అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హనుమకొండ వాసి మృతి | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. హనుమకొండ వాసి మృతి

Published Mon, Apr 15 2024 1:35 AM

- - Sakshi

గుండ్రాతి మడుగు వాసికి తీవ్రగాయాలు

టెక్సాస్‌కు వెళ్లిన తల్లిదండ్రులు

కురవి/ వరంగల్‌ క్రైం: అమెరికాలోని టెక్సాస్‌లో శనివారం రాత్రి (భారతీయ కాలమాన ప్రకారం) జరిగిన రోడ్డు ప్రమాదంలో మహబూబాబాద్‌ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు(విలేజి)కు చెందిన బండి రోహిత్‌రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన బండి అనిల్‌రెడ్డి, అనితారెడ్డి దంపతులు సుమారు 20 సంవత్సరాల నుంచి హనుమకొండలోని సహకారనగర్‌లో నివాసం ఉంటున్నారు.

వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు రోహిత్‌రెడ్డి టెక్సాస్‌లో అమెజాన్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. చిన్న కుమారుడు రోహన్‌రెడ్డి కూడా అక్కడే ఎంఎస్‌ చదువుకుంటున్నాడు. ఈ క్రమంలో రోహిత్‌రెడ్డి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. తీవ్రగాయాలైన రోహిత్‌రెడ్డిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. ఈ విషయంపై తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఆదివారం రాత్రి టెక్సాస్‌కు ప్రయాణమయ్యారు.

Advertisement
Advertisement