Sakshi: Telugu News | Latest Telugu News | తెలుగు వార్తలు | Online Telugu Breaking News Today

ప్రధాన వార్తలు

YSRCP President YS Jagan Mohan Reddy Key Press Meet At 11 AM1
QR కోడ్‌తో బాబు మోసాలను నిలదీద్దాం.. ప్రజలకు వైఎస్‌ జగన్‌ పిలుపు

సాక్షి,గుంటూరు: ఏపీలో ఏడాదిగా కూటమి పాలనలో.. టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్‌ జగన్‌ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్‌ ఆర్డర్‌, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్‌పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం.. ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్‌లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్‌ డైవర్ట్‌ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్‌ పాలిటిక్స్‌లో భాగంగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అరెస్ట్‌ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్‌ నిజంగా అశ్చర్యకరం. ‌తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వాలని గన్‌మెన్‌ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్‌మెంట్‌ ఇవ్వనందుకు గన్‌మెన్‌పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్‌, డీజీపీకి గన్‌మెన్‌ లేఖ రాశారు. మరో గన్‌మెన్‌ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్‌మెంట్‌ ఇప్పించుకున్నారు. వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్‌ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్‌ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్‌ను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్‌ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్‌ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్‌ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్‌రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్‌, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్‌పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డిపై, ఉషశ్రీచరణ్‌, తోపుదుర్తి ప్రకాష్‌, గోరంట్ల మాధవ్‌పై కేసులు. ఇలా వైఎస్సార్‌సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్‌ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు.. చంద్రబాబూ?సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్‌ చేశారు?టీవీ డిబెట్‌లో అనలిస్ట్‌ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్‌ఆర్‌ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్‌ఆర్‌ అరెస్ట్‌ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది. మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా?మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా అని వైఎస్‌ జగన్‌ ప్రెస్‌మీట్‌లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బయటకొచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారు. కనీసం చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదా? న్యాయం చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. న్యాయం వైపు నిలిచే వ్యక్తి చంద్రబాబు కాదు. మరో ప్రాంతంలో ఇంటర్‌ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తర్వాత బాలిక శవమై కనిపించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. టీడీపీ నేత.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటిప్రజల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లను మంజూరు చేసి 10లక్షల ఇళ్లు పూర్తి చేశాం. చట్టం చేసి మరి నామినేటెడ్‌ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించ్చాం. మహిళలపై ఎవరికి గౌరవం ఉంది?. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి.కరెంట్‌ బిల్లుల బాదుడే.. బాదుడు15వేల కోట్లు కరెంట్‌ బిల్లుల బాదుడు,గవర్నమెంట్‌ స్కూళ్లు కాలేజీ కాలేజీల్ని నిర్విర్యం చేశాడు. ప్రైవేట్‌ స్కూల్స్‌, కాలేజీల్లో ఫీజుల పేరిట బాదుడే బాదుడే. రేషన్‌ వెహికల్స్‌ వాహనాల్ని తీసేశాడు. రేషన్‌ ద్వారా ఇచ్చే పప్పు దాన్యాల్ని ఎగనామం పెట్టాడు. ఫలితంగా పప్పు దాన్యాల రేట్లు పెంచి బాదుడే బాదుడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. సుమారు 3లక్షలపై చీలూకు ఉద్యోగాల్ని తొలగించారు.ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరేసరిపంటలకు సరైన మద్దతు లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా ఒరిగిందా అంటే? అదీ లేదు. వచ్చీ రాగానే పీఆర్సీ అన్నారు. పీఆర్సీని ఆపేశారు. ఈ జులై 1వ తారీఖుతో కలిసి నాలుగు డీఏ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 20 వేలకోట్ల వరకు ఆపేశారు. చంద్రబాబు పెట్టిన తాకట్టు.. చంద్రబాబు తాను అబద్ధమాడుతూ.. తానెప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టడం లేదు. కానీ 4-4-2025 నాడు విడుదల చేసిన జీవో 69 కింద ఏపీఎండీసీ కింద 436 మినరల్‌ ప్రాజెక్ట్‌ను తాకట్టు పెట్టారు. వాటి విలువ 191,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి ప్రెస్‌మీట్‌లో రాష్ట్ర ప్రజలకు వైఎస్‌ జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో, బాండలను అందరూ రెడీగా పెట్టుకోవాలి. చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకునేందుకు మీ ఇంటికి ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని పంపిస్తున్నారు. నేతలు వచ్చినప్పుడు మ్యానిఫెస్టో, బాబుష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాండును అందించారు. ఆ బాండు, ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ ఎంత వరకు ఎన్నికల హామీలు నెరవేర్చారో అడగండి. అప్పుడైనా చంద్రబాబుకు ఎన్నికల హామీలు నెరవేర్చుతారో చూడాలి. ఒకవేళ మీ వద్ద ‘బాబు మ్యానిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటూ’ అనే పేరుతో చంద్రబాబు మ్యానిఫెస్టోను డౌన్‌లోడ్‌ చేసుకునేలా క్యూఆర్‌ కోడ్‌ను వైఎస్సార్‌సీపీ అందుబాటులోకి తెస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వంపై ఫైట్‌ చేయండి. రాష్ట్ర ప్రజల తరుఫున వైఎస్సార్‌సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్సార్‌సీపీ అధినేత, వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు.

India Op Sindoor Effect: Pak Still Struggles To Open Air Bases2
ప్చ్‌.. పాకిస్తాన్‌ పీత కష్టాలు

ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్‌ సూపర్‌ సక్సెస్‌.. ఆపరేషన్‌ సిందూర్‌ అట్టర్‌ ప్లాప్‌ అని డప్పు కొట్టి ప్రకటించుకున్నా పాక్‌ను పట్టించుకునే నాథుడే(దేశం)కరువయ్యాడు. పైగా 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్‌ పరిశోధకుడు డామియన్ సైమన్ పాక్‌ పాలిట పీడకలగా తయారయ్యాడు.భారత సైన్యం అసలు తమ ఎయిర్‌బేస్‌లపై దాడులే జరపలేదని పాక్‌ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్‌ సిందూర్‌లో మురిద్‌, జాకోబాబాద్‌, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్‌బేస్‌లను టార్పలిన్‌(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్‌. ఈ విషయాన్ని బయటపెట్టిన డామియన్‌.. ఇప్పుడు మరో కీలక సమాచారాన్ని ఎక్స్‌ వేదికగా వదిలాడు. అందులో రహీం యార్‌ ఖాన్‌ బేస్‌ను పాక్‌ ఎంతకీ పునరుద్ధరించలేకపోతోందని వెల్లడించాడు.Pakistan once again issues a NOTAM for Rahim Yar Khan, the runway struck by India in May 2025 now remains offline estimated till 04 July 2025 pic.twitter.com/M6nE1ONTmL— Damien Symon (@detresfa_) June 19, 2025ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా ఫేజ్‌1లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం.. ఫేజ్‌2లో రహీమ్‌ యార్‌ ఖాన్‌ బేస్‌ను సైతం దెబ్బ తీసింది. అయితే జులై 4వ తేదీ దాకా దాని కార్యకలాపాలు ప్రారంభం కాబోవని పాక్‌ సైన్యం తాజాగా నోటామ్‌(notice to airmen) సైతం జారీ చేసింది.ఆపరేషన్‌ సిందూర్‌లో భాగంగా.. పక్కా ప్రణాళికతో భారత్‌ ఈ ఎయిర్‌బేస్‌ను దెబ్బ తీసింది. దీంతో పాకిస్తాన్‌కు జరిగిన నష్టం మాములిది కాదు. పంజాబ్‌ ప్రావిన్స్‌లో పాక్‌కు ఇదే వ్యూహాత్మక స్థావరంగా ఉండేది. అంతేకాదు.. ఈ ఎయిర్‌బేస్‌కు అనుసంధానంగా రహీమ్‌ యార్‌ ఖాన్‌ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఒకే రన్‌వే ఉన్న ఈ ఎయిర్‌పోర్టును భారత్‌ జరిపిన దాడి తర్వాత వారం పాటు మూసే ఉంచుతామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే అది కూడా ఇప్పటిదాకా తెరుచుకోకపోవడం గమనార్హం. దీంతో.. దాడి ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ‘‘అది ఇంకెప్పటికి తెరుచుకుంటుందో?’’ అంటూ సోషల్‌ మీడియాలో జోకులు పేలుతున్నాయి.India didn’t just respond, it decimated yet another key site of #Pakistan's attack. #Rahimyarkhan airport, a key launchpad for Pakistani drone attacks, now lies in ruins.Precision. Power. Payback.#PakistanIndianWar pic.twitter.com/zvkaaWFH5R— DrVinushaReddy (@vinushareddyb) May 10, 2025విశేషం ఏంటంటే.. రాజస్థాన్‌ బికనీర్‌లో నిర్వహించిన ఓ ర్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్‌బేస్‌ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాక్‌ రహీమ్‌ యార్‌ ఖాన్‌ ఎయిర్‌బేస్‌ ఇంకా ఐసీయూలోనే ఉంది. అది ఎప్పటికీ తిరిగి తెరుచుకుంటోందో కూడా చెప్పలేకపోతున్నారు అని మోదీ తన ప్రసంగంలో వ్యంగ్యం ప్రదర్శించారు. " مودی" نے رحیم یارخان ائیر بیس تباہ کردیا 😂😂راجھستان ، رحیم یارخان بارڈر کے دوسری طرف عوامی جلسے سے خطاب#modi #rajasthan #RahimYarKhan #rahimyarkhanpakistan pic.twitter.com/9oRsvL5ql6— Rana Kashif (@ranakashi102) May 23, 2025📍రహీం యార్ ఖాన్ (Rahim Yar Khan) పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లో ఉన్న ఒక ప్రముఖ నగరం(జిల్లా కేంద్రం కూడా). ఇది పాకిస్తాన్‌లో 21వ అతిపెద్ద నగరం. ఈ నగరం పూర్వపు పేరు నౌషెహ్రా. అయితే 1881లో బహావల్పూర్ రాష్ట్ర నవాబ్ సాదిక్ ఖాన్ IV.. తన కుమారుడు రహీం యార్ ఖాన్ (1877–1881) పేరును ఈ నగరానికి పెట్టాడు. ఈ ప్రాంతంలో పట్టన్ మినారా అనే 2000 సంవత్సరాల పురాతన బౌద్ధ స్థూపం ఉంది, ఇది మౌర్యుల హక్రా లోయ నాగరికతకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తుంటారు.

Shubman Gill Promises Big On The Eve Of 1st India-England Test3
నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలనుకుంటున్నా: గిల్‌

లీడ్స్‌లోని హెడింగ్లీ వేదిక‌గా భార‌త్‌-ఇంగ్లండ్ మ‌ధ్య తొలి టెస్టు శుక్ర‌వారం(జూన్ 20) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్ద‌మైంది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌లో శుభ‌రంభం చేయాల‌ని భార‌త జ‌ట్టు భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం(జూన్ 18) టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌ విలేక‌రుల స‌మావేశంలో పాల్గోనున్నాడు.ఈ సంద‌ర్భంగా పలు ప్ర‌శ్న‌ల‌కు గిల్ స‌మాధ‌న‌మిచ్చాడు. భార‌త కెప్టెన్‌గా త‌ను ఎదుర్కొనున్న ఛాలెంజ్స్ కోసం గిల్ మాట్లాడాడు. అయితే కెప్టెన్సీ భారం త‌న బ్యాటింగ్‌పై ప‌డ‌కుండా చూసుకుంటాని అత‌డు చెప్పుకొచ్చాడు. "ఇప్ప‌టివ‌ర‌కు ఏ విధంగా అయితే పూర్తి స్వేఛ్చ‌తో బ్యాటింగ్ చేశానో, ఇక‌పై కూడా అదే కొన‌సాగిస్తున్నాను. కెప్టెన్సీ గురుంచి ఎక్కువ‌గా ఆలోచించ‌కుండా నా బ్యాటింగ్‌పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ సిరీస్‌లో బెస్ట్ బ్యాటర్‌గా ఉండాలని భావిస్తున్నా. విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్ధానం కోసం ఇప్పటి​కే గంభీర్ భాయ్‌, నేను చర్చించుకున్నాము. మా దగ్గర రెండు వేర్వేరు కాంబినేషన్లు సిద్దంగా ఉన్నాయి. పిచ్‌ను పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గిల్ పేర్కొన్నాడు.భ‌య‌పెడుతున్న గిల్ రికార్డు..శుబ్‌మ‌న్ గిల్ త‌న కెరీర్‌లో 32 టెస్టులు ఆడి 1893 ప‌రుగులు చేశాడు. అందులో ఆరు సెంచ‌రీలు ఉన్నాయి. కానీ సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి రికార్డు మాత్రం టీమ్‌మెనెజ్‌మెంట్‌ను క‌ల‌వ‌ర‌పెడుతోంది. సెనాదేశాల్లో గిల్ ఇప్ప‌టివ‌ర‌కు 11 టెస్టులు ఆడి 514 ప‌రుగులు మాత్ర‌మే చేశాడు. ఇంగ్లండ్‌లో అయితే అత‌డి ప్ర‌ద‌ర్శ‌న మ‌రి దారుణంగా ఉంది. ఇంగ్లండ్ గ‌డ్డ‌పై మూడు టెస్టులు ఆడిన శుబ్‌మ‌న్‌.. 14.66 సగటుతో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ‘కోహ్లి చెప్పింది నిజమే.. కానీ మాకూ కుటుంబం ఉంటుంది.. డబ్బు సంపాదించాలి’

Those Who Speak English In Country Will Soon Feel Ashamed: Amit Shah4
ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులొస్తాయ్‌: అమిత్‌ షా

ఢిల్లీ: మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని.. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివన్న అమిత్ షా.. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు.. అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను.’’ అంటూ అమిత్‌ షా చెప్పుకొచ్చారు.మన దేశాన్ని, మన సంస్కృతి, చరిత్ర, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏవిదేశీ భాష కూడా సరిపోదని అమిత్‌ షా వ్యాఖ్యానించారు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేం. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాం. ప్రపంచాన్ని కూడా నడిపిస్తాం’’ అని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) గురించి వివరిస్తూ.. ఈ ఐదు ప్రతిజ్ఞలు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయని అమిత్‌ షా అన్నారు. అమృత్ కాల్ కోసం మోదీ జీ 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు)కు పునాది వేశారు. 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటామని.. ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని అమిత్ షా చెప్పారు.

Shashi Tharoor Satires On Donald Trump Asim Munir Lunch5
లాడెన్‌ను అంత తేలికగా మరిచిపోయారా?

పహల్గాం ఘటన తర్వాత.. భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు తన మధ్యవర్తిత్వంతోనే చల్లారాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్న మ్యాటర్‌ తెలిసిందే. అంతేకాదు.. అందుకు సహకరించారంటూ పాక్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అసిమ్‌ మునీర్‌ను వైట్‌హౌజ్‌కు ఆహ్వానించి మరీ భోజనం పెట్టారు. ఈ పరిణామంపై తిరువనంతపురం(కేరళ) కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ వ్యంగ్యంగా స్పందించారు.‘‘పాకిస్తాన్ అనేది గతంలో ఒసామా బిన్ లాడెన్‌ను తమ సైనిక శిబిరం సమీపంలో దాచిన దేశం. అలాంటి దేశానికి చెందిన సైన్యాధిపతికి అమెరికా అధ్యక్షుడు ఆతిథ్యమివ్వడం విడ్డూరం. ఈ పరిణామం.. బహుశా అమెరికా ప్రజలు ఒసామాను మరిచిపోయారా? అనే సందేహాన్ని కలిగిస్తోంది’’ అని థరూర్‌ వ్యాఖ్యానించారు. .. పాక్‌ ప్రతినిధి బృందాన్ని కలిసిన కొంతమంది అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్లు ఉన్నారు. కానీ ఒసామా బిన్ లాడెన్ అనే పేరును అమెరికన్లు అంత త్వరగా మరచిపోయి ఉండరని నేను అనుకోను. ఇది అమెరికన్లకు అంత సులభంగా మరిచిపోలిగిన విషయమైతే కాదు. పాక్ లాడెన్‌ను తన ఆర్మీ శిబిరం దగ్గర దాచిన విషయంలో బాధ్యత వహించాల్సిందే. వారు(పాక్‌) అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రదాడికి కారణమైన వ్యక్తిని రహస్యంగా దాచారు. పైగా భారత్‌పై ఉగ్రదాడులకు కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు... కనీసం ఈ సమావేశాన్ని ఉపయోగించుకుని అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పాక్ ఆర్మీ చీఫ్‌ను హెచ్చరించి ఉండాలి. వాళ్ల దేశం నుంచి ఉగ్రవాదులను ఆర్థికంగా, సాయుధంగా, శిక్షణ ఇచ్చి మరీ భారత్‌కు పంపడం మంచిది కాదని చెప్పి ఉండాలి. మందు, విందుతో పాటు పాక్‌ ఆర్మీ చీఫ్‌కు అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్‌మెన్లు ఈ విషయాలన్నీ చెప్పి ఉండాలి. ఎందుకంటే ఇదంతా అమెరికా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కూడా’’ అని థరూర్‌ ఖ్యానించారు. పహల్గాం దాడి తర్వాత.. పాక్‌ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో తెలియజేసేందుకు ఎంపీల అఖిల పక్ష బృందాలను పలు దేశాలకు కేంద్రం పంపుతోంది. అందులో శశిథరూర్‌ కూడా ఉన్నారు.#WATCH | Thiruvananthapuram, Kerala | On US President Donald Trump's lunch meeting with Pakistan Army Chief Asim Munir, Congress MP Shashi Tharoor says, "I hope the food was good and he gets some food for thought in the process. I hope that in these interactions, the Americans… pic.twitter.com/QJn6BHEjoY— ANI (@ANI) June 19, 20252001 సెప్టెంబర్‌ 11వ తేదీన వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ ట్విన్‌ టవర్స్‌పై ఉగ్రదాడి జరిగి 3 వేల మందికిపైగా మరణించారు. ఈ దాడుల వెనుక ఒసామా బిన్‌ లాడెన్‌ నేతృత్వంలోని అల్‌ ఖైదా ఉందని తేలింది. పదేళ్ల తర్వాత.. 2011, మే 2వ తేదీన అమెరికా నేవీ సీల్ బలగాలు పాకిస్తాన్‌లోని అబోట్టాబాద్ అనే పట్టణంలో నిర్వహించిన రహస్య ఆపరేషన్‌లో లాడెన్‌ను హతమార్చాయి. ఇందుకోసం జరిపిన ఆపరేషన్‌కు Operation Neptune Spear అనే కోడ్ పేరు పెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ఈ దాడిని పర్యవేక్షించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే తానే చెబితేనే యుద్ధం ఆగిందని ట్రంప్‌ ప్రకటించారు. అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్‌ ఆర్మీ చీఫ్‌ అసిమ్‌ మునీర్‌ల చొరవతోనే ఇది సాధ్యమైందని చెబుతూ ఇద్దరినీ వైట్‌హౌజ్‌ లంచ్‌ ఈవెంట్‌కు ఆహ్వానించారు. అసిమ్‌ మునీర్‌ అప్పటికే అమెరికా చేరుకోగా.. జీ7 సదస్సుకు హాజరైన మోదీతో ట్రంప్‌ ఫోన్‌లో 35 నిమిషాలపాటు సంభాషించారు. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన మోదీ.. ట్రంప్‌ మధ్యవర్తిత్వం చేశారన్న ప్రకటనను తోసిపుచ్చారు. పాక్‌ ఆర్మీ బతిమాలినందు వల్లే ఆపరేషన్‌ సిందూర్‌ ఆగిపోయిందని, భారత్‌-పాక్‌ దేశాల మధ్య మధ్యవర్తిత్వం జరగలేదని.. ఇక మీదటా జరగబోదని ట్రంప్‌తో స్పష్టం చేశారు.

Is Singer Sonu Nigam Says After RCB Win Nothing Good Happened6
'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్‌ అంతమాట అన్నాడా?

పద్దెనిమిదేళ్ల నిరీక్షణ.. కోట్లాది అభిమానుల కల.. ఐపీఎల్‌ ట్రోఫీ. ఎట్టకేలకు కింగ్‌ కోహ్లి (RCB Won IPL 2025) సేన ఆ కప్పు గెలుచుకోవడంతో కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అయితే ఆర్సీబీ గెలుపు తర్వాత దేశంలో ఏదీ మంచి జరగడం లేదంటూ ఓ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమైంది. అంటే ఆర్సీబీ విజయం తర్వాత అన్నీ అనర్థాలే జరుగుతున్నాయని దాని అర్థం. సోనూ నిగమ్‌ అన్న పేరుతో ఉన్న ట్వీట్‌ కావడంతో ఇది కచ్చితంగా సింగర్‌ సోనూ పనే అని చాలామంది ఫిక్సయ్యారు. అసలే కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకా అక్కడి ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో మరోసారి కన్నడ టీమ్‌ గెలుపుపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అని నెటిజన్లు ఫైర్‌ అయ్యారు.అసలు నిజమిదే!ఆర్సీబీ ఐపీఎల్‌ గెలిచాక ప్రపంచంలో ఏదీ మంచి జరగడం లేదు అని సోనూ నిగమ్‌ (Sonu Nigam) ట్వీట్‌ చేసిన మాట వాస్తవం! కానీ ఈయన సింగర్‌ సోనూ నిగమ్‌ కాదు, బిహార్‌కు చెందిన లాయర్‌ సోనూ నిగమ్‌. ఇద్దరి పేర్లు ఒకటే కావడం.. అందులోనూ ఆయన ప్రొఫైల్‌కు బ్లూ టిక్‌ ఉండటంతో ఆ ట్వీట్‌ చేసి సింగర్‌ అని పలువురు పొరబడుతున్నారు. కానీ సింగర్‌ సోషల్‌ మీడియాలో ఆర్సీబీ గెలుపు గురించి ఎటువంటి విద్వేషపూరిత కామెంట్లు చేయలేదు.సోనూ నిగమ్‌ కన్నడ వివాదమేంటి?బెంగళూరులో సోనూ నిగమ్‌ ఇటీవల ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ప్రేక్షకులు సోనూ నిగమ్‌ను కన్నడ పాటలు పాడాలని కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో ఆయన చిరాకు పడ్డారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది. డిమాండ్‌ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని అసహనం వ్యక్తం చేశారు.సారీ కర్ణాటకసోనూ నిగమ్‌ కన్నడ భాష, సంస్కృతిని అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆయనపై బ్యాన్‌ విధించినట్లు తెలుస్తోంది. దీంతో సోనూ మెట్టు దిగి వచ్చారు. కన్నడ ప్రజలు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మీ కోసం మీ భాషలో పాటలు పాడతాను. కానీ, ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడమని బెదిరించడంతో నా మనసు నొచ్చుకుంది. సారీ కర్ణాటక, నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ అని క్షమాపణలు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదాలు⇒ జూన్‌ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.⇒ జూన్‌ 12న అహ్మదాబాద్‌ నుంచి లండన్‌ బయల్దేరిన ఎయిరిండియా విమానం పైకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మెడికల్‌ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అలాగే మెడికల్‌ కాలేజీ ఉన్న 34 మంది ప్రాణాలు విడిచారు.⇒ జూన్‌ 15న కేదార్‌నాథ్‌ సమీపంలో హెలికాప్టర్‌ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. Jabse RCB IPL jeeti hai tabse duniya mein kuch bhi achcha nahi ho raha hai!— Sonu Nigam (@SonuNigamSingh) June 16, 2025 చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు

Karnataka plans in crease working hours in tech sector employees 7
ఐటీ ఉద్యోగుల నెత్తిన మ‌రో పిడుగు?!

మీరు ఐటీ ఉద్యోగులా?. అయితే మీ నెత్తిన మరో గుదిబండ పడబోతోంది!. త్వ‌ర‌లో ఐటీ రంగంలో ప‌నిగంట‌లు పెరుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఆ దిశ‌గా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో తొలి అడుగు పడబోతోంది. ఐటీ సెక్టార్‌లో పని గంటలను పెంచే యోచనలో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుందంటూ దక్క‌న్ హెరాల్డ్ ఓ క‌థ‌నాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌చురించింది.ప్ర‌స్తుతం క‌ర్నాట‌క‌లో సెక్ష‌న్‌7,క‌ర్ణాట‌క షాప్స్, క‌మిర్షియ‌ల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1961 ప్ర‌కారం.. 9 ప‌ని గంట‌లు కొన‌సాగుతున్నాయి. పండ‌గ‌లు, ప‌బ్బాలు వంటి కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల్లో క‌నీసం సంవ‌త్స‌రంలో ఏదైనా మూడు నెల‌ల్లో ఉద్యోగులతో అద‌నంగా 10 గంట‌లు ప‌నిచేయించుకోవ‌చ్చు. ఈ ప‌నిగంట‌లు 50 గంట‌లు మించ‌కూడ‌దు.కానీ క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం తాజాగా కొత్త ప‌నిగంట‌ల ప్ర‌తిపాద‌న‌లు తెర‌పైకి తెర‌పైకి తెచ్చిన‌ట్లు దక్క‌న్ హెరాల్డ్ హైలెట్ చేసింది. ఉద్యోగులు ఇక‌పై 10 ప‌ని గంట‌లు, అద‌నంగా 12 గంట‌లు ప‌నిచేయించుకుంటే ఎలా ఉంటుందా? అనే దిశగా ప్ర‌భుత్వం కార్మిక‌శాఖ‌, ఐటీ రంగ నిపుణుల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతోంది. ఫ‌లితంగా ప్ర‌త్యేక సంద‌ర్భాల‌లో అద‌నంగా చేసే ప‌నిగంట‌లు 50 నుంచి ఏకంగా 140 గంట‌లు చేరుకోనున్నాయి.క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై కార్మిక సంఘాల నుంచి వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుంది. ప‌నిగంట‌ల్ని పెంచి ఉద్యోగుల హ‌క్కుల కాల‌రాజేసే ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని ఆరోపిస్తున్నాయి. ప‌నిగంట‌లు పెంచ‌డం వ‌ల్ల ఉద్యోగులు తమ హ‌క్కుల‌పై ప్ర‌తికూల ప్ర‌భావంతో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్‌, ఫ్రొఫెష‌న‌ల్ లైఫ్‌కు విఘాతం క‌లుగుతోంద‌ని అంటున్నారు.క‌ర్ణాట‌క‌తో పాటు ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వంపై సైతం ప‌నిగంట‌ల్ని పెంచే ప్ర‌తిపాద‌న‌లు తెర‌పైకి తెచ్చిన‌ట్లు స‌మాచారం. రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేయ‌డంతో పాటు ఇన్వెస్ట‌ర్ల‌ను ఆక‌ట్టుకునేలా తొమ్మిది ప‌నిగంట‌ల్ని ప‌ది ప‌నిగంట‌లు చేసే దిశ‌గా ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఉద్యోగుల‌కు, సంస్థ‌ల‌కు ల‌బ్ధి చేకూరేలా కార్మిక చ‌ట్టాల్ని మార్చే యోచ‌న‌లో ఉంద‌ని డ‌క్కెన్ హెరాల్డ్ త‌న క‌థ‌నంలో ప్ర‌స్తావించింది. అంతేకాదు ప‌నిగంట‌లు పెంచి ప‌నిచేసే ప్రాంతాల్లో రాత్రి వేళ ప‌నిదినాల్లో మ‌హిళ‌ల‌కు వెసులు బాటు క‌ల్పించ‌డంతో పాటు రవాణ‌, భ‌ద్ర‌త‌, సెక్యూరిటీ, లైటింగ్ మెరుగుప‌రుచుకునే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకోనుంద‌ని వెల్ల‌డించింది. పని గంటలను పొడిగించాలనే ప్రభుత్వ ప్రణాళికను క‌ర్ణాటకలోని అనేక కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. బుధవారం, రాష్ట్ర కార్మిక శాఖ పరిశ్రమ, కార్మిక సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశాన్ని నిర్వహించి చట్టానికి సాధ్యమయ్యే సవరణపై చర్చించింది.కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) సమావేశంలో పాల్గొని ఈ ఆలోచనను స్పష్టంగా వ్యతిరేకించింది. కేఐటీయూ ఈ ప్రతిపాదనను బానిశ‌త్వంగా అభివర్ణించింది. కార్మికుల ఆరోగ్యం, పని-జీవిత సమతుల్యత, ఉద్యోగ భద్రతకు హాని కలిగిస్తుందని పేర్కొంది. ప‌నిగంట‌ల విష‌యంలో ప్ర‌భుత్వ ప్ర‌తిపాదన‌ల్ని టెక్నాల‌జీ రంగ ఉద్యోగులు వ్య‌తిరేకించాల‌ని, వారికి అండ‌గా నిల‌వాల‌ని యూనియన్ విజ్ఞప్తి చేసింది.ప‌నిగంట‌లు పెరిగితే భారీ ఎత్తున ఉద్యోగుల తొల‌గింపులు.. ఉద్యోగుల‌పై ఒత్తిడి పెరుగుతుంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

YS Jagan Serous Comments On CBN Govt Sakshi Incident8
చంద్రబాబు.. ‘సాక్షి’పై దాడులు విచ్చలవిడి రౌడీయిజం కాదా?: వైఎస్‌ జగన్‌

సాక్షి, తాడేపల్లి: ఏపీలో సాక్షి ఆఫీసులే టార్గెట్‌గా టీడీపీ నేతలు దాడులు చేశారని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ ఆరోపించారు. టీడీపీ సహా కూటమి నేతలు సాక్షి కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు, ప్రభుత్వమే కారణం కాదా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా?. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు.వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీనియర్‌ జర్నలిస్ట్‌ కొమ్మినేని శ్రీనివాస్‌ ఏం పాపం చేశారని అరెస్ట్‌ చేశారు. అనలిస్ట్‌ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం?. గతంలో కేఎస్‌ఆర్‌ ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు ఊడగొట్టించారు. ఆయనపై పగతోనే ఇదంతా చేశారు. పత్రికల గొంతు నులుపే కార్యక్రమం ధర్మమేనా?. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపచెల్లుమనిపించినట్టు కాదా?. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు రాతలు రాసిన వారిపై రెడ్‌బుక్‌ రాజ్యాంగం అమలు చేస్తారా?. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు కారణం కాదా?. పక్కా ప్లన్‌, ఓ ప్రణాళికతో సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కుట్ర జరిగింది. సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు ధ్వంసం చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది. ఈరోజు సాక్షి టార్గెట్‌గా దాడులు చేశారు. రేపటి రోజున మరొకరిపై దాడులు చేస్తారా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా? ఇది ఇలాగే కొనసాగితే ఎలా?. భవిష్యత్‌ ప్రజలు బతుకుతారా?. ప్రజాస్వామ్యం అనేది ఏపీలో ఉందా?. చంద్రబాబుకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కాదా?. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ది తెచ్చుకోవాలి. ‘సాక్షి’ ఆఫీసులపై దాడులు చేసింది వీరే..శ్రీకాకుళంలో మెట్ట శైలజ-టీడీపీ అధ్యక్షురాలుమెండ దాసు నాయుడు- టీడీపీ నాయకులు.విశాఖలో.. ముక్కా శ్రావణి.. టీడీపీ కార్పొరేటర్‌. అనంత లక్ష్మి.. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు.తూర్పుగోదావరి.. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి(అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే).బతూలు బాలరామకృష్ణ.. జనసేన ఎమ్మెల్యే. విజయవాడలోగద్దె అనురాధ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ భార్య గద్దె క్రాంతి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ కుమారుడు. మంగళగిరిలో.. కంభంపాటి శిరీష ఎస్‌సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌.అనంతపురంలో.. స్వప్న.. టీడీపీ మహిళా వింగ్‌ స్టేట్‌ సెక్రటరీ. సంగా తేజస్వినీ.. టీడీపీ మహిళా విభాగం స్టేట్‌ సెక్రటరీ.కడపలో.. బొజ్జా తిరుమలేష్‌.. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రెసిడెంట్‌. తిరుపతి.. ఆర్‌సీ మునికృష్ణ.. తిరుపతి డిప్యూటీ మేయర్‌. కోడూరి బాలసుబ్రహ్మణ్యం.. టీడీపీ అధికార ప్రతినిధి.

Israel Direct Warn To Iran Supreme Ali Khamenei9
ఖమేనీ కథ ముగిస్తాం.. ఇజ్రాయెల్‌ సంచలన ప్రకటన

పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్‌ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. తాజా టెల్‌ అవీవ్‌ ఆస్పత్రి దాడిని ఉద్దేశించి ఇజ్రాయెల్‌ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌(israel katz) స్వయంగా ఈ ప్రకటన చేశారు.తాజాగా.. టెల్‌ అవీవ్‌లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్‌తో ఇరాన్‌ దాడులు జరిపింది. ఈ దాడికి ఇరాన్‌ సుప్రీం ఖమేనీ(Khamenei)నే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ .. త్వరలోనే ఆయన కథ ముగిస్తామని, ఇరాన్‌ను ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్‌ 13వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో.. నేరుగా ఇరాన్‌ సుప్రీంను ఉద్దేశించి ఇజ్రాయెల్‌ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే.. ఈ బెదిరింపులను ఖమేనీ తీవ్రంగా భావించే పరిస్థితులు కనిపించడం లేదు. ‘‘బెదిరింపులకు తలొగ్గం.. యుద్ధం తీవ్రతరం అయ్యింది’’ అంటూ సోషల్‌ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్‌కు గట్టి సందేశాలు పంపుతున్నారు. తమపై దాడి చేసి ఇజ్రాయెల్‌ (Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఓ వీడియో సందేశం సైతం విడుదల చేశారాయన. ‘‘ఇరాన్‌ లొంగిపోదనే విషయాన్ని వాళ్లు(ట్రంప్‌, నెతన్యాహులను ఉద్దేశిస్తూ) తెలుసుకోవాలి. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్‌ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుంది. ఈ యుద్ధంలో వాళ్ల సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలి అని ఖమేనీ తన సందేశం పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్‌తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్‌ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్‌ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్‌ హెచ్చరించారు.మరోవైపు ఖమేనీకి బెదిరింపులపై లెబనాన్‌ ఉగ్రసంస్థ హెజ్‌బొల్లా తీవ్రంగా స్పందించింది. ఈ బెదిరింపులు మూర్ఖపు చర్య అని, అలాంటి ప్రయత్నాలు జరిగితే తాము చూస్తూ ఉండబోమని, అమెరికా-ఇజ్రాయెల్‌ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. ఎవరీ ఖమేనీ.. అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ (Ayatollah Sayyid Ali Khamenei) ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్‌. అత్యంత శక్తివంతమైన ప్రపంచాధినేతల్లో ఒకరు. ఖమేనీ ఒక షియా మత పండితుడు మాత్రమే కాదు.. రాజకీయ నేతగా ఇస్లామిక్ విప్లవంలో కీలకంగా వ్యవహరించాడు. 1989లో అయతొల్లా ఖోమేనీ మరణం తర్వాత ఇరాన్‌కు సుప్రీం అయ్యారు. ఖమేనీ (మధ్యలో వ్యక్తి)ఖమేనీ జీవిత నేపథ్యం:పుట్టిన తేదీ: జూలై 17, 1939స్థలం: మష్హద్, ఇరాన్విద్య: మష్హద్, కూమ్ నగరాల్లో మత విద్యవృత్తి: మత పండితుడు, రచయిత, రాజకీయ నాయకుడురాజకీయ ప్రస్థానం:1979లో ఇరాన్‌లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు.విప్లవం తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా 1981 నుంచి 1989 వరకు పనిచేశారు.1989లో ఖోమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్‌గా పగ్గాలుసుప్రీం లీడర్‌గా.. ఇరాన్‌లో సుప్రీం లీడర్ పదవి అత్యున్నతమైనది. ఖమేనీకి సైనిక, న్యాయ, మత వ్యవస్థలపై పూర్తి నియంత్రణ ఉంది. విదేశాంగ విధానాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈయనదే. ఆయన నియామకాలు, ఆదేశాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ పేరు మరింతగా వార్తల్లోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి.

Supreme Court Panel Confirms Cash Found At Justice Yashwant Varma Home10
న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ

సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు (justice yashwant varma) భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్‌ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్‌ వర్మ అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. స్టోరూంలో వెలుగులోకి వచ్చిన కరెన్సీ నోట్ల ఏపీసోడ్‌లో జస్టిస్‌ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్‌ చేశాయి. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్‌లో ఉన్న స్టో రూమ్‌లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ వర్మ అధికారిక నివాసం…” పేజీ 59లో: “... స్టోరుమ్‌లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో పూర్తిగా కాలిన నోట్లు వెలుగులోకి వ‌చ్చాయి. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు అని స‌ద‌రు వ్యక్తి త్రిస‌భ్య క‌మిటీకి చెప్పారు. కమిటీ నివేదిక ప్రకారం, ఇంత పెద్ద‌మొత్తంలో స్టోరూంలో ల‌భ్య‌మ‌వ్వ‌డంపై అనేక అనుమానాలున్నాయి. జస్టిస్‌ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’ అని నివేదిక‌లో ప్ర‌స్తావించింది.జస్టిస్‌ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీలను కూడా క‌మిటీ విచారించింది. విచార‌ణ‌లో ఈ ఇద్దరూ స్టోరూంలో న‌గ‌దు ఉన్న విష‌యాన్ని ఎవ‌రికీ చెప్పొద్ద‌ని అగ్నిమాపక సిబ్బందిని కోరిన‌ట్లు తేలింది.దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జస్టిస్‌ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు. సుప్రీం నియ‌మించిన త్రిస‌భ్య క‌మిటీ స‌భ్యులు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ షీల్‌ నాగ్, హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జి.ఎస్‌.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అనూ శివరామన్‌ను సభ్యులుగా ఉన్నారు.

Advertisement
Advertisement

ఫోటో స్టోరీస్

View all

న్యూస్ పాడ్‌కాస్ట్‌

Advertisement
Advertisement
Advertisement

ఫొటోలు

Advertisement

వీడియోలు

Advertisement