-
కాల్పుల్లో టీఎంసీ నేత మృతి.. మూక దాడిలో నిందితుడు హతం
జోయ్నగర్: పశి్చమబెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా జోయ్నగర్లో సోమవారం టీఎంసీకి చెందిన స్థానిక నేత ఒకరు దుండగుల కాల్పుల్లో చనిపోయారు. నిందితుడిగా అనుమానిస్తున్న ఓ వ్యక్తి మూకదాడిలో ప్రాణాలు కోల్పోయాడు. బమున్గాచి ఏరియా టీఎంసీ అధ్యక్షుడు సైఫుద్దీన్ లస్కర్(47) సోమవారం ఉదయం ప్రార్థనలకు బయటకు వచ్చారు. మాటువేసిన దుండగులు దగ్గర్నుంచి జరిపిన తుపాకీ కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఘటనతో కోపోద్రిక్తులైన ఆయన మద్దతుదారులు నిందితులుగా భావిస్తున్న ఇద్దరిని పట్టుకున్నారు. వారి దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. రెండో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లస్కర్ మద్దతుదారులు పొరుగునే ఉన్న దలువాఖలి గ్రామంలో లూటీకి పాల్పడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ఆ ప్రాంతంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. లస్కర్ హత్యతో తమకెలాంటి సంబంధం లేదని సీపీఎం పేర్కొంది. అధికార యంత్రాంగం, పోలీసులు టీఎంసీకి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించింది. -
డీజే కొట్టు డీజే.. కరోనా లేదు గిరోనా లేదు!
మూడో వేవ్ ఉధృతిలో కరోనా కేసులు పొటెత్తుతున్నాయి. ఒకవైపు కేసుల సంఖ్య తగ్గిపోతుండడంపై కేంద్రం అప్రమత్తం అయ్యింది. టెస్ట్లను పెంచాలని రాష్ట్రాలను, కేంద్రపాలిత ప్రాంతాలకు సూచనలిస్తూ.. వ్యాప్తి విషయంలో అప్రమత్తం చేస్తోంది. మరోవైపు ఎన్నికల సంఘం కూడా ప్రచారం విషయంలో ఆంక్షలతో కట్టడికి ప్రయత్నిస్తోంది. అయితే.. కొందరు మాత్రం వైరస్ విషయంలో నిర్లక్క్ష్యం వహిస్తూనే ఉన్నారు. తాజాగా కరోనా ఆంక్షలను పట్టించుకోకుండా వేల మందితో ఓ నేత.. వివాహ వేడుక నిర్వహించిన ఘటన ఇప్పుడు గుజరాత్లో వెలుగు చూసింది. థాపి జిల్లాలో ఓ బీజేపీ నేత ఈ వేడుకను నిర్వహించాడు. రంగు రంగుల లైట్ల వెలుగుల్లో వేల మంది డీజే నృత్యాల్లో మునిగిపోయిన వీడియో ఒకటి అక్కడి వాట్సాప్ అకౌంట్లలో చక్కర్లు కొడుతోంది. గుజరాత్ కొవిడ్ గైడ్ లైన్స్ ప్రకారం.. పెళ్లికి 150మందికి మించకూడదు. కానీ, డోవ్లాన్ బ్లాక్లో నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నేత సునంద ఈ వేడుకను నిర్వహించాడు. వేల మంది హాజరై.. భౌతిక దూరం, మాస్క్లను మరిచి చిందులేశారు. మధ్యలో కానిస్టేబుల్స్ వచ్చి వారించినప్పటికీ.. వాళ్లను బెదిరించి పంపినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికార పక్ష నేత కావడంతో వైరల్ అయిన ఆ వీడియోపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఇదిలా ఉంటే.. గుజరాత్లో ప్రస్తుతం 70వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. చదవండి: పగలంతా బొమ్మ.. రాత్రి కాగానే దెయ్యం! -
ప్రభుత్వ స్థలం ఆక్రమణ విషయంలో బరితెగింపు
కొమ్మాది: ప్రభుత్వ స్థలాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలి. ఎన్ని అవాంతరాలు ఎదురైనా వెనుకాడకూడదని నిర్ణయించుకున్నాడు ఓ నాయకుడు. గతంలో రెవెన్యూ అధికారులు హెచ్చరించినా ఆక్రమణ విషయంలో తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు. జీవీఎంసీ 4వ వార్డు కాపులుప్పాడ ఎస్సీ కాలనీలో స్థానిక నాయకుడు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు వెనుకాడటం లేదు. అక్టోబర్ 23న ఇక్కడి ప్రభుత్వ స్థలంలోని తాటిచెట్లను పొక్లెయిన్తో తొలగించాడు. ఈ విషయం అధికారులకు తెలియడంతో అతన్ని మొక్కుబడిగా మందలించి వదిలేశారు. ఇప్పుడు ఈ స్థలాన్ని చదును చేసేందుకు అడ్డుగా ఉన్న సీసీ రోడ్డు, డ్రైనేజీలను ధ్వంసం చేశాడు. మౌనం వహిస్తున్న అధికారులు ఈ ప్రభుత్వ స్థలంలో కొంత భాగాన్ని కల్యాణ మండపానికి కేటాయించారు. ప్రస్తుతం ఈ మండపం నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీని పక్కన ఉన్న ఖాళీ స్థలాన్ని సదరు వ్యక్తి దర్జాగా పొక్లెయిన్ పెట్టి పనులు నిర్వహిస్తున్నప్పటికీ అధికారులు చూసీ చూడనట్లు వ్యహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సచివాలయం వెనుకాలే కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణ జరుగుతున్నప్పటికీ వారు స్పందించక పోవడం విశేషం. ప్రభుత్వ స్థలం ఆక్రమణలో భాగంగా ఎస్సీ కాలనీకి ఏర్పాటు చేసిన సీసీ రోడ్డు కొంత మేర ధ్వంసమైంది. డ్రైనేజీలను కూడా మూసివేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే అధికారులు కఠినమైన చర్యలు తీసుకుంటే ఈ సమస్య పునరావృతం కాకుండా ఉండేదని అంటున్నారు. ఇంత జరుగుతున్నా సచివాలయం నుంచి గానీ, రెవెన్యూ నుంచి గానీ ఒక్క అధికారి కూడా రాలేదని.. దీనిపై సోమవారం కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని స్థానికులు తెలిపారు. హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తాం ఇక్కడ కొంత మేర ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురి కావడం వాస్తవమే. గతంలో హెచ్చరించాం. అయితే మరల ఈ స్థలాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం జరుగుతున్నాయి. ఆక్రమణకు గురైన స్థలంలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేస్తాం. – బడే శ్రీనివాస్, వీఆర్వో, కాపులుప్పాడ చదవండి: డెల్టా, ఒమిక్రాన్ ఒకేసారి సోకితే ఏమౌతుందో తెలుసా? కొత్త వేరియంట్ ప్రత్యేకత అదే.. -
కారుతో ఢీకొట్టి ఇద్దరు జర్నలిస్ట్ల హత్య
పట్నా: దేశంలో రోజురోజుకు జర్నలిస్ట్ల హత్యలు పెరుగుతున్నాయి. తాజాగా బిహార్లో ఇద్దరు జర్నలిస్ట్లను స్థానిక నాయకుడొకరు కారుతో ఢీకొట్టి హత్య చేశాడు. దైనిక్ భాస్కర్ దినపత్రికలో పనిచేస్తున్న నవీన్ నిశ్చల్, విజయ్ సింగ్ అనే ఇద్దరు పాత్రికేయులు దారుణ హత్యకు గురైయ్యారు. పట్నాకి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోజ్పూర్లో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ హర్సు అనే స్థానిక నాయకుడు, తన కొడుకుతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. నవీన్, విజయ్ బైకుపై ఆరా ప్రాంతానికి వెళుతుండగా వీరి వాహనాన్ని మహ్మద్ హర్సు అతడి కుమారుడు స్కార్ఫియోతో ఢీకొట్టించారు. నిందితులపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. వీరిద్దరూ ప్రస్తుతం పరారీలో ఉన్నారని చెప్పారు. మహ్మద్ హర్సు ఇంతకుముందే వివిధ క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నారు. -
అధ్యక్షా..! ఇదీ మా బడి... ఇదీ మా ఊరు
లిటిల్ రిపోర్టర్ బడి బాగుంటే చదువు బాగుంటుంది. ఊరు బాగుంటే బతుకు బాగుంటుంది. బాగుండడం అంటే ఏంటి? స్కూల్లో ఉండాల్సిన వసతులన్నీ ఉండడం. ఊళ్లో నీళ్లకు, నిలువ నీడకు కరువు లేకుండా ఉండడం. అయితే అన్ని స్కూళ్లు, అన్ని ఊళ్లు ఇలాగే ఉన్నాయా? లేవు! లేవన్న విషయం ఎలా తెలుస్తుంది? పేపర్లు రాస్తాయి. పేపర్వాళ్లకు ఎలా తెలుస్తుంది? రిపోర్టర్లు రాసి పంపుతారు. రిపోర్టర్లు అంటే పేపర్లలో పనిచేసేవాళ్లు మాత్రమే కాదు, సమస్యను గుర్తించి దానిని నలుగురి దృష్టికీ తెచ్చేవాళ్లు కూడా. ఇదిగో.. వీళ్లంతా చిన్నారి రిపోర్టర్లు. ఇవన్నీ ఈ చిన్నారులు రిపోర్ట్ చేసిన సమస్యలు. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా ‘సాక్షి ఫ్యామిలీ’ వీటిని ప్రచురిస్తోంది. వీటిపై.. ‘అధ్యక్షా...’ అంటూ ప్రతిపక్షాలు లోకల్ లీడర్లను ఎలాగూ ప్రశ్నించకుండా వదలవు. చూడాలి మరి. ప్రభుత్వాలు ఏమాత్రం స్పందిస్తాయో, పరిస్థితిని ఎప్పటికి చక్కదిద్దుతాయో! పాస్ ఉంది... బస్సు లేదు! మా ఊరు పాడేరు. నేను చేజర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు 8వ తరగతి చదువుతున్నాను. మా ఊరికి రోడ్డు సౌకర్యం లేనందు వల్ల బస్సు రావడం లేదు. గతంలో బస్సు వచ్చేది. ప్రస్తుతం బస్సులు లేకపోవడంతో ఆటోలలో వెళ్లాల్సి వస్తోంది. వానా కాలంలో అదీకష్టమే. చాలా మంది ఆటోలకు డబ్బులు పెట్టలేక బడికి రావడం లేదు. ముఖ్యంగా అమ్మాయిలను ఆటోల్లో పంపించడానికి భయపడి స్కూలు మానిపించేస్తున్నారు. మేము ఎన్నోసార్లు ఆర్టీసీ వారికి అర్జీ పెట్టుకున్నాం. మా సమస్యకు పరిష్కారం దొరకలేదు. బస్సు పాసులు ఇచ్చారే కానీ బస్సులు వేయలేదు. ప్రస్తుతం మా యందు దయ తలచి బస్సు సౌకర్యం కల్పించవలసినదిగా కోరుచున్నాం. – వి. వెంగమ్మ, 8వ తరగతి, పాడేరు, చేజర్ల జడ్పీ ఉన్నత పాఠశాల, చేజర్ల మండలం, నెల్లూరు జిల్లా టీచర్లు ఇద్దరే మా పాఠశాలలో నీటి సౌకర్యం లేదు. దాహం వేస్తే బయట అంగడికెళ్లి మంచినీళ్లు తెచ్చుకుని తాగుతున్నాం. మా పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు ఒకటే గది. అన్ని తరగతుల వాళ్లమూ ఆ గదిలోనే చదువుకోవాలి. మాకు ఇద్దరే టీచర్లు ఉన్నారు. అన్ని క్లాసులకూ వాళ్లే పాఠాలు చెప్పాలి. మాకు తరగతి గదులు కట్టించి, టీచర్లను నియమించాలి. అలాగే మున్సిపాలిటీ నుంచి నీటి కుళాయి కనెక్షన్ ఇప్పించాలి. కనీసం ఒక కుండ అయినా ఇప్పిస్తే మేమే నీళ్లు పట్టుకుంటాం. – లక్ష్మీదుర్గ, 5వ తరగతి ఎస్.ఆర్.పురం మున్సిపల్ స్కూల్, కావలి పట్టణం, నెల్లూరు జిల్లా మరుగుదొడ్లకు తలుపుల్లేవు మాది రాజవొమ్మంగి. మా పాఠశాలను మోడల్ స్కూల్గా గుర్తించారు. అన్ని రకాల సౌకర్యాలు వస్తాయని సంబరపడ్డాం. అయితే మా మండల పరిషత్ ఇంగ్లీష్మీడియం పాఠశాలలో ఆంగ్లం బోధించే ఉపాధ్యాయుడు లేడు. ఇక ఈ పాఠశాలను మోడల్ స్కూల్గా మార్చామని ఎలా చెపుతున్నారో అర్ధం కావడం లేదు. అదే విధంగా మంచినీటి సౌకర్యం లేదు. పిల్లలమే చందాలు వేసుకొని కుండ కొనుక్కున్నాం. మరుగుదొడ్లు కట్టారు, కానీ వాటికి తలుపులు లేవు. నీళ్ల ట్యాప్లు లేవు. – షేక్ ముజాహిద్దీన్ ఆలీషా, 4వ తరగతి, రాజవొమ్మంగి, విశాఖపట్టణం చెత్త తియ్యరు... కుక్కలను తోలరు! మా ఇల్లు కాకినాడలోని అశోక్నగర్, అచ్యుతాపురం. మా ఇంటి వద్ద కరెంటు స్థంభం ఉంది. ఆరు నెలల నుంచి వీధిలైట్లు వెలగడంలేదు. చీకటి పడితే బయట అడుగుపెట్టాలంటే భయం. కుక్కలు తరుముతాయి. వీథిలో చెత్త కుప్పలను అలాగే వదిలేయడంతో కుక్కలు యధేచ్ఛగా తిరుగుతుంటాయి. వీ«ధిలైట్లు వెలగక పోవడంతో రాత్రిళ్లు దొంగల భయం ఉంటోంది. ఈ ఉత్తరం చదివిన తర్వాత అయినా పెద్దలు, అధికారులు çసమస్యలు పరిష్కరించాలి. – జి. సాయి తేజేష్, 4వ తరగతి, కాకినాడ నీటి కోసం ఎదురు చూపు... బాపట్ల పట్టణంలో మంచినీళ్లు ఎప్పుడొస్తాయో తెలియదు. రోజంతా మంచినీటి కోసం ఎదురు చూడడంలోనే సరిపోతుంటుంది అమ్మావాళ్లకు. వచ్చినా అరగంట సేపటికే ఆగిపోతాయి. మంచినీటి కుళాయిలు తగినన్ని పెంచినా ఈ ఇబ్బంది కొంత తగ్గుతుంది. ఒకే కుళాయి దగ్గర అందరూ గుమిగూడి తగవులాడుకోవడం రోజూ మామూలే ఇక్కడ. ట్యాంకర్ల కోసం ఎదురు చూడడం, వచ్చాక నీళ్లు మోసుకోవడంతోనే సరిపోతోంది. ఇక ఏ పనులకు వెళ్లాలన్నా కుదరడం లేదు. – ఎం. సుష్వాంత్, 8వ తరగతి, బాపట్ల కంప్యూటర్ ఎవరు నేర్పిస్తారు! నేను ఆలేరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుతున్నాను. మా స్కూలుకి కంప్యూటర్లు ఇచ్చారు. కంప్యూటర్ టీచర్ని నియమించలేదు. దాంతో అవన్నీ నిరుపయోగంగా ఉన్నాయి. మాకు పీఈటీ టీచర్ లేరు. ఆట సామగ్రి లేదు. ఏటా మాకు దుస్తులు ఇచ్చేవారు. గడచిన ఏడాది ఇవ్వలేదు. పాత వాటినే వేసుకున్నాం. రాబోయే ఏడాదికైనా కంప్యూటర్ టీచర్ని నియమిస్తే మంచిగ నేర్చుకుంటాం. – బి. సాయికుమార్, 8వ తరగతి, ఆలేరు, యాదాద్రి భువనగిరి జిల్లా మద్యం సీసాలమయం! మా స్కూలు భవనం పూర్తిగా కుంగిపోయి గోడలు పగుళ్లు బారాయి. వర్షం వస్తే స్లాబు కారుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మరమ్మత్తులు జరగలేదు. హైస్కూల్లో బాలికలం ఉన్నాం. వాష్రూములు సరిగ్గా లేవు. ఇంకా పెద్ద ఇబ్బంది ఏమిటంటే... మా స్కూలు సెలవు రోజు స్కూలు ఆవరణ తాగుబోతుల రాజ్యం అవుతోంది. ఫుడ్ పార్సిల్ కవర్లు, ఖాళీ మద్యం సీసాలను పడేస్తున్నారు. పగిలిన గాజు పెంకులతో ఆవరణంతా అసహ్యంగా ఉంటుంది. సోమవారం స్కూలు తెరవగానే మేము ఆవరణ అంతా శుభ్రం చేసుకోవాలి. ఒక్కోసారి గాజు పెంకులు గుచ్చుకుంటాయి కూడ. ఈ కష్టం తప్పించండి ప్లీజ్. – బి. ఇందుమతి, పునాదిపాడు, కంకిపాడు, కృష్ణాజిల్లా ఆటో బోల్తా... చదువుకు డుమ్మా! నేను రోజూ స్కూలుకి ఏడు కిలోమీటర్లు ఆటోలో వెళ్లేవాడిని. ఒక రోజు మా ఆటో బోల్తా పడింది. ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. దాంతో ఆ ఇద్దరూ బడి మానేశారు. మాకు హైస్కూలుకు పోవడం అంటే పరాయి దేశం పోయినట్లే. అంతగా భయపడతారు. ప్రాథమిక స్కూలుతోనే చదువాపేస్తున్నారు చాలామంది. మా తాండకు దారి సరిగ్గా ఉండదు. మట్టిబాటలో వెళ్లాలి. దాంతో మా ఊరికి బస్సులు లేవు. రోడ్డు వేసి బస్సులు వేస్తే మాలాంటి చాలా మంది చదువుకుంటారు. మా తండాలో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. వీథిదీపాలు లేవు. ఇవన్నీ ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియడం లేదు. అందుకే పేపర్కు రాస్తున్నా. – ఎం. అరవింద్ నాయక్, 10వ తరగతి, లత్తవరంతాండ, అనంతపురం జిల్లా కాలువ పొంగితే... విజయనగరం పట్టణంలో ఉడాకాలనీ మాది. కాలనీలో రోడ్డు మొత్తం బురదమయం. నీరు నిలిచి ఉంటుంది. పందులు తిరుగుతూ బురదను తిరగతోడుతుంటాయి. దోమలతో అంటువ్యాధులు వస్తున్నాయి. మురుగునీరు కాలువలో నుంచి పొంగి రోడ్డు మీదకు పారుతుంటుంది. ప్లాస్టిక్ సంచులు కాలువలను బ్లాక్ చేస్తుంటాయి. ప్రభుత్వం మా కాలనీ సమస్యలను పట్టించుకుని పరిష్కరించాలి. – హర్షిత, 6వ తరగతి, కంటోన్మెంట్, విజయనగరం నది దాటడం గగనమే.. మాది పందలపాక గ్రామం. నేను ఆరవ తరగతి చదువుకుంటున్నాను. మా పాఠశాలకు గ్రామానికి మధ్యలో తుల్యభాగా నది ప్రవహిస్తుంటుంది. దానిపై నిర్మించిన కాలిబాట వంతెన ఇరుకుగా ఉంది. అంతే కాదు... అది శిథిలావస్థకు చేరుకుంది. పాఠశాల దూరంగా ఉండడంతో సైకిల్ పై వంతెన దాటి వెళ్ళాలి. ఎప్పుడు విరిగిపడుతుందో తెలియనంతగా పాడైపోయింది వంతెన. చాలామంది పడిపోయారు, గాయాలయ్యాయి. వంతెన ఇరుకుగా ఉండడంతో గోడలు గీరుకుపోయి రక్తం వస్తుంటుంది. ఇదంతా మాకు రోజూ ఎదురయ్యే అనుభవం. దీంతో పాఠశాలకు వెళ్లే సుమారు 800 మంది విద్యార్థులం చాలా ఇబ్బంది పడుతున్నాం. స్కూలు పిల్లలమే కాదు పెద్దవాళ్లకు కూడా ఆ వంతెన మీద నుంచి ప్రయాణించాలంటే భయమే. మంచి వంతెన నిర్మిస్తే తప్ప మా కష్టాలు తీరవు. – షేక్. ముమీనా, పడాల పెదపుల్లారెడ్డి జడ్పీ ఉన్నత పాఠశాల, పందలపాక, బిక్కవోలు, తూర్పు గోదావరి జిల్లా – సాక్షి నెట్వర్క్ సహకారంతో...
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
- అందుకే నాకు పిల్లలు వద్దు: నిఖిల్ కామత్ సంచలన వ్యాఖ్యలు
- ధాన్యం తడవకుండా.. కాపాడే మంచె!
- గాజాలో ఆగని దాడులు.. భారతీయుడి మృతి
- అందుకే విడిపోతున్నాం.. జీవీ ప్రకాష్-సైంధవిల ప్రకటన
- శ్రీనగర్: రెండు దశాబ్ధాల ఓటింగ్ రికార్డు బద్దలు!
- జనసేన కార్యకర్తల దౌర్జన్యం
- నగరం బాట పట్టిన ఆంధ్రా ఓటర్లు.. దారులన్నీ రద్దీ!
- Today Horoscope: ఈ రాశి వారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది
- Lok Sabha Election 2024: నేడు వారణాసిలో మోదీ నామినేషన్
Advertisement