-
కథర్నాక్.. స్టోరీ టెల్లింగ్ మంత్ర
‘కథలు చెప్పకు’ అని పేరెంట్స్తో, ఫ్రెండ్స్తో సుతిమెత్తని తిట్లు తినని వారు యూత్లో తక్కువగానే ఉంటారు. అయితే ప్రసిద్ధ బ్రాండ్స్ మాత్రం ‘కథలు చెప్పండి ప్లీజ్’ అంటూ యంగ్ టాలెంట్కు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రకటనలకు సంబంధించి ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది బ్రాండ్స్కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. రకరకాల బ్రాండ్లకు సంబంధించి భావోద్వేగాలతో మిళితమైన యాడ్స్ యువ సృజనకారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అమూల్ బ్రాండ్ ‘అమూల్ గర్ల్’ ద్వారా సమకాలీన సంఘటనలతో కనెక్ట్ కావడానికి చేస్తున్న టాపికల్ యాడ్స్ పాపులర్ అయ్యాయి. నగల బ్రాండ్ ‘తనిష్క’ తమ వ్యాపార ప్రకటనల్లో ‘స్టోరీ టెల్లింగ్’ ఫార్మట్ను బలంగా ఉపయోగించుకుంటుంది. ఇక ‘లైఫ్బాయ్’ దగ్గరకు వస్తే... ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది ్ర పాడక్ట్ను ప్రమోట్ చేయడానికే కాదు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ విషయంలోనూ ఉపయోగపడుతుందనేది అర్థమవుతుంది. శాస్త్ర, సాంకేతిక విషయాలపై వినియోగదారుల్లో ఆసక్తి కలిగించడానికి, పెంచడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టేజ్డ్ విజువల్స్ను ఉపయోగించుకుంటుంది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్. బ్రాండ్లు విస్తృత స్థాయిలో కన్జ్యూమర్లతో కనెక్ట్ కావడానికి తమ ప్రాడక్ట్కు సంబంధించిన అడ్వర్టైజింగ్ విషయంలో భావోద్వేగాలతో కూడిన ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ను కోరుకుంటున్నాయి. అడ్వర్టైజింగ్ ప్రపంచంలో స్ట్రాటజిక్ స్టోరీ టెల్లింగ్ అనేది కీలకంగా మారింది. ఈ పవర్ఫుల్ టూల్ బ్రాండ్స్కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. సర్వేల ప్రకారంప్రాడక్ట్లకు సంబంధించి సంప్రదాయ అడ్వర్టైజింగ్ల కంటే మిత్రుల మాటలనే విశ్వసిస్తోంది యువత. వారిలో నమ్మకం కలిగించాలంటే యాడ్ అనేది యూత్ఫుల్గా, మిత్రుడు కొత్త విషయం చెప్పినట్లుగా ఉండాలి. ఇందుకోసం బ్రాండ్స్ యువ స్టోరీ టెల్లర్స్ను ఉపయోగించుకుంటున్నాయి. వారి స్టోరీ టెల్లింగ్లోని తాజాదనానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. థీమ్ను గుర్తించడం, సెంట్రల్ క్యారెక్టర్స్ను డిజైన్ చేసుకోవడం, కస్టమర్ల హృదయాలను తాకేలా యాడ్ను తీర్చిదిద్దడం అనేవి స్టోరీ టెల్లింగ్లో కీలక విషయాలు. ఇలాంటి విషయాలలో యువ సృజనకారులు తమలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ డిజిటల్ శకంలో స్టోరీ టెల్లింగ్ అనేది కొత్త రూ పాలతో సృజనాత్మకంగా వికసిస్తోంది. వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), గేమింగ్ టెక్నాలజీ... మొదలైనవి స్టోరీ టెల్లింగ్లో కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. ‘స్టోరీ టెల్లింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బలమైన సాధనం. టార్గెట్ ఆడియెన్స్ను మెప్పించేలా స్టోరీ టెల్లింగ్ కోసం ఏ.ఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉనేది బలమైన భావోద్వేగాల సమ్మేళనం’ అంటున్నాడు ‘పోకో’ ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్. సినిమాల నుంచి ఇంటర్వ్యూల వరకు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు ప్రకటనలు ప్రత్యక్షమైతే చిరాగ్గా అనిపిస్తుంది. కోల్కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నివేదిత మాత్రం పనిగట్టుకొని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ను చూస్తుంటుంది. ‘ఒకప్పటి వ్యా పార ప్రకటనల్లో వారి బ్రాండ్కు సంబంధించిన గోల మాత్రమే ప్రధానంగా కనిపించేది. ఇప్పటి ప్రకటనల్లో మాత్రం ఇంటలెక్చువల్ ఫ్లేవర్, క్రియేటివిటీ కనిపిస్తోంది. వాటిని చూస్తుంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకు కూడా రకరకాల ఐడియాలు వస్తుంటాయి’ అంటుంది నివేదిత. ముంబైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ వికాస్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో ‘నేను అయితే ఈ యాడ్ను ఇలా తీస్తాను’ అంటూ నోట్స్ రాసుకోవడం అలవాటు. ఒక్కముక్కలో చె΄్పాలంటే నివేదిత, వికాస్లాంటి యువ ఉత్సాహవంతులను బ్రాండ్స్ కోరుకుంటున్నాయి. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతిభను నిరూపించుకుంటే ఇక వారికి తిరుగేలేదు. స్టోరీ టెల్లింగ్ మంత్ర యాడ్లో స్టోరీ టెల్లింగ్ ఫార్మట్ అనేది కంపెనీకి, కస్టమర్లకు మధ్య భావోద్వేగాలతో కూడిన ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ.. ఎలా... ఎంత చెప్పాలో అంతే చెప్పాలనేది స్టోరీ టెల్లింగ్లో భాగం. మిస్ ఫైర్ అయితే మొదటికే మోసం వస్తుంది. ప్రకటనలకు సంబంధించి కొన్ని కంపెనీలు విఫలం కావడానికి కారణం... తమ ప్రాడక్ట్ గురించి తప్ప కన్జ్యూమర్ గురించి పట్టించుకోకపోవడం. అందుకే కన్జ్యూమర్ను హీరో చేసేలా స్టోరీ బిల్డ్ చేయాలి అనేది ముఖ్యమైన స్టోరీ టెల్లింగ్ మంత్ర. ‘ఫలానా యాడ్ ఎందుకు విఫలమైంది’ అనే విషయంలో యువ సృజనకారులు పోస్ట్మార్టం చేయడంతో పాటు ఒక యాడ్ సూపర్ డూపర్ హిట్ కావడంలోని కీలక అంశాలను ఔ పాసన పడుతున్నారు. ‘వాట్ మేక్స్ ఏ గ్రేట్ స్టోరీ’ అనే కోణంలో కస్టమర్ ఛాలెంజ్లను అధ్యయనం చేస్తున్నారు. -
పంట విక్రయంలో సాంకేతిక దన్ను
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్ఎఫ్ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్ను ప్రారంభించారు. దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే. అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు. దార్శనికుడి విధాన జోక్యం పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు. అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్ఎఫ్ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. 2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్ఎఫ్ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్లను ఇది అందిస్తుంది. నేడు, ఎస్ఎఫ్ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్సేల్ మార్కె ట్లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. తగిన బాధ్యత ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు. అయితే, భారతదేశం ఐటీ సూపర్పవర్గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్ఎఫ్ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్ఎఫ్ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్ఎఫ్ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు. మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింత పురోగమించేలా... విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్ఎఫ్ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత. తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి. - వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - సంజీవ్ చోప్రా -
మీకు 18 ఏళ్లు నిండాయా? మోడీ ప్రభుత్వం 3 లక్షలు ఇస్తోంది
-
గిరిజన ఉపాధిలో వికాసం
సాక్షి, అమరావతి: ఏజెన్సీలోని వన్ ధన్ వికాస్ కేంద్రాలు(వీడీవీకే)లతో గిరిజన ఉపాధిలో వికాసం కనిపిస్తోంది. వీటి ఏర్పాటుతో గిరిజనులకు ఉన్నతమైన జీవనోపాధి కల్పించాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరింది. గిరిజనులు సేకరించిన ఫలసాయంతోపాటు గిరిజన రైతులు పండించిన ఉత్పత్తులను నాణ్యత చెడిపోకుండా అందమైన ప్యాకింగ్తో అమ్మకాలు చేయిస్తోంది. గిరి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తూ అడవి బిడ్డలకు లాభదాయకంగా మలుస్తోంది. కొనుగోలుదారులకు సైతం ప్రయోజనాలను అందిస్తోంది. రాష్ట్రంలోని 8 సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ(ఐటీడీఏ)ల పరిధిలో వీడీవీకేలు అనుకున్న లక్ష్యాలను సాధిస్తూ గిరిజనులకు ఎంతో మేలు చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసిన వీడీవీకేల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తోంది. ఆయా ఐటీడీఏల పరిధిలో ప్రాజెక్ట్ ఆఫీసర్లు వివిధ శాఖలను సమన్వయం చేసుకుంటూ వాటిని పర్యవేక్షిస్తున్నారు. విక్రయిస్తున్న ఉత్పత్తులివీ.. అటవీ ప్రాంతంలో గిరిజనులు సేకరించిన అటవీ ఫలసాయంతోపాటు వారు పండించిన ఉత్పత్తులు కూడా అందంగా ప్యాక్చేసి వీడీవీకేల్లో విక్రయిస్తున్నారు. ప్రధానంగా తేనె, కాఫీ, పసుపు, మిరియాలు, రాజ్మా, రాగులు, రాగి పిండి, కొర్రలు, సామలు, అరికెలు, ఊదలు, అడవి దుంపల నుంచి తీసిన పాలపిండి, జీడిపప్పు, నల్లజీడి పిక్కలు, మినుములు, చింతపండు, శీకాయ, శీకాయ పొడి, కుంకుడు, చీపుర్లు, అడ్డాకులతోపాటు ఇంట్లో తయారు చేసిన ధనియాల పొడి, నువ్వులు, కారం, కరివేపాకు, మునగాకు పొడులు కూడా విక్రయిస్తుండటం విశేషం. రూ.61.63 కోట్లతో 415 వీడీవీకేలు రాష్ట్రంలో 2019–20 నుంచి 2021–22 వరకు గిరిజన సంక్షేమ శాఖ 415 వీడీవీకేలను ఏర్పాటు చేయించింది. ఇందుకోసం రూ.61.63 కోట్లు మంజూరు చేయగా.. ఇప్పటివరకు రూ.36.04 కోట్లు విడుదల చేశారు. గిరిజన మహిళలతో గ్రూపులు ఏర్పాటు చేయించి.. వారికి పెట్టుబడి సాయం అందిస్తున్నారు. గిరిజనులు పండించిన ఉత్పత్తులు, సేకరించిన ఫలసాయాలకు వీటిద్వారా కనీస మద్దతు ధర దక్కేలా చేస్తున్నారు. సేకరించిన అటవీ ఉత్పత్తులకు అదనపు విలువను జోడించేలా గిరిజన మహిళలకు శిక్షణ ఇవ్వడం, మార్కెటింగ్కు అనుగుణంగా వాటిని సిద్ధం చేయడం వంటి లక్ష్యాలు సాధించడంలో వీడీవీకేల ద్వారా చేస్తున్న ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయి. గిరిజన ఉత్పత్తుల సేకరణ నుంచి మార్కెటింగ్ వరకు వీడీవీకేల ద్వారా అందిస్తున్న తోడ్పాటు గిరిజన మహిళల ఆర్థిక పురోగతికి దోహదం చేస్తోంది. రాష్ట్రంలో ఏర్పాటైన వీడీవీకేలు సూపర్ మార్కెట్లను తలపిస్తున్నాయి. నెలకు రూ.25 వేలకు పైనే మిగులుతోంది గిరిజన మహిళలు గ్రూపుగా ఏర్పడి వీడీవీకే ఏర్పాటు చేసుకుంటే ప్రభుత్వం సబ్సిడీతో కూడిన పెట్టుబడి సాయం అందిస్తుంది. ఐటీడీఏ, డీఆర్డీఏ పర్యవేక్షణలో ఇవి గిరిజన ప్రాంతాల్లో వినూత్న సూపర్ మార్కెట్ల మాదిరిగా ఆదరణకు నోచుకుంటున్నాయి. వీటికి మంచి డిమాండ్ ఉండటంతో నెలకు కనీసం రూ.లక్షకుపైగా విక్రయాలు జరిగితే పెట్టుబడి పోనూ రూ.25 వేలు లాభం మిగులుతోంది. గ్రూపు సభ్యులు లాబాల్లో వాటా పంచుకుని మెరుగైన జీవనం గడిపేందుకు వీడీవీకేలు దోహదం చేస్తున్నాయి. – జి.పైడమ్మ, వీడీవీకే నిర్వాహకురాలు, పాడేరు -
క్రెడో బ్రాండ్స్ @ రూ. 266–280
మఫ్టీ బ్రాండ్ జీన్స్ తయారీ కంపెనీ క్రెడో బ్రాండ్స్ మార్కెటింగ్ ఈ నెల 19న పబ్లిక్ ఇష్యూకి వస్తోంది. 21న ముగియనున్న ఇష్యూలో భాగంగా 1.96 కోట్ల ఈక్విటీ షేర్లను ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. షేరుకి రూ. 266–280 ధరల శ్రేణిలో చేపట్టనున్న ఇష్యూ ద్వారా రూ. 550 కోట్లు సమీకరించే ప్రణాళికల్లో ఉంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 18న షేర్లను కేటాయించనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 53 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పురుషుల మధ్యస్థాయి ప్రీమియం, ప్రీమియం క్యాజువల్ వేర్ దుస్తుల తయారీలో కంపెనీ కార్యకలాపాలు విస్తరించింది. దేశీయంగా 404 ప్రత్యేక బ్రాండ్ ఔట్లెట్స్, 1,807 టచ్పాయింట్స్సహా 71 లార్జ్ ఫార్మాట్, 1332 మల్టీ బ్రాండ్ స్టోర్ల ద్వారా విక్రయాలు నిర్వహిస్తోంది. గతేడాది(2022–23) ఆదాయం 46 శాతం ఎగసి రూ. 498 కోట్లను అధిగమించింది. నికర లాభం 117 శాతం దూసుకెళ్లి రూ. 77.5 కోట్లను తాకింది. -
ఢీ అంటే ఢీ ఆర్ట్ ఆఫ్ డీఇన్ఫ్లుయెన్సింగ్
‘ఇప్పటి వరకు ఇన్ఫ్లుయెన్సర్ పవర్ ఏమిటో చూశారు. ఇక డీఇన్ఫ్లుయెన్సర్ పవర్ ఏమిటో చూసే టైమ్ వచ్చింది’... ఇది తెలుగు సినిమాలో మాస్ డైలాగ్ కాదు. సోషల్ మీడియాలో ఒక కుర్రాడు పెట్టిన కామెంట్.సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల హవా నడుస్తున్న కాలం ఇది. కస్టమర్లు ఏది కొనాలో, ఏ షో చూడాలో, ఎలాంటి ఆరోగ్య సూత్రాలు పాటించాలో చెబుతున్నారు. ఇప్పుడు ఈ ట్రెండ్కు అడ్డుపడే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ ట్రెండ్ యువతరం నుంచే వచ్చి బలపడుతోంది. ట్రెడిషనల్ ఇన్ఫ్లుయెన్సర్లు ఒక ప్రాడక్ట్ను హైప్ చేస్తే డీఇన్ఫ్లుయెన్సర్లు ఆ హైప్ను ఛాలెంజ్ చేస్తున్నారు.... మార్కెటింగ్ డాటా అండ్ ఎనలిటిక్స్ కంపెనీ కంతార్ స్టడీ రిపోర్ట్ ప్రకారం వినియోగదారులపై ఇన్ఫ్లుయెన్సర్ల సిఫారసుల ప్రభావం తక్కువేమీ కాదు. సోషల్ మీడియాలో ఎటు చూసినా ఇన్ఫ్లుయెన్సర్లు కనిపిస్తారు. టీ పోడుల నుంచి టీపాయ్ల వరకు రకరకాలప్రాడక్ట్స్ను ప్రమోట్ చేయడానికి చిన్నచిన్న క్యాచీ వీడియోలను రూపోందిస్తారు. దీనికి భిన్నంగా ఒక ప్రాడక్ట్ను విశ్లేషిస్తూ విమర్శిస్తే...అదే డీఇన్ఫ్లుయెన్సింగ్! ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ హ్యాష్ట్యాగ్తో టిక్ టాక్లో ఈ ట్రెండ్ మొదలైంది.సోషల్ మీడియా ఎనాలటిక్స్ ఫర్మ్ ట్యూబ్లర్ ల్యాబ్స్ చెబుతున్నదాని ప్రకారం గత సంవత్సరం నుంచి ఈ ట్రెండ్ ఊపందుకుంది. మ్యాడి వెల్ అనే ఇన్ఫ్లుయెన్సర్ ప్రముఖ కాస్మటిక్ స్టోర్స్లో పని చేసింది. కొన్నిప్రోడక్ట్స్ పట్ల కస్టమర్లు ఎందుకు విముఖంగా ఉన్నారో తన స్వీయ అనుభవాలను తెలియజేసింది. ఈ ప్రభావంతో ఆమె పేరు ఇన్ఫ్లుయెన్సర్ల జాబితా నుంచి డీఇన్ఫ్లుయెన్సర్ల జాబితాలోకి చేరింది. న్యూయార్క్కు చెందిన ఇరవై సంవత్సరాల క్లారా కొన్ని బ్రాండ్లను విమర్శిస్తూ వీడియోలు చేసింది. వాటిలో ఒకటి వైరల్గా మారింది. అదే సమయంలో తాను విమర్శించిన బ్రాండ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో అనే భయం పట్టుకుంది. అయితే తనకు తానుగా ధైర్యం తెచ్చుకోవడానికి ఎంతో సమయం పట్టలేదు.‘నేను సరిౖయెన వివరాలతోనే వీడియో చేశాను. నేనెందుకు భయపడాలి’ అంటోంది క్లారా. మన సెలబ్రిటీ ఒకరు ఆరోగ్య సంబంధమైన విషయాలపై కాస్త లోతుగానే మాట్లాడాడు. అయితే ఆయన అవగాహన లోపాన్ని ఒక వైద్యుడు వెంటనే ఎత్తిచూపాడు. పాపులర్ చైనీస్ వ్లోగర్ ఒకరు తన వయసు తక్కువగా కనిపించేలా సాంకేతిక మాయ చేస్తే ఎవరో కుర్రాడు కనిపెట్టి ‘ఆయన అసలు రూపం ఇది’ అని చూపాడు. స్వీడన్ ఇన్ఫ్లుయెన్సర్ ఫేక్ ట్రిప్ గురించి మరొక యువకుడు ‘ఇవి ఫొటోషాప్ చిత్రాలు’ అని నిజాన్ని బహిర్గతం చేశాడు. నిజానికి ఇలాంటివి సోషల్ మీడియాలో గతంలో లేవని కాదు. అయితే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ పుణ్యామా అని ‘అది కాదు ఇది’ అని వెంటనే సాధికార సమాచారంతో స్పందించే ధోరణి పెరిగింది.డీఇన్ఫ్లూయెన్సర్లు వోవర్–హైప్డ్ప్రాడక్ట్స్ను విమర్శించడమే కాదు చౌక ధరల్లో లభించే వాటి గురించి చెబుతున్నారు. యూనివర్శిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో ప్రోఫెసర్ అయిన అమెరికస్ రీడ్ ఇలా అంటున్నారు...‘ఇన్ఫ్లుయెన్సర్లలో ఎక్కువమంది సాధికారికంగా మాట్లాడడం లేదేమో అనే భావన కస్టమర్లలో వచ్చింది. డబ్బులు ఇస్తారు కాబట్టి సంబంధితప్రాడక్ట్ను ప్రమోట్ చేస్తారు. నిజానిజాల గురించి వారికి అవసరం లేదు. ఈ నేపథ్యంలో కాస్తో కూస్తో డీఇన్ఫ్లుయెన్సరే నయం అనుకుంటున్నారు. నిజానికి డీఇన్ఫ్లుయెన్సర్ కూడా ఇన్ఫ్లుయెన్సరే’ కొందరు ఒక అడుగు ముందుకు వేసి ఈ ట్రెండ్కు ‘యాంటీ క్యాపిటలిస్ట్’ ట్రెండ్గా నామకరణం చేశారు. డీఇన్ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ వల్ల వృథా ఖర్చులు తగ్గుతాయని, వేలం వెర్రికి అడ్డుకట్టపడుతుందని, పర్యావరణ కోణంలో కూడా ఈ ట్రెండ్ వల్ల మేలు జరుగుతుందని యువతరంలో ఎంతోమంది బలంగా వాదిస్తున్నారు. తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలలో ఇతరులతో పంచుకుంటున్నారు. అయితే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ ట్రెండ్పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా ఉన్నాయి.డీఇన్ఫ్లుయెన్సింగ్కు విషయ సాధికారత, నిజాయితీ అనేవి కీలకం. అయితే ‘డీఇన్ఫ్లుయెన్సింగ్’ రూపంలో సూడో–అథెంటిసిటీ ముందుకు వస్తుందని, ఈ ట్రెండ్ను తమ స్వార్థానికి ఉపయోగించుకునే వారి సంఖ్య పెరుగుతుందనే విమర్శ ఉంది. ‘ఈ ట్రెండ్ కాస్త చివరికి ఎలా మారుతుందంటే ఇది కొనవద్దు. మీరు కొనాల్సింది అది అన్నట్లుగా!’ అంటుంది 26 సంవత్సరాల అమెరికన్ ఇన్ఫ్లు్లయెన్సర్ జెస్సిక. ‘ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇన్ఫ్లుయెన్సర్లు చెప్పగానే కస్టమర్ల అభిప్రాయాలు రాత్రికి రాత్రి మారిపోవు. ఇన్ఫ్లుయెన్సర్లు కేవలం సలహా ఇస్తారు. అంతే. ఏది కొనాలి, ఏది కొనకూడదు అనే స్వీయవిచక్షణ కస్టమర్లలో ఉంది. ఇన్ఫ్లుయెన్సర్లుగా మేము పారదర్శకంగా, నిజాయితీగా ఉంటాం’ అంటుంది ఫ్రాన్స్కు చెందిన ఇన్ఫ్లున్సర్ కోలిన్. ఆమెకు ఇన్స్టాగ్రామ్లో 4,00,000 ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం డీఇన్ఫ్లుయెన్సింగ్ ట్రెండ్ హెల్త్, ఫైనాన్స్, లైఫ్స్టైల్ విభాగాలలో ఎక్కువగా కనిపిస్తుంది.‘డీఇన్ఫ్లూయెన్సింగ్ అనేది వాపా బలుపా?’ అనేది పక్కన పెడితే ఈ ట్రెండ్ మూలంగా ఇన్ఫ్లుయెన్సర్లుప్రాఫిట్కు మాత్రమే కాదు మెరిట్కు కూడాప్రాధాన్యత ఇచ్చే ధోరణి, జవాబుదారీతనం పెరుగుతుంది. సమస్య ఇన్ఫ్లుయెన్సర్లు కాదు. కొందరు ఇన్ఫ్లుయెన్సర్లు అనుసరిస్తున్న ధోరణి. వారిలో మార్పు రావాలి. సామాజిక బాధ్యత పెరగాలి. యువతలో అశాంతి, ఆందోళన రేకెత్తించే కంటెంట్కు దూరంగా ఉండాలి.– హిమాద్రి పటేల్, డిజిటల్ క్రియేటర్ -
మార్కెట్ల ప్రవేశం, కస్టమర్లను కాపాడుకోవడమే కీలకం
న్యూఢిల్లీ: మార్కెట్లలోకి ప్రవేశించలేకపోవడం, కస్టమర్లను కాపాడుకోవడం, తమ ఉత్పత్తులను సమర్థవంతంగా మార్కెట్ చేసుకోలేకపోవడం వంటి ప్రధాన సవాళ్లను సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈలు) ఎదుర్కొంటున్నాయి. మార్కెటింగ్కు సంబంధించి సవాళ్లు వాటి వృద్ధికి అవరోధంగా ఉంటున్నాయి. ఈ వివరాలను ‘కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ రిలేషన్స్’(ఐసీఆర్ఐఈఆర్) సర్వే తెలిపింది. 2022 నవంబర్ 4 నుంచి 2023 జనవరి 20 మధ్య కాలంలో 2,007 ఎంఎస్ఎంఈల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకుంది. ఇందులో 65 శాతం సూక్ష్మ పరిశ్రమలే ఉన్నాయి. 19 శాతం చిన్నవి కాగా, 16 శాతం మధ్య స్థాయి సంస్థలు. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లను విక్రయ మార్గాలుగా ఎంపిక చేసుకుంటున్న ఎంఎస్ఎంఈలు ప్రధానంగా యువ, విద్యావంతులైన వారి నిర్వహణలో ఉన్నట్టు ఈ సర్వే తెలిపింది. ఇతర ఎంఎస్ఎంఈలతో పోలిస్తే, ఎగుమతి ఆధారిత ఎంఎస్ఎంఈలలో అధిక శాతం ఈ కామర్స్ ప్లాట్ఫామ్లతో అనుసంధానమై ఉన్నాయి. ఎగుమతుల పట్ల అవగాహన కలిగిన సంస్థలు, ఈ కామర్స్ సేవల వినియోగానికి అనుకూలంగా ఉన్నట్టు ఇది తెలియజేస్తోంది. సమీకృత ఎంఎస్ఎంఈలు పనితీరు, టర్నోవర్, లాభదాయకత, ఉద్యోగ ప్రయోజనాల విషయంలో మెరుగ్గా ఉన్నట్టు ఐసీఆర్ఐఈఆర్ నివేదిక తెలిపింది. సదుపాయాల కొరత, రుణ సాయం లభించకపోవడం, నిపుణులైన కార్మిక శక్తి, ఆలస్యపు చెల్లింపులు ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న ఇతర ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. ఈ కామర్స్తో అవకాశాల విస్తరణ.. సర్వేలో పాల్గొన్న సంస్థల్లో 1,005 ఇప్పటికే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లతో అనుసంధానమయ్యాయి. మిగిలిన 1,002 ఈ కామర్స్పై నమోదు కానివి. ఈ కామర్స్ ప్లాట్ఫామ్లతో అనుసంధానం కావడం వల్ల కేవలం మార్కెట్ విస్తరణ అవకాశాలు పెరగడమే కాకుండా, రుణ సదుపాయానికి అవకాశం ఉంటుందని ఈ సర్వే నివేదిక పేర్కొంది. సమ్మిళిత వృద్ధికి ఎంఎస్ఎంఈలు కీలకమని పేర్కొంటూ.. అవి డిజిటల్గా పరివర్తనం చెందడం ఎంతో అవసరమని ఈ సర్వే ప్రస్తావించింది. ఈ కామర్స్ వేదికల ద్వారా మరిన్ని భౌగోళిక ప్రాంతాలకు విస్తరించే అవకాశాల పట్ల ఎంఎస్ఎంఈల్లో అవగాహన ఉన్నట్టు పేర్కొంది. ఎంఎస్ఎంఈలు టెక్నాలజీ సాయంతో మార్కెట్ అనుసంధానాన్ని పెంచుకునేందుకు, వాటికి ప్రభుత్వం నుంచి విధానపరమైన మద్దతు అవసరాన్ని ప్రస్తావించింది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యవసర రుణ హామీ పథకం తదితర ఎన్నో పథకాలను అమలు చేస్తుండగా, వాటి మధ్య స్థిరీకరణ అవసరమని ఎంఎస్ఎంఈలు అభిప్రాయపడ్డాయి. విధానపరమైన అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అసవరాన్ని కూడా ప్రస్తావించాయి. సమగ్ర ఎంఎస్ఎంఈ విధానం ఉండాలని, ఒకే వేదికగా అన్ని ప్రయోజనాలు పొందేలా అవకాశం కలి్పంచాలని పేర్కొన్నాయి. ఈ ప్రయోజనాల పట్ల ఎంఎస్ఎంఈల్లో అవగాహన కలి్పంచాలని కూడా అభిప్రాయపడ్డాయి. -
లోగో రీబ్రాండింగ్ చిక్కులు: మస్క్కు షాకిచ్చిన మార్కెటింగ్ ఏజెన్సీ
ట్విటర్ బాస్ ఎలాన్ మస్క్లో మరోసారి చిక్కుల్లోపడ్డాడు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విటర్ ఐకానిక్ ‘బర్డ్ లోగో’ను మార్చిదాని ప్లేస్లో ‘ఎక్స్’గా మారుస్తూ ఈ ఏడాది జూలైలో మాస్క్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మార్కెటింగ్ ఏజెన్సీ ఎక్స్ అనే కంపెనీ కాపీరైట్ ఉల్లంఘన దావా వేసింది. ట్రేడ్మార్క్ , సర్వీస్ మార్క్ ఉల్లంఘనకు పాల్పడిందని ఆరోపించింది. ఈ మేరకు సోమవారం ఫ్లోరిడాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. ట్విటర్ లోగో రీబ్రాండ్ తరువాత ఇలాంటి కోర్టు కేసును ఎదుర్కోవడం ఇదే తొలిసారి. (ఐటీలో లేఆఫ్స్ కలకలం: మరోసారి మెటాలో ఉద్యోగాల కోత!) ఫ్లోరిడాకు చెందిన అడ్వర్టైజింగ్ , సోషల్ మీడియా సర్వీస్ కంపెనీ ఎక్స్ ..ట్విటర్ పేరు మార్పునకు సంబంధించి అభ్యంతరాలు వ్యక్తం చేసింది. తమ ట్రేడ్మార్క్ "X" గుర్తును ఉపయోగించి మార్కెటింగ్, విక్రయించడం లేదా పంపిణీ లాంటి వాటినుంచి ఎక్స్ను నిషేధించాలని కోరుతోంది. అంతేకాదు మస్క్ ఎక్స్ సేవలు, ప్రకటనలు తమ వినియోగదారులు గందరగోళానికి గురయ్యారని ఎక్స్ పేర్కొంది. తన నష్టాలకు లేదా ప్రతివాది లాభాలకు మూడు రెట్లు సమానమైన పరిహారాన్ని అందించాలని కోరింది. ఈ ప్రమాదాన్ని ముందేఊహించిన ట్రేడ్ మార్క్ నిపుణులు తాజా పరిణామంతో ఇప్పటికే లాభాలు క్షీణించి, ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్న మస్క్కు మరింత దెబ్బేనని భావిస్తున్నారు. కాగా గతేడాది ట్విటర్ ను టేకోవర్ చేసుకున్నప్పటి నుంచి ఎలన్ మస్క్ పలు కీలక మార్పులకు శ్రీకారం చుట్టాడు. భారతీయ ఎగ్జిక్యూటివ్లను తొలగించడం, వేలాదిమంది ఇతర ఉద్యోగుల తొలగింపులు, ట్విటర్ సబ్స్క్రిప్షన్ ఫీజు వసూలు, కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులు లాంటివి ఉన్నాయి. తాజాగా గేమ్ స్ట్రీమింగ్, ప్లాట్ఫారమ్ని సరిచేయడానికి లైవ్ షాపింగ్ ఫీచర్పై పని చేస్తున్నట్టు తెలుస్తోంది. -
ది అడ్వర్టైజింగ్ క్లబ్ చైర్మన్గా రానా బారువా
అడ్వర్టైజింగ్, మార్కెటింగ్, మీడియా పరిశ్రమకు చెందిన అపెక్స్ బాడీ అడ్వర్టైజింగ్ క్లబ్ నూతన మేనేజింగ్ కమిటీని ప్రకటించింది. తమ 69వ వార్షిక సర్వసభ్య సమావేశంలో 2023-2034 సంవత్సరానికి సంబంధించి హవాస్ ఇండియా గ్రూప్ సీఈవో రానా బారువాను అధ్యక్షునిగా నియమించింది. మాజీ అధ్యక్షుడు పార్థ సిన్హా మేనేజింగ్ కమిటీ సభ్యునిగా కొనసాగనున్నట్లు అడ్వర్టైజింగ్ క్లబ్ కంపెనీ ఓ ప్రకటన విడుదల చేసింది. తన నియామకం గురించి.. రానా బారువా మాట్లాడుతూ, “దాదాపు 70 చరిత్ర కలిగిన సంస్థ ది యాడ్ క్లబ్కు ప్రెసిడెంట్గా పనిచేయడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. కొత్త తరం, ఔత్సాహికులకు మెరుగైన సేవలు అందిచాలనేది తమ లక్ష్యమని.. ఇందుకోసం వివిధ రంగాల్లో వైవిధ్యమైన లీడర్స్ అపరిమిత అవకాశాల్ని, సేవల్ని అందించేందుకు తమ ఉత్తమమైన మేనేజ్మెంట్ టీమ్తో కలిసి ముందుకెళ్తామన్నారు. ఇండస్ట్రీలోని కొత్త ప్రతిభను ఆకర్షించడానికి, మహిళా సాధికారతకు, భవిష్యత్తు నాయకులను ప్రోత్సహించడం, వైవిధ్యాన్ని అభివృద్ధి చేయడం, ఈక్విటీ, చేరికలను పెంచేందుకు ప్రగతిశీల పొత్తులు, సంభాషణలను ప్రోత్సహించడానికి తామంతా కలిసి గొప్ప కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి కట్టబడి ఉంటామని చెప్పారు. అడ్వర్టైజింగ్ క్లబ్ ఆఫీస్ బేరర్లుగా ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులు ► రానా బారువా - అధ్యక్షుడు ►ధీరజ్ సిన్హా - ఉపాధ్యక్షుడు ►డాక్టర్ భాస్కర్ దాస్ - కార్యదర్శి ►శశి సిన్హా - జాయింట్ కార్యదర్శి ►మిత్రజిత్ భట్టాచార్య - కోశాధికారి మేనేజింగ్ కమిటీ సభ్యులు ►అవినాష్ కౌల్ ►మాల్కం రాఫెల్ ►ప్రశాంత్ కుమార్ ►పునీత ఆరుముగం ►శుభ్రాంశు సింగ్ ►సోనియా హురియా ► సుబ్రహ్మణ్యేశ్వర సమయం కో-ఆప్టెడ్ పరిశ్రమ నిపుణులు ►అజయ్ కాకర్ ►ప్రదీప్ ద్వివేది ►విక్రమ్ సఖుజా డ్వర్టైజింగ్ క్లబ్ను మరింత ముందుకు నడిపేందుకు ప్రతిభ నైపుణ్యం, సంబంధిత విభాగాల్లో లోతైన అనుభవం ఆధారంగా ఎంపికైన మరికొంత మంది వ్యక్తులు ► అజయ్ చాంద్వానీ ► అలోక్ లాల్ ► అనూషా శెట్టి ► లులు రాఘవన్ ► మన్షా టాండన్ ►నిషా నారాయణన్ ►రాజ్ నాయక్ ►సత్యనారాయణ రాఘవన్ ►వికాస్ ఖంచందాని -
ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను సేకరిస్తాం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్లో సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్ సంస్థ సిద్ధంగా ఉందని అమూల్ ఆర్గానిక్స్ బిజినెస్ హెడ్ నిమిత్ దోషి వెల్లడించారు. ఆర్గానిక్ సర్టిఫికేషన్ కలిగిన రైతుల నుంచి మార్కెట్ ధరపై నిర్దేశించిన ప్రీమియం ధరతో వ్యవసాయ ఉత్పత్తులను సేకరిస్తూ.. వారికి తగిన గిట్టుబాటు ధర లభించేలా కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయ అనుబంధశాఖల ఉన్నతాధికారులతో బుధవారం సచివాలయంలో అమూల్ ప్రతినిధి బృందం భేటీ అయ్యింది. అమూల్ ఆర్గానిక్స్ ద్వారా ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు ఉన్న అవకాశాలపై విస్తృత స్థాయిలో చర్చించారు. నిమిత్ దోషి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు కోసం ఐదేళ్ల ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. త్వరలో రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంటామని తెలిపారు. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మ, శనగపిండి తదితర ఉత్పత్తులను ప్రీమియం ధరలకు రైతుల నుంచి సేకరించి, ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్లోకి తీసుకొస్తామన్నారు. భవిష్యత్లో విదేశాలకు ఎగుమతి చేస్తామన్నారు. నేషనల్ కో–ఆపరేటివ్ ఆర్గానిక్ లిమిటెడ్లో చేరితే విస్తృతస్థాయి మార్కెటింగ్ అవకాశాలను అందిపుచ్చు కోవచ్చునన్నారు. రైతు సాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ టి.విజయకుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో 8.5 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వీరు పండించిన ఉత్పత్తులకు సర్టిఫికేషన్ జారీ ప్రక్రియను సరళీకృతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. సెర్ప్ సీఈవో ఎండీ ఇంతియాజ్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వారిలో మహిళలే అత్యధికమని తెలిపారు. తొలి దశలో ఆర్గానిక్ సర్టిఫికెట్ కలిగిన గిరిజన ప్రాంతాలలోని రైతుల నుంచి రాజ్మ సేకరించాలని సూచించారు. మార్క్ఫెడ్ ఎండీ రాహుల్ పాండే, రైతు బజార్ సీఈవో నందకిషోర్, నాబార్డు ఏజీఎం ఎం.చావ్సాల్కర్ పాల్గొన్నారు. -
‘అమూల్’.. ఆర్గానిక్
సాక్షి, అమరావతి: జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ సంస్థ తాజాగా రైతన్నలు పండించే ప్రకృతి, సేంద్రీయ ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రకృతి, సేంద్రీయ వ్యవసాయం చేసే రైతులకు చేయూత అందించేందుకు సిద్ధమైంది. దీనికి సంబంధించి విధివిధానాల రూపకల్పనపై వ్యవసాయ, ఉద్యాన, రైతు సాధికారత సంస్థ అధికారులతో అమూల్ ప్రతినిధులు బుధవారం సమావేశం కానున్నారు. విస్తృత మార్కెటింగ్ రాష్ట్రంలో ప్రస్తుతం 8.82 లక్షల ఎకరాల్లో 8 లక్షల మంది రైతులు ప్రకృతి సాగు చేస్తున్నారు. కొద్ది మంది రైతులు మాత్రమే నేరుగా తమ ఉత్పత్తులను విక్రయించుకోగలుగుతున్నారు. మధ్యవర్తులను ఆశ్రయించి నష్టపోతున్న రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పెద్దఎత్తున మార్కెటింగ్ సౌకర్యాలను కల్పిస్తోంది. రైతుబజార్లలో ప్రత్యేకంగా స్టాల్స్ కేటాయించడంతోపాటు కలెక్టరేట్ ప్రాంగణాలు.. సచివాలయాలు, ఆర్బీకేలు, మండల కేంద్రాల్లోని ప్రభుత్వ కార్యాలయాల ఆవరణల్లో వీక్లీ మార్కెట్లను ప్రోత్సహిస్తోంది. తాజాగా మరో అడుగు ముందుకేసి విస్తృత స్థాయిలో మార్కెటింగ్ సౌకర్యం కల్పించేందుకు ముందుకొచ్చిన అమూల్తో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకోనుంది. ప్రకృతి, సేంద్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి అయ్యే పంట దిగుబడుల్లో 30 శాతం స్థానికంగా వినియోగిస్తుండగా మరో రూ.1,100 కోట్ల విలువైన 1.42 లక్షల టన్నుల ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్యను అధిగమించేందుకు మంత్ర, సహజ ఆహారం, రిలయన్స్ రిటైల్, బిగ్ బాస్కెట్ ఇతర కంపెనీల భాగస్వామ్యంతో రైతు సాధికార సంస్థ ముందుకెళ్తోంది. మరోవైపు టీటీడీ దేవస్థానానికి 12 రకాల ఉత్పత్తులను సరఫరా చేస్తోంది. వచ్చే ఐదేళ్లలో కనీసం రూ.5 వేల కోట్ల టర్నోవర్ సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 10 – 15 శాతం ప్రీమియం ధరకు సేకరణ ఈ ఏడాది 1,29,169 ఎకరాల్లో వరి, వేరుశనగ, జీడిమామిడి, మొక్కజొన్న, బెల్లం, కాఫీ, పసుపు సహా 12 రకాల ఉత్పత్తులు సాగవుతుండగా 2,03,640 టన్నుల దిగుబడి రావచ్చని అంచనా. రైతు సాధికార సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఎమ్మెస్పీకి మించి మార్కెట్లో పలికిన ధరలకు అదనంగా 15 శాతం, ఒకవేళ మార్కెట్ ధరలు ఎమ్మెస్పీ కంటే తక్కువగా ఉంటే ఎమ్మెస్పీకి అదనంగా 10 శాతం ప్రీమియం ధరతో రైతుల నుంచి టీటీడీ సేకరిస్తోంది. అదే రీతిలో ఆర్గానిక్ సర్టిఫికేషన్ పొందిన రైతులు ఉత్పత్తి చేసిన పంట ఉత్పత్తులను అమూల్ సంస్థ సేకరించి మార్కెటింగ్ చేయనుంది. తొలి దశలో ధాన్యం, శనగలు, కందులు, కందిపప్పు, రాజ్మా, శనగపిండి లాంటి వాటిని రైతుల నుంచి ప్రీమియం ధరలకు సేకరించి ప్రాసెస్ చేసి అమూల్ ఆర్గానిక్స్ పేరిట మార్కెట్లోకి తీసుకురానుంది. క్షేత్ర స్థాయిలో పరిశీలన క్షేత్ర స్థాయిలో వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందుకు అమూల్ ఆర్గానిక్స్ అధ్యయనం చేస్తోంది. గుజరాత్ నుంచి వచ్చిన అమూల్ బిజినెస్ హెడ్ దోషి, బ్రాండ్ మేనేజర్ స్నేహ కమ్లాని నేతృత్వంలోని అమూల్ ఆర్గానిక్స్ ప్రతినిధి బృందం ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో పర్యటించింది. ప్రకృతి సాగు చేసే మహిళా రైతులతో సమావేశమైంది. మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాల్మిల్ కమ్ బల్క్ స్టోరేజ్ పాయింట్, ప్రాసెసింగ్ యూనిట్లను సందర్శించింది. ప్రకృతి, సేంద్రీయ సాగుకు ఊతం ప్రకృతి ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు అమూల్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోనుంది. ఇది చరిత్రాత్మక ముందడుగు. పాడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్న అమూల్ అదే రీతిలో ప్రకృతి సాగు రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు ఉత్పత్తుల మార్కెటింగ్కు ముందుకు రావడం శుభ పరిణామం. ఇది రాష్ట్రంలో ప్రకృతి, సేంద్రీయ సాగుకు మరింత ఊతమిస్తుంది. – టి.విజయకుమార్, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్, రైతు సాధికార సంస్థ మార్కెటింగ్కు తోడ్పాటు అందిస్తాం తెనాలి: పాడి పరిశ్రమ రంగంలో దేశంలో అగ్రగామిగా ఉన్న అమూల్ తాజాగా ఆర్గానిక్ రంగంలోకి ప్రవేశించిందని సంస్థ ఆర్గానిక్ హెడ్ నిమిత్ దోషి చెప్పారు. ఆర్గానిక్ విధానంలో వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తుల మార్కెటింగ్కు తోడ్పాటునందిస్తామని తెలిపారు. అమూల్ సంస్థ మేనేజర్ స్నేహతో కలిసి మంగళవారం గుంటూరు జిల్లా కొల్లిపరలోని శ్రేష్ట ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీని నిమిత్ సందర్శించారు. కంపెనీ ఆధ్వర్యంలో పండించిన పంటలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ను పరిశీలించారు. 100 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నట్లు శ్రేష్ట డైరెక్టర్ ఉయ్యూరు సాంబిరెడ్డి తెలిపారు. ఎన్జీవోలు, ఇతర సంస్థలతో కలసి భూమి ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ పరిమిత వ్యయంతో సాగు చేస్తున్నట్టు చెప్పారు. కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ మార్కెటింగ్ విభాగం ప్రతినిధి ప్రభాకర్, ప్రకృతి వ్యవసాయం జిల్లా మేనేజర్ రాజకుమారి, శ్రేష్ట డైరెక్టర్లు నెర్ల కుటుంబరెడ్డి, బొంతు గోపాలరెడ్డి, రైతు సాధికార సంస్థ రీజినల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ వెంకట్రావు, విజయ్, ప్రవల్లిక, భానుమతి తదితరులు పాల్గొన్నారు. -
జీడీపీలో వ్యవసాయం వాటా మరింత పెరగాలి
న్యూఢిల్లీ: దేశ జీడీపీలో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా మరింత పెరగాల్సి ఉందని, మార్కెటింగ్ను బలోపేతం చేయడం ద్వారా ఇది సాధ్యపడుతుందని కేంద్ర సహకార శాఖ మంత్రి అమిత్షా అభిప్రాయపడ్డారు. ఈ విషయంలో రైతులు, తయారీదారుల సంఘాలు (ఎఫ్పీవోలు) కీలకపాత్ర పోషించాల్సి ఉందన్నారు. ఢిల్లీలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా మంత్రి మాట్లాడారు. ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలను అనుసరించడం మొదలు పెడితే వ్యవసాయం లాభదాయకంగా మారుతుందన్నారు. ఈ దిశగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలు (పీఏసీఎస్), ఎఫ్పీవోలు సాయంగా నిలుస్తాయన్నారు. ఎఫ్పీవోలు, పీఏసీఎస్లు హైబ్రిడ్ నమూనాలో కలసి పనిచేయాలని సూచించారు. ఇందులో భాగంగా 11,770 ఎఫ్పీవోలు ఒప్పందం ద్వారా పీఏసీఎస్తో అనుసంధానం కావాలని కోరారు. దీనికింద పీఏసీఎస్లకు ఎఫ్పీవోలు సేవలు అందించాలని సూచించారు. ‘‘తయారీ ద్వారా జీడీపీ వృద్ధి చెందితే ఉపాధి కల్పన భారీగా ఉండదు. అదే వ్యవసాయం, అనుబంధ రంగాలు వృద్ధి చెందిదే జీడీపీకే కాకుండా పెద్ద ఎత్తున ఉపాధి కల్పనకు అనుకూలిస్తుంది. వ్యవసాయం దాని అనుబంధ రంగాలు అత్యధికంగా జీడీపీకి 17.5–18 శాతం వాటా సమకూరుస్తున్నాయి. కానీ, ఇతర రంగాల్లోని వారితో పోలిస్తే రైతుల పరిస్థితి ఏమంత మెరుగ్గా లేదు. ఇతర రంగాల్లో మాదిరే రైతుల పరిస్థితులు మెరుగు పడాలంటే అందుకు ఎఫ్పీవోలను ఆమోదించాలి’’ అని అమిత్షా పేర్కొన్నారు. ఎఫ్పీవోల్లో రైతులు, తయారీదారులు (ఉత్పత్తిదారులు) భాగంగా ఉంటారు. వీరు చిన్న, సన్నకార రైతులకు సాగు, ముడి సరుకులు, సాంకేతిక సేవలు, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సహా అన్ని రకాల సేవలు అందిస్తుంటారు. మరిన్ని ఎఫ్పీవోలు ఇప్పటికే 11,770 ఎఫ్పీవోలు ఉండగా, 2027–28 నాటికి మరో 10,000 ఎఫ్పీవోలను ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా ఉంది. దేశంలో 85 శాతం మంది చిన్న, సన్నకార రైతులే ఉన్నందున వ్యవసాయం లాభసాటిగా మారాల్సి ఉందని అమిత్షా పేర్కొన్నారు. ఇందుకోసం ఆధునిక టెక్నాలజీ, మార్కెటింగ్ విధానాలు అవసరమని సూచించారు. ‘‘ఎఫ్పీవోల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతోంది. కానీ, సహకార రంగంలో ఎఫ్పీవోలు, వాటి వల్ల ప్రయోజనాలు పరిమిత స్థాయికే చేరుకున్నాయి. పీఏసీఎస్ల ద్వారా 1,100 ఎఫ్పీవోలను ఏర్పాటు చేయాలని ఇటీవలే నిర్ణయించాం’’అని అమిత్షా తెలిపారు. వ్యవసాయ మౌలిక నిధికి మద్దతుగా నిలవాలి బ్యాంక్లను కోరిన వ్యవసాయ శాఖ వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పన నిధి (రూ.లక్ష కోట్లు)కి ప్రోత్సాహంగా నిలవాలని కేంద్ర వ్యవసాయ శాఖ కోరింది. సాగు రంగంలో మౌలిక వసతులు కల్పించేందుకు ఇది తప్పనిసరి అవసరంగా పేర్కొంది. సాగు అనంతరం నిల్వ వసతుల నిర్వహణ, కమ్యూనిటీ సాగు తదితర చర్యల కోసం 2020 జూలై 8న కేంద్ర సర్కారు వ్యవసాయ మౌలిక సదుపాయాల కల్పనా నిధి (ఏఐఎఫ్)ని ప్రారంభించింది. ఈ పథకం కింద 2025–26 నాటికి రూ.లక్ష కోట్లను బ్యాంక్లు మంజూరు చేయాల్సి ఉంటుంది. ఇది వడ్డీ రాయితీ, కేంద్ర ప్రభుత్వ హామీతో కూడిన పథకం. ఇందుకోసం కొత్త ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి మనోజ్ అహుజా ప్రారంభించారు. ‘‘నెల రోజుల పాటు (ఆగస్ట్ 15 వరకు) ఇది కొనసాగుతుంది. ఈ కాలంలో రూ. 7,200 కోట్లను మంజూరు చేయాలి. ఈ వీడి యో కాన్ఫరెన్స్ సమావేశానికి ప్రభుత్వ, ప్రైవేటు, ప్రాంతీయ, స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కోపరేటివ్ బ్యాంక్ల ఎగ్జిక్యూటివ్లు హాజరయ్యారు’’అని అహుజా తెలిపారు. దేశంలో వ్యవసాయ మౌలిక ప్రాజెక్టులకు గణనీయమైన అవకాశాలున్నాయని చెప్పారు. -
14 పందులతో మొదలు నేడు 150కి సంఖ్య.. కిలోకు 280 చొప్పున అమ్మకం
తక్కువ కాలంలో మంచి నికరాదాయం పొందాలనుకుంటే సీమ పందుల పెంపకం చేపట్టడం ఒక్కటే మార్గం అంటున్నారు యువ మహిళా రైతు రాచెల్లి అనూష. తెలంగాణ రాష్ట్రం జిల్లా కేంద్రం సిద్దిపేటకు 12 కిలో మీటర్ల దూరంలోని మల్యాలకు చెందిన అనూష సీమ పందులను పెంచుతూ చక్కటి ఆదాయాన్ని గడిస్తున్నారు. పట్టభద్రురాలైన అనూష తన భర్త మల్లేశం ప్రోత్సాహంతో తన నాలుగు ఎకరాల పొలంలో మూడేళ్ల క్రితం నుంచి స్వయంగా వ్యవసాయం చేస్తున్నారు. ఈ క్రమంలో అనేక కష్టనష్టాల పాలయ్యారు. ఆవులు, గేదెలు, గొర్రెలు, నాటుకోళ్లు, కంజు పిట్టలు, కుందేళ్లు, కొర్రమీను చేపలు.. ఏవి పెంచినా కలిసిరాలేదు. మూడేళ్లు తిప్పలు పడిన తర్వాత వెటర్నరీ కళాశాలకు చెందిన నిపుణులు డా. ప్రసాద్, డా. విద్య సలహా మేరకు సీమ పందుల ఫాంను ఏర్పాటు చేసుకొని చక్కని ఆదాయం పొందుతున్నారు. పందులు పెంచటం ఏమిటని బంధువులు వారించినా పట్టించుకోకుండా భర్త సహకారంతో 2020 మార్చిలో 14 సీమ పందులను కొని తెచ్చుకొని పెంపకం ప్రారంభించారు. లార్ట్ వైట్ యార్క్ షేర్, ల్యాండ్రెస్, డ్యూరార్, లార్జ్ బ్లాక్ యార్క్ షేర్ వంటి సంకర జాతి పందులను ఆమె పెంచుతున్నారు. ఫాంలో ఇప్పుడు వాటి సంఖ్య 150కి పెరిగింది. ఫాం సమీపంలోనే ఇంటిని నిర్మించుకొని నిరంతరం తానే స్వయంగా అన్ని పనులూ చేసుకోవటం ద్వారా అనూష చక్కటి ఫలితాలు పొందుతున్నారు. మార్కెటింగ్ సమస్య లేదని అంటూ.. కర్ణాటక, అస్సాం తదితర రాష్ట్రాల నుంచి కూడా వ్యాపారులు వచ్చి సీమ పందులను కొనుక్కెళ్తున్నారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక జిల్లాల నుంచి రైతులు వచ్చి ఫాంను చూసి, పిల్లలను కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారన్నారు. వారానికో రోజు పంది మాంసాన్ని కిలో రూ. 280 చొప్పున ఫాం దగ్గరే విక్రయిస్తున్నారు. మార్కెటింగ్ సమస్య లేదు! సీమ పందులకు మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. పోటీ తక్కువ. శ్రమ తక్కువ. ఆదాయం ఎక్కువ. మార్కెటింగ్ సమస్య లేదు. ఒక ఎకరం భూమి సాగు చేస్తే ఎంత ఆదాయం వస్తుందో రెండు పందులను పెంచితే అంతే ఆదాయం వస్తుంది. దాణా, గడ్డి రోజుకు రెండు సార్లు వేయాలి. ఎప్పుడైనా వీలుకాకపోతే సాయంత్రం వేయకపోయినా పర్వాలేదు. 200 పందులను ఒక్కరే చూసుకోవచ్చు. పందులను సాదుకుంటూ వ్యవసాయం కూడా చేసుకోవచ్చు. – రాచెల్లి అనూష, యువ రైతు 75 రోజుల్లో 20 కేజీలు కోతకు అమ్మే పందులను, బ్రీడింగ్ కోసం అమ్మే పందులను ప్రత్యేక షెడ్లు వేసి వేర్వేరుగా పెంచుతున్నారు. పంది పిల్ల 75 రోజుల్లో 20 కేజీల బరువు పెరుగుతుందని అనూష వివరించారు. బ్రీడింగ్ కోసం 20 కేజీల బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. మాంసం కోసం కోతకైతే సుమారుగా 80 కిలోలకు పైగా బరువు పెరిగిన తర్వాత విక్రయిస్తున్నారు. బ్రీడింగ్ పందులకు గడ్డితో పాటు రెండు పూటలా దాణా పెడుతున్నారు. కోతకు వెళ్లే పందులకు హోటళ్లలో మిగిలిన ఆహారాన్ని కూడా మేపుతున్నారు. పశు వైద్యుడు డా. అభిలాష్ సూచనల మేరకు అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారు. అనేక వ్యాక్సిన్లతోపాటు, ఇతర ఇంజక్షన్లను క్రమం తప్పకుండా ఇస్తూ నాణ్యమైన మేతను అందిస్తే సీమపందుల పెంపకం సులభమేనని అంటారు అనూష భర్త మల్లేశం (97044 99873). – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ; ఫోటోలు: కె. సతీష్ కుమార్ (చదవండి: సీఎం జగన్ స్పూర్తిగా.. మహారాష్ట్రలో లక్షా 11వేల మొక్కలు నాటే కార్యక్రమం) -
ఉద్యానం.. మరింత విస్తారం
సాక్షి, విశాఖపట్నం: ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని విస్తృతం చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇందుకోసం రైతులకు రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోంది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజనలో ఉద్యాన విస్తరణ పథకం కింది ఏటా కొంతమేర దీనిని విస్తరించాలని లక్ష్యాన్ని నిర్దేశించింది. విశాఖపట్నం జిల్లాలో 10,328 ఎకరాల ఉద్యాన పంటల విస్తీర్ణం ఉంది. ఈ ఏడాది అదనంగా మరో 180 ఎకరాల్లో ఈ పంటలను విస్తరించాలని జిల్లా ఉద్యానశాఖ నిర్ణయించింది. ఇందుకు అవసరమైన ప్రక్రియను ఉద్యానశాఖ అధికారులు చేపట్టారు. ఉద్యాన విస్తరణ పథకం కింద డ్రాగన్ ఫ్రూట్, టిష్యూ కల్చర్ అరటి, బొప్పాయి, కూరగాయలు తదితర పంటలు సాగు చేస్తారు. వీటితో పాటు జిల్లాలో మరో 500 ఎకరాల్లో ఆయిల్పాం తోటలు పెంచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ పథకంలో సాగు చేసే పంటలకు ప్రభుత్వం రాయితీ కూడా ఇస్తోంది. మొక్కలు, ఎరువులతో పాటు సాగుకు అవసరమైన పనిముట్లకు కూడా యూనిట్ ధరను బట్టి గరిష్టంగా 50 శాతం వరకు సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం జిల్లా ఉద్యానశాఖ అధికారులు ఆర్బీకే స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యాన సాగు పెంపు ఆవశ్యకత, అధిక దిగుబడులనిచ్చే వంగడాలు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు తదితర అంశాలను రైతులకు వివరిస్తున్నారు. అదే సమయంలో వీటికి అర్హులైన రైతులను గుర్తింపు ప్రక్రియను కూడా మొదలు పెట్టారు. ఈ నెల 15 వరకు ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. అనంతరం అవసరమైన నర్సరీలను కూడా ఎంపిక చేసి మొక్కలను పంపిణీ చేస్తారు. ఉద్యాన పంటల విస్తరణకు నీటి పారుదల, డ్రిప్, స్పింక్లర్లు వంటి సదుపాయాలు కలిగి ఉండాలి. మరోవైపు మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పండ్ల తోటల పెంపకాన్ని కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇందులో మొక్కలను ఉచితంగా ఇవ్వడమే కాకుండా ఇందుకు అవసరమయ్యే కూలీలను కూడా ఈ పథకంలో సమకూరుస్తారు. ఇది రైతులకు ఆర్థికంగా ఎంతో వెసులుబాటు చేకూర్చనుంది. మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం రైతులు పండించిన ఈ ఉద్యాన పంటలకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తాం. ఈ ఉత్పత్తులను రైతు బజార్లలో విక్రయించేలా మార్కెటింగ్ శాఖ ద్వారా చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకోసం ఈ రైతులకు కార్డులను జారీ చేస్తాం. ఉద్యాన పంటల నాణ్యత, దిగుబడులు పెంచడం, రైతులకు మంచి ధర గిట్టుబాటు అయ్యేలా చూడడం వంటివి లక్ష్యాలతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. – మన్మధరావు, జిల్లా ఉద్యానశాఖ అధికారి, విశాఖపట్నం -
రూ.2 వేల వాచీ.. రూ.59 వేలకు విక్రయం!
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని స్వప్నలోక్ కాంప్లెక్స్లో ఈ ఏడాది మార్చిలో జరిగిన అగ్నిప్రమాదం క్యూ–నెట్ మల్టీ లెవల్ మార్కెటింగ్ (ఎంఎల్ఎం) సంస్థ అక్రమ దందాను మరోసారి తెరపైకి తెచ్చింది. ఆ దుర్ఘటనలో చనిపోయిన ఆరుగురూ దీని ఉద్యోగులే. ఈ ఘటనపై నమోదైన కేసులను దర్యాప్తు చేసిన హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధికారులు.. ఈ సంస్థ సౌత్ ఇండియా ఆపరేషన్స్ హెడ్ గుమ్మడిల్లి రాజేశ్ అలియాస్ రాజేశ్ ఖన్నాను బెంగళూరులో అరెస్టు చేశారు. ఈ సంస్థ ఎంఎల్ఎం పేరిట తక్కువ ఖరీదైన వస్తువులను అత్యంత ఎక్కువ రేటుకు అమ్ముతోందని.. రూ.2 వేల వాచీని రూ.59 వేలకు విక్రయించినట్టు ఆధారాలు సేకరించామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ వెల్లడించారు. కేసులు నమోదవడంతో పేరు మార్చి.. హాంకాంగ్ కేంద్రంగా ఎంఎల్ఎం దందా చేస్తున్న క్యూ–నెట్పై అనేక కేసులు నమోదవడంతో.. విహాన్ డైరెక్ట్ సెల్లింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ‘వీ–ఎంపైర్’ పేర్లతో మళ్లీ దందా ప్రారంభించింది. ఈ సంస్థలో టెలీకాలర్లు, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్, ప్రమోటర్స్, టీమ్ లీడర్లుగా చాలామంది పనిచేస్తున్నారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ ఐదో అంతస్తులోని ఫ్లాట్ నంబర్ 511లో దీని కార్యాలయం ఉంది. రాజేశ్ ఖన్నా, ఉపేందర్రెడ్డి, శివనాగ మల్లయ్య, కటకం మల్లేశ్, నాగమణి సహా 12 మంది కీలకంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి నెలా కనీసం రూ.20 వేల నుంచి రూ.60 వేల వరకు సంపాదించవచ్చంటూ ఎరవేయడం.. ఇప్పటికే ‘వీ–ఎంపైర్’లో చేరినవారు నెలకు రూ.50వేల నుంచి రూ.1.5లక్షల దాకా సంపాదిస్తున్నారని అమాయకులకు ఎర వేస్తున్నారు. మూడు కోట్లు వసూలు చేసి.. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసు బృందం.. ఇప్పటివరకు హైదరాబాద్లోనే 159 మంది బాధితుల నుంచి రూ.3 కోట్ల వరకు వసూలు చేసినట్టు గుర్తించింది. దేశవ్యాప్తంగా ఇంకా ఎంతో మంది బాధితులు ఉంటారని పోలీసులు తెలిపారు. రాజేశ్ ఖన్నా వద్ద లభించిన 35 బ్యాంకు ఖాతాల్లోని రూ.54 కోట్ల నగదును ఫ్రీజ్ చేశామని.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. -
‘చిరు’ధాన్యాల సాగుకు పెద్ద ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చిరుధాన్యాల సాగును ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ ఆర్థిక ఏడాది(2023–24) 1,66,736 హెక్టార్లలో చిరుధాన్యాలు పండించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. గత ఆర్థి క ఏడాదితో పోల్చితే ఇది 39,365 హెక్టార్లు అధికం. అలాగే గత ఆర్థిక ఏడాది 3.22 లక్షల మెట్రిక్ టన్నుల చిరుధాన్యాలు ఉత్పత్తి చేయగా.. ఈసారి 4.11 లక్షల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతాయని ప్రభుత్వం అంచనా వేసింది. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో సాగు విస్తీర్ణం, వినియోగాన్ని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. చిరుధాన్యాల సాగును ప్రోత్సహించడంతో పాటు ప్రజలు ఆహారంగా తీసుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్రెడ్డి ఆదేశాలిచ్చారు. జిల్లాల వారీగా చిరుధాన్యాల సాగు విస్తీర్ణం లక్ష్యాలను నిర్ధారించారు. అందుకు అనుగుణంగా రైతులు సాగు చేసేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఉత్పత్తులకు తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని సీఎస్ ఆదేశించారు. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద.. వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద రాష్ట్రంలో 160 చిరుధాన్యాల ప్రైమరీ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. ప్రాసెసింగ్ యూనిట్లు నెలకొల్పే వారికి తగిన విధంగా ప్రోత్సాహకాలను అందించాలన్నారు. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో చిరుధాన్యాల స్టాల్స్ ఏర్పాటు చేసి ఆయా ఉత్పత్తులను ప్రోత్సహించాలని ఆదేశించారు. మహిళా మార్టుల్లోనూ వీటిని విక్రయించాలని సూచించారు. చిరుధాన్యాలను ఆర్బీకేల ద్వారా కనీస మద్దతు ధరకు పౌరసరఫరాల సంస్థ కొనుగోలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. కనీస మద్దతు ధరను కూడా ప్రభుత్వం ప్రకటించింది. అనేక జబ్బులకు చిరుధాన్యాలతో చెక్ జొన్నలు, సజ్జలు, రాగులు తదితరాల్లో పిండి పదార్థాలు ఎక్కువ. ఇవి దైనందిన అవసరాలకు సరిపడా 70 నుంచి 80 శాతం శక్తిని అందిస్తాయి. నిత్యం వీటిని ఆహారంగా వినియోగిస్తే గుండె జబ్బులు, షుగర్, బీపీ తదితర జబ్బులు అదుపులో ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాగుల్లో ఖనిజాలు ముఖ్యంగా కాల్షియం అధికంగా ఉండటంతో.. మూత్ర రోగాలను అరికట్టడంతో పాటు దేహపుష్టిని కలుగజేస్తాయి. ఆరోగ్యంగా ఉండాలంటే నిత్యం మనం తీసుకునే ఆహారంలో చిరుధాన్యాలను వినియోగించాల్సిన అవసరముందని నిపుణులు చెబుతున్నారు. -
తోపుడు బండి మీద సమోసాలు అమ్మి.. రోజుకు రూ.12 లక్షలు సంపాదిస్తున్న క్యూట్ కపుల్!
Ghar, Padosi, Bacche Hi Rishtedar Ek Samosa Toh Banta Hai Yaar నవ్వొస్తుంది కదా. బట్ ఇదే ట్యాగ్ లైన్తో సమోసా సింగ్ అనే కంపెనీ మొత్తం మార్కెట్నే క్యాప్చర్ చేస్తోంది. ఇప్పటికే వందల కోట్ల సమోసా వ్యాపార సామ్రాజ్యాన్ని నెలకొల్పింది. భవిష్యత్లో ప్రపంచ దేశాల్లో సైతం సమోసాలు అమ్మి వేలకోట్ల టర్నోవర్ సాధించేలా ప్రణాళికలు రచిస్తుంది. తోపుడు బండి మీద సమోసాలు అమ్మిన నిధి సింగ్, శిఖర్ వీర్ సింగ్..వందల కోట్ల వ్యాపారంగా ఎలా తీర్చిదిద్దారు. పూలమ్మిన చోటే కట్టెలమ్మే అనే సామెతను తిరగరాసిన ఈ దంపతులిద్దరూ సమోసాలు ఎందుకు అమ్మాలనుకున్నారో తెలుసుకుందాం పదండి. కరణ్ జోహార్ సినిమా తరహాలో రియల్ లైఫ్లో హీరో శిఖర్ వీర్ సింగ్, హీరోయిన్ నిధి సింగ్ బ్యాచిలర్ బయోటెక్నాలజీ డిగ్రీని పూర్తి చేసేందుకు 2004లో థానేలోని కురకేత్ర యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే? రీల్ లైఫ్ తరహాలో రియల్ లైఫ్లో శిఖర్ వీర్ సింగ్, నిధి సింగ్లు స్నేహితులు కాస్త ప్రేమికులుగా మారారు. అలా అని చదువును ఆటకెక్కించలేదు. ఇద్దరూ డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం నిధి బయోటెక్నాలజీ చదవనైతే చదివింది కానీ మనసంతా మార్కెటింగ్ వైపే మళ్లింది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా థానే నుంచి ఢిల్లీకి పయనమైంది. ఢిల్లీలో అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీలో మార్కెటింగ్ విభాగంలో జాయిన్ అయింది. లైఫ్ సైన్సెస్ అమితంగా ఇష్టపడే శిఖర్ మాస్టర్స్ చేసేందుకు ఉన్నత చదువుల కోసం థానే నుంచి హైదరాబాద్కు వచ్చాడు. లైఫ్ సైన్సెస్ చదివే సమయంలో శిఖర్ ఫాస్ట్ ఫుడ్ తరహాలో స్నాక్ ఐటమ్స్ అమ్మకాల్లో శుభ్రత లేకపోవడాన్ని గమనించాడు. అన్నీ ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలలో పిజ్జాలు, బర్గర్లను అమ్మితే.. అదే ఇండియన్ స్నాక్స్, సావీరస్ (సాల్టీగా-స్పైసీగా) ను వీధుల్లో అమ్మడాన్ని గమనించాడు. సమోసాలు అమ్ముదాం నిధి అదిగో అప్పుడే శిఖర్కు దిగ్గజ రెస్టారెంట్లకు పోటీగా సమోసా వ్యాపారం చేయాలన్న ఆలోచనకు బీజం పడింది. తన ఐడియాను నిధికి షేర్ చేశాడు. వ్యాపార మెళుకువలు తెలియని శిఖర్.. కియోస్కోలో సమోసా అమ్మితే ఎలా ఉంటుందని నిధికి తన మనసులో మాట చెప్పాడు. శిఖర్ 2009లో సైంటిస్ట్గా బయోకాన్ కంపెనీలో చేరాడు. కొంత కాలానికి వాళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి, నచ్చిన జీతం ఇంతకంటే ఏం కావాలి? కానీ వాళ్లు అలా అనుకోలేదు. ఉద్యోగాల నిమిత్తం దేశాలు పట్టుకొని తిరిగినప్పటికీ సమోసా వ్యాపారం చేయాలన్న ఆశ పోలేదు. ఇంకా రెట్టింపు అయ్యింది. వ్యాపార ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. శుభ్రత (hygiene)తో పాటు సమోసాను వినూత్నంగా తయారు చేయాలని అనుకున్నారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. జాబ్కు రిజైన్ చేసి సంవత్సరాలు గడిచాయి. చివరికి 2015 అక్టోబర్ నెలలో బిజినెస్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. బిజినెస్ కోసం ఎవరు ఏం చేయాలో డిసైడ్ అయ్యారు. అందుకు నిధి అమోదం తెలపడంతో తన స్టార్టప్ ప్రయత్నాల్ని ప్రారంభించాడు శిఖర్. అక్టోబర్ 13, 2015లో శిఖర్ తాను చేస్తున్న జాబ్కు రిజైన్ చేశాడు. నిధి తాను కూడా జాబ్కు రిజైన్ చేస్తానంటే కంపెనీ ఒప్పుకోలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటూ స్టార్టప్ ప్రారంభించుకోమని ఆఫర్ ఇచ్చింది. వెంటనే వాళ్లిద్దరూ కలిసి రెండు చిన్న కిచెన్ రూమ్లు అద్దెకు తీసుకున్నారు. వంట చేసే వాళ్లను నియమించుకున్నారు. పరిశోధన- అభివృద్ధి (Research and Development)లో నిమగ్నమయ్యారు. నాలుగు నెలల కష్టం 4 నెలల పాటు రేయింబవళ్లు నిద్రాహారాలు మాని వినూత్నంగా పలు షేపుల్లో సమోసాను తయారు చేశాడు శిఖర్. బిజినెస్ ప్రారంభించాలన్న తమ ప్రయత్నాల్లో ఎట్టకేలకు మరో అడుగు ముందుకు వేశారు. ఆర్ అండ్ డీలో రకరకాల రుచులతో సమోసాలు వేయించాలి. కాల్చకూడదు, జిడ్డు లేకుండా ఆరోగ్యం ఉండాలన్న ఆలోచన శిఖర్ బయోటెక్ అనుభవం నేర్పిచ్చింది. రకరకాల ఫ్లేవర్లతో ప్రత్యేకంగా తయారు చేసిన పిండితో సమోసాపై భాగంగా గట్టిగా ఉండేలా చూసుకున్నారు. అలా సంప్రదాయ సమోసా షేప్ కంటే వీళ్లు తయారు చేసిన సమోసా చూడటానికి బాగుంది. సమోసా ఆకారం ఇలా ఉండడం (కింద ఇమేజ్లో చూపించినట్లుగా) వల్ల నూనెను పీల్చుకోదని తెలిపారు. చికెన్ మఖానీ (బటర్ చికెన్), కడాయి పనీర్ నుండి చాక్లెట్ వరకు రకరకాల రుచుల్లో సమోసాలు అందించేందుకు సిద్ధమయ్యారు. సమోసా సింగ్ పేరు భలే ఉందే అమ్మేందుకు సమోసా సిద్ధమైంది. ప్రొడక్ట్ ఉంటే సరిపోదు కదా. దానికంటూ పేరుండాలి. అందుకే అందరి నోళ్లలో నానేలా మా సంస్థకు సమోసా సింగ్ అని పేరుపెట్టాం. ఓ రోజు శిఖర్ నా దగ్గరకు వచ్చి కంపెనీ పేరు సమోసా సింగ్ అని చెప్పడంతో ‘అరె ఈ పేరేదో భలే ఉందే అని’ నవ్వుకున్నట్లు నిధి వివరించారు. తోపుడుబండి మీద సమోసాలు ప్రొడక్ట్ (సమోసా),పేరు రెడీ. మార్కెటింగ్లో మెళుకువలు నేర్చుకున్నారు. ముందుగా తాము తయారు చేసిన సమోసా గురించి కస్టమర్ల నుంచి అభిప్రాయం తెలుసుకునేందుకు తోపుడుబండి మీద సమోసాలు అమ్మారు. రద్దీ ఉండే ఏరియాల్లో కియోస్కోలు ఏర్పాటు చేసి సమోసా గురించి కస్టమర్ల అభిప్రాయాలు సేకరించారు. ఫీడ్బ్యాక్ పాజిటీవ్గా రావడంతో ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బెంగళూరులో సమోసా సింగ్ పేరుతో క్యూఎస్ఆర్ అవుట్ లెట్ను ప్రారంభించారు. నిధి బిల్ కౌంటర్ను నిర్వహిస్తుండగా, శిఖర్ కొంతమంది వర్కర్లతో కలిసి సమోసాలు తయారు చేసి అమ్మడం, హోమ్ డెలివరీలు చేయడం ప్రారంభించారు. టేస్ట్ అదిరింది. ధర రీజనబుల్గా ఉంది. రెండు సమోసాలు రూ.20, చికెన్ మఖానీ సమోసాలు (రెండు) రూ. 55కే ధర తక్కువగా ఉండడం సమోసా సింగ్కు కలిసి వచ్చింది. మౌత్ పబ్లిసిటీ పెరిగి రెండు నెలల్లో ఆర్డర్లు రోజుకు 500 సమోసాలు అమ్మే స్థాయికి ఎదిగారు. భారీ ఆర్డర్ దశ తిరిగింది బిజినెస్ ఊహించని విధంగా సాగుతుండడంతో నిధి క్యాష్ కౌంటర్ నుంచి..కార్పొరేట్ ఆర్డర్ల కోసం మార్కెటింగ్ విభాగంలో అడుగు పెట్టింది. అలా తనకున్న మార్కెటింగ్ అనుభవంతో జర్మన్ కంపెనీ నుంచి 8వేల సమోసాలను తయారు చేసి ఇచ్చే ఆర్డర్ను సంపాదించింది. ఆర్డర్ అయితే వచ్చింది. చేయడం,వాటిని నిల్వ చేయడంలో విఫలమయ్యే అవకాశం ఉందని భావించారు. సదరు సంస్థను వారం రోజుల సమయం అడిగారు. వారంలో మళ్లీ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్పై పనిచేశారు. సమోసా చెప్పిన టైంకు చేసి ఆర్డర్ ఇవ్వాలి. ప్రొడక్ట్ చెడిపోకుండా తయారు చేసేలా రీసెర్చ్ చేశారు. షిప్ట్ల వారీగా సమోసాలు తయారు చేసి చెప్పిన టైం కంటే ముందే ఆర్డర్ సిద్ధం చేశారు. ఇల్లు అమ్మి జర్మనీ ఆర్డర్ తర్వాత సమోసా సింగ్ మారు మ్రోగింది. ఆర్డర్ల సంఖ్య పెరిగింది. వివిధ నగరాల్లో అవుట్ లెట్లను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. కానీ చేతిలో సరిపడ డబ్బు లేకపోవడంతో బెంగళూరులో ఉన్న ఇల్లును అమ్మి వ్యాపారానికి అనువుగా ఉండేలా అవుట్ లెట్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం బెంగళూరు,హైదరాబాద్, పూణేతో పాటు ఇతర నగరాల్లో సమోసాలు అమ్ముతున్నారు. ఇలా సమోసాలు అమ్ముతూ రోజుకు రూ.12 లక్షల నుంచి సంవత్సరానికి వందల కోట్లు సంపాదిస్తున్నారు. కృషితో నాస్తి దుర్భిక్షం అనే సిద్ధాంతం తమను ఇక్కడికి దాకా తీసుకొచ్చిందని, భవిష్యత్లో విదేశీయులతో తమ సమోసాను టేస్ట్ చేయించాలని అనుకుంటున్నట్లు నిధిసింగ్, శిఖర్ సింగ్లు విజయ గర్వంతో చెబుతున్నారు. -
ఇంతై.. ‘ఇంతి’oతై..
ఈమె పేరు కొండా ఉషారాణి.. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కికి చెందిన ఈమెకు తన 13వ ఏట వివాహమైంది. పెళ్లయిన మూడున్నరేళ్లకే భర్త చనిపోవడంతో తల్లితో పాటు తనకున్న ఇద్దరు పిల్లలను పెంచుకునేందుకు పొగాకు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా చేరింది. వచ్చే జీతం సరిపోకపోవడంతో రుణం తీసుకొని ఇంట్లోనే బట్టల దుకాణం ప్రారంభించింది. అయితే దొంగలు పడి బట్టలన్నీ దోచుకెళ్లారు. దీంతో కొన్నాళ్లు దిగాలు పడ్డ ఉషారాణి తన బిడ్డలను పోషించుకోవడానికి పడి లేచిన కెరటంలా నిలబడింది. కంపెనీల నుంచి బయో ఎరువులను తీసుకొని మార్కెటింగ్కు శ్రీకారం చుట్టింది. 10 ఏళ్ల పాటు ఊరూరా తిరుగుతూ వాటిని అమ్ముతూ కుటుంబానికి ఆసరాగా నిలిచింది. అంతేకాకుండా గోశాల నుంచి సేకరించిన గోమూత్రం, పేడ వ్యర్థాలతో స్వయంగా బయో ఎరువులు తయారు చేస్తూ రైతులకు విక్రయించడం మొదలుపెట్టింది. ఆ తర్వాత సొంతంగా పాడి గేదెలను కొనుగోలు చేసి బయో ఎరువుల తయారీ యూనిట్ పెట్టింది. తాను స్వయంశక్తితో నిలదొక్కుకోవడమే కాకుండా పది మందికి ఉపాధి కల్పిస్తోంది. అంతటితో ఆగకుండా తనకున్న 1.40 ఎకరాలతో పాటు మరో ఆరెకరాలు కౌలుకు తీసుకొని ప్రకృతి సాగు చేపట్టింది. వరితో పాటు మిరప, మునగ, పసుపు, కాలీఫ్లవర్ పంటలను సాగు చేస్తోంది. ఇటీవల స్త్రీ (శాస్త్ర, సాంకేతిక, పరిశోధన, ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రోత్సాహం) అవార్డును అందుకుంది. మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లా.. రెండో అబ్బాయి పుట్టిన మూడు నెలలకే భర్త చనిపోయారు. ఏం చేయాలో పాలుపోలేదు. జీవితం ఎన్నో పాఠాలు నేర్పింది. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. అయినా మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లా – కొండా ఉషారాణి, మహిళా రైతు, నూతక్కి, గుంటూరు జిల్లా -
లెమన్ గ్రాసే లచ్చిందేవి!
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్ : వారందరూ ఓ చిన్న తండాకు చెందిన గిరిజన మహిళలు. రెక్కాడితే గానీ డొక్కాడదు. ఆ పరిస్థితి నుంచి బయట పడేందుకు, తమ కుటుంబాలను గాడిన పెట్టేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. చివరకు అందరూ ఏకమై దారులు వెతికారు. వినూత్న ఆలోచనను ఒడిసిపట్టి విజయబావుటా ఎగురవేశారు. లెమన్ గ్రాస్ (నిమ్మగడ్డి)తో సుగంధ ద్రవ్యాన్ని (నూనె) తయారుచేస్తూ.. ఓ అంతర్జాతీయ ఏజెన్సీ సహకారంతో మార్కెటింగ్ చేస్తూ ఔరా అనిపిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే తొలి యూనిట్ ఏర్పాటు చేసి ఆర్థికాభివృద్ధి దిశగా పయనిస్తూ.. అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న చీకరుచెట్టు తండా మహిళలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.. అడుగులు ఇలా.. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని చీకరుచెట్టు తండా జనాభా 570 మంది. ఈ చిన్న తండాలో 14 మహిళా సంఘాలు ఉండగా.. ఇందులో సుమారు 150 మంది సభ్యులు ఉన్నారు. గతంలో బ్యాంకు లింకేజీ రుణాలతో చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేవారు. ఆంధ్రప్రదేశ్లోని సెరా అనే సంస్థ మహిళా చైతన్యం, ఆర్థికాభివృద్ధిపై 2021 జనవరిలో జిల్లాలోని పలు గ్రామాల్లో మహిళా సంఘాలకు అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. ఈ క్రమంలోనే పెద్దమందడి మండలంలోని దొడగుంటపల్లిలో జరిగిన సదస్సుకు చీకరచెట్టు తండాలోని మహిళలు హాజరయ్యారు. లెమన్ గ్రాస్తో సుగంధ ద్రవ్యంతో పాటు పలు ఉత్పత్తులు తయారు చేయవచ్చని తెలుసుకున్నారు. పదిమంది మహిళలు గ్రూపుగా ఏర్పడి.. తమ ఆసక్తిని అప్పటి కలెక్టర్ షేక్ యాస్మిన్భాషా దృష్టికి తీసుకెళ్లారు. ఆమె ఆర్థిక సాయంతో పాటు ప్రోత్సాహం అందించడంతో.. వారంతా ఝాన్సీలక్ష్మీబాయి మహిళా సంఘంగా ఏర్పడి సుగంధ ద్రవ్యం, ఇతర ఉత్పత్తుల తయారీ యూనిట్ను ప్రారంభించారు. అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం మొత్తం యూనిట్ కాస్ట్ రూ.11.50 లక్షలు కాగా.. కలెక్టర్ నుంచి రూ.6.50 లక్షలు, సెరా సంస్థ రూ.2 లక్షలు సాయం లభించింది. మహిళలు తమవంతుగా రూ.3 లక్షలు వేసుకుని యూనిట్ను నెలకొల్పారు. మొదట లెమన్ గ్రాస్ సేకరించి సుగంధ ద్రవ్యం తయారు చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత నూనెతో పలు ఉత్పత్తులకూ రూపకల్పన చేశారు. అంతేకాదు.. వీటిని మార్కెటింగ్ చేయడం ఎలా అని ఆలోచించి ఓ స్వచ్ఛంద సంస్థ సహకారం తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఓ ఇంటర్నేషనల్ మార్కెటింగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. యూనిట్ ఏర్పాటుకు సంబంధించి ట్రికా నుంచి ఇటీవల రూ.11.13 లక్షల సబ్సిడీ విడుదలైంది. లీటర్ ఆయిల్కు రూ.1,400 టన్ను నిమ్మగడ్డితో ఆ మహిళలు ఆరు లీటర్ల నూనె తయారు చేస్తున్నారు. మార్కెట్లో ఈ ఆయిల్ లీటర్కు రూ.1,400 పలుకుతోంది. ఈ నూనెతో క్రిమినాశక సబ్బులు, షాంపూలు, పలు కాస్మోటిక్స్, ఫేస్ క్రీమ్, హెయిర్ ఆయిల్, లెమన్టీ పౌడర్ తయారు చేయవచ్చు. ప్రస్తుతం ఇక్కడి మహిళలు సబ్బులు, ఫినాయిల్, ఫ్లోర్ క్లీనర్, సెంట్లు, లెమన్ టీ పౌడర్ తయారు చేసి విక్రయిస్తున్నారు. భవిష్యత్లో అగర్బత్తులతో పాటు ధూప్ స్టిక్స్ ఇతరత్రా తయారు చేయనున్నట్లు మహిళలు వెల్లడించారు. పెరుగుతున్న సాగు సంఘంలో ఉన్న సభ్యులు మొదట తమ తమ వ్యవసాయ పొలాల్లో నిమ్మగడ్డి సాగు చేశారు. తర్వాత తాము కొంటామంటూ చుట్టుపక్కల గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయడంతో పాటు రైతులను యూనిట్ వద్దకు తీసుకెళ్లి అవగాహన కల్పించారు. ఈ క్రమంలో దొడగుంటపల్లి, పామిరెడ్డిపల్లి, చిలకటోనిపల్లి, పెద్దమందడి గ్రామాల్లో చాలామంది రైతులు లెమన్ గ్రాస్ సాగు చేపట్టారు. ఈ మేరకు టన్ను నిమ్మగడ్డికి రూ.4 వేలు ఇవ్వడంతో పాటు మంట కోసం ఉపయోగించిన గడ్డి కాలిపోగా వచ్చిన బూడిదను పొలాల్లో ఎరువుగా వినియోగించేందుకు సదరు రైతులకే అందజేస్తున్నారు. ఆదరణ లభిస్తోంది.. నిమ్మగడ్డి పంట రెండు నెలలకోసారి వస్తుంది. అయినా దీని సాగు ఇంకా పెరగాల్సి ఉంది. ఈ మేరకు కృషి చేస్తున్నాం. ప్రస్తుతం రెండు నెలలకోసారి 80 నుంచి 100 లీటర్ల వరకు ఆయిల్ విక్రయిస్తున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించిన ఎగ్జిబిషన్లలో పాల్గొన్నాం. మేం తయారు చేసే లెమన్ గ్రాస్ ఆయిల్, సబ్బులు ఇతరత్రా ఉత్పత్తుల్లో ఎలాంటి రసాయనాలు లేకపోవడంతో మంచి ఆదరణ ఉంది. వనపర్తి కలెక్టరేట్లో లెమన్ టీ సెంటర్ ఏర్పాటు చేశాం. – మోతీబాయి, ఝాన్సీ లక్ష్మీబాయి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు -
షాపర్టైన్మెంట్కు స్వాగతం
తాము ఇష్టపడే వస్తువును కొనడానికి వెబ్సైట్లలోకి వెళ్లే యువతరం... అక్కడ కనిపించే సుదీర్ఘమైన సమాచారాన్ని చదవడం బోర్గా ఫీలవుతున్నారు.అలా అని వస్తువుగురించి పూర్తిగా తెలుసుకోకుండా కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో లైవ్ ‘షాపర్టైన్మెంట్’ను ఇష్టపడుతున్నారు.వెబ్సైట్లలో వన్సైడ్ కమ్యూనికేషన్ ఇష్టపడని వారికి లైవ్ కామర్స్ యాప్లు దగ్గరయ్యాయి. మహారాష్ట్రలోని నాసిక్కు చెందిన 25 సంవత్సరాల కనిక షిండే యాక్టివ్ ఆన్లైన్ షాపర్. రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం లైవ్ స్ట్రీమింగ్కు ప్రాధాన్యత ఇస్తుంది. ఇప్పుడు ఆమె నోట పదేపదే వినిపిస్తున్నమాట షాపర్టైన్మెంట్. ‘షాపర్టైన్మెంట్లో షాప్కు వెళ్లి సరదాగా షాపింగ్ చేసిన అనుభూతి కలుగుతుంది. లిప్స్టిక్ నుంచి ఐ షాడోస్ వరకు మనం ఎంపిక చేసుకునే వస్తువుల విషయంలో స్పష్టత వస్తుంది. ఆ వస్తువులకు సంబంధించి సందేహాలకు వెంటనే సమాధానాలు దొరుకుతాయి’ అంటుంది కనిక. నాసిక్లోని కనిక షిండే మాత్రమే కాదు మన దేశంలో చిన్న, పెద్ద పట్టణాలు అనే తేడా లేకుండా జెన్–జెడ్, మిలీనియల్స్ రియల్ టైమ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం ‘షాపర్టైన్మెంట్’కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడది వారికి ఫ్యాషన్గా కూడా మారింది. చైనీస్ డిజిటల్ మార్కెట్లో పుట్టిన ‘షాపర్టైన్మెంట్’ (కాంబినేషన్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇ– కామర్స్, వీడియో కంటెంట్) ట్రెండ్ ఇప్పుడు మన దేశంలోనూ హల్చల్ చేస్తోంది.చైనాలో ‘షాపర్టైన్మెంట్’ అనేది పాపులర్ ట్రెండ్గా ఉంది. చైనాకు చెందిన దిగ్గజ షాపింగ్ ప్లాట్ఫామ్ ‘టవ్భావ్’ షాపర్టైన్మెంట్కు ఊపు ఇచ్చింది. అమ్మకాల్లో కొత్త చరిత్ర సృష్టించింది. ‘ఇది కేవలం మరో మార్కెటింగ్ ట్రెండ్ కాదు. రిటైల్ ఇండస్ట్రీ ముఖచిత్రాన్ని మార్చే పరిణామం’ అంటున్నారు విశ్లేషకులు.చైనాలోని షార్ట్ వీడియో ప్లాట్ఫామ్స్ దౌయిన్, క్లైష్ ‘షాపర్టైన్మెంట్’ ట్రెండ్ దూసుకుపోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి.యువతరాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్నసంస్థల నుంచి పెద్ద సంస్థల వరకు ‘షాపర్టైన్మెంట్’కు పెద్ద పీట వేస్తున్నాయి. ఫ్లిప్కార్ట్ ఫ్యాషన్ అండ్ లైఫ్స్టైల్ ప్లాట్ఫాం ‘మింత్రా’ లైవ్ వీడియో స్ట్రీమింగ్ యాప్ లాంచ్ చేసింది. 2026 కల్లా ‘షాపర్టైన్మెంట్’ అమ్మకాలు గణనీయంగా పెరగనున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఇ–కామర్స్ ప్రపంచంలో కస్టమర్ రివ్యూలు కొనుగోలు ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే ఇవి కొన్నిసార్లు గందరగోళంగా మారి ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితిలోకి నెడతాయి. ఇలాంటి సమయంలోనే షాపర్టైన్మెంట్కు ప్రాధాన్యత పెరుగుతుంది. – హరిత, కోజికోడ్ (కేరళ) వెబ్సైట్లలో కనిపించే సుదీర్ఘమైన సమాచారం చదవాలంటే బోర్గా ఉంటుంది. మనం కావాలనుకున్న వస్తువును కంటితో చూసి కొనుగోలు చేయడంలోనే మానసిక తృప్తి ఉంటుంది. – శాంతిస్వర, చెన్నై -
నవంబర్లో సేవలకు పటిష్ట డిమాండ్
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం నవంబర్లో మూడు నెలల గరిష్ట స్థాయికి ఎగసింది. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ 56.4గా నమోదయ్యింది. అక్టోబర్లో ఇది 55.1 వద్ద ఉంది. పీఎంఐ 50 శాతంలోపు ఉంటే క్షీణతగా, ఆపైన ఉంటే వృద్ధి ధోరణిగా పరిగణించడం జరుగుతుంది. ఈ ప్రాతిపదికన దేశ ఎకానమీలో మెజారిటీ పాత్ర పోషిస్తున్న సేవల రంగం వరుసగా 20 నెలల నుంచి వృద్ధి ధోరణిలోనే కొనసాగుతోంది. ఎస్అండ్పీ గ్లోబల్ మార్కెట్ ఇంటెలిజెన్స్లో ఎకనామిక్స్ అసోసియేట్ డైరెక్టర్ పోలియానా డీ లిమా తెలిపిన సమాచారం ప్రకారం, నవంబర్లో సేవల రంగానికి పటిష్ట డిమాండ్ నెలకొంది. మార్కెటింగ్, అమ్మకాలు బాగున్నాయి. సేవల రంగం నవంబర్లో చక్కటి ఉపాధి అవకాశాలనూ కల్పించింది. అయితే కంపెనీలు అత్యధిక నిర్వహణా వ్యయాలను ఎదుర్కొన్నాయి. సేవలు–తయారీ కలిపినా.. స్పీడే! ఇక తయారీ, సేవల రంగం కలిపిన ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్పుట్ ఇండెక్స్ అక్టోబర్లో 55.5గా ఉంటే, నవంబర్లో 57.7కు ఎగసింది. ఈ రెండు విభాగాల్లో ప్రైవేటు రంగ క్రియాశీలత పెరిగినట్లు తమ సర్వేలో వెల్లడైనట్లు డీ లిమా తెలిపారు. ఒక్క తయారీ రంగానికి సంబంధించి ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) చూస్తే, నవంబర్లో 55.7గా నమోదయ్యింది. అక్టోబర్లో ఈ సూచీ 55.3 వద్ద ఉంది. గడచిన మూడు నెలల్లో సూచీ ఈ గరిష్ట స్థాయిల్లో నమోదుకావడం ఇదే తొలిసారి. సూచీ 50పైన ఉంటే వృద్ధిగా, ఆ లోపునకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. ఈ ప్రాతిపదికన పీఐఎం వరుసగా 17 నెలల నుంచి వృద్ధి బాటనే పయనిస్తోంది. -
విజయపథం: ఆలోచనే ఆదాయం
చిన్నప్పుడెప్పుడో స్నేహితురాలికి సినిమా కథ చెప్పింది రమ్య. ఆ స్నేహితురాలు మరుసటిరోజే సినిమా చూసింది. ‘ఆ సినిమా కంటే నువ్వు చెప్పిన విధానమే బాగుంది’ అని రమ్యకు కితాబు ఇచ్చింది. ప్రతిభ వృథా పోదు అంటారు. రమ్యలోని ప్రతిభ కూడా అంతే. ఒక అంశాన్ని ఆకర్షణీయంగా చెప్పే ఆమె ప్రతిభ మార్కెటింగ్ రంగంలో తనకు ఎంతో బలాన్ని ఇచ్చింది. ‘రమ్య రామచంద్రన్... యంగ్ ఇన్ఫ్లూయెన్సర్ మార్కెటింగ్ ఎంటర్ప్రెన్యూర్’గా గుర్తింపు తెచ్చుకోవడానికి ఉపయోగపడింది. ‘హుపల్’ పేరుతో ముంబై కేంద్రంగా డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్ ఏజెన్సీని స్థాపించి విజయం సాధించింది రమ్య. డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్ రంగంలోకి అడుగు పెట్టడం సులువే కానీ, అక్కడ గెలుపు జెండా ఎగరేయడం మాత్రం సులువు కాదు. ఎంతో పోటీ ఉంటుంది. అందుకే ఆషామాషీగా ఏజెన్సి ప్రారంభించలేదు రమ్య. యాక్టివ్ సోషల్మీడియా యూజర్ల సంఖ్య ఎంత, ఏ వయసు వాళ్లు ఎక్కువ మంది ఉన్నారు, వారి స్క్రీన్టైమ్ ఎంత? ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకొని ఏజెన్సీ ప్రారంభించింది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ల గురించి తెలుసుకుంటూ ఉండేది. ‘వీరి ప్రతిభను మనం ఎలా ఉపయోగించుకోగలమా’ అని ఆలోచించేది. ‘ఈ తరం వాళ్లకు ఏది చెప్పినా ఇది మాకు సంబంధించిన విషయమే అన్నట్లుగా చెప్పాలి. ఉన్న వాస్తవాన్ని పదింతలు పెద్దచేసి చూపించే కంటెంట్ను వారు ఇష్టపడడం లేదు’ అంటుంది రమ్య. డిజిటల్ ఇన్ఫ్లూయెన్సర్ కంటెంట్ మార్కెటింగ్కు ఉజ్వల భవిష్యత్ ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని సరికొత్త భవిష్యత్ వ్యూహాలతో సిద్ధం అవుతుంది రమ్య. ‘విజయం అనేది ఒక ప్రాజెక్ట్ కు మాత్రమే పరిమితం. అది పునరావృతం కావాలంటే బుర్రకు ఎప్పుడూ పదును పెడుతూనే ఉండాలి. ఇతరుల కంటే ఎంత భిన్నంగా ఆలోచిస్తున్నామనేదే మన బలం అవుతుంది. మన విజయానికి ఇంధనం అవుతుంది’ అంటున్న రమ్య రామచంద్రన్ మాటలు నిజం కదా. -
గ్యాస్లో పెట్టుబడులకు ధర విషయంలో స్వేచ్ఛ కీలకం
న్యూఢిల్లీ: సముద్రాల్లో వందల కొద్దీ మీటర్ల లోతున ఉండే సహజ వాయువు నిక్షేపాలను కనుగొని, వెలికి తీయాలంటే బిలియన్ల కొద్దీ డాలర్ల పెట్టుబడులు అవసరమవుతాయని రిలయన్స్ ఇండస్ట్రీస్ సీనియర్ వీపీ సంజయ్ రాయ్ తెలిపారు. ఈ రంగంలోకి పెట్టుబడులు రావాలంటే ధర, మార్కెటింగ్పరమైన స్వేచ్ఛ కల్పించడం కీలకమని పేర్కొన్నారు. చమురు, గ్యాస్ ఆపరేటర్ల సమాఖ్య ఏవోజీవో ఈ విషయాన్నే గ్యాస్ ధరను సమీక్షిస్తున్న ప్రభుత్వ నియమిత కిరీట్ పారిఖ్ కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రెండో త్రైమాసిక ఫలితాల ప్రకటన తర్వాత ఇన్వెస్టర్ కాల్లో పాల్గొన్న సందర్భంగా రాయ్ ఈ విషయాలు వివరించారు. అటు వినియోగ సంస్థలు మాత్రం గ్యాస్ ధరపై ఎంతో కొంత పరిమితి ఉండాలని కోరుకుంటున్నట్లు రాయ్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పారిఖ్ కమిటీ రాబోయే కొన్ని వారాల్లో నివేదికను సమర్పించే అవకాశం ఉందని తెలిపారు. ప్రస్తుతం ప్రైమరీ ఎనర్జీ బాస్కెట్లో 6.7 శాతంగా ఉన్న దేశీ గ్యాస్ వాటాను 2030 నాటికి 15 శాతానికి పెంచుకోవాలన్న లక్ష్యాన్ని సాధించాలంటే కనీసం రూ. 2–3 లక్షల కోట్ల పెట్టుబడులు అవసరమవుతాయని కమిటీకి ఏవోజీవో తెలిపింది. విద్యుత్తు, ఎరువులు మొదలైన వాటి ఉత్పత్తిలో సహజ వాయువును వినియోగిస్తారు. -
భారత్లో డిమాండ్ ఉన్న టాప్-10 నైపుణ్యాలేవో తెలుసా మీకు?
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా డిమాండ్ కలిగిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలకు వీలుంటుందని లింక్డ్ఇన్ నివేదిక తెలిపింది. ఈ తరహా నైపుణ్యాల విషయంలో ఉద్యోగార్థులకు సాయం చేయడం, వారి కెరీర్కు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో.. ‘స్కిల్స్ ఎవల్యూషన్ 2022’, ‘ఫ్యూచర్ ఆఫ్ స్కిల్స్ 2022’ డేటాను లింక్డ్ఇన్ విడుదల చేసింది. లింక్డ్ఇన్కు భారత్లో 9.2 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వారి నైపుణ్యాల డేటా ఆధారంగా.. వృద్ధి చెందుతున్న టాప్10 నైపుణ్యాలు, భవిష్యత్ నైపుణ్యాల వివరాలను తెలియజేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అంతర్జాతీయంగా ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాల్లో 25 శాతం మార్పు చోటు చేసుకుందని.. 2025 నాటికి 41 శాతం మార్పు చోటు చేసుకుంటుందని తెలిపింది. భారత్లో వీటికి డిమాండ్.. భారత్లో డిమాండ్ ఉన్న టాప్-10 నైపుణ్యాల వివరాలను లింక్డ్ఇన్ తెలియజేసింది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఎస్క్యూఎల్, సేల్స్, జావా, సేల్స్ మేనేజ్మెంట్, మైక్రోసాఫ్ట్ అజూర్, స్ప్రింగ్బూట్ డిమాండ్ నైపుణ్యాలుగా ఉన్నాయి. 2015 నుంచి చూస్తే కార్పొరేట్ సేవల పరంగా నైపుణ్యాల్లో 41.6 శాతం మార్పు చోటు చేసుకుంది. ఫైనాన్షియల్ రంగంలో.. జీఎస్టీ, టీడీఎస్, స్టాట్యుటరీ ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. సాఫ్ట్వేర్, ఐటీ సేవల పరంగా పదింటికి గాను ఆరు నైపుణ్యాలు కొత్తవే ఉన్నాయి. మీడియా ఆన్లైన్ మాధ్యమంలో విస్తరిస్తున్న క్రమంలో.. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో), వెబ్ కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, బ్లాగింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. బ్రాంచ్ బ్యాంకింగ్, బ్రాంచ్ ఆపరేషన్స్ నైపుణ్యాలకు ఫైనాన్షియల్లో డిమాండ్ నెలకొంది. అంటే ఆఫ్లైన్ బ్యాంకింగ్ సేవలకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. హెల్త్కేర్ రంగంలో నైపుణ్యాల పరంగా 2015 తర్వాత 30 శాతం మార్పు చోటు చేసుకుంది. -
గిగ్ వర్కర్లకు ఫుల్ డిమాండ్, గిగ్ వర్కర్లు అంటే ఎవరు?
ముంబై: గిగ్ వర్కర్లకు(తాత్కాలిక పనివారు/సంప్రదాయ వ్యవస్థకు వెలుపల చేసేవారు/రెగ్యులర్ రోల్స్ కాకుండా ఒప్పందం మేరకు చేసేవారు)మే నెలలో డిమాండ్ 22 శాతం పెరిగింది. ప్రధానంగా విక్రయాలు, మార్కెటింగ్ విభాగంలో ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంది. క్వెస్ కార్ప్కు చెందిన స్టార్టప్ టాస్క్మో తన తొలి ‘టాస్క్మో గిగ్ ఇండెక్స్’ (టీజీఐ) నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి తర్వాత భారతీయ కంపెనీలు గిగ్ వర్కర్ల కోసం, ప్రాజెక్టు ఆధారిత తాత్కాలిక ఉద్యోగుల కోసం ఎక్కువగా చూస్తున్నట్టు ఈ నివేదిక తెలిపింది. బిజినెస్ డెవలప్మెంట్, క్షేత్రస్థాయిలో విక్రయాలు, చివరి వరకు చేరుకోవడం, డిజిటల్ ప్రచారం, బ్రాండ్ ప్రచారానికి గిగ్ వర్కర్లపైనే కంపెనీలు ఎక్కువగా ఆధార పడుతున్నాయి. మార్కెటింగ్, సేల్స్ విభాగాల్లో వీరికి డిమాండ్ మూడొంతులు పెరిగింది. క్విక్ కామర్స్లో 300 శాతం (వేగంగా డెలివరీ చేసేవి), హెల్త్టెక్లో 250 శాతం, ఫిన్టెక్లో 200 శాతం, ఈకామర్స్లో 198 శాతం చొప్పున గిగ్ వర్కర్లకు డిమాండ్ పెరిగిందని ఈ నివేదిక తెలియజేసింది. 2022 జనవరి-మే నెల మధ్య ధోరణలను ఈ నివేదికలో టాస్క్మో వివరంగా ప్రస్తావించింది. తన ప్లాట్ఫామ్లో మే నెలలో 60వేల మంది గిగ్ వర్కర్లు పేర్లను నమోదు చేసుకున్నట్టు టాస్క్మో తెలిపింది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement