుడిప్పుడే నాట్లు ఆరంభించారు. అది కూడా మొత్తం ఆయకట్టులో 10 శాతమే. ఇక్కడ సుమారు 80 శాతం నారుమడులు పడ్డాయి. బోర్ల కింద నారు వేసిన రైతులు మాత్రమే నాట్లు వేస్తున్నారు. - ఆలమూరు సబ్ డివిజన్ పరిధిలో 38 వేల ఎకరాలు కాగా, ఇక్కడ కూడా 80 శాతం నారుమడులు పడ్డాయి. నాట్లు 15 శాతం మాత్రమే అయ్యాయి. - మధ్య డెల్టాలోని కొత్తపేట సబ్ డివిజన్లో సుమారు 30 వేల ఎకరాల ఆయకట్టు ఉండగా, ఇక్కడ ఆత్రేయపురం మండలంలో మాత్రమే కొంతవరకూ నాట్లు పడుతున్నాయి. మొత్తం నియోజకవర్గంలో ఐదు శాతం నాట్లు కూడా పడలేదన్నది అంచనా. నారుమడులు కూడా 40 శాతం మాత్రమే పడ్డాయి. -
తెగిపడిన రైల్వే సిగ్నల్స్ తీగలు
నిడదవోలు : తాడేపల్లిగూడెం మండలం నవాబ్పాలెం వద్ద రైల్వే సిగ్నల్ తీగలు తెగిపడటంతో శనివారం ప్రధాన రైళ్లు పది నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. నవాబ్పాలెం వద్ద ఎర్ర కాలువ ఆధునికీకరణ పనులు చేస్తుండగా రైల్వే సిగ్నల్ వ్యవస్థకు చెందిన టెలిఫోన్ తీగలకు పొక్లెయిన్ తగలడంతో తెగిపడ్డాయి. దీంతో సిగ్నల్ వ్యవస్థకు అంతరాయం ఏర్పడింది. రైల్వే అధికారులు డ్రైవర్లకు ఎల్సీసీ ఇచ్చి మ్యానువల్ పద్ధతితో రైళ్ల రాకపోకలకు క్లియరెన్స ఇచ్చారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు రైల్వే సిగ్నల్ వ్యవస్థ సిబ్బంది అక్కడకు చేరుకుని లైన్లను పునరుద్ధరించారు. ఈ సమయంలో విశాఖపట్నం నుంచి విజయవాడ వైపునకు వెళ్లే రైళ్లను నిడదవోలు స్టేషన్లో నిలిపివేసి డ్రైవర్లకు లైన్ క్లియర్ సర్టిఫికెట్ను (ఎల్సీసీ)ని అందచేసి రాకపోకలకు ఇబ్బంది లేకుండా చేశారు. విజయవాడ వైపు నుంచి విశాఖ వైపు వెళ్లే రైళ్లకు నవాబ్పాలెం స్టేషన్లో ఎల్సీసీలను ఇచ్చి రాకపోకలు సాగిం చారు. దీంతో రత్నాచల్, ప్రశాంతి, బొకారో, జన్మభూమి ఎక్స్ప్రెస్లతో పాటు పాసింజర్ రైళ్లు పది నిమిషాలు ఆలస్యంగా నడిచాయి. -
ఆలస్యంగా నడిచిన విమానాలు
విమానాశ్రయం (గన్నవరం) : దట్టమైన పొగమంచు కారణంగా మంగళవారం గన్నవరం ఎయిర్పోర్టులో విమానాల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఉదయం 10 గంటల వరకు ఎయిర్పోర్టు పరిసరాలను పొగమంచు కమ్మేసింది. రన్వే కనిపించకపోవడంతో పలు విమానాలు ఆలస్యంగా నడిచాయి. ఉదయం 7.30 గంటలకు ఇక్కడి నుంచి బెంగళూరు వెళ్లాల్సిన ఎయిర్కోస్టా విమానం 10 గంటలకు బయలుదేరింది. ఉదయం 8.45 గంటలకు న్యూఢిల్లీ నుంచి రావాల్సిన ఎయిరిండియా విమానం 10.10 గంటలకు చేరుకుంది. ఈ విమానానికి రన్వే క్లియరెన్స్ రాక సుమారు పది నిమిషాలు గాలిలో చక్కర్లు కొట్టి 10.20కు రన్వేపై దిగింది. హైదరాబాద్ నుంచి ఉదయం 9.15 గంటలకు రావాల్సిన స్పైస్జెట్ విమానం 11.10 గంటలకు వచ్చింది. హైదరాబాద్ నుంచి 9.30 గంటలకు రావాల్సిన ఎయిరిండియా ఏటీఆర్ విమానం 11.30కి చేరుకుంది. విమానాలు సుమారు రెండు నుంచి రెండున్న గంటల ఆలస్యంగా నడవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రన్వేపై దట్టమైన పొగమంచు ఉండడం కారణంగా విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఎయిర్పోర్ట్స్ అథారిటీ అధికారులు తెలిపారు. సాయంత్ర విమాన సర్వీసులు కూడా సుమారు గంట పాటు ఆలస్యంగా నడిచాయి. -
ఆలస్యంగా నడుస్తున్న చెన్నై ఎగ్మోర్ రైలు
కర్నూలు(రాజ్విహార్): చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్ రైలు (నంబర్ 17652) ఆలస్యంగా నడుస్తోంది. వర్దా తుపాన్ నేపథ్యంలో రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు మంగళవారం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే బుధవారం నిర్వాహణ పనుల కారణంగా ఎనిమిది గంటల పాటు ఆలస్యంగా నడుస్తోంది. కాచిగూడలో సాయంత్రం 4:30గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు అర్ధరాత్రి 12:30 బయలుదేరి కర్నూలుకు ప్రతి రోజు రాత్రి తెల్లవారుజామున 4:30 గంటలకు వచ్చి వెళ్తుందని రైల్వే అధికారులు పేర్కొన్నారు. -
జీజీహెచ్లో ‘జనన’ పత్రాలకు తంటా
* జనన ధ్రువపత్రాల జారీలో నిర్లక్ష్య ధోరణి * ప్రచారం ఘనం.. అమలు శూన్యం * జీజీహెచ్ అధికారుల తీరుపై విమర్శల వెల్లువ బిడ్డ పుట్టిన 24 గంటల్లో ఆధార్ ఎన్రోల్మెంట్, జనన సర్టిఫికెట్ జారీ అంటూ ఒక పక్క ప్రచారాలతో ఊదరగొడుతున్నా.. అమలు విషయంలో మాత్రం లబ్ధిదారులకు వీటి కోసం నెలల తరబడి పడిగాపులు తప్పుడం లేదు. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యం రోగులకు శాపంగా మారింది. గుంటూరు మెడికల్: గుంటూరు నగరంలోని అమరావతిరోడ్డుకు చెందిన ముక్కా రాజేశ్వరి సెప్టెంబర్ 21న జీజీహెచ్లో ఆడపిల్లకు జన్మనిచ్చింది. ఆమె ఇంటికి వెళుతున్న సమయంలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం, ఆధార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్లను ఆసుపత్రి అధికారులు ఇవ్వకపోవడంతో శనివారం ఆమె సోదరుడు కల్లవరపు రాజేంద్ర సర్టిఫికెట్ కోసం ఆసుపత్రికి వచ్చాడు. ఆసుపత్రిలోని జనన, మరణ రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించగా.. పుట్టిన తేదీ సర్టిఫికెట్ అందజేసి, ఆధార్ ఎన్రోల్మెంట్ సర్టిఫికెట్ను బయట చేయించుకోవాలని చెప్పి చేతులు దులుపుకున్నారు. అదే విధంగా రాజేంద్రనగర్కు చెందిన కట్టమూరి కృష్ణమూర్తి సెప్టెంబర్ 1న జీజీహెచ్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. అతని మరణ ధృవీకరణ పత్రాన్ని తక్షణమే ఇవ్వాల్సి ఉండగా, సంబంధిత సిబ్బంది, అధికారులు ఇవ్వకపోవడంతో శనివారం కృష్ణమూర్తి కుటుంబసభ్యులు సర్టిఫికెట్ కోసం ఆసుపత్రికి వచ్చారు. నెలరోజులు అయినప్పటికీ మరణ ధృవీకరణ పత్రాన్ని సిద్ధం చేయలేదు. పైగా దరఖాస్తు చేసుకుని నెలరోజుల తరువాత వస్తే అందిస్తామని చెప్పడంతో సిబ్బంది తీరును విమర్శిస్తూ కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. ఇలా ప్రతిరోజూ గుంటూరు జీజీహెచ్లో జనన, మరణ ధృవీకరణ పత్రాల కోసం లబ్ధిదారులకు పడిగాపులు తప్పడం లేదు. రోల్ మోడల్ ఆస్పత్రిలోనే... రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు జీజీహెచ్ను రోల్మోడల్గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం మే 1 నుంచి జిల్లా వ్యాప్తంగా ఆన్లైన్ సర్టిఫికెట్ల కార్యక్రమాన్ని జీజీహెచ్లో లాంచనంగా ప్రారంభించింది. ఆసుపత్రిలో పుట్టిన 24 గంటల వ్యవధిలో పుట్టిన తేదీ ధృవీకరణ పత్రంతోపాటు, ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబరును కూడా లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. కానీ జీజీహెచ్లో కాన్పు జరిగి ఇంటికి వెళ్లిన తరువాత వారంరోజులు ఆగి వస్తే సర్టిఫికెట్ ఇస్తామంటూ బాలింతలను, వారి కుటుంబ సభ్యులను సంబంధిత సిబ్బంది అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆధార్ ఎన్రోల్మెంట్ బయటేనంటా..! పుట్టిన తేదీ సర్టిఫికెట్లలో ఆధార్ ఎన్రోల్మెంట్ ఇవ్వకుండా బయట చేయించుకోవాల్సిందేనంటూ పంపించి వేస్తున్నారు. మరణ ధృవీకరణ పత్రాల మంజూరు కూడా ఆలస్యంగానే జరుగుతోంది. గత నెలలో మరణిస్తే, ధృవీకరణ పత్రం నెలరోజులు గడిచినా ఇవ్వడం లేదని కొందరు ఆందోళన కూడా చేశారు. అయినప్పటికీ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది 24 గంటల్లో మంజూరు చేయాల్సిన సర్టిఫికెట్లు మంజూరు చేయకుండా కాలయాపన చేస్తుండటంతో ప్రజలకు ఇబ్బంది తప్పడం లేదు. ఉన్నతాధికారులు ఈ విషయంపై దృష్టి సారించి సకాలంలో సర్టిఫికెట్లు మంజూరు అయ్యేలా చూడాలని బాధితులు కోరుతున్నారు. -
తల్లడిల్లుతున్న తల్లులు
* గుంటూరు జీజీహెచ్లో ఇదీ పరిస్థితి * ఎంసీహెచ్కు సీఎం శంకుస్థాపన రాయి వేసి ఏడాది * పునాదులు కూడా తీయని వైనం * అష్టకష్టాలు పడుతున్న బాలింతలు ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే..’ చందాన ఉంది గుంటూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ వార్డు పరిస్థితి. సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాతా, శిశు ఆరోగ్య సంరక్షణ వార్డు (ఎంసీహెచ్) నిర్మాణానికి శిలాఫలకం వేసి ఆదివారంతో ఏడాది పూర్తయింది. సంవత్సరంలోగా భవన నిర్మాణం పూర్తిచేసి మెరుగైన వైద్యసేవలను అందించాలని ఆరోజు ముఖ్యమంత్రి వైద్యాధికారులు, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. అయినా నేటికి పునాదులు కూడా తీయలేదు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రికి వచ్చే గర్భిణీలు, చిన్నారులకు సరిపడా పడకలు లేక ప్రతిరోజూ వారు పడుతున్న కష్టాలు నిత్యం కనిపిస్తూనే ఉన్నాయి. వారి కష్టాలను తీర్చి సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు అందించేందుకు ప్రభుత్వం ఎంసీహెచ్ వార్డు నిర్మాణం కోసం రూ. 20 కోట్లు 2014లో విడుదల చేసింది. తల్లి, బిడ్డకు స్పెషాలిటీ వైద్యసేవలు.. జీజీహెచ్లో గర్భిణీలు, చిన్నారులు వైద్యం పొందేందుకు సరిపడా మంచాలు లేకపోవడంతో ఒకే పడకపై ఇద్దరు లేదా ముగ్గురు వైద్యం పొందాల్సిన దుస్థితి ప్రస్తుతం నెలకొంది. సాధారణ కాన్పు, ఆపరేషన్ అనంతరం పడకలు లేక కొన్నిసార్లు కటిక నేలపైనే బాలింతలు ఉండాల్సి వస్తోంది. చిన్నపిల్లలది కూడా అదే పరిస్థితి. ఈ దీనావస్థపై ‘సాక్షి’లో కథనాలు కూడా ప్రచురితమయ్యాయి. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించి 200 పడకలతో తల్లి, బిడ్డలకు మెరుగైన వైద్యం అందించేందుకు ప్రత్యేక వార్డు నిర్మించేందుకు నిధులను విడుదల చేస్తూ జీవో విడుదల చేసింది. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న కుటుంబ నియంత్రణ విభాగం, గైనకాలజీ వైద్య విభాగం తొలగించి ఆ ప్రదేశంలో ఎంసీహెచ్ వార్డు నిర్మించాలని నిర్ణయించారు. పోస్టు ఆపరేటివ్ వార్డు, ప్రీ ఆపరేటివ్ వార్డు, ఆపరేషన్ థియేటర్, ఎన్ఐసీయూ, ల్యాబ్, డిస్పెన్సరీ, డెలివరీ సూట్స్, తల్లులు వేచి ఉండే గది అన్నీ కూడా ఒకే భవనంలో నిర్మాణం పూర్తయితే అందుబాటులోకి వస్తాయి. ఒకేచోట అన్ని వైద్యసౌకర్యాలు ఉండడం ద్వారా తల్లికి, బిడ్డకు మెరుగైన వైద్యసేవలు అందుతాయి. భవన తొలగింపునకే ఏడాది.. ఆస్పత్రిలో ఎంసీహెచ్ వార్డును నిర్మించేందుకు ప్రస్తుతం ఉన్న పాత భవనాలను తొలగించేందుకు ఆస్పత్రి అధికారులు, ఇంజినీరింగ్ అధికారులకు ఏడాది సమయం పట్టింది. నిధులు విడుదల చేసి మూడేళ్లవుతున్నా సంబంధిత అధికారులు సకాలంలో భవన నిర్మాణం చేసేందుకు ఎందుకు శ్రద్ధ చూపించడం లేదో అర్ధంకావడం లేదు. మరోవైపు రెండేళ్లుగా ఆస్పత్రికి కాన్పుల కోసం వస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. నెలకు వెయ్యి వరకు డెలివరీలు జరుగుతుండడంతో ఒక్కో పడకపై ఇద్దరు లేదా ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. ఒకవైపు ఆపరేషన్ కాన్పు నొప్పులు, మరోవైపు కనీసం మంచం కూడా సరిపడక అవస్థలు పడుతున్నారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి సకాలంలో ఎంసీహెచ్ వార్డు భవన నిర్మాణం పూర్తయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. -
మో‘డల్’ స్కూళ్లు
– బాలారిష్టాల్లో వసతి గహాల ఏర్పాటు – ఏళ్లుగా సాగుతున్న నిర్మాణాలు – ప్రిన్సిపాళ్లు, పీజీటీ, టీజీటీ పోస్టులు ఖాళీలతో విద్యార్థుల ఇక్కట్లు – 172 టీచర్ పోస్టులు ఖాళీ – వివిధ తరగతుల్లో 3,532 సీట్లు ఖాళీ అనంతపురం ఎడ్యుకేషన్ : ఇది గార్లదిన్నెలోని మోడల్ స్కూల్లోని తరగతి గది నిర్మాణం. 2013లో అప్పటి రాష్ట్ర ప్రాథమికశాఖ మంత్రి శైలజానాథ్ ఈ స్కూల్ను ప్రారంభించారు. నాటి నుంచి ఇప్పటి దాకా నిర్మాణం జరుగుతూనే ఉంది. బాల, బాలికలకు మరుగుదొడ్లు, రెండో తరగతి గదుల నిర్మాణం పూర్తి కాలేదు. జిల్లాలోని అన్ని మోడల్ స్కూళ్ల పరిస్థితి ఇలానే ఉంది. 2012–13 విద్యా సంవత్సరంలో ప్రతి మండలంలోనూ ఓ మోడల్ స్కూల్ను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. పరిస్థితులు అనుకూలించకపోవడంతో 2013–14లో తొలివిడతగా కేవలం 25 మండలాల్లో స్కూళ్లు ప్రారంభించారు. ఇవి కూడా పూర్తిగా నిర్మాణాలకు నోచుకోలేదు. సౌకర్యాలు కరువు.. హాస్టల్ సదుపాయం ఉంటుందని చెప్పడంతో గ్రామీణ విద్యార్థులు పోటీలు పడి దరఖాస్తులు చేసుకున్నారు. తీరా స్కూళ్లు ప్రారంభమయ్యే నాటికి రెసిడెన్షియల్ విషయంలో చేతులెత్తేశారు. ఆ తర్వాత విద్యార్థినులకు మాత్రమే వసతి కల్పిస్తామని ప్రకటించారు. అది కూడా అమలు కాలేదు. తాజాగా ఈ విద్యా సంవత్సరం నుంచి 9, 10, 11, 12 తరగతుల విద్యార్థినులకు హాస్టల్ వసతి కల్పిస్తామని చెప్పిన అధికారులు భవన నిర్మాణాలు పూర్తి కాలేదని చేతులెత్తేశారు. తగ్గుతోన్న విద్యార్థుల సంఖ్య ఆంగ్లమాధ్యమంతో పాటు రెసిడెన్షియల్ వసతి కల్పిస్తామని ప్రకటించడంతో స్కూళ్లలో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు ఎగబడ్డారు. ఎమ్మెల్యే, మంత్రులు, చివరకు కేంద్రమంత్రులు కూడా సీటు కోసం సిఫార్సులు చేశారు. ఏడాదికేడాది స్కూళ్లకు ఆదరణ తగ్గుతూ వచ్చింది. వసతి లేమి, ఉపాధ్యాయుల కొరత కారణంగా తల్లిదండ్రులు అయిష్టత చూపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 25æ స్కూళ్లలో విద్యార్థుల సీట్లు 3,532 ఖాళీగా ఉన్నాయి. ప్రిన్సిపాళ్ల పోస్టులు 19, పీజీటీ 96, టీజీటీ 57 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ––––––––––––––––––––––––– అక్టోబర్ పూర్తవుతాయి నిర్మాణాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమే. ఈ నెల 1 నుంచి విద్యార్థినులకు వసతిగహాలు ప్రారంభించాల్సి ఉన్నా చాలాచోట్ల నిర్మాణాలు జరగక పెండింగ్ పడింది. అక్టోబర్ నాటికి వసతి గహాలు ప్రారంభించేందుకు కసరత్తు జరుగుతోంది. పూర్తిస్థాయిలో హాస్టల్ వసతి కల్పిస్తే ఈ స్కూళ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. – శ్రీరాములు, అసిస్టెంట్ డైరెక్టర్ మోడల్ స్కూల్స్
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
డ్రాపౌట్స్ నివారణకు చర్యలు
రాజీవ్ గాంధీకి ఘనంగా నివాళులు
రాష్ట్రానికి భారీ వర్ష సూచన
ఓటు ప్రజాస్వామ్యానికి బలం
అమలాభట్టలో న్యాయ సచేతన శిబిరం
మిగులు సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు
ఓట్ల లెక్కింపు కేంద్రం పరిశీలన
నలుగురు బీజేడీ ఎమ్మెల్యేలకు అనర్హత తాఖీదులు
భక్తులకు పండ్లు వితరణ
రెండు బైక్లు ఢీ.. ఇద్దరికి గాయాలు
తప్పక చదవండి
- ఏఎంసీ.. నో ఏసీ!.. ఇచ్చట ఎవరి ఫ్యాన్లు వారే తెచ్చుకోవలెను
- రెప్పపాటులోనే మృత్యు ఒడికి
- వారణాసిలో వార్ వన్ సైడే
- ఎమ్మెల్సీ కవితపై చార్జిషీటు
- ఆక్వాలో అగ్రగామిగా ఏపీ
- సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అరెస్ట్
- చైనా గ్యాంగ్ చెరలో భారతీయులు
- ఐఏఎస్లే ఇన్చార్జులు.. 10 యూనివర్సిటీలకు వీసీలుగా నియమించిన ప్రభుత్వం
- దారి మళ్లనున్న తుపాను!
- పాపం రాహుల్ త్రిపాఠి.. షాక్లో కావ్య మారన్! వీడియో వైరల్
Advertisement