-
అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
ఉన్నత చదువులు కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు పలు కారణాలతో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. ఎన్నో కలలతో భవిష్యత్తును నిర్మించుకుంటున్న యువత అకాల మరణాలు వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులు స్తున్నాయి. తాజాగా అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మే 14న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.జార్జియాలోని అల్పారెట్టాలో జరిగిన ఈ ప్రమాదంలో భారతీయ అమెరికన్ విద్యార్థులు కన్నుమూశారు. వీరిని శ్రియ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు. రిత్విక్ సోమేపల్లి, మహమ్మద్ లియాఖత్ అనే మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు.వీరు అల్ఫారెట్టాలోని నార్త్ ఫుల్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా జార్జియా యూనివర్సిటీలోని సీనియర్ అల్ఫరెట్టా హైస్కూల్ విద్యార్థులనీ, యాక్సిడెంట్ సమయంలో కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడిందని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా, అన్వీ శర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.అన్వీశర్మ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని కళాకార్ గ్రూప్ పేర్కొంది. అలాగే శ్రియ అద్భుతమైన డాన్సర్ అని షికారీ గ్రూప్ సంతాపం తెలిపింది. శ్రియ అవసరాల యూజీఏ షికారి డ్యాన్స్ టీమ్లో సభ్యురాలు, అలాగే అన్వీశర్మ యూజీఏ కళాకార్ ,కాపెల్లా బృందంలో సింగర్గా ఉన్నారు. ఇక ఆర్యన్ జోషి క్రికెటర్గా రాణిస్తున్నాడు. కీలక పోటీల్లో జట్టు విజయానికి కారణమైన అతని మరణం తీరని లోటని ఆల్ఫారెట్టా హై క్రికెట్ జట్టు ఇన్స్టా పోస్ట్లో విచారం వ్యక్తం చేసింది. తెలిపింది.కాగా గత నెల, అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు. -
దుష్ప్రచారం చేయడం డాక్టర్ లోకేశ్కు అలవాటే..
సాక్షి, అమరావతి: ప్రముఖులపై దుష్ప్రచారం చేయడం డాక్టర్ ఉయ్యూరు లోకేశ్కు అలవాటని ప్రముఖ ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి తెలిపారు. ఏపీలో ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని మేధావిగా చలామణి అవుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే అమెరికాలో 18 ఏళ్లుగా ఆయన ప్రాక్టీస్పై నిషేధం కొనసాగుతోందని తెలిపారు. టీడీపీ సానుభూతిపరుడైన లోకేశ్ ఇటీవల గన్నవరం విమానాశ్రయంలో లండన్కు వెళుతున్న సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర పన్నారు. ఈ సందర్భంగా అతని గురించి పలు విస్తుపోయే వాస్తవాలను డాక్టర్ వాసుదేవరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. గుంటూరు మెడికల్ కాలేజీలో 1983లో లోకేశ్ గ్రాడ్యుయేట్ అయ్యాడు. గ్యాస్ట్రో విభాగంలో ఎండీ పూర్తిచేసిన ఆయన అమెరికాలోని వర్జీనియాలో తొలుత ప్రాక్టీస్ మొదలెట్టాడు. అప్పటి నుంచే ఎదుటి వ్యక్తులపై అవాస్తవ ఆరోపణలు చేయడం, కోర్టుల్లో తప్పుడు కేసులు ఫైల్ చేయడం లోకేశ్కు అలవాటు. ప్రాక్టీస్ ప్రారంభించిన తొలినాళ్లలో ఆస్పత్రి యాజమాన్యంపై, సహచర వైద్యులపై కోర్టులో కేసులు వేసి, ఆ ఆరోపణలను రుజువు చేయడంలో విఫలమయ్యాడు. ఇదే తరహాలో 2022లో భారత ప్రధాని మోదీ, ఏపీ సీఎం వైఎస్ జగన్, అదానీ మీద వాషింగ్టన్ డీసీ కోర్టులో కేసులు ఫైల్ చేశాడు. ఇండియా నుంచి కంటైనర్లలో డబ్బుతో పాటు, ఇజ్రాయిల్ నుంచి స్పైవేర్ కొనుగోలు చేసి అమెరికాకు అక్రమంగా తరలిస్తున్నారంటూ ఆరోపణలు చేశాడు. తప్పుడు ఆరోపణలతో కోర్టు సమయాన్ని వృథా చేస్తున్నావని లోకేశ్కు కోర్టు చీవాట్లు పెట్టడంతో పాటు జరిమానా విధించింది. ప్రాక్టీస్పైనా నిషేధం వైద్య నిబంధనలకు విరుద్ధంగా రోగులకు చికిత్సలు అందించి పలువురి మరణానికి లోకేశ్ కారకుడయ్యాడు. 2006లో వర్జీనియా బోర్డ్ ఆఫ్ మెడిసిన్ లోకేశ్ మెడికల్ లైసెన్స్ను రద్దు చేసింది. అనంతరం న్యూయార్క్, న్యూజెర్సీ వంటి ఇతర ప్రాంతాలకు వెళ్లాడు. ఆయా రాష్ట్రాల్లోనూ లైసెన్స్ను రీవోక్ చేశారు. అయితే ఈ వాస్తవాలను కప్పిపుచ్చి అమెరికాలో ప్రముఖ వైద్యుడిగా చలామణి అవుతూ ఏపీ సీఎం జగన్పై అవాస్తవ ఆరోపణలకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు వాస్తవాలను ఓ సారి తెలుసుకోవాలి. మేధావులుగా చలామణి అవుతున్న లోకేశ్ వంటి కులోన్మాదులు సీఎం జగన్పై దాడులకు పాల్పడుతున్నారు. -
సింగపూర్లో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఘనంగా
శ్రీ సాంస్కృతిక కళాసారథి, సింగపూరు వారి ఆద్వర్యంలో "పాట షికారుకొచ్చింది" పుస్తక పరిచయ కార్యక్రమం ఒన్ కాన్ బెర్రా పంక్షన్ హాల్లో, 19 మే ఆదివారం సాయంత్రం ఘనంగా జరిగింది, పుస్తక రచయిత, సివిల్స్ అభ్యర్థుల శిక్షకుడు, మోటివేషనల్ స్పీకర్, వ్యక్తిత్వ వికాస నిపుణుడు, రచయిత, తెలుగు భాషాభిమానిగా ఆకెళ్ళ రాఘవేంద్ర అందరికీ సుపరిచితులు. ఈ కార్యక్రమంలో పాట షికారుకొచ్చింది పుస్తక రచయిత ఆకెళ్ళ రాఘవేంద్ర మాట్లాడుతూ ఇప్పటివరకూ దాదాపు 200 పైగా వేదికల మీద మాట్లాడినా కుటుంబ సమేతంగా ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం తొలిసారి ఇక్కడే కుదిరిందని, ఇంతకు ముందు ఎన్ని సార్లు ప్రయత్నించినా వీలు కానిది ఈ సింగపూరు సభ ద్వారా జరగడం ఎంతో ఆనందంగా ఉంది అన్నారు. తన గురువు సిరివెన్నెల జీవితాన్ని సమతుల్యం చేస్తూ రాసిన పుస్తకం అని రచయిత తెలిపారు. ఈ సందర్బంగా సిరివెన్నెలతో తనకు ఉన్న అనుబందాన్ని, తనను ప్రోత్సహించిన వైనాన్ని పంచుకున్నారు. సింగపూరులో శ్రీ సాంస్కృతిక కళాసారథి సంస్థ నిర్వహించిన ఈ కార్యక్రమం ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతుందని ప్రశంసించారు. ఇకపై సంస్థ నిర్వహించే కార్యక్రమాలను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు. సిరివెన్నెల అబిమానులందరికీ కృతజ్ఞతలు అని భావోద్వేగానికిలోనయ్యారు. సుబ్బు వి పాలకుర్తి సభ నిర్వహణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలోసంస్థ అధ్యక్షులు రత్నకుమార్ కవుటూరు మాట్లాడుతూ సిరివెన్నెల జయంతి అయిన మే 20వ తేదీకి ఒక్కరోజు ముందు ఆయన జీవిత పుస్తకాన్ని, పుస్తక రచయిత, సిరివెన్నెల ఆత్మీయ శిష్యులు ఆకెళ్ళ రాఘవేంద్ర ద్వారా సింగపూర్లో ఆవిష్కరించుకోవడం చాలా ఆనందం అని, కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ కృతజ్ఞతలును తెలియచేసారు. ఎందరో అభిమానులను సొంతం చేసుకున్న సిరివెన్నెల స్మరించుకునే అవకాశం ఈ పుస్తకం ద్వారా మరొక్కసారి అందరికీ దక్కిందన్నారు. తెలుగు అక్షరం ఉన్నంత వరకూ సిరివెన్నెల పాట తెలుగు వారి నోటివెంట వినబడుతూనే ఉంటుందని తెలియచేసారు.ఈ కార్యక్రమమునకు రామాంజనేయులు చమిరాజు, సునీల్ రామినేని, మమత మాడబతుల సహాయ సహకారాలు అందించగా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని గణేశ్న సాంకేతిక సహకారం అందించారు. 50 మందికి పైన పాల్గొన్న ఈ కార్యక్రమము, ఆన్లైన్ ద్వారా 1000కి పైగా వీక్షించారు. సిరివెన్నెల అభిమానులు షర్మిల, కృష్ణ కాంతి, మాధవి, పణీష్ తమ పాటలు, కవితలు వినింపించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. కార్యక్రమము చివర్లో ఆకెళ్ళ సిరివెన్నెల అద్భుతమైన ప్రసంగంతో తండ్రికి తగ్గ తనయగా ప్రశంసలు పొందారు. అతిదులందరికి విందు భోజన ఏర్పాట్లను రేణుక, అరుణ, శ్రీలలిత తదితరులు పర్యవేక్షించారు. -
హాంకాంగ్ లో ఘనంగా ఉగాది వేడుకలు..
హాంగ్కాంగ్లో తెలుగు వారంతా కలిసి ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య ఆధ్వర్యంలో శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో ఉల్లాసంగా సాగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రముఖులు, శ్రీ కే. వెంకట రమణ గారుకాన్సల్, కన్సుల్టే జనరల్ అఫ్ ఇండియా,హాంగ్ కాంగ్ మరియు మకావ్; మాస్.ఏమి యుంగ్, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ (ఐలాండ్స్), హాంగ్ కాంగ్ హోమ్ అఫైర్స్ డిపార్ట్మెంట్; శ్రీ. లాల్ హర్దసాని ప్రెసిడెంట్, ది హిందూ అసోసియేషన్; ఉస్తాద్ గులాం సిరాజ్, చైర్మన్, పుంహక మరియు శ్రీ. కె. వెంకట వంశీధర్, రీజినల్ హెడ్,స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా, ముఖ్య అతిధులుగా విచ్చేసారు. శ్రీ వెంకట రమణ గారు దీప ప్రజ్వలన చేయగా, ఇతర ముఖ్య అతిధులు కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తదనంతరం శ్రీ వెంకట రమణ గారు,హాంగ్ కాంగ్ లో తెలుగు వారు సమాఖ్య ద్వారా చేస్తున్న భాష సేవ సాంస్కృతిక పరిరక్షణను కొనియాడారు. తదనంతరం శంకరంబాడి సుందరాచారి గారి రచన ‘మా తెలుగు తల్లికి మల్లె పూదండ‘ గానంతో ప్రారంభైన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను అలరించాయి. కూచిపూడి, భరతనాట్యం వంటి సాంప్రదాయ నృత్యాలు, ఫ్లూట్ మరియు యుకెలేలే వాయిద్యాలపై టాలీవుడ్ పాటలు, ఫ్యూజన్ డ్యాన్స్, పాత క్లాసిక్ మెడ్లీలకు నృత్యం వంటి విభిన్నమైన ఆట పాటలతో మరియు హాస్య నాటిక తో కార్యక్రమం ఆసాంతం ఆకట్టుకుంది. గౌరవనీయ అతిధులు కాన్సల్ శ్రీ వెంకట రమణ గారు మరియు మిస్ మాస్.ఏమి యుంగ్ సమాఖ్య లోని స్వచ్చంద సేవకులకు, తెలుగు బడి గురువులకు, స్థానికంగా జరిగే జాతీయ అంతర్జాతీయ మారథాన్లలో మరియు ఆక్స్ఫామ్ ట్రయిల్ వాకర్ లో పాల్గొని విజయవంతంగా పూర్తి చేసిన వారి ప్రతిభ గుర్తిస్తూ వారికి మొమెంటోలు అందించారు. సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీమతి జయ పీసపాటి కార్యక్రమ వివరాలిస్తూ, హాంగ్ కాంగ్ లో నివసిస్తున్న తెలుగు వారు సంప్రదాయ వస్త్రధారణతో హాజరైన సభ్యులతో తెలుగుతనం వెల్లివిరిసిన ఈ వేడుకలతో తెలుగు నేలను మరిపించిందని హర్షం తెలిపారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన నగరం కనుక ఇక్కడ తమకి ఇక్కడ పెద్ద హాల్ల్స్ అందుబాటులో ఉండవని, ప్రభుత్వ వసతులు లభ్యమైనప్పుడు వేడుకలు చేసుకుంటున్నామని, అందుకీ ఉగాది వేడుకలు చేసుకోవడం కొంత ఆలస్యంయ్యిందని వివరించారు .జూన్ లో తమ సంస్థ క్రీడా దినోత్సవానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. సమాఖ్య కార్యవర్గ సభ్యులు జయ పీసపాటి, రాజశేఖర్ మన్నే,రమేష్ రేణిగుంట్ల, హరీన్ తుమ్మల, రమాదేవి సారంగా, మాధురి కొండా మరియు ఇతర సభ్యులు అపర్ణ కంద, రాధికా సంబతూర్, ప్రత్యుష – రవికాంత్ గునిశెట్టి, కల్పన – జయసురేష్ మట్టపర్తి, ప్రియాంక – బాబీ సత్తినేని, కృష్ణ ప్రసాద్ రెడ్డి, భరత్ కోరాడ, ధర్మ రాజు దుంప, సుగుణ రవి, మానస గర్దాస్, శాంతి పలుకూరి తదితరులు ఉగాది వేడుకల నిర్వాహణలో ఉత్సాహంగా పాల్గొన్నారు. -
అమెరికా వీసా కోసం ‘దొంగ’ నాటకం, అడ్డంగా బుక్కైన నలుగురు భారతీయులు
అమెరికా వీసా కోసం వింత నాటకంతోఅడ్డంగా బుక్కయ్యారు. నిందితుల్లో నలుగురు భారతీయులతో సహా ఆరుగురు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందేందుకు ఆయుధాలతో దోపిడీల్లో బాధితులుగా కుట్ర పన్నారు. తద్వారా బాధితులు యునైటెడ్ స్టేట్స్కు ఇమ్మిగ్రేషన్ వీసాలు పొందవచ్చని ప్లాన్ వేశారు. చివరికి ఏమైందంటే..కెంటకీలోని ఎలిజబెత్టౌన్కు చెందిన భిఖాభాయ్ పటేల్, జాక్స్న్కు చెందిన నీలేష్ పటేల్, టెన్నెస్సీ, రవినాబెన్ పటేల్, రేసిన్, విస్కాన్సిన్,ఫ్లోరిడాలోని జాక్సన్విల్లేకు చెందిన రజనీ కుమార్ పటేల్, అమెరికా వీసాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు దశలవారీగా జరిగిన దోపిడీలలో బాధితులుగా నటించారు. తద్వారా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైన కొన్ని నేరాల బాధితుల కోసం ఉద్దేశించిన వీసాలు పొందవచ్చని భావించారు. కానీ పోలీసులకు చిక్కారు. చికాగో సెంట్రల్ కోర్టులో ఆరోపణలు నమోదైనాయి. కోర్టు ప్రకటన ప్రకారం, నిందితులు, కొందరు దోపిడీకి గురైన వారి సర్టిఫికేట్ల ఆధారంగా అమెరికా పౌరసత్వం, వీసా సేవలకు నకిలీ U-వీసా దరఖాస్తులను కూడా సమర్పించారు. వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేశారని రవీనాబెన్ పటేల్పై వేర్వేరుగా ఆరోపణలు వచ్చాయి. ఈ స్కాంలో నలుగురు వ్యక్తులు నయీంకు వేల డాలర్లు చెల్లించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు ఈ నకిలీ దోపిడీ సమయంలో కొందరు వ్యక్తులు ఆయుధాలతో బాధితుల వద్దకు వెళ్లి దోచుకున్నారని కూడా నివేదిక పేర్కొంది. మోసానికి కుట్ర పన్నారనే ఆరోపణలపై నిందితుడికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, వీసా దరఖాస్తులో తప్పుడు ప్రకటనలు చేసిన ఆరోపణలపై 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే నిబంధన ఉందని ఒక ప్రకటన తెలిపింది. -
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
జహీరాబాద్: అమెరికాలోని చోర్లెట్ ప్రాంతంలో గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి చెందిన అబ్బరాజు పృథ్వీరాజ్ (30) అక్కడికక్కడే మృతి చెందాడు. పృపృథ్వీరాజ్ ఎనిమిదేళ్ల క్రితం ఐటీ ఉద్యోగం నిమిత్తం అమెరికా వెళ్లాడు. ఏడాదిన్నర కిందట సిద్దిపేట ప్రాంతానికి చెందిన శ్రీప్రియతో వివాహం జరిగింది.భార్యాభర్తలు బయటకు వెళ్లి పని ముగించుకుని ఇంటికి వెళుతున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. రోడ్డుపై నిలిచి ఉన్న ఓ వాహనాన్ని పృథ్వీరాజ్ నడుపుతున్న కారు ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారు బెలూన్లు తెరుచుకోవడంతో భార్యాభర్తలిద్దరూ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదం అనంతరం వారు రహదారికి మరోవైపు చేరుకున్నారు. కాగా, ప్రమాదం జరిగిన విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు పృథ్వీరాజ్ కారులో ఉండిపోయిన సెల్ఫోన్ కోసం వెళుతూ.. మళ్లీ రోడ్డు దాటుతున్న క్రమంలో అదే సమయంలో వేగంగా వచి్చన వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పృథ్వీ మృతదేహం శనివారం లేదా ఆదివారం ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని బంధువులు తెలిపారు. -
అమెరికాలో ఖమ్మం యువకుడు మృతి
ఖమ్మం సహకారనగర్: బీటెక్ పూర్తిచేశాక బహుళజాతి కంపెనీలో ఉద్యోగం వచ్చినా కాదను కున్న యువకుడు ఎంఎస్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఇటీవలే కోర్సు పూర్తికాగా, కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు తల్లి దండ్రులూ అమెరికా వెళ్లారు. పట్టా స్వీకరించిన సంతోషంలో స్నేహితులతో కలిసి విహారయాత్ర కు వెళ్లిన ఆ యువకుడు అక్కడి జలపాతంలో మునిగి మృతి చెందగా.. కొడుకు మృతదేహంతో స్వస్థలానికి వెళ్లాలని తెలిసిన ఆ తల్లిదండ్రుల రోదనకు అంతు లేకుండా పోయింది. ఈ విషాద ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. ఖమ్మంలోని మాంటిస్సోరి పాఠశాలల డైరెక్టర్ లక్కిరెడ్డి చంద్రశేఖర్రెడ్డి ఏకైక కుమారుడు రాకేశ్ (24) రెండేళ్ల క్రితం బీటెక్ పూర్తిచేయగా అమెజా న్లో ఉద్యోగం వచ్చింది. అయినా ఎంఎస్ చదవా లనే లక్ష్యంతో అమెరికా వెళ్లాడు. అక్కడ అరిజోనా యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తిచేసిన ఆయన వారం క్రితం పట్టా స్వీకరించారు. కుమారుడు పట్టా స్వీకరించడాన్ని కళ్లారా చూసేందుకు చంద్రశేఖర్రెడ్డి దంపతులు అమెరికా వెళ్లి ప్రస్తుతం అక్కడే ఉన్నారు. అయితే, ఎంఎస్ విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా అమెరికాలోని ప్రసిద్ధ ఫాసిల్ క్రీక్ జలపాతం వద్దకు రాకేశ్, ఆయన స్నేహితులు ఈనెల 8వ తేదీన వెళ్లారు.జలపాతం వద్ద సరదాగా గడుపుతుండగా రాకేశ్తో పాటు మరో యువకుడు ప్రమాదవశాత్తు జారి నీటిలో మునిగిపోయారు. గాలింపు చర్యలు చేపట్టగా మరుసటిరోజు 25 అడుగుల లోతులో మృతదే హాలు లభించాయి. రాకేశ్తో పాటు మృతి చెందిన మరో యువకుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
చికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం ఆందోళనలో తల్లిదండ్రులు
అమెరికాలో తెలుగు విద్యార్థి అదృశ్యం కావడం కలకల రేపుతోంది. ఉన్నత విద్య కోసం చికాగో వెళ్లిన తెలంగాణకు చెందిన 25 ఏళ్ల రూపేష్ చంద్ర చింతకింది అదృశ్యం అయ్యాడు. అతని అచూకీ కోసం కుటుంబ సభ్యులు భారత రాయబార వర్గాలను సంప్రదించారు. చికాగోలోని ఎన్ షెరిడాన్ రోడ్ 4300 బ్లాక్ నుంచి అతను తప్పిపోయినట్లు తెలుస్తోంది. టెక్సాస్ నుండి కలవడానికి వచ్చిన ఒకరిని కలవబోతున్నాడని చెప్పినట్లు సమాచారం.‘‘మే 2 మధ్యాహ్నం వాట్సాప్లో మాట్లాడాను. ఏదో పని మీద ఉన్నా అని చెప్పాడు. అంతే అప్పటినుంచి ఆఫ్లైన్లో ఉన్నాడు" రూపేష్ తండ్రి సదానందం తెలంగాణలోని హన్మకొండకు చెందిన రూపేశ్ విస్కాన్సిన్ లోని కాంకార్డియా యూనివర్శిటీలో మాస్టర్స్ చదువుతున్నాడు. వారం రోజులుగా రూపేశ్ ఆచూకీ లభించకపోవడంతో హైదరాబాద్లోఉంటున్న అతని తల్లిదండ్రలు ఆందోళనకు గురయ్యారు. తమ కుమారుడి ఆచూకీ కనుగొనాలంటూ భారత విదేశాంగా శాఖను కోరింది. త్వరలోనే రూపేశ్ అచూకీ తెలుస్తుందని ఆశిస్తున్నామని చికాగోలోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది.The Consulate is deeply concerned learning that Indian student Rupesh Chandra Chintakindi is incommunicado since 2nd May. Consulate is in touch with the police and the Indian diaspora hoping to locate/reestablish contact with Rupesh.@IndianEmbassyUS @MEAIndia— India in Chicago (@IndiainChicago) May 8, 2024మే 2 నుంచి రూపేశ్ మిస్సయినట్లు చికాగోలోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా తెలిపింది. అతడి ఆచూకి కోసం పోలీసులు ప్రవాస భారతీయులతో నిరంతరం చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. రూపేష్ ఆచూకీ తెలిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని స్థానిక పోలీసులు ప్రకటన విడుదల చేశారు. -
శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో లెర్న్ చెస్ అకాడెమీ వార్షిక చెస్ టోర్నమెంట్
సింగపూర్లో ప్రముఖ చెస్ శిక్షణ సంస్థ అయిన “లెర్న్ చెస్ అకాడమీ”(Learn Chess Academy) మే 1వ తేదీన వార్షిక చెస్ టోర్నమెంట్ నిర్వహించడం ద్వారా యువ చెస్ ప్రతిభను పెంపొందించే ప్రయత్నం చేసారు. ఈ టోర్నమెంట్లో 6 నుండి 15 సంవత్సరాల వయస్కులైన సుమారు 50 మంది విద్యార్థులు పాల్గొన్నారు. అండర్ 6, 8, 10, 12 ,13 ఏళ్ల పైబడినవారు ఇలా ఐదు విభాగాలలో పోటీపడ్డారుఅపార అనుభవం కలిగిన ప్రొఫెషనల్ చెస్ కోచ్ మురళి కృష్ణ చిత్రాద స్థాపించిన ఈ “లెర్న్ చెస్ అకాడమీ”, 15 సంవత్సరాల నుండి నిరంతరంగా చిన్న పిల్లలకు మరియు యువకులకు చదరంగం ఆటలో శిక్షణ ఇస్తోంది. ఈ టోర్నమెంట్ కేవలం పోటీకి మాత్రమే కాకుండా, విద్యార్థులు తమ వ్యూహాత్మక నైపుణ్యాలను ప్రదర్శించే వేదికగా కూడా నిలిచింది.ఈ కార్యక్రమం బహుమతి పంపిణీ కార్యక్రమంలో, టాటా ఇంటర్నేషనల్ సింగపూర్ ఛైర్మన్ , ఏసియన్ ఫార్మర్ రెసిడెంట్ డైరెక్టర్, ది సింగపూర్ ఇండియన్ డెవలప్మెంట్ అసోసియేషన్ (SINDA) టర్మ్ ట్రస్టీ, సింగపూర్ ఇండియన్ ఫైన్ ఆర్ట్స్ సొసైటీ (SIFAS) అధ్యక్షుడు, అయిన కె.వి.రావు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. విశిష్ట అతిథిగా అనుజ్ ఖన్నా సోహమ్, AFFLE గ్రూప్ వ్యవస్థాపకుడు పాల్గొన్నారు.విద్యార్థుల విభిన్న ప్రతిభాపాటవాల ప్రదర్శనతో పాటు, వివిధ వినోదాత్మక కార్యక్రమాలతో, ఉత్సాహంగా జరిగింది. ముఖ్యంగా విద్యార్థులు చెస్ థీమ్ స్కిట్, రూబిక్స్ క్యూబ్ సొల్యూషన్ లాంటి, టాలెంట్ షో, ప్రత్యేకమైన క్యాలెండర్ గేమ్ , క్విజ్ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి.యువతలో సమస్యా పరిష్కార నైపుణ్యాలను, నిర్ణయం తీసుకునే నైపుణ్యాలు అభివృద్ధి చేయడంలో చెస్ ప్రాముఖ్యతను మురళి కృష్ణ చిత్రాడ వివరించారు. "సౌందర్య కనగాల" యాంకరింగ్ ఆకట్టుకుంది.శ్రీ సాంస్కృతిక కళాసారథి అధ్యక్షులు రత్న కుమార్ కవుటూరు, సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ నాగేష్ మరియు గోపి చిరుమామిళ్ల తదితర ప్రముఖులు విజేతలకు బహుమతులు అందజేసారు. -
వైయస్సార్సీపీ సిద్ధం సభలకు అమెరికా NRI ల సంఘీభావం !
ఎన్నికలకు సమయం సమీపిస్తున్న తరుణంలో లాస్ ఏంజెల్స్, ఇర్విన్ పట్టణంలోని వైయస్సార్సీపీ అభిమానులు సమావేశమైనారు.,ఈ వారం రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాలపై చర్చించారు. ముఖ్యంగా వైయస్సార్సీపీ ప్రభుత్వం గత ఐదేళ్లుగా చేసిన అభివృద్ధి పనులపై సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం కల్పించాలని తీర్మానించారు .వాస్తవానికి గత అన్ని ప్రభుత్వాలకంటే ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వర్తించినప్పటికీ , ఆదాయ వనరులతో భావితరాల అభివృద్ధికి బాటలు పరిచినప్పటికీ, కేవలం సంక్షేమానికి సంబందించిన విషయాలు మాత్రమే ఎక్కువ ప్రాచుర్యం పొందినందున, అభివృద్ధికి సంబంధించి మరింత అవగాహన కల్పించాలని తీర్మానించారు .ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు మాట్లాడుతూ, వైయస్సార్సీపీ తాను చేసిన పనులను చెప్పుకుంటూ, ఓట్లను అభ్యర్థిస్తుండగా , ప్రతిపక్షాలు మాత్రం వారు గతంలో చేసిందేమీ లేక కేవలం తిట్లు , పరుషవాక్యాలతో ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఈ వ్యత్యాసం గ్రహించలేని అజ్ఞానులు ఏమాత్రం కాదని , అది ఎన్నికల ఫలితాలలో నిరూపించబడుతుంది అన్నారు . -
సాంస్కృతిక కళాసారథి సింగపూర్ ఆధ్వర్యంలో పుస్తక సమీక్ష
శ్రీ సాంస్కృతిక కళాసారథి' ఆధ్వర్యంలో, సింగపూర్లో ప్రవాసభారతీయులతో డా. రామ్ మాధవ్ రచించిన నూతనగ్రంధ పరిచయ కార్యక్రమం ఘనంగా జరిగింది. డా రామ్ మాధవ్ ఇటీవల రచించిన *ది ఇండియన్ రియాలిటీ: మారుతున్న కథనాలు, షిఫ్టింగ్ పర్సెప్షన్ (“The Indian Reality: Changing Narratives, Shifting Perceptions”) పుస్తక పరిచయం,విశ్లేషణ కార్యక్రమం సింగపూర్లో మే 4న ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అనేక స్థానిక భారతీయ సంస్థల అధిపతులతో పాటు సుమారు 100 మంది సింగపూర్ వాసులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పుస్తక రచయిత, బీజేపీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఇండియా ఫౌండేషన్ పాలక మండలి అధ్యక్షుడు డా రామ్ మాధవ్ భారతదేశం చుట్టూ అభివృద్ధి చెందుతున్న కథనంపై అంతర్దృష్టి దృక్కోణాలను పంచుకున్నారు. భారతదేశంలోని ప్రస్తుత పరిపాలన ద్వారా అందించబడిన జవాబుదారీతనాన్ని ఆయన నొక్కిచెప్పారు, సానుకూల మార్పును ప్రభావితం చేయడానికి ప్రధాన స్రవంతి రాజకీయాల్లో యువకులు విద్యావంతులు పెరుగుతున్న భాగస్వామ్యాన్ని హైలైట్ చేశారు. అంతేకాకుండా, భారతదేశంలో సాంస్కృతిక పునరుజ్జీవనాన్ని గురుంచి నొక్కిచెప్పారు. అనంతరం రామ్ మాధవ్ , వామరాజు సత్యమూర్తిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సింగపూర్ తెలుగు సమాజం మాజీ అధ్యక్షుడు వామరాజు సత్యమూర్తి తదితరులు పాల్గొన్నారు. అనంతరం సభ్యులు అడిగిన సందేహాలను నివృత్తి చేసారు. 'శ్రీ సాంస్కృతిక కళాసారథి' సంస్థ అధ్యక్షులు కవుటూరు రత్నకుమార్ అతిధులకు, ఇంకా ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు రామాంజనేయులు చామిరాజు, శ్రీధర్ భరద్వాజ్, సుధాకర్ జొన్నాదుల, పాతూరి రాంబాబు, నిర్మల్ కుమార్, కాత్యాయని గణేశ్న, గ్లోబల్ ఇండియన్ ఇంటర్నేషనల్ స్కూల్ నుండి ప్రభురామ్, మమత, దినేష్, ఇండియా ఫౌండేషన్ నుండి దీక్ష తదితరులకు ధన్యవాదాలు తెలిపారు. అతిధుల విందు భోజనంతో ఈ కార్యక్రమం ముగిసింది. -
రూటే సెపరేటు
ఆయన స్థానికుడు కాదు. ఓ ఎన్ఆర్ఐ(నాన్ రెసిడెంట్ ఇండియన్). కానీ ఇక్కడే నివాసమంటూ జనాలకు నమ్మబలుకుతున్నాడు. విదేశాల్లో ఉద్యోగమని..ప్రజాసేవ కోసం ఇక్కడికి వచ్చానని ఊదర గొడుతున్నాడు. నియోజకవర్గ రాజకీయాల్లోకి వస్తూనే టీడీపీలో ముసలం సృష్టించాడు. అప్పటివరకు నియోజకవర్గ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన ఓ మాజీ ఎమ్మెల్సీని, మరో మాజీ ఎమ్మెల్యేను పూర్తిగా పక్కకు నెట్టేశాడు. పార్టీని తన చేతుల్లోకి తీసుకుని నిట్టనిలువునా రెండు వర్గాలుగా చీల్చేశాడు. ఒంటెత్తు పోకడలకు తెరతీసి ఎవరైనా తన వద్దకే రావాలి గానీ..తాను ఎవరి వద్దకూ వెళ్లనంటూ పార్టీలో విభేదాలకు ఆజ్యం పోశాడు. ఈ పంచాయితీ అధిష్టానం దగ్గరికి వెళ్లినా..‘చినబాబు’ మద్దతుతో ఆయన మాటకు ఎదురే లేకపోయింది. దీంతో పార్టీ సీనియర్ నాయకులంతా ఇప్పుడు అంటీముట్టనట్లు ఉంటున్నారు. ● అందరి వాడు కాదు ● నిన్నమొన్నటి వరకూ స్థానికంగా ఓటుహక్కూ లేదు ● ఒంటెత్తు పోకడతో దూరమైన టీడీపీ సీనియర్లు ● పార్వతీపురం నియోజకవర్గంలో ‘ఎన్ఆర్ఐ’కు ఎదురుగాలిసాక్షి, పార్వతీపురం మన్యం: నిజానికి పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యే ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థి బ్యాక్గ్రౌండ్ను పరిశీలిస్తే అన్నీ ఆర్థిక నేరారోపణలు, మోసాలు. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు వాటినే తెలుగుదేశం పార్టీ ఆ వ్యక్తి అర్హతలుగా నిర్ణయించి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. రాజకీయాల్లోకి రాకముందే ఇన్ని అబద్ధాలా అంటూ! నియోజకవర్గ ప్రజలు విస్తుపోతున్నారు. రేప్పొద్దున ఇటువంటి వ్యక్తికి ఓటేస్తే..ఇంకెన్ని మోసాలు చేస్తాడోనని చర్చించుకుంటున్నారు. పార్వతీపురం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎన్ఆర్ఐ ఎన్నికల బరిలో గెలిచేందుకు అన్ని అడ్డదారులూ తొక్కుతున్నట్లు ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఈ వ్యక్తికి రాజకీయంగా గానీ, ప్రజాసేవపరంగా గానీ గతంలో ఎటువంటి అనుభవమూ లేదు. పుట్టింది, పెరిగింది, నివాసం ఇక్కడ కానేకాదు. ఎప్పుడో తాతల కాలంలో ఉండేవార మని ఓ ఊరు పేరు చెప్పి, తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లోకి ప్రవేశించారు. పోనీ, ఆ ఊరిలోనైనా ఓటుహక్కు ఉందా? అంటే అదీ లేదు. మరో ఊరిలో ఆరునెలల క్రితం ఓటుకు దరఖాస్తు చేసుకున్నారు. 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ ఆయనకే అన్న హామీ లభించిన తర్వాతే..ఈ ప్రక్రియలన్నీ ప్రారంభించారు. పార్టీ క్యాడర్లోనూ అసంతృప్తి ఎక్కడి వ్యక్తినో తీసుకొచ్చి మా నెత్తిన పెట్టారని..ఆయన ఒంటెత్తు పోకడలతో నలిగిపోతున్నామంటూ టీడీపీ క్యాడర్ రగిలిపోతోంది. దీనికితోడు ప్రచార సమయంలో ఆయన వెంట వెళ్లే క్యాడర్కు అయ్యే ఖర్చును సైతం సదరు ‘ఎన్ఆర్ఐ’ పెట్టుకోవడం లేదని, స్థానికంగా ఉండే పార్టీ నాయకుల మీదే నెట్టేస్తున్నాడని వినికిడి. దీంతో చోటామోటా నాయకులకు చేతిచమురు వదిలిపోతోంది. మరోవైపు ప్రజలు కూడా ఎక్కడో వ్యక్తిని ఇక్కడెందుకు ప్రోత్సహించాలన్న ఆలోచనలో పడినట్లు సమాచారం. స్థానికేతరుడికి ఓటు వేయడం కన్నా.. స్థానికంగా ఉంటూ నిత్యం మన సమస్యలను పరిష్కరిస్తూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేను మరోసారి గెలిపించుకుందామని ఓ నిర్ణయానికి వచ్చేశారన్న చర్చ నియోజకవర్గంలో విస్తృతంగా సాగుతోంది. అటు పార్టీ క్యాడర్కు దూరమై, ఇటు ప్రజలకూ దగ్గర కాలేక.. సదరు ‘ఎన్ఆర్ఐ’ ఓటమికి మానసికంగా ముందుగానే సిద్ధపడిపోయినట్లు అనుచరులు చెప్పుకుంటున్నారు. ఆర్థిక నేరారోపణల్లో దిట్ట సదరు అభ్యర్థిపై తీవ్రమైన ఆర్థిక నేరారోపణలూ ఉన్నాయి. కులం ముసుగులో తమను మోసం చేశారని..అక్కడ సంపాదించిన డబ్బులతో రాజ్యాధికారం కోసం సదరు వ్యక్తి ఆరాటపడుతున్నారని ఇన్ఫాం ఇంటర్నేషనల్ అనే సంస్థ గతంలో తీవ్రంగా ఆరోపణలు గుప్పించింది. కులం అభ్యున్నతి కోసం 2014లో ఐఎఫ్ఎం అనే సంస్థ ఏర్పాటైందని చెప్పిన అక్కడి ప్రతినిధులు..2018లో తమ సంస్థ చేసిన కార్యక్రమాలు చూసి ఆ వ్యక్తి తమతో కలిశాడని పేర్కొ న్నారు. సంస్థలో ఉన్న కొంతమంది ఐఏఎస్, ఐపీఎస్ మేధావులను పక్కదారి పట్టించి..ఇదే సంస్థ పేరు మీద విశాఖ గీతం యూనివర్సిటీలో కెనరా బ్యాంకు ఖాతా తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడన్నారు. అదేవిధంగా ఓ టీవీ చానల్లో డైరెక్టర్గా చేరి, రూ.4 కోట్లు వసూలు చేసి సంస్థకు ఇవ్వలేదని నాడు గుర్తు చేశారు. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలియక ఆ టీవీ చానల్ నడుపుతున్న శ్రీనివాసరావు చనిపోయారని అప్పట్లో పార్వతీపురంలో విలేకరుల సమావేశం పెట్టి మరీ సంస్థ సభ్యులు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. -
స్పెయిన్ వరుడు, కర్ణాటక వధువు
కర్ణాటక: మనసుపడితే మూడుముళ్ల పండుగకు జాతిభేదాలతో పనేముంది. కొన్నిసార్లు దేశ సరిహద్దులు కూడా దాటి జంటలు ఒక్కటవుతాయి. ఇదే కోవలో స్పెయిన్ యువకుడు, మండ్య యువతి ప్రేమ బంధాన్ని పెళ్లితో సుస్థిరం చేసుకున్నారు. వివరాలు.. జిల్లాలోని కేఆర్ పేటె పట్టణానికి చెందిన వస్త్ర వ్యాపారి రవీంద్రనాథ కుమార్తె దీక్షిత కోయంబత్తూరులో ఈశా ఫౌండేషన్లో యోగా టీచర్గా పనిచేస్తోంది. స్పెయిన్లోని బార్సిలోనాకు చెందిన జాన్ వైడల్ ఆశ్రమానికి వస్తుండేవాడు. ఈ సమయంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ప్రేమ మొగ్గ తొడిగింది. పెద్దలకు చెప్పగా రెండు కుటుంబాలు పెళ్లికి సమ్మతించారు. దీంతో మంగళవారం కెఆర్ పేటెలోనే సంప్రదాయ రీతిలో వివాహ వేడుక జరిగింది. వరుని తల్లిదండ్రులు, తోబుట్టువులు సంప్రదాయ దుస్తులు ధరించి హాజరయ్యారు. -
తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు: తానా ఈవెంట్
డాలస్, టెక్సాస్: తానా సాహిత్యవిభాగం ‘తానా ప్రపంచసాహిత్యవేదిక’ ఆధ్వర్యంలో ప్రతి నెలా ఆఖరి ఆదివారం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో భాగంగా ఆదివారం నిర్వహించిన 67వసమావేశం: తెలుగు సాహిత్యంలో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు”అనే కార్యక్రమం ఆసాంతం ఆసక్తిదాయకంగా, వినోదాత్మకంగా జరిగింది. తానా అధ్యక్షులు నిరంజన్ శ్రుంగవరపు సభను ప్రారంభిస్తూ సామెతలు మన తెలుగు భాషకు సింగారంఅని, వీటిని పరిరక్షించవలసిన బాధ్యత మనఅందరిదీ అంటూపాల్గొంటున్న అతిథులకు స్వాగతం పలికారు.తానా ప్రపంచసాహిత్యవేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ మాట్లాడుతూ – సామెతలు, పొడుపుకథలలో పరిశోధనలుచేసిన, చేస్తున్నసాహితీవేత్తలు పాల్గొంటున్న ఈ కార్యక్రమం చాలా ప్రత్యేకం అన్నారు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ ..“భాషాసౌందర్యం, అనుభవ సారం, నీతి, సూచన, హాస్యంకలగలుపులతో సామెతలు, జాతీయాలు, నుడికారాలు, పొడుపుకథలు ఆయా కాలమాన ప్రజల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తూ ఉంటాయని, వీటిని కోల్పోకుండా భావితరాలకు అందించడంలో ప్రభుత్వాలు, విద్యాలయాలు, సంస్థలు చేయ వలసిన కృషి ఎంతైనా ఉందన్నారు” పొడుపుకథలలో పరిశోధనచేసి, ఉస్మానియా విశ్వవిద్యాలయంనుండి పీహెచ్డీ పట్టా అందుకుని, అదే విశ్వ విద్యాలయంలో తెలుగుశాఖాధ్యక్షులుగా పనిచేసిన ఆచార్య డా. కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై “తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ప్రత్యేక స్థానంఉందని, విజ్ఞానం, వినోదం, ఆసక్తి కల్గించే పొడుపు కథలకు సృష్టికర్తలు ప్రజలేనని, చమత్కారం, నిగూఢభావం కల్గిన పొడుపుకథలు పల్లె పట్టుల్లో, మరీముఖ్యంగా జానపద గేయాలలో కూడా ఎక్కువగా ఉంటాయని అనేక ఉదాహరణలతో శ్రావ్యంగా గానంచేసి వినిపించారు.ప్రత్యక అతిథిగా హాజరైన డా. ఊరిమిండి నరసింహారెడ్డి చమత్కార గర్భిత పొడుపు కథలు, ప్రహేళికలు, పలుకుబడులు, పదభందాలుమొదలైనసాహితీ ప్రక్రియలన్నీ మన తెలుగు సిరిసంపదలని, వాటి గొప్పదనాన్ని ఒక విహంగ వీక్షణంగా ప్రతిభా వంతంగా స్పృశించారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న పూర్వతెలుగు అధ్యాపకురాలు, ప్రముఖ రచయిత్రి, ఆచార్య డా. సి.ఎచ్ సుశీలమ్మ (గుంటూరు)– ‘కోస్తాంధ్ర ప్రాంత సామెతలపైన’ ; నటుడు, ప్రయోక్త, రచయిత, తెలుగు ఉపాధ్యాయుడు జి.ఎస్ చలం (విజయనగరం) ‘ఉత్తరాంధ్ర ప్రాంత సామెతలపైన’; మైసూరులోని తెలుగు అధ్యయన, పరిశోధనా విభాగంలో సహాయా చార్యులుగా పని చేస్తున్న ఆచార్య డా. బి నాగశేషు (సత్యసాయి జిల్లా) – ‘రాయలసీమ ప్రాంత సామెతలపైన’; ఉస్మానియా విశ్వవిద్యాలయంలో “తెలుగు, కన్నడ ప్రాంత వ్యవసాయ సామెతలు - తులనాత్మక పరిశీలన” అనేఅంశంపై పి.ఎచ్.డి చేస్తున్నబుగడూరు మదనమోహన్ రెడ్డి (హిందూపురం) – ‘వ్యవసాయరంగ సామెతలపై’ ఎన్నో ఉదాహరణలతో చేసిన అసక్తికర ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. -
అమెరికాలో ఘోర ప్రమాదం : ముగ్గురు గుజరాతీ మహిళలు దుర్మరణం
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో గుజరాత్కు చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందారు. సౌత్ కరోలినాలోని గ్రీన్విల్లే కౌంటీలోని వీరు ప్రయాణిస్తున్న కారు హైవేమీదనుంచి, వంతెనపైకి దూసుకెళ్లడంతో అక్కడిక్కడే మరణించారు. చనిపోయిన వారిని గుజరాత్లోని ఆనంద్ జిల్లా నివాసితులైన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్ , మనీషాబెన్ పటేల్గా గుర్తించారు. మితిమీరిన వేగంతో గ్రీన్విల్లే కౌంటీ కరోనర్స్ ఆఫీస్ I-85లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి 20 అడుగులు గాల్లోకి లేచి, అనంతరంఅదే ఎత్తులో ఉన్న చెట్లను ఢీకొట్టింది. అధిక వేగమే ప్రమాదానికి కారణమని చీఫ్ డిప్యూటీ కరోనర్ మైక్ ఎల్లిస్ మీడియాకు వెల్లడించారు. కారు ముక్కలైన తీరు చెట్టుపై కారు ఇరుక్కున్న వైనం వేగానికి అద్దం పడుతోందని తెలిపారు. కారులోని క్రాష్ డిటెక్షన్ సిస్టమ్ ఇతర కుటుంబ సభ్యులకు అలర్ట్ పంపింది. దీంతో వారు సౌత్ కరోలినాలోని స్థానిక అధికారులను అప్రమత్తం చేశారు. సౌత్ కరోలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ బృందాలు, దితర అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం శుభకార్యాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మధ్యాహ్నం ఆశీర్వాదం, వందన సమర్పణతో ముగిశాయి. ఈసందర్భంగా సీతారాముల వారికి నిర్వహించిన పల్లకీసేవలో పిల్లలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఎస్వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్ రాములు దాసోజు, భాస్కర్ నీల, కమలా కొచ్చెర్లకోట, ప్రవీణ్కుమార్ యాదవ్, సురేష్ గోపతి, సురేష్రెడ్డి గడ్డం, పావనిరెడ్డి, కేకే చివుకుల, కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్, తుకారాం రెడ్డి, రాఘవేందర్, గౌతమ్ శాస్త్రి, రవి వాసా, గోపి కొల్లూరు, రవికుమార్, వంశీ వుల్చి, వంశీ బోగిరెడ్డి, గోవర్దన్ హృదయపూర్వక కృతజ్ఞతలు,సంతోషాన్ని వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు స్వచ్ఛంద సేవకులు, దాతలు ఎంతగానో సహకరించారని కొనియాడారు. బ్రాక్నెల్లో కొత్తగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇందుకోసం www.svbtcc.orgలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ఎస్వీబీటీసీసీ సభ్యుల భక్తి,సేవానిరతనిఇ ప్రతిబింబించడమే కాకుండా వాలంటీర్ల అంకితభావం, నిబద్ధత కీలక పాత్రను పోషించాయని నిర్వాహకులు తెలిపారు. -
వెస్ట్ లండన్ బాలాజీ ఆలయంలో ఘనంగా శ్రీ సీతారామ కల్యాణోత్సవం
లండన్లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి టెంపుల్ అండ్ కల్చరల్ సెంటర్(SVBTCC)లో సీతారాముల కల్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఈ వేడుకను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తెలుగువారు తరలివచ్చారు. ఉదయం శుభకార్యాలతో ప్రారంభమైన ఈ ఉత్సవాలు మధ్యాహ్నం ఆశీర్వాదం, వందన సమర్పణతో ముగిశాయి. ఈసందర్భంగా సీతారాముల వారికి నిర్వహించిన పల్లకీసేవలో పిల్లలు, మహిళలు భక్తిశ్రద్ధలతో పాల్గొన్నారు. ఎస్వీబీటీసీసీ ట్రస్టీలు డాక్టర్ రాములు దాసోజు, భాస్కర్ నీల, కమలా కొచ్చెర్లకోట, ప్రవీణ్కుమార్ యాదవ్, సురేష్ గోపతి, సురేష్రెడ్డి గడ్డం, పావనిరెడ్డి, కేకే చివుకుల, కార్యవర్గ సభ్యులు విశ్వేశ్వర్, తుకారాం రెడ్డి, రాఘవేందర్, గౌతమ్ శాస్త్రి, రవి వాసా, గోపి కొల్లూరు, రవికుమార్, వంశీ వుల్చి, వంశీ బోగిరెడ్డి, గోవర్దన్ హృదయపూర్వక కృతజ్ఞతలు,సంతోషాన్ని వ్యక్తం చేశారు .ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తమకు స్వచ్ఛంద సేవకులు, దాతలు ఎంతగానో సహకరించారని కొనియాడారు. బ్రాక్నెల్లో కొత్తగా ప్రారంభించిన శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని భక్తులు దర్శించుకొని స్వామి వారి ఆశీస్సులు పొందాలని కోరారు. ఇందుకోసం www.svbtcc.orgలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చన్నారు. ఈ వేడుకల నిర్వహణలో ఎస్వీబీటీసీసీ సభ్యుల భక్తి,సేవానిరతనిఇ ప్రతిబింబించడమే కాకుండా వాలంటీర్ల అంకితభావం, నిబద్ధత కీలక పాత్రను పోషించాయని నిర్వాహకులు తెలిపారు. -
శ్రీలంక అమ్మాయి.. జగిత్యాల అబ్బాయి
రాయికల్: ఉద్యోగం కోసం జోర్డాన్ దేశం వెళ్లిన మేడిపల్లి అబ్బాయి.. శ్రీలంక అమ్మాయి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో హిందూసాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. మెట్పల్లి మండలం మూడుబొమ్మల మేడిపల్లి గ్రామానికి చెందిన జొరిగె అశోక్ ఉద్యోగం కోసం జోర్దాన్ దేశానికి వెళ్లాడు. అక్కడ శ్రీలంక దేశానికి చెందిన సమన్వి పరిచయమైంది. ఇరువురి మధ్య ప్రేమ చిగురించింది. వీరి ప్రేమకు కుటుంబసభ్యులు అంగీకారం తెలపడంతో అశోక్ అక్కాబావలైన రాయికల్ మండలం రామాజీపేటకు చెందిన చేగంటి శేఖర్–పూజితలు హిందూ సాంప్రదాయ ప్రకారం భూపతిపూర్లోని లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో వీరి వివాహం జరిపారు. దంపతులను ఎమ్మెల్యే సంజయ్కుమార్, మాజీ సర్పంచులు వాసరి రవి, మాజీ ఎంపీటీసీ బెజ్జంకి మోహన్, వైస్ ఎంపీపీ మహేశ్వర్రావు ఆశీర్వదించారు. -
YS Jagan మేమంతా సిద్ధం యాత్ర: స్కాట్లాండ్ యూకేలో సంఘీభావం
వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మేమంతా సిద్ధం యాత్రకు APలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్న వేల UK Scotland లోని ఎడిన్బర్గ్లో వైయస్సార్సీపీ UK కన్వీనర్లు డా ప్రదీప్ చింతా , ఓబులేరెడ్డి పాతకోట ఆధ్వర్యంలో మేమంతా సిద్ధం సంఘీబావ సభ నిర్వహించారుపేద ప్రజల అభ్యిన్నతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు 59 నెలలుగా కష్టపడుతున్నారు , మనమంతా ఈ ఒక్క నెలా జగనన్నకోసం కష్టపడి మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలనిడా ప్రదీప్ చింతా కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజలు జగనన్నకు బ్రహ్మరథం పడుతున్నారు, 175 సీట్లు తప్పకుండా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మేమంతా సిద్ధం నినాదంతో సభాప్రాంగణం మారుమ్రోగిందిఈ కార్యక్రమంలో వైయస్సార్సీపీ UK కమిటీ సభ్యులు అనిల్ బెంజిమెన్, ప్రభాకర్ రెడ్డి అవుతాల, విజయ్ పెండేకంటి, శ్రీకాంత్ పసుపుల, రఘు, దుష్యంత్ రెడ్డి, జోయెల్, రామిరెడ్డి పుచ్చకాయల, సాయి, కార్తీక్ భూమిరెడ్డి, క్రాంతి పాలెం, త్రినాథ్, గురు, శ్రీనివాస్ వరిగొండ, వాసూ విడుదల, కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. యూకే నలుమూలలనుండి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు.Read this article in English : Solidarity rally for YSRCP's Memantha Siddham yatra in Scotland -
అమెరికా వృద్ధిలో భారతీయుల వాటా ఎంత?
అమెరికాలో నివసిస్తున్న మన భారతీయుల్లో 65,960 మందికి అగ్రరాజ్య పౌరసత్వం అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. అనేకమంది మనవారు అక్కడ ఎప్పటి నుంచో నివసిస్తున్నా అందరికీ అక్కడి పౌరసత్వం లేదు. మనదేశంలో పుట్టి అక్కడ జీవిస్తున్నవారిలో దాదాపు 42 శాతం మందికి అక్కడి పౌరసత్వం పొందే అర్హత లేదని సీ ఆర్ ఎస్ నివేదిక తెలుపుతోంది.2023 నాటికి గ్రీన్ కార్డ్ లేదా లీగల్ పర్మినెంట్ రెసిడెన్సీ వున్న 2,90,000 మంది భారతీయులకు సహజ విధానంలో పౌరసత్వం పొందే అవకాశం వుందని చెబుతున్నారు.అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు ఆ దేశ జనాభాలో 14శాతం. గతంతో పోల్చుకుంటే అమెరికాలో నివసించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది.సాఫ్ట్ వేర్ రంగం పెరుగుతున్న కొద్దీ మనవాళ్ళ సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. విద్యార్థులు కూడా పెరుగుతున్నారు. తెలుగువారు కూడా బాగా పెరుగుతున్నారు.1.35 శాతంతో దాదాపు 50లక్షల మందికి పైగా మనవారు అగ్రరాజ్యంలో నివసిస్తున్నారు. కొత్తగా 65,960 మంది అధికారిక అమెరికా పౌరులయ్యారు. అగ్రరాజ్య పౌరసత్వం పొందాల్సిన మనవాళ్ళు ఇంకా చాలామంది వున్నారు.17 వ శతాబ్దం నుంచే మనవాళ్ళు అమెరికాకు వెళ్తున్నారు, కొందరు అక్కడే జీవిస్తున్నారు.వాళ్ళ అవసరాల కోసం మనవారిని వాళ్ళ సేవకులుగా తీసుకెళ్లడం అప్పటి నుంచే ప్రారంభమైంది."వాళ్లు సేవకులు కాదు బానిసలు" అని మన చరిత్రకారులు అంటున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వారు మనవారిని వాళ్ళ కాలనీలకు తరలించుకొని తీసుకెళ్లారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇది మరో రూపం తీసుకుంది. కొంతమంది ఉపాధి కోసం, కొంతమంది విద్య కోసం అమెరికా బాట పట్టారు. ఈ నాలుగు దశాబ్దాలలో ఆ సంఖ్య క్రమంగా గణనీయంగా పెరిగింది.1900 ప్రాంతంలో సిక్కులు ఎక్కువగా కాలిఫోర్నియా ప్రాంతంలో ఉన్నట్లు తెలుస్తోంది. స్వామి వివేకానంద చికాగో ప్రయాణం, ఉపన్యాసం పెద్ద ప్రభావాన్ని చూపించింది. వేదాంత సొసైటీ స్థాపనకు దారితీసింది. సిక్కులను కూడా అమెరికాలో ఒకప్పుడు హిందువులనే పిలిచేవారు. ఒక దశలో,భారతదేశం నుంచి వలసలను అరికట్టాలని కూడా అమెరికా చూసింది. ఇమిగ్రేషన్ చట్టాన్ని మరింత బలంగా నిర్మాణం చేయడంతో మన వాళ్ళ అమెరికా వలసలు తగ్గిపోయాయి. 1920ప్రాంతంలో భారతీయ అమెరికన్ల జనాభా కేవలం 6,400. ప్రస్తుతం 50లక్షలు. ఈ వందేళ్లలో మనవాళ్ళ జనాభా ఎన్నిరెట్లు పెరిగిందో? దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు.మన జనాభా పెరగడానికి కారణాలలో విద్య ప్రధానమైంది. దానికి మూలం మన ప్రతిభ. 1920ల్లో మన ప్రతిభ చూపించి వాళ్ళను గెలిచినవారిలో మన యల్లాప్రగడ సుబ్బారావు పేరెన్నిక కన్నవారు. గోవింద్ బిహారీ లాల్ కూడా చాలా గొప్పవారు. జర్నలిజంలో ప్రతిష్ఠాత్మకమైన పులిట్జర్ పురస్కారాన్ని పొందిన తొలి భారతీయుడు. అక్కడి నుంచి మొదలైన మన భారతీయ ప్రతిభా ప్రయాణం నేడు ఐటీ దిగ్గజాలు సత్య నాదెండ్ల, సుందర పిచ్చయ్య వంటివారు వరకూ సాగింది. మన దేశ మూలాలు కలిగిన కమలా హ్యారిస్ ప్రస్తుతం అగ్రరాజ్య ఉపాధ్యాక్షురాలుగా పదవిని అలంకరించారు. బానిసల గతి నుంచి బాసుల స్థాయికి మన భారతీయులు ఎదగడం గర్వకారణం.వ్యాపార, వాణిజ్యాలలో మనవారు అక్కడ అద్భుతంగా రాణిస్తున్నారు.మానవవనరులలో మనది గౌరవనీయమైన స్థానం. వైట్ హౌస్ లోనూ మనవారి ప్రాతినిధ్యం పెరుగుతోంది. అమెరికా ఎన్నికల్లో ఆర్ధిక సహాయం అందించేవారిలో మనవాళ్ళు కీలకంగా వున్నారు. కాకపోతే, రాజకీయ భాగస్వామ్యంలో మాత్రం వెనుకబడి వున్నారు. అమెరికాలో ఓటు హక్కున్న మనవాళ్ళు చాలామంది అస్సలు ఓటే వెయ్యరని మన వాళ్లే అంటారు. ఇది ఏ మాత్రం ఆహ్వానించదగిన విషయం కాదు. ఎన్నికల్లో నిలుచుండే అభ్యర్థులకు డబ్బులిస్తే సరిపోదు. ఎన్నికల్లో నిలబడాలి, ముఖ్యంగా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోవాలి.సాఫ్ట్ వేర్ రంగం తాజాది. వైద్యం, విద్య, పరిశోధన, మార్కెటింగ్ విభాగాల్లోనూ మనవాళ్ళు గౌరవనీయమైన సంఖ్యలోనే వున్నారు.అంతర్జాతీయ సంబంధాలలో అమెరికా ఒకప్పుడు పాకిస్తాన్ కే ఎక్కువ మద్దతు చూపించేది. పీవీ నరసింహారావు ప్రధానమంత్రిగా అధికారం పీఠం ఎక్కిన తర్వాత మన విదేశాంగ విధానంలో కొత్త వ్యూహాలు అల్లడం మొదలుపెట్టారు. అందులో అమెరికా బంధాలు కీలకమైనవి. చైనాతో ఎప్పటికైనా ఇబ్బందులు వస్తాయని ఆయన ముందే గ్రహించి ఈ అడుగు వేశారు. మన్ మోహన్ సింగ్ అదే బాటలో నడిచారు. నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయ్యాక సరికొత్త రూపును తెచ్చారు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ తో వ్యక్తిగత స్నేహాన్ని నెరిపారు. ట్రంప్ ఎన్నికలకు అమెరికా వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. ట్రంప్ ను ఇండియా ఆహ్వానించి గుజరాత్ లో లక్షమందితో పెద్ద సభ ఏర్పాటు చేసి, ట్రంప్ ను తన్మయంలో మునకలు వేయించారు.అమెరికాలో ప్రధానంగా వున్న రాజకీయ పార్టీలు రెండు. ఒకటి డెమోక్రటిక్ పార్టీ , రెండోది రిపబ్లికన్ పార్టీ. మనవాళ్ళు మొదటి నుంచి ఎక్కువ శాతం సహజంగా డెమోక్రటిక్ పార్టీకి మద్దతు అందించారు. క్రమంగా రిపబ్లికన్ పార్టీ వైపు కూడా మొగ్గు చూపడం ప్రారంభించారు. ముఖ్యంగా డోనాల్డ్ ట్రంప్ సమయంలో ఈ పరిణామం జరిగిందని అంటారు. బిల్ క్లింటన్, బరాక్ ఒబామా నుంచి జో బైడెన్ వరకూ అమెరికా అధ్యక్షులుగా పనిచేసినవారు భారతదేశం పట్ల ప్రత్యేక ప్రేమ చూపించి నట్లు కనిపించినా, వారి ప్రేమ ఒకింత పాకిస్తాన్ వైపే ఎక్కువగా ఉండేదని కొందరు వ్యాఖ్యానిస్తారు. వీరితో పోల్చుకుంటే డోనాల్డ్ ట్రంప్ కు భారత్ పట్ల ఆకర్షణ, అనురాగం ఎక్కువని కొందరు అంటారు.రేపు జరగబోయే ఎన్నికల్లో ట్రంప్ - బైడెన్ మధ్య హోరాహోరి పోరు వుంది. ట్రంప్ అధికారంలోకి వస్తే భారత్ కు, అక్కడ నివసించే భారతీయులకు ఎక్కువ మేలు జరుగుతుందని ఒక వర్గం అంటోంది. మనది ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్. మనతో అగ్రరాజ్యానికి చాలా అవసరం వుంది. గతంతో పోల్చుకుంటే మన అవసరం ఆ దేశానికి పెరుగుతోంది. అమెరికా - భారత్ మధ్య వాణిజ్య, వ్యాపారాలు పెరుగుతున్నాయి. ఇంకా పెరగాల్సి వుంది. పెట్టుబడులు కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, అక్కడ నివసించే మన వారికి పన్నుల రాయతీలోనూ, వ్యాపార ప్రోత్సాహకాలలోనూ, పౌరసత్వ కల్పనలోనూ, రాజకీయ భాగస్వామ్యంలోనూ ఇంకా సహకారం ఎంతో పెరగాల్సి వుంది. ఇమిగ్రేషన్, వీసాల అనుమతులు, ఉద్యోగాల కల్పనలో అగ్రరాజ్యం ఇంకా ఉదారంగా వ్యవహరించాలి.ప్రస్తుతం,అమెరికాలో కీలక భూమిక పోషిస్తున్న భారతీయులు భవిష్యత్తులో మరింత కీలకమైన వ్యక్తులుగా, వ్యవస్థలుగా మారతారని నిస్సందేహంగా చెప్పవచ్చు. అగ్రరాజ్యంలో భారతీయుల అధికారిక అమెరికా పౌరుల సంఖ్య భవిష్యత్తులో గణనీయంగా పెరుగుతుందని అంచనా వెయ్యవచ్చు.ఇప్పటికే పౌరసత్వం వున్న కొందరికి సంపూర్ణమైన స్వేచ్ఛ లేదు.దానికి కూడా పరిష్కారం లభించాలి. ఉభయ పౌరసత్వం ( అమెరికా - భారత్ ) పట్ల కూడా అడుగులు పడవచ్చు.- మాశర్మ. సీనియర్ జర్నలిస్టు -
AP Education Reforms : నాణ్యమైన విద్యతోనే మార్పు, ప్రవాసాంధ్రుల ప్రశంసలు
ప్రపంచాన్ని మార్చడానికి విద్య చాలా ముఖ్యమైన ఆయుధం అని నెల్సన్ మండేలా అన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ కూడా అదే నమ్మకంతో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి అనేక చర్యలు చేపట్టారు. అమ్మ ఒడి, విద్యా కానుక, ఫీజు రీయింబర్స్మెంట్, ఉన్నత విద్యలో సంస్కరణలు, కొత్త వైద్య కళాశాలలు మొదలైన అనేక సంక్షేమ పథకాలను ఆయన ప్రారంభించారు.ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుని ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించిన ఆంధ్ర రాష్ట్ర విద్యార్థులు...విద్యకు పెద్ద పీట వేస్తే ఇలాంటివి ఎన్నయినా సాధిస్తారు... ఇదొక ఉదాహరణ మాత్రమే. రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అనేకం... ఇంగ్లిష్ మీడియం చదువులు, ప్రభుత్వ బడుల్లో ఆధునిక టెక్నాలజీ ఉపయోగం.. బడులు/భవనాల ఆధునికరణ... నాడు నేడు కింద ఆధునీకీకరణ ఎలా జరిగింది. ప్రభుత్వ బడుల్లో ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ఏమేం సౌకర్యాలు వచ్చాయి.. మరుగు దొడ్లలో మార్పులు... ఇంకా మరెన్నో. విద్యలో చేపట్టిన సంస్కరణల గురించి చర్చించిన ఈ డిబేట్లో రానున్న రోజుల్లో విద్య వల్ల సమాజానికి ఎలాంటి పురోగతిని అనే వాటి గురించి సాక్షి ఒక చర్చ నిర్వహించింది. ఈ చర్చలో అమెరికాలోని పలువురు ప్రవాసాంధ్రులు పాల్గొన్నారు. డాక్టర్ కామేశ్వర బద్రి, PhD, మోర్హౌస్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్, డైరెక్టర్, ప్రెసిడెంట్, అసోసియేషన్ ఆఫ్ సైంటిస్ట్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ ఇన్ అమెరికా, హ్యూస్టన్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ సురేష్ రెడ్డి మైలం, ఫీనిక్స్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధీరజ్ పోలా, హార్ట్ఫోర్డ్ నుంచి చరణ్ పింగిళి, సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, అట్లాంటా నుంచి కమల్ కిరణ్ జనుమల, సీవోవో, రెడ్ యాంట్స్ గ్రూప్ (IT, ఫైనాన్స్ & మీడియా ఈ చర్చల్లో పాల్గొన్నారు. -
కొవ్వెక్కి కొట్టుకుంటున్న పచ్చ ముఠా..!
-
పల్లెల్లో ఓట్ల కొనుగోలుకు టీడీపీ భారీ కుట్రలు
-
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హనుమకొండ వాసి మృతి
కురవి/ వరంగల్ క్రైం: అమెరికాలోని టెక్సాస్లో శనివారం రాత్రి (భారతీయ కాలమాన ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు(విలేజి)కు చెందిన బండి రోహిత్రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బండి అనిల్రెడ్డి, అనితారెడ్డి దంపతులు సుమారు 20 సంవత్సరాల నుంచి హనుమకొండలోని సహకారనగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రోహిత్రెడ్డి టెక్సాస్లో అమెజాన్లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు రోహన్రెడ్డి కూడా అక్కడే ఎంఎస్ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలైన రోహిత్రెడ్డిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి టెక్సాస్కు ప్రయాణమయ్యారు. -
డాక్టరేట్ అందుకున్న రామ్ చరణ్.. మెగాస్టార్ రియాక్షన్ ఇదే
మెగాస్టార్ వారసుడిగా 'చిరుత'లా ఎంట్రీ ఇచ్చిన రామ్ చరణ్.. నేడు గ్లోబల్ స్టార్ రేంజ్కు చేరుకోవడమే కాదు తాజాగా గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తన నటనతో 'రంగస్థలం'పై మెప్పించి ఇండస్ట్రీ 'గేమ్ ఛేంజర్'గా గుర్తింపు తెచ్చుకున్న 'చరణ్' వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ అందుకున్నారు. అద్భుతమైన సినిమాలు చేస్తూ తనదైన ఇమేజ్ను సంపాదించుకున్న రామ్ చరణ్ కీర్తి కిరీటంలో మరో డైమండ్ చేరింది. వివిధ రంగాల్లో విశిష్ట వ్యక్తులను గుర్తించి వారికి గౌరవ డాక్టరేట్స్ ఇవ్వటంలో వేల్స్ యూనివర్సిటీ ప్రసిద్ధి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంటర్టైన్మెంట్ రంగంలో ఎంటర్ప్రెన్యూరర్గా రామ్ చరణ్ చేసిన సేవలకు వేల్స్ యూనిర్సిటీ 14వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయనకు గౌరవ డాక్టరేట్ను అందించింది. అందులో రామ్ చరణ్తో పాటు డా.పి.వీరముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ చంద్రయాన్, ఇస్రో), డా.జి.ఎస్.కెవేలు (ఫౌండర్, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్), అచంట శరత్ కమల్ (పద్మశ్రీ అవార్డ్ గ్రహీత, ప్రముఖ టేబుల్ టెన్నిస్ ప్లేయర్)లను కూడా గౌరవించారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ.. 'నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించి గౌరవంతో డాక్టరేట్ బహుకరించిన వేల్స్ యూనివర్సిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ 45వేలకు పైగా స్టూడెంట్స్ ఉన్నారు. 38 సంవత్సరాలకు పైగా ఈ యూనివర్సిటీని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. అలాంటి యూనివర్సిటీ నుంచి నాకు గౌరవ డాక్టరేట్ ఇస్తున్నారనే విషయం తెలియగానే మా అమ్మగారు నమ్మలేదు. ఆర్మీలాంటి గ్రాడ్యుయేషన్స్ మధ్యలో నేను ఈరోజు ఇలా ఉండటం ఊహిస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. నిజానికి నాకు దక్కిన గౌరవం నాది కాదు.. నా అభిమానులది, దర్శకులు, నిర్మాతలు, నా తోటి నటీనటులది. వేల్స్ యూనివర్సిటీని ఇంత విజయవంతంగా ముందుకు తీసుకెళుతున్న యాజమాన్యానికి, టీచింగ్ సిబ్బందికి, విద్యార్థులుకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. చెన్నై నాకెంతో ఇచ్చింది. నాకే కాదు, మా నాన్నగారు తన ప్రయాణాన్ని ఇక్కడ నుంచే ప్రారంభించారు. నా సతీమణి ఉపాసన వాళ్లు అపోలో హాస్పిటల్స్ను కూడా ఇక్కడ నుంచే మొదలు పెట్టారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎనబై శాతం మందికి చెన్నైతో మంచి అనుబంధం ఉంది. ఏదైనా సాధించాలని కలలు కని చెన్నైకి వస్తే అది నేరవేరుతుంది. అది ఈ ప్రాంతం గొప్పతనం. అన్ని రంగాల వారికి ఈ భూమి కలలను నేరవేర్చేదిగా ఉంటూ వస్తుంది. నేను ఇక్కడ విజయ హాస్పిటల్లోనే పుట్టి పెరిగాను. సినిమాల విషయానికి వస్తే ప్రముఖ డైరెక్టర్ శంకర్గారితో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాను. ఆయనతో వర్క్ చేయాలని చాలా మంది అనుకుంటారు. నేను ఇప్పుడు ఆయనతో వర్క్ చేయటం మంచి ఎక్స్పీరియెన్స్. శంకర్ గారు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. డిఫరెంట్ స్టోరీతో ఈ పొలిటికల్ థ్రిల్లర్ తెరకెక్కుతుంది. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా సెప్టెంబర్- అక్టోబర్ నెలల్లో విడుదల చేయాలని అనుకుంటున్నాం. ' అని అన్నారు. నాకు చాలా గర్వంగా ఉంది: చిరంజీవి 'తమిళనాడులో ప్రసిద్ధ విద్యాసంస్థగా కొనసాగుతున్న వేల్స్ విశ్వవిద్యాలయం నుంచి రామ్ చరణ్కు గౌరవ డాక్టరేట్ దక్కడం నాకు చాలా సంతోషంగా ఉంది. నన్ను ఒక తండ్రిగా ఎమోషనల్గా ఫీల్ అవడమే కాకుండా.. గర్వంగా భావిస్తున్నాను. పిల్లలు విజయాలను అధిగమించినప్పుడు ఏ తల్లిదండ్రులకైనా నిజమైన ఆనందం కలుగుతుంది. రామ్ చరణ్ చాలా స్థిరంగా విజయాలను అందుకుంటున్నాడు. లవ్ యు మై డియర్ డా.రామ్ చరణ్' అని మెగాస్టార్ తెలిపారు. View this post on Instagram A post shared by Chiranjeevi Konidela (@chiranjeevikonidela)
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
గంజాయి స్వాధీనం
పచ్చిరొట్టతో అనేక ప్రయోజనాలు
కార్పొరేట్ విద్య
ప్రభుత్వ కళాశాలల్లోనే నాణ్యమైన విద్య
ఎంసీహెచ్పై మరింత నమ్మకం పెంచండి
ధాన్యం కొనుగోళ్లు త్వరగా పూర్తి చేయాలి
కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట
‘రిజిస్ట్రేషన్’పై న్యాయం చేయాలని నిరసన
కేయూ ఇన్చార్జ్ వీసీగా వాకాటి కరుణ
మాజీ ప్రధానికి ఘన నివాళి
తప్పక చదవండి
- ‘కంగనా కాలు మోపిన ఆలయాలను శుద్ధి చేయాలి’
- అమెరికాలో ముగ్గురు భారతీయ విద్యార్థుల దుర్మరణం : ఎన్ని కలలు కన్నారో..!
- పోర్షే కారు ప్రమాదం: ‘పబ్లో భారీ ఖర్చు’.. వెల్లడించిన పోలీసులు
- అమెరికాలో తెలుగు మహిళకు అరుదైన గౌరవం
- ఏపీలో రాబోయే ప్రభుత్వంతో సత్సంబంధాలు: తిరుమలలో సీఎం రేవంత్రెడ్డి
- ఇన్స్టా రీల్ కోసం వందడుగుల ఎత్తు నుంచి దూకి..
- బయోపిక్లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
- ‘కాంగ్రెస్ పాలనలో కన్నీటి దృశ్యాలివి’.. కేటీఆర్ వ్యాఖ్యలు
- పవన్ ఏ దేశానికి వెళ్లారు?
- అదే మా కొంపముంచింది.. వీలైనంత త్వరగా మర్చిపోవాలి: కమ్మిన్స్
Advertisement