-
World Cup 2023: వరల్డ్కప్లో దారుణ ప్రదర్శన.. పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ రాజీనామా
వన్డే ప్రపంచకప్-2023లో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ జట్టు.. లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ఈ క్రమంలో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ తన పదవికి రాజీనామా చేశాడు. ఈ ఏడాది జూన్లో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)తో మోర్కెల్ ఆరు నెలల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ ఏడాది డిసెంబర్ వరకు ఇంకా సమయం ఉనప్పటికీ మోర్కెల్ ముందుగానే తన పదవి నుంచి తప్పుకున్నాడు. అయితే తన పదవీ కాలాన్ని పొడిగిస్తారని మొదటిలో వార్తలు విన్పించినప్పటికి.. వరల్డ్కప్లో పాక్ పేసర్లు దారుణంగా విఫలమకావడంతో మోర్కెల్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఈ ఏడాది జూలైలో శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్తో పాక్ బౌలింగ్ కోచ్గా మోర్కెల్ ప్రయాణం మొదలైంది. ఇక మోర్కెల్ తప్పుకోవడంతో పాకిస్తాన్ బౌలింగ్ కోచ్గా ఉమర్ గుల్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. గతంలో కూడా ఉమర్ గుల్ పాక్ బౌలింగ్ కోచ్గా వ్యవహరించాడు. వచ్చే నెలలో పాకిస్తాన్ జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లానుంది. ఈ పర్యటనకు ముందు పాకిస్తాన్కు కొత్త బౌలింగ్ కోచ్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ టూర్లో భాగంగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో మూడు టెస్టుల సిరీస్లో పాక్ తలపడనుంది. -
IPL 2024: లక్నో సూపర్ జెయింట్స్ కీలక ప్రకటన.. ఇకపై గంభీర్..
IPL 2024- Lucknow Super Giants: ఐపీఎల్-2024 నేపథ్యంలో లక్నో సూపర్ జెయింట్స్ ఫ్రాంఛైజీ తమ కోచింగ్ సిబ్బందిని ప్రకటించింది. టీమిండియా మాజీ స్టార్ గౌతం గంభీర్ను గ్లోబల్ మెంటార్గా ప్రమోట్ చేసిన మేనేజ్మెంట్.. శ్రీధరన్ శ్రీరామ్ను తమ కుటుంబంలోకి ఆహ్వానించింది. హెడ్కోచ్ అతడే గతంలో ఆస్ట్రేలియా క్రికెట్ స్పిన్ కన్సల్టెంట్గా పనిచేసిన శ్రీరామ్ ఎల్ఎస్జీ అసిస్టెంట్ కోచ్గా సేవలు అందించనున్నాడు. ఇక లక్నో ఫ్రాంఛైజీ తమ జట్టు హెడ్కోచ్గా ఇప్పటికే జస్టిన్ లాంగర్ను నియమించిన విషయం తెలిసిందే. అతడికి తోడుగా.. విజయ్ దహియా, ప్రవీణ్ తాంబేలతో పాటు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్లు మోర్నీ మోర్కెల్, జాంటీ రోడ్స్ అసిస్టెంట్ కోచ్లుగా పనిచేయనున్నారు. PC: LSG బంగ్లాదేశ్ను గెలుపుబాటలో నడిపి శ్రీధరన్ శ్రీరామ్ చేరిక లక్నో సూపర్ జెయింట్స్కు అదనపు బలంగా మారనుంది. 47 ఏళ్ల ఈ టీమిండియా మాజీ స్పిన్నర్ గతంలో బంగ్లాదేశ్ పురుషుల టీ20 జట్టుకు మార్గదర్శనం చేశాడు. టీ20 వరల్డ్కప్-2022లో సూపర్-12లో బంగ్లా అద్భుతంగా ఆడేలా కోచింగ్ ఇచ్చాడు. ఆస్ట్రేలియా జట్టుకు సైతం అంతేకాదు.. ఆస్ట్రేలియా జట్టుకు సైతం శ్రీరామ్ కోచ్గా వ్యవహరించాడు. టీ20 వరల్డ్కప్, 2021-22 యాషెస్ సిరీస్ సమయంలో జట్టుతో ప్రయాణించాడు. అదే విధంగా.. గతంలో ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు అసిస్టెంట్ కోచ్గా పనిచేశాడు. ప్లేఆఫ్స్ చేరినా.. లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్ గాయంతో సీజన్ మధ్యలోనే వైదొలిగినా జట్టు ఐపీఎల్-2023 ప్లే ఆఫ్స్నకు అర్హత సాధించగలిగింది. కోల్కతా నైట్ రైడర్స్ కేవలం ఒకే ఒక్క రన్ తేడాతో టాప్-4లో నిలిచిన లక్నో కీలక మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఇంటిబాట పట్టింది. కోహ్లి- గంభీర్ వివాదం ఇదిలా ఉంటే.. లక్నో- ఆర్సీబీ మ్యాచ్ సందర్భంగా నవీన్ ఉల్ హక్ కారణంగా విరాట్ కోహ్లి- గంభీర్ మధ్య తలెత్తిన గొడవ వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. స్థాయి మరిచి ప్రవర్తించిన ఈ ఇద్దరు స్టార్లపై క్రికెట్ దిగ్గజాలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చదవండి: అవసరం లేదు! సంజూ శాంసన్ను స్వదేశానికి పంపిన బీసీసీఐ S Sriram joins to complete our coaching staff for 2024 💙 Full story 👉 https://t.co/4svdieJytL pic.twitter.com/8EgX2Pg8uP — Lucknow Super Giants (@LucknowIPL) September 9, 2023 -
T20 WC 2023: న్యూజిలాండ్ బౌలింగ్ కోచ్గా సౌతాఫ్రికా మాజీ పేసర్
Morne Morkel: సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ న్యూజిలాండ్ కోచింగ్ స్టాఫ్లో భాగం కానున్నాడు. స్వదేశంలో జరుగనున్న మహిళా టీ20 ప్రపంచకప్ టోర్నీ నేపథ్యంలో వైట్ఫెర్న్స్కు బౌలింగ్లో మెళకువలు నేర్పించనున్నాడు. కివీస్ మహిళా జట్టు ఫాస్ట్ బౌలింగ్ కోచ్గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఈ విషయాన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. కాగా 38 ఏళ్ల మోర్నీ మోర్కెల్ ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టీ20 ప్రపంచకప్ ఈవెంట్లో నమీబియా పురుషుల జట్టు కోచ్గా పనిచేశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా టీ20 లీగ్తో బిజీగా ఉన్నాడు. ప్రొటిస్ పొట్టి లీగ్లో అతడు డర్బన్ సూపర్జెయింట్స్ బౌలింగ్ కోచ్గా పనిచేస్తున్నాడు. సౌతాఫ్రికాలో టోర్నీ ఈ క్రమంలో మెగా టోర్నీ నేపథ్యంలో న్యూజిలాండ్ ఈ మేరకు మోర్కెల్ నియామకానికి సంబంధించి నిర్ణయం తీసుకోవడం విశేషం. సౌతాఫ్రికాలో ఈ వరల్డ్కప్ జరుగనున్న తరుణంలో అక్కడి పిచ్ల గురించి అవగాహన ఉన్న మేటి బౌలర్ను తమ కోచ్గా ఎంపిక చేసుకోవడం గమనార్హం. కాగా 2006- 2018 మధ్య కాలంలో మోర్నీ మోర్కెల్ సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. జాతీయ జట్టు తరఫున మొత్తంగా 86 టెస్టులు, 117 వన్డేలు, 44 టీ20 మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ టెస్టులో 309, వన్డేల్లో 188, టీ20లలో 47 వికెట్లు తీశాడు. ఇక న్యూజిలాండ్ మహిళా జట్టు ఇటీవలి కామన్వెల్త్ గేమ్స్లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే. కాగా ఫిబ్రవరిలో మహిళ టీ20 వరల్డ్కప్ టోర్నీ ఆరంభం కానుంది. ఐసీసీ మహిళల టి20 ప్రపంచకప్ ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు వేదిక: దక్షిణాఫ్రికా మొత్తం జట్లు: 10 చదవండి: IND vs SL: శ్రేయస్ అయ్యర్ సూపర్ బౌలింగ్.. కోహ్లి షాకింగ్ రియాక్షన్! వీడియో వైరల్ Sarfaraz Khan: అప్పుడేమో సిద్ధంగా ఉండమన్నారు! కానీ చివరకు.. నేనూ మనిషినే.. నాకూ భావోద్వేగాలు ఉంటాయి.. -
'37 ఏళ్ల వయస్సులో అదరగొడుతున్నాడు.. అతడిని జట్టులోకి తీసుకోండి'
ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్కు ఫాప్ డు ప్లెసిస్ను దక్షిణాఫ్రికా జట్టులోకి తీసుకోవాలని ఆ దేశ మాజీ పేసర్ మోర్నే మోర్కెల్ అభిప్రాయపడ్డాడు. కాగా డుప్లెసిస్ ప్రస్తుతం దక్షిణాఫ్రికా క్రికెట్కు సంబంధించిన ప్రణాళికలలో భాగంగా లేడు. అదే విధంగా అతడు తన దక్షిణాఫ్రికా క్రికెట్ సెంట్రల్ కాంట్రాక్ట్ను కోల్పోయాడు. కాగా డుప్లెసిస్ తన చివరి అంతర్జాతీయ మ్యాచ్ 2020లో ఆడాడు. ఇక ఐపీఎల్-2022లో ఆర్సీబీ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన డుప్లెసిస్ పర్వాలేదనిపించాడు. ఈ ఏడాది సీజన్లో 468 పరుగులు చేసిన డుప్లెసిస్.. ఆర్సీబీ ప్లే ఆఫ్స్కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. "డు ప్లెసిస్ 37 ఏళ్ల వయస్సులో కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ఫీల్డింగ్లో కూడా అదరగొడుతున్నాడు. డుప్లెసిస్ ఐపీఎల్లో ఆర్సీబీ తరుపున అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. కాబట్టి అటువంటి అనుభవజ్ఞుడైన ఆటగాడు దక్షిణాఫ్రికా జట్టులో ఉండాలి. క్రికెట్ సౌతాఫ్రికా పునరాలోచన చేసి అతడిని ప్రపంచకప్కు జట్టులోకి తీసుకురావాలి" అని మోర్కెల్ పేర్కొన్నాడు. చదవండి: Sourav Ganguly 50th Birthday: లండన్లో బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకున్న దాదా -
మోర్నీ మోర్కెల్ వేగవంతమైన బంతి.. దిల్షాన్ భయపడ్డాడు
తొలిసారి నిర్వహించిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2022 టోర్నీ విజేతగా వరల్డ్ జెయింట్స్ నిలిచింది. ఆసియా లయన్స్తో జరిగిన ఫైనల్లో వరల్డ్ జెయింట్స్ 25 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్లో ఆసియా లయన్స్ గట్టిపోటీ ఇచ్చినప్పటికి పరాజయం పాలైంది. ఆట సంగతి ఎలా ఉన్నా.. మాజీ క్రికెటర్లంతా ఒక దగ్గరికి చేరి టోర్నీ ఆడడం అభిమానులకు మాత్రం సంతోషాన్ని పంచింది. అయితే ఫైనల్ మ్యాచ్లో వరల్డ్ జెయింట్స్ బౌలర్ మోర్నీ మోర్కెల్ టోర్నీ చరిత్రలో అత్యంత వేగవంతమైన బంతిని సంధించాడు. 37 ఏళ్ల మోర్కెల్ మంచి ఫాస్ట్ బౌలర్ అన్న సంగతి తెలిసిందే. ప్రొటీస్కు క్రికెట్ ఆడిన రోజుల్లో ఎన్నోసార్లు వేగవంతమైన బంతులు విసిరాడు. తాజాగా ఫైనల్ మ్యాచ్లో తిలకరత్నే దిల్షాన్కు వేసిన ఒక బంతి గంటకు 138 కిమీవేగంతో వెళ్లింది. మంచి పేస్తో.. బౌన్స్తో వచ్చిన బంతిని దిల్షాన్ ఆడడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే బంతి విసిరిన తర్వాత పట్టుతప్పిన మోర్కెల్ క్రీజులోనే కిందపడ్డాడు. అతను పడ్డ విధానం చూసి గాయమైందనే అనుకున్నారు. కానీ అదృష్టం బాగుండడంతో మోర్కెల్కు ఎలాంటి గాయం కాలేదు. ఇదే మ్యాచ్లో తన సోదరుడు అల్బీ మోర్కెల్ మూడు వికెట్లతో రాణించాడు. కాగా మోర్నీ మోర్కెల్ దిల్షాన్ను తన తర్వాతి ఓవర్లో స్లో డెలివరీ వేసి బోల్తా కొట్టించాడు. pic.twitter.com/RYsGz7ju8t — Sports Hustle (@SportsHustle3) January 29, 2022 -
Ind Vs Sa: కోహ్లి సెంచరీ కొడతాడు... ఇండియాదే సిరీస్: ప్రొటిస్ మాజీ బౌలర్
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కచ్చితంగా సెంచరీ సాధిస్తాడని ప్రొటిస్ మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ అన్నాడు. సౌతాఫ్రికా పిచ్లు అతడికి అనుకూలిస్తాయని... కోహ్లి శతక్కొట్టడం ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా రన్మెషీన్గా పేరొందిన కోహ్లి... సెంచరీ కొట్టి రెండేళ్లు అవుతోంది. దక్షిణాఫ్రికాతో మూడో టెస్టులో ఈ ఆశ తీరుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. పట్టుదలగా నిలబడిన కోహ్లి తొలి ఇన్నింగ్స్లో 79 పరుగులకే అవుట్ కావడంతో భంగపాటు తప్పలేదు. ఇక టెస్టు సిరీస్లో పరాజయం తర్వాత టెస్టు కెప్టెన్సీకి గుడ్ బై చెప్పడంతో భారత జట్టు సారథిగా కోహ్లి ప్రస్థానం ముగిసిన నేపథ్యంలో కోహ్లికి ఇదే తొలి మ్యాచ్. ఈ నేపథ్యంలో స్టార్ స్పోర్ట్స్ షో లో మోర్నీ మోర్కెల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మేరకు... ‘‘విరాట్ కోహ్లి కచ్చితంగా వంద కొడతాడు. ముఖ్యంగా కేప్టౌన్లో బ్యాటింగ్ చేయడాన్ని అతడు ఆస్వాదిస్తాడు. ఇక్కడి న్యూలాండ్స్ పిచ్పై బ్యాటింగ్ చేయడం తనకిష్టమని కోహ్లి ఎన్నోసార్లు చెప్పాడు. సెంచరీ లేకుండా ఈ సిరీస్ ముగించడు అని గట్టిగా నమ్ముతున్నా’’ అని మోర్కెల్ వ్యాఖ్యానించాడు. ఇక టీమిండియా అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉందన్న ఈ ప్రొటిస్ మాజీ పేసర్... 2-1 తేడాతో సిరీస్ను కైవసం చేసుకుంటుందని అంచనా వేశాడు. మొదటి రెండు మ్యాచ్లకు వేదిక అయిన పర్ల్ వారికి అనుకూలిస్తుందని అభిప్రాయపడ్డాడు. చదవండి: Ind vs Sa ODI Series: రుతురాజ్కు నో ఛాన్స్.. ధావన్, చహల్కు అవకాశం! Guided #TeamIndia with courage & fearlessness 👍 Led the side to historic wins 🔝 Let's relive some of the finest moments from @imVkohli's tenure as India's Test captain. 👏 👏 Watch this special feature 🎥 🔽https://t.co/eiy9R35O4Q pic.twitter.com/4FMCLstZu3 — BCCI (@BCCI) January 17, 2022 -
టీ20 వరల్డ్కప్: తొలిసారి నమీబియా.. జట్టులో అతడు కూడా..
Namibia T20 World Cup 2021 squad: యూఏఈ వేదికగా వచ్చే నెల 17న ఆరంభం కానున్న టీ20 ప్రపంచకప్నకు సదరన్ ఆఫ్రికా దేశం నమీబియా తమ జట్టును ప్రకటించింది. సౌతాఫ్రికా మాజీ ఆల్రౌండర్ డేవిడ్ వీస్కు ఇందులో చోటు కల్పించడం విశేషం. 2016లో దక్షిణాఫ్రికా తరఫున టీ20 వరల్డ్కప్ ఆడిన డేవిడ్.. తన తండ్రి స్వదేశమైన నమీబియా నుంచి ఈసారి ప్రాతినిథ్యం వహించడం గమనార్హం. ఇక హెడ్ కోచ్ పియరీ డీ బ్రున్ శిక్షణలో రాటుదేలిన తమ ఆటగాళ్లతో తొలిసారిగా ఈ మెగా ఈవెంట్లో తలపడేందుకు నమీబియా సిద్ధమవుతోంది. మేనేజ్మెంట్లో ప్రొటిస్ మాజీ ఆటగాడు మోర్నే మోర్కెల్ కూడా ఉండటం మరో విశేషం. కాగా 2019లో దుబాయ్లో జరిగిన క్వాలిఫైయర్ ప్లేఆఫ్ మ్యాచ్లో ఒమన్ను ఓడించడం ద్వారా వరల్డ్కప్నకు నమీబియా అర్హత సాధించింది. ఇక అక్టోబరు 18న శ్రీలంకతో తమ తొలి మ్యాచ్ ఆడనుంది. నమీబియా టీ20 జట్టు ఇదే.. గెర్హాడ్ ఎరాస్మస్(కెప్టెన్), స్టీఫెన్ బార్డ్, కార్ల్ బిర్కెన్స్టాక్, మిచావు డు ప్రీజ్, జాన్ ఫ్రిలింక్, జానే గ్రీన్, జాన్ నికోల్ లోఫ్టీ ఈటన్, బెర్నార్డ్ షోల్ట్, బెన్ షికాంగో, జేజే స్మిత్, రూబెన్ ట్రంపెల్మాన్, మైకేల్వాన్ లింగన్, డేవిడ్ వీజ్, క్రెయిగ్ విలియమ్స్, పిక్కీ యా ఫ్రాన్స్. చదవండి: T20 World Cup 2021: విండీస్ టీ20 జట్టు ఇదే.. ఆరేళ్ల తర్వాత ఆ ఆటగాడికి పిలుపు -
ఎవరీ కుర్రాడు.. రేపటి టెస్టు మ్యాచ్లో ఆడిద్దామా!
జోహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా మాజీ బౌలర్ మోర్నీ మోర్కెల్ ఆ దేశం నుంచి విజయవంతమైన ఫాస్ట్ బౌలర్లలో ఒకడు. మంచి పొడగరి అయిన మోర్కెల్ పదునైన బౌన్సర్లతో ప్రత్యర్థి బ్యాట్స్మెన్లను ఇబ్బందులకు గురి చేసేవాడు. 2006-2018 మధ్య దక్షిణాఫ్రికా తరపున ఆడిన మోర్కెల్ తన 12 ఏళ్ల కెరీర్లో 86 టెస్టుల్లో 309 వికెట్లు,117 వన్డేల్లో 188 వికెట్లు, 44 టీ20ల్లో 47 వికెట్లు తీశాడు. మొత్తంగా దక్షిణాఫ్రికా తరపున 500కు పైగా వికెట్లు తీసిన ఆరో ఆటగాడిగా నిలిచాడు. మోర్నీ మోర్కెల్ సోదరుడు అల్బీ మోర్కెల్ కూడా దక్షిణాఫ్రికా తరపున ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. తాజాగా మోర్కెల్ 2004లో ఈస్ట్రెన్స్ తరపున ఫస్ట్క్లాస్ మ్యాచ్లో ఎలా అరంగేట్రం చేశాననేది చెప్పుకొచ్చాడు. '' 2004లో వెస్టిండీస్ దక్షిణాఫ్రికాలో పర్యటించేందుకు వచ్చింది. ప్రాక్టీస్ మ్యాచ్లో భాగంగా ఈస్ట్రెన్స్తో వారు ఆడాల్సి ఉంది. దీనిలో భాగంగా నా సోదరుడు అల్బీ మోర్కెల్ నా వద్దకు వచ్చి ఈస్ట్రన్స్కు ఒక నెట్ బౌలర్ కావాలి.. నువ్వెందుకు ప్రయత్నించకూడదు అని చెప్పాడు. అలా ఈస్ట్రన్స్ బ్యాట్స్మెన్కు నెట్బౌలర్గా బంతులు విసిరాను. నా బౌలింగ్ చూసిన కోచ్ నా వద్దకు వచ్చి.. '' నీ బౌలింగ్ బాగుంది.. ఏం చేద్దామనుకుంటున్నావు'' అని అడిగాడు.. అతను అడిగింది నాకు అర్థం కాలేదు.. ''ఏమో తెలీదు'' అని సమాధానం ఇచ్చాను. వెంటనే కోచ్ నన్ను ఆఫీస్ రూమ్కు తీసుకెళ్లి జూనియర్ క్రికెటర్గా కాంట్రాక్ట్ ఇప్పించాడు. అలా ఈస్ట్రన్స్ తరపున ఫస్ట్క్లాస్ కెరీర్ను ప్రారంభించాను. కొంతకాలం తర్వాత ఇంగ్లండ్ దక్షిణాఫ్రికాలో పర్యటించింది. కాగా ప్రాక్టీస్ సమయంలో నేను అప్పటి ఆల్రౌండర్ జాక్ కలిస్కు బంతులు విసిరాను. అతను నా బౌలింగ్ చూసి ఇంప్రెస్ అయ్యాడు. కోచ్ జెన్నింగ్స్ వద్దకు వెళ్లి.. ''ఎవరీ కుర్రాడు అద్బుతంగా బౌలింగ్ చేస్తున్నాడు..'' అని అడిగాడు. దానికి కోచ్.. ''అతను అల్బీ మోర్కెల్ తమ్ముడు మోర్నీ మోర్కెల్.. ఈస్ట్రన్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇది విన్న కలిస్.. ఇతన్ని మనం రేపటి టెస్టు మ్యాచ్లో ఆడేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందని'' చెప్పాడు. అని వివరించాడు. అలా 2006లో టీమిండియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్టు ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన మోర్కెల్ 12 ఏళ్ల పాటు ప్రొటీస్కు ప్రాతినిధ్యం వహించాడు. చదవండి: 'ఆ సమయంలో ద్రవిడ్ను చూసి భయపడేవాళ్లం' -
కళ్లు చెదిరే సిక్స్.. కొడితే అవతల పడింది
కాన్బెర్రా: ఆసీస్ ఆల్రౌండర్ బెన్ కటింగ్ మీకందరికి గుర్తుండే ఉంటాడు. 2016లో సన్రైజర్స్ హైదరాబాద్ కప్పు కొట్టడంలో బెన్ కటింగ్ పాత్ర మరువలేనిది. ఆర్సీబీతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్లో 15 బంతుల్లోనే 4 సిక్సర్లు, ఒక ఫోర్తో 39 పరుగులు సాధించాడు. ఆ తర్వాత బౌలింగ్లోనూ కీలకమైన రెండు వికెట్లు తీసి ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచి సన్రైజర్స్కు కప్పు అందించాడు. తాజాగా బిగ్బాష్ లీగ్లో భాగంగా ఆదివారం సిడ్నీ థండర్స్, బ్రిస్బేన్ హీట్ మధ్య ప్లే ఆఫ్ మ్యాచ్ జరుగుతుంది. గెలిస్తే ఫైనల్ అవకాశాలు మరింత మెరుగయ్యే మ్యాచ్లో బెన్ కంటింగ్ జూలు విదిల్చాడు. 18 బంతుల్లోనే నాలుగు సిక్సర్లు, ఒక ఫోర్తో 34 పరుగులతో అజేయంగా నిలిచాడు. అయితే బెన్ కటింగ్ కొట్టిన నాలుగు సిక్సర్లలో .. ఒక సిక్సర్ స్టేడియం అవతల పడింది. మోర్నీ మోర్కెల్ వేసిన 18 ఓవర్ మూడో బంతిని కటింగ్ ప్రంట్ ఫుట్ వచ్చి డీప్ మిడ్ వికెట్ మీదుగా భారీ సిక్సర్ కొట్టగా.. బంతి నేరుగా వెళ్లి స్టేడియం రూఫ్ను తాకుతూ బయటపడింది. మీటర్ రేంజ్లో కటింగ్ కొట్టిన సిక్స్ 101 మీటర్లుగా నమోదైంది. బెన్ కటింగ్ సిక్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: ఆండ్రూ టై కావాలనే అలా చేశాడా! ఈ సీజన్ బిగ్బాష్ లీగ్లో కటింగ్ కొట్టిన సిక్స్ అత్యంత ఎత్తులో వెళ్లిన సిక్స్గా రికార్డుకెక్కింది. కాగా మొదట బ్యాటింగ్ చేసిన సిడ్నీ థండర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. కటింగ్ 34, సామ్ బిల్లింగ్స్ 34 పరుగులతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ ఆడుతున్న బ్రిస్బేన్ హీట్స్ ఇప్పటివరకు 12 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 70 పరుగులు చేసింది. హీట్స్ గెలవాలంటే 48 బంతుల్లో 89 పరుగులు చేయాల్సి ఉంది. చదవండి: దుమ్మురేపిన పుజారా.. కోహ్లి మాత్రం అక్కడే That is OUTTTAAAAA HERE!! Wow! #BBL10 #BBLFinals pic.twitter.com/lOTzhwDtyb — KFC Big Bash League (@BBL) January 31, 2021 -
ఐదో సఫారీ బౌలర్గా..
కేప్టౌన్: ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్ తర్వాత తన అంతర్జాతీయ క్రికెట్ కెరీర్కు వీడ్కోలు చెప్పబోతున్న దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్ మోర్నీ మోర్కెల్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికా తరపున మూడొందల టెస్టు వికెట్లు సాధించిన ఐదో బౌలర్గా మోర్కెల్ గుర్తింపు సాధించాడు. ఆసీస్తో సిరీస్లో భాగంగా మూడో టెస్టు రెండో రోజు ఆటలో మోర్కెల్ నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. తద్వారా మూడొందల టెస్టు వికెట్ల క్లబ్లో మోర్కెల్ చేరిపోయాడు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 9 వికెట్ల నష్టానికి 245 పరుగులు చేసింది. బెన్క్రాఫ్ట్ (77) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్గా నిలిచాడు. దక్షిణాఫ్రికా పేసర్లు మోర్నీ మోర్కెల్ (4/87), రబడ (3/81) ధాటికి ఆసీస్ ఒక దశలో 175 పరుగులకే 8 వికెట్లు కోల్పోయింది. అయితే ఎదురుదాడికి దిగిన లయన్ సఫారీలను అడ్డుకున్నాడు. 8 ఫోర్లతో 47 పరుగులు చేసిన అతను, పైన్ (33 బ్యాటింగ్)తో కలిసి తొమ్మిదో వికెట్కు 66 పరుగులు జోడించాడు. అంతకుముందు దక్షిణాఫ్రికా 311 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్గా వచ్చి చివరి వరకు అజేయంగా నిలిచిన ఎల్గర్ (141 నాటౌట్) మూడో సారి ఈ ఘనత సాధించి విండీస్ దిగ్గజం హేన్స్తో సమంగా నిలవడం విశేషం. -
సఫారీ బౌలర్.. అరుదైన రికార్డు.!
సాక్షి, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో 300 వికెట్ల పడగొట్టిన ఐదో సాఫారీ టెస్ట్ బౌలర్గా గుర్తింపు పొందాడు. అంతకు ముందు అల్లాన్ డోనాల్డ్ (330), షాన్ పొలాక్ (421), మఖాయ ఎన్తినీ(390), డేల్ స్టేయిన్(419)లు ఈ ఘనతను సొంతం చేసుకున్న జాబీతాలో ఉన్నారు. తాజాగా ఆసీస్తో జరుగుతున్న టెస్టు రెండో రోజు ఆటలో మోర్కెల్ ఆసీస్ బ్యాట్స్మన్ ఖాజా, స్మిత్, మార్ష్లను అవుట్ చేసి ఈ ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇక ఆట అనంతరం మోర్కెల్ మాట్లాడుతూ.. ఈ రికార్డు సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికాకు ఆడటమే ప్రత్యేకమన్న మోర్కెల్.. భారత్పై అరంగేట్ర మ్యాచ్, టెస్టుల్లో నెం1గా నిలవడం, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్లను వారి సొంత గడ్డలపై ఓడించడం తన జీవితంలో మరిచిపోలేని అనుభూతి ఇచ్చినట్లు చెప్పుకొచ్చాడు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 311 ఆలౌట్ ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 207/8 -
ఆసీస్తో ఆఖరి ఆట
జొహన్నెస్బర్గ్: దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ త్వరలోనే ఆటకు టాటా చెప్పనున్నాడు. స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతానని మోర్కెల్ సోమవారం ప్రకటించాడు. ‘ఇది చాలా కఠినమైన నిర్ణయం. అయితే వీడ్కోలుకు ఇదే సరైన సమయం. ఇకపై క్రికెట్లేని జీవితాన్ని కొత్తగా ఆస్వాదిస్తా. నాకో మంచి కుటుంబం ఉంది. నేను, నా విదేశీ భార్య అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్ బడలికల నుంచి విముక్తులమవుతున్నాం. క్రికెట్ భారాన్ని దించేసి వ్యక్తిగత జీవితంలో ముందడుగు వేయదల్చుకున్నా’ అని 33 ఏళ్ల మోర్కెల్ తన రిటైర్మెంట్ సందేశంలో పేర్కొన్నాడు. ప్రొటీస్ జెర్సీ ధరించి ఎన్నో మధుర క్షణాలను అనుభవించానని... దక్షిణాఫ్రికాకు ఆడిన ప్రతీ మ్యాచ్ను, ప్రతీ క్షణాన్ని ఆస్వాదించినట్లు తెలిపాడు. ‘నా క్రికెట్ ప్రయాణంలో సఫారీ బోర్డు, జట్టు సహచరులు, కుటుంబసభ్యులు, మిత్రులు ఎంతో తోడ్పాటు అందించారు. నాలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉంది. దాన్ని ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్లో ఉపయోగిస్తా. జట్టును గెలిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తా’అని అన్నాడు. 2006లో డర్బన్లో భారత్తో జరిగిన టెస్టుతో అరంగేట్రం చేసిన మోర్కెల్ 12 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్లో మూడు ఫార్మాట్లలో కలిపి 529 వికెట్లు పడగొట్టాడు. వన్డేల్లో 117 మ్యాచ్లాడి 188 వికెట్లు తీశాడు. టి20ల్లో 44 మ్యాచ్లాడి 47 వికెట్లు పడగొట్టాడు. టెస్టు కెరీర్లో 83 మ్యాచ్లాడి 294 వికెట్లు చేజిక్కించుకున్నాడు. 2009లో ప్రధాన పేసర్ మఖాయ ఎన్తిని రిటైర్మెంట్ తర్వాత జట్టులో కీలక బౌలర్గా ఎదిగాడు. ఐపీఎల్లో ఢిల్లీ డేర్డెవిల్స్, కోల్కతా నైట్రైడర్స్, రాజస్తాన్ రాయల్స్కు ప్రాతినిధ్యం వహించిన మోర్కెల్ను ఈసారి వేలంలో ఎవరూ కొనుగోలు చేయలేదు. -
72 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి
-
'ఏంటి..మోర్నీని దంచి కొట్టానా..చెప్పు?'
-
మోర్కెల్ను దంచి కొట్టనా..?
కేప్టౌన్: భారత్-దక్షిణాఫ్రికాలతో జరుగుతున్న తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. సఫారీలు తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులకు ఆలౌటైతే, టీమిండియా తన మొదటి ఇన్నింగ్స్లో 209 పరుగులకు ఆలౌటైంది. అటు తరువాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా రెండో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 65 పరుగులు చేసింది. దాంతో మూడో రోజు ప్రత్యర్థిని సాధ్యమైనంత తక్కువకు కట్టడి చేయడంపైనే భారత్ విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయనేది వాస్తవం. ఇదిలా ఉంచితే, శనివారం ఆటలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. భారత్ తొలి ఇన్నింగ్స్లో భాగంగా 46 ఓవర్ను మోర్నీ మోర్కెల్ వేశాడు. ఆ సమయంలో క్రీజ్లో హార్దిక్ పాండ్యా-భువనేశ్వర్ కుమార్లున్నారు. అయితే ఆ ఓవర్ రెండో బంతిని మోర్కెల్ ఆఫ్ స్టంప్పై సంధించాడు. దాన్ని వదిలి పెట్టిన హార్దిక్.. అదే సమయంలో నాన్ స్టైకింగ్ ఎండ్లో ఉన్న భువనేశ్వర్తో చేసిన ఒక సంభాషణ ఆకట్టుకుంది. 'ఏంటి..మోర్నీని దంచి కొట్టానా..చెప్పు?' అని భువీని హిందీలో అడిగాడు. దీన్ని కామెంటరీ బ్యాక్స్లో ఉన్న హర్షా బోగ్గే ఇంగ్లిష్లో అనువదించి సహచర కామెంటేటర్లకు తెలియజేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం హార్దిక్-భువీలకు సంబంధించిన వీడియో వైరల్గా మారింది. -
మోర్కెల్ కు ఆరు వారాల విశ్రాంతి!
పోష్స్ట్రూమ్: దక్షిణాఫ్రికా పేసర్ మోర్నీ మోర్కెల్ ఆరు వారాల పాటు జట్టుకు దూరమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఉదర సంబంధిత నొప్పితో బాధపడుతున్న మోర్కెల్.. ఉన్నపళంగా జట్టు నుంచి తప్పుకున్నాడు. బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్టులో భాగంగా ఆదివారం నాల్గో రోజు ఆటలో 5.2 ఓవర్లు ముగిసిన తరువాత మోర్కెల్ ఫీల్డ్ ను వదిలివెళ్లిపోయాడు. 'ప్రస్తుతం మోర్కెల్ ఉదర సంబంధమైన నొప్పితో బాధపడుతున్నాడు. అతనికి నాలుగు వారాల నుంచి ఆరు వారాల వరకూ విశ్రాంతి అవసరం. మోర్కెల్ కు స్కానింగ్ చేయించిన తరువాత ఈ విషయం బయటపడింది. దాంతో బంగ్లాదేశ్ పర్యటనకు దూరం కానున్నాడు'అని టీమ్ డాక్టర్ మొహ్మద్ ముసాజీ తెలిపారు. ఇప్పటికే ముగ్గురు దక్షిణాఫ్రికా ఫాస్ట్ బౌలర్లు గాయం కారణంగా జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. డేల్ స్టెయిన్, ఫిలిండర్, క్రిస్ మోరిస్ లు గాయాలు కారణంగా దూరం కాగా, తాజాగా వారి జాబితాలో మోర్కెల్ చేరిపోయాడు. -
కష్టాల్లో బంగ్లాదేశ్
పోష్స్ట్రూమ్: బౌలర్ మోర్నీ మోర్కెల్ మూడు బంతుల తేడాలో రెండు వికెట్లు తీయడంతో... దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ కష్టాల్లో పడింది. 424 పరుగుల భారీ విజయలక్ష్యంతో రెండో ఇన్నింగ్స్లో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ నాలుగో రోజు ఆటముగిసే సమయానికి 15.3 ఓవర్లలో 3 వికెట్లకు 49 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో నాలుగో బంతికి తమీమ్ ఇక్బాల్ను, ఆరో బంతికి మోమినుల్ హక్ను మోర్కెల్ అవుట్ చేశాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్లో ఇమ్రుల్ కైస్ (32) అవుటైన వెంటనే నాలుగో రోజు ఆటను ముగించగా... ముష్ఫికర్ రహీమ్ (16 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్నైట్ స్కోరు 54/2తో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన దక్షిణాఫ్రికా 56 ఓవర్లలో 6 వికెట్లకు 247 పరుగులవద్ద ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. -
'క్రికెట్ ను వదిలేయమన్నారు'
సెంచూరియన్: దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టులో కీలక క్రికెటరైన మోర్నీ మోర్కెల్ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడి దాదాపు ఎనిమిది నెలలు అయ్యింది. గతేడాది జూన్ లో వెన్నునొప్పి కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే ఆ సమయంలో తాను ఇక క్రికెట్ ను ఆడటానికి పనికిరానని డాక్టర్లు సలహా ఇవ్వడం తీవ్రమైన వేదనకు గురిచేసిందని మోర్కెల్ తాజాగా స్సష్టం చేశాడు. ప్రస్తుతం మొమెంటమ్ వన్డే కప్ మ్యాచ్ ఆడనున్న మోర్కెల్... తాను పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ ను నిరూపించుకుని మళ్లీ అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడతాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. 'గతంలోనే నన్ను క్రికెట్ ను వదిలేయమనే సలహా డాక్టర్లు ఇచ్చారు. నేను వెన్నునొప్పితో బాధపడుతున్న తరుణంలో క్రికెట్ నుంచి దూరంగా ఉండమని ఒక డాక్టర్ చెప్పాడు. ఇక నేను క్రికెట్ ఆడటానికి పని చేయనని తేల్చిచెప్పాడు. ఆ క్షణంలోనే నా క్రికెట్ కెరీర్ పై అనుమానం వచ్చింది. ఇక క్రికెట్ ను ఆడగలనా?అనే సందేహం నన్ను ఆందోళనలో పడేసింది. అయితే అప్పట్నుంచి నా ఫిట్ నెస్ నిరూపించకోవడం కోసం శ్రమిస్తూనే ఉన్నా. ఆ డాక్టర్ ఇచ్చిన సలహా పక్కను పెట్టేశా. నాకు నేనుగా వెన్నునొప్పి నుంచి బయట పడేందుకు కష్టపడుతూనే ఉన్నా. ఆ క్రమంలోనే వేరే డాక్టర్ల సలహాలను కూడా తీసుకున్నా. ఇప్పుడు వెన్నునొప్పి నుంచి కోలుకుంటున్నా. త్వరలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే దక్షిణాఫ్రికా జట్టులో చోటు కూడా దక్కించుకుంటా' అని మోర్కెల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. -
మళ్లీ ‘మూడి’నట్లే(నా)!
‘ఈ వికెట్ మీద బ్యాటింగ్ చేయడం అంటూ సాధ్యమైతే అది తొలి రోజు మాత్రమే’... నాగ్పూర్లో టాస్ గెలిచిన వెంటనే కోహ్లి అన్న మాట ఇది. టర్నింగ్ పిచ్ను తయారు చేశామని క్యురేటర్ ముందే చెప్పడంతో ఇది పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. తొలి రోజు ఆట కూడా ఊహించినట్లుగానే సాగింది. తొలి సెషన్లో భారత బ్యాట్స్మెన్ ఆధిపత్యం చూపించినా... స్పిన్నర్లు వచ్చాక పరుగుల వేగం మందగించింది. అయితే స్టెయిన్ గైర్హాజరీలో బౌలింగ్ బాధ్యతలు తీసుకున్న మోర్నీ మోర్కెల్ ఓ సాధారణ పిచ్పై సంచలన బౌలింగ్ చేశాడు. బంతుల్లో వైవిధ్యం చూపిస్తూ బ్యాట్స్మెన్ను అయోమయంలోకి నెట్టాడు. విజయ్, కోహ్లి, రహానేల రూపంలో మూడు కీలక వికెట్లతో భారత జోరుకు బ్రేక్ వేశాడు. రెండో సెషన్లో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయిన భారత్ సహజంగానే కొంత ఒత్తిడిలోకి వెళ్లింది. వ్యూహం మారింది! తాను కెప్టెన్ అయిన దగ్గరి నుంచి ఐదుగురు బౌలర్ల వ్యూహంతో ఆడుతున్న కోహ్లి ఈసారి మాత్రం నలుగురు బౌలర్లకే పరిమితమయ్యాడు. గత రెండు మ్యాచ్ల్లో అనుభవాలు, పిచ్ స్వభావం దృష్ట్యా రెండో పేసర్ అనవసరమని భారత్ భావించింది. దీంతో ముగ్గురు స్పిన్నర్లు తుది జట్టులోకి వచ్చారు. రోహిత్ శర్మకు అవకాశం దక్కినా వినియోగించుకోవడంలో విఫలమయ్యాడు. 2010లో నాగ్పూర్లో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ద్వారా టెస్టుల్లో రోహిత్ అరంగేట్రం జరగాల్సింది. అయితే ఆ మ్యాచ్ ప్రారంభానికి అరగంట ముందు ఫుట్బాల్ ఆడుతూ గాయపడ్డాడు. ఆ తర్వాత మూడేళ్లు కష్టపడితేగానీ టెస్టు జట్టులోకి రాలేకపోయాడు. ఈసారి అదే మైదానంలో దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడే అవకాశం వస్తుందని రోహిత్ ఊహించి ఉండడు. నిజానికి ప్రస్తుత పరిస్థితుల్లో ఇది తనకు గొప్ప అవకాశం. వన్డేల్లో షాట్లు ఆడటం అలవాటైన భారత బ్యాట్స్మెన్ టెస్టుల్లో డిఫెన్స్ ప్రాముఖ్యతను గుర్తించలేకపోయారు. దానికి ఉదాహరణ ఈ మ్యాచ్లో మన బ్యాట్స్మెన్ ఆటతీరు. అయితే మొత్తం మీద 215 పరుగులు చేయడం కాస్త సానుకూలాంశమే. ఈ సిరీస్లో దక్షిణాఫ్రికా బాగా నిరాశపడింది తాహిర్ విషయంలోనే. సిరీస్ ఆరంభానికి ముందు తనే తమ తురుపు ముక్కగా భావించారు. కానీ స్పిన్కు సహకరిస్తున్న పిచ్లపై కూడా తను ప్రభావం చూపలేకపోతున్నాడు. అందుకే మరో స్పిన్నర్ హార్మర్నే సఫారీలు నమ్ముకున్నారు. తన మీద ఉంచిన బాధ్యతను నెరవేరుస్తూ హార్మర్ నాలుగు వికెట్లతో రాణించాడు. బ్యాట్స్మెన్ తిప్పలు ఎప్పటిలాగే అశ్విన్ మరోసారి కొత్త బంతితో దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్కు చుక్కలు చూపించాడు. పిచ్ మీద నిలబడటానికే దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ డ్యాన్స్ చేయాల్సి వస్తోంది. తొమ్మిది ఓవర్ల పాటు సఫారీ బ్యాట్స్మెన్ బంతి బంతికీ గండమే అన్నట్లు ఆడారు. అశ్విన్ మరోసారి ఓ చక్కటి బంతితో ఓపెనర్ వేన్జిల్ను అవుట్ చేసి కోహ్లి కోరుకున్న ఆరంభాన్ని అందించాడు. ఇక ఈ సిరీస్లో స్టార్గా ఎదిగిన రవీంద్ర జడేజా కళ్లు చెదిరే బంతితో నైట్వాచ్మన్ తాహిర్ను పెవిలియన్కు చేర్చాడు. మొత్తం మీద భారత్ జట్టు తొలి రోజును సంతోషంగానే ముగించింది. అయితే దక్షిణాఫ్రికా కూడా పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్లలేదు. పడ్డ రెండు వికెట్లలో ఒకటి నైట్ వాచ్మన్దే. ఆమ్లా, డివిలియర్స్, డు ప్లెసిస్, డుమినిలలో ఏ ఇద్దరు నిలదొక్కుకున్నా భారత్ స్కోరు దగ్గరకి రావచ్చు. అయితే పిచ్ స్వభావాన్ని, భారత స్పిన్నర్ల జోరును పరిగణలోకి తీసుకుంటే రెండో రోజు కనీసం రెండు సెషన్లైనా నిలబడతారా అనే సందేహం వస్తోంది. ఈ మ్యాచ్లో ఫలితం రావడం ఖాయం. అదేంటనేది రెండో రోజుకే స్పష్టత వస్తుంది. ప్రస్తుతం తీరు చూస్తే ఇది కూడా మూడోరోజే ముగిసేలా కనిపిస్తోంది..! - సాక్షి క్రీడావిభాగం -
డుమిని, మోర్కెల్ ఫిట్
బెంగళూరు: భారత్తో తొలి టెస్టులో దారుణంగా ఓడిన దక్షిణాఫ్రికాకు రెండో టెస్టుకు ముందు ఊరట లభించింది. గాయాల కారణంగా తొలి టెస్టు ఆడని ఆల్రౌండర్ డుమిని, పేసర్ మోర్నీ మోర్కెల్ 14 నుంచి జరిగే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటారని ఆ జట్టు తెలిపింది. అయితే తొలి టెస్టులో గాయపడ్డ స్టెయిన్ ఆ సమయానికి కోలుకోకపోవచ్చు. రెండో ర్యాంక్లోనే భారత్ దుబాయ్: దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో ఓడినప్పటికీ భారత్ జట్టు ఐసీసీ ర్యాంక్ మాత్రం మారలేదు. ప్రస్తుతం ధోని సేన 114 పాయింట్లతో రెండో ర్యాంక్లో ఉండగా... ఆస్ట్రేలియా 127 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. -
బౌలర్లకు బాడీలాంగ్వేజ్ కీలకం: మోర్నీ
కటక్: టి20ల్లో బౌలర్లూ సత్తాచాటాలంటే పాజిటివ్ దృక్పథంతో పాటు సరైన బాడీ లాంగ్వేజ్ కీలకమని కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) పేసర్ మోర్నీ మోర్కెల్ తెలిపాడు. బుధవారం జరిగిన మ్యాచ్లో ముంబైని కట్టడి చేయడంలో అతని పాత్ర ఉంది. ‘టి20ల్లో బ్యాట్కు, బాల్కు మధ్య పోటీ తీవ్రంగా ఉంటుంది. ధాటిగా సాగే ఈ ఆటలో బౌలర్లు తమ బంతులపైనే దృష్టి కేంద్రీకరిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. ముఖ్యంగా బంతిని నియంత్రించే శారీరక భాష అవసరం’ అని అన్నాడు. ఆట ఆరంభంలోనే ఓపెనర్ గౌతమ్ను, కీలక దశలో కోరి అండర్సన్ను మోర్కెల్ అవుట్ చేయడంతో ముంబై కోలుకోలేదు. ఆ తర్వాత స్పిన్నర్లు రాణించడంతో కోల్కతా విజయం సులువైంది. ‘ఇక్కడి బారాబతి స్టేడియంపై మాకున్న అవగాహన కాస్త కలిసొచ్చింది. అయితే పిచ్ మాత్రం ఇరు జట్లకు సమానావకాశాలిచ్చింది. మా స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు’ అని మోర్కెల్ అన్నాడు. మెరుపుల క్రికెట్లో మీ ప్రాధాన్యత పరుగుల కట్టడికా లేక వికెట్లకా అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ రెండింటికి సమ ప్రాధాన్యత ఉంటుందన్నాడు. -
మోర్కెల్ను కలిసిన ‘అనుమానాస్పద వ్యక్తి’
పూర్తి నివేదిక కోసం వేచి చూస్తున్నాం యూఏఈలో ఐపీఎల్ సక్సెస్ బీసీసీఐ వెల్లడి ముంబై: కోల్కతా నైట్రైడర్స్ పేసర్ మోర్నీ మోర్కెల్ను ఓ ‘అనుమానాస్పద వ్యక్తి’ సంప్రదించడం మినహాయిస్తే యూఏఈలో జరిగిన ఐపీఎల్ మ్యాచ్లు విజయవంతమయ్యాయని బీసీసీఐ వెల్లడించింది. మిగతా టోర్నీ కూడా ఎలాంటి వివాదాలు లేకుండా సాగిపోతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. శనివారం జరిగిన ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో మోర్కెల్ అంశం ప్రస్తావనకు రావడంతో... పూర్తి నివేదిక కోసం ఎదురుచూస్తున్నామని బోర్డు కార్యదర్శి సంజయ్ పటేల్ సమాధానమిచ్చారు. ‘ఐపీఎల్ అవినీతి నిరోధక యూనిట్ ఈ విషయాన్ని చూసుకుంటోంది. పూర్తిస్థాయి నివేదికలు రావాల్సి ఉంది. గవర్నింగ్ కౌన్సిల్లో ఇలాంటి చర్చలు సర్వసాధారణం’ అని పటేల్ పేర్కొన్నారు. యూఏఈలో జరిగిన అంశాలపై చర్చించేందుకు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని బీసీసీఐ తాత్కాలిక అధ్యక్షుడు సునీల్ గవాస్కర్ అన్నారు. ‘మేం తీసుకున్న కొన్ని చర్యల వల్ల యూఏఈలో మ్యాచ్లు సక్సెస్ అయ్యాయి. ఇది మాలో విశ్వాసాన్ని నింపింది. ఇది ఇలాగే కొనసాగితే భారత్లో కూడా టోర్నీ వివాదాలు లేకుండా సాగిపోతుంది. నిజాయితీ గల అధికారులు ప్రతి జట్టు వెంట ఉండటం మాకు లాభించింది. యువ ఆటగాళ్లకు అవసరమైన సహాయాన్ని మేం అందించాం. ఐపీఎల్ అంటే కేవలం క్రికెట్ అని మాత్రమే గుర్తుంచుకునేలా కృషి చేస్తాం’ అని సన్నీ వివరించారు. ఆదరణ అదుర్స్ యూఏఈ, అబుదాబి, షార్జాల్లో నిర్వహించిన మ్యాచ్లకు అభిమానుల ఆదరణతో పాటు టెలివిజన్ వ్యూవర్షిప్, టిక్కెట్ కలెక్షన్ చాలా బాగుందని బీసీసీఐ తెలిపింది. ‘దక్షిణాఫ్రికా (2009లో 56 శాతమే)తో పోలిస్తే ప్రతి మ్యాచ్కు 82 శాతం టిక్కెట్లు అమ్ముడుపోయాయి. తొలి 10 రోజుల్లో ఐపీఎల్ అధికారిక వెబ్సైట్ను 10 మిలియన్ల మంది సందర్శించారు. 2013తో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఫేస్బుక్లో ఐపీఎల్ పేజీని లైక్ చేసిన వాళ్ల సంఖ్య 3.8 మిలియన్ నుంచి 9.1 మిలియన్కు చేరుకుంది. ఇది ఇంకా కొనసాగుతోంది’ అని పటేల్ తెలిపారు.
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
త్వరలో మస్క్కు ముప్పు.. భారత్ సంతతి సీఈవో సంచలన వ్యాఖ్యలు
ఏపీ పోలింగ్పై సీఎం జగన్ ట్వీట్
టీ20 వరల్డ్కప్ 2024.. ఐసీసీ కీలక నిర్ణయం!? అలా అయితే కష్టమే
తాడిపత్రిలో ఉద్రిక్తత.. వైఎస్ఆర్సీపీ నేతలపై రాళ్ల దాడి
నేనెవర్నీ విడగొట్టలేదు.. ఆ హీరోయిన్కు, నా భర్తకు ఆల్రెడీ బ్రేకప్!
పెళ్లిరోజే చెల్లెలి కొంపముంచిన ‘ఇన్స్టాగ్రామ్’ అన్నలు
అచ్చెన్నాయుడు సొంత గ్రామంలో టీడీపీ రిగ్గింగ్ బయటపడ్డ వీడియో
యోగా విషయంలో రాందేవ్ కృషి మంచిదే కానీ: సుప్రీంకోర్టు
మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
రెమో మళ్లీ వచ్చేస్తున్నాడు.. బుకింగ్స్ అదుర్స్!
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- వీడు మాములోడు కాదు.. 100 రోజులు, 200 విమానాలు కట్ చేస్తే..!
- మెడికల్ బోర్డు చీఫ్పై సుప్రీం ఆగ్రహం
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement