-
కేజ్రీవాల్ పేరు చెప్పాకే మాగుంటకు బెయిల్: సంజయ్ సింగ్
సాక్షి, ఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో కుట్ర చేసి సీఎం కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారని అన్నారు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్. ఇదే సమయంలో లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు. కాగా, సంజయ్ సింగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ..‘లిక్కర్ స్కాం కేసులో కేజ్రీవాల్కు వ్యతిరేకంగా ఎలాంటి మనీ ట్రయల్ ఆధారాలు లేవు. ఈ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్కు కుట్రలు చేశారు. మాగుంట శ్రీనివాస్ రెడ్డి.. కేజ్రీవాల్కు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆప్ను నాశనం చేయాలని బీజేపీ చూస్తోంది. బీజేపీతో కలిస్తే ఎలాంటి కేసులు ఉండవు. అలాగే, కేజ్రీవాల్ పేరు చెప్పిన తర్వాతే మాగుంట రాఘవకు బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు మాగుంట శ్రీనివాస్కు టీడీపీ టికెట్ ఇచ్చారు. బీజేపీతో పొత్తులో భాగంగానే ఇదంతా జరిగింది. ఆయన ఇప్పుడు మోదీ ఫొటో పట్టుకుని ఓట్లు అడుగుతున్నారు’ అని కామెంట్స్ చేశారు. #WATCH | Delhi: Aam Aadmi Party MP Sanjay Singh says, "There is one person, Magunta Reddy, who gave 3 statements, his son Raghav Magunta gave 7 statements. On 16th September, when he (Magunta Reddy) was first asked by ED whether he knew Arvind Kejriwal, he told the truth and said… pic.twitter.com/YzyPrZxYAQ — ANI (@ANI) April 5, 2024 ఇదిలా ఉండగా.. లిక్కర్ స్కాం కేసులో ఆర్నెల్ల పాటు తీహార్ జైల్లో ఉన్న సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. వైద్య పరీక్షల అనంతరం ఆయన గురువారం రాత్రి విడుదలయ్యారు. ఆప్ కార్యకర్తలు వెంట ర్యాలీగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. కేజ్రీవాల్ భార్య సునీతను కలిసి ఆమెకు పాదాభివందనం చేశారు. అనంతరం పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. జైల్లో ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ల నివాసాలకు కూడా వెళ్లి వారి కుటుంబీకులను పరామర్శిస్తానని చెప్పారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘మోదీ నియంత పాలనలో దేశమంతా నలిగిపోతోందంటూ దుమ్మెత్తిపోశారు. మోదీ సర్కారు ఎంతగా వేధించినా ఆప్ బెదరబోదు. కేజ్రీవాల్ రాజీనామా చేయబోరు. రెండు కోట్ల మంది ఢిల్లీవాసుల ప్రయోజనాల పరిరక్షణకు జైలు నుంచే సీఎంగా విధులు నిర్వర్తిస్తారు. ఆయన, సిసోడియా, జైన్ త్వరలోనే విడుదలవుతారు’ అని అన్నారు. -
లిక్కర్ స్కామ్ లో నిందితుడిగా ఉన్న ఫ్యామిలీకి ఎంపీ సీటు..
-
జైలు వద్ద లొంగిపోయిన మాగుంట రాఘవ
ఢిల్లీ లిక్కర్ స్కామ్లో జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న మాగుంట రాఘవ.. తీహార్ జైలు వద్ద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్అధికారులకు లొంగిపోయాడు. మాగుంట రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది ఈడీ. మధ్యంతర బెయిల్ పరిమితిని కుదించి లొంగిపోవాలని రాఘవను ఆదేశించింది సుప్రీంకోర్టు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు రాఘవ జైలువద్ద ఈడీకి లొంగిపోయాడు.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
జాతీయ రాజకీయాల్లో కపిలేశ్వరపురం జమీందార్లు
ఎటువంటి వివాదాలూ లేకుండా..
ఆలయ గోడపై సత్యదేవుని చరిత్ర
ప్రచార ఖర్చులపై ప్రత్యేక దృష్టి
No Headline
‘పల్లె’వించిన ప్రగతి
ప్రశాంత పోలింగ్కు ఏర్పాట్లు
పోలింగ్ రోజున సెలవు
రూ.193 కోట్లతో 28 సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి
పిఠాపురం వంగా గీత అడ్డా.. పవన్ కళ్యాణ్ కి మాస్ కౌంటర్ సాక్షి
తప్పక చదవండి
- పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
- ముద్రగడ మరో లేఖ.. కీలక వ్యాఖ్యలు
- నాకోసం ఆ స్టార్ హీరో నెలలతరబడి వెయిట్ చేశాడు: కమెడియన్
- ఏఐ యూనివర్సిటీ.. ఒడిశా మేనిఫెస్టోలో ఆసక్తికర హామీలు
- ‘సత్య’ మూవీ రివ్యూ
- అతిపెద్ద ఐటీ కంపెనీ.. సీఈవో జీతం మాత్రం..
- జనగణన లేకుండా ఈ లెక్కలేల?
- మద్యం మత్తుతో ఓటర్ల చిత్తుకు చంద్రబాబు కుట్ర
- RCB Vs PBKS: ఆర్సీబీ ఘన విజయం.. ఐపీఎల్ నుంచి పంజాబ్ ఔట్
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement