ప్రధాన వార్తలు

QR కోడ్తో బాబు మోసాలను నిలదీద్దాం.. ప్రజలకు వైఎస్ జగన్ పిలుపు
సాక్షి,గుంటూరు: ఏపీలో ఏడాదిగా కూటమి పాలనలో.. టీడీపీ, ఎల్లో మీడియాతో యుద్ధం చేస్తున్నామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడే పల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు.రాష్ట్రంలో దిగజారిన లాండ్ ఆర్డర్, పాలన వైఫల్యాలు, మోసాల మధ్య చంద్రబాబు పాలన కొనసాగుతోంది. చంద్రబాబు అరాచక పాలనకు వ్యతిరేకంగా మే4న ప్రజలు, వైఎస్సార్పీ శ్రేణులు భారీ ఎత్తున పాల్గొని వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేశారు. టీడీపీ నేతలు, పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించేందుకు రెంటపాళ్ల వెళ్లా. కర్ఫ్యూలాంటి పరిస్థితుల మధ్య నా రెంటపాళ్ల పర్యటన జరిగింది. అయినా విజయవంతమైంది. మా పార్టీ శ్రేణుల్ని పరామర్శిస్తే తప్పా? మొన్నటి పొదిలి పర్యటనలో 40వేల మందిపై రాళ్లేసే ప్రయత్నం చేశారు. రైతులు సంయమనం పాటించారు. అయినా కేసులు పెట్టారు. రైతుల సమస్యల గురించి ఎవరూ మాట్లాడకూడదు. సంఘీభావం తెలపకూడదా? అని ప్రశ్నించారు. చంద్రబాబు భయం.. ఎందుకు?చంద్రబాబు ఎందుకు భయపడుతున్నారు. ఓ టీవీ ఛానెల్లో చంద్రబాబు అహంకార మాటలు వినండి. ప్రతిపక్షను భూస్థాపితం చేస్తారట. ప్రశ్నిస్తున్న వ్యక్తిని భూస్థాపితం చేస్తారా?. ఏడాది కాలంలోనే ఎన్నడూ లేని విధంగా ప్రజల్లో చంద్రబాబు పాలనపై అసహనం పెరిగింది. ఆ అసహనాన్ని డైవర్ట్ చేస్తూ వైఎస్సార్సీపీ సానుభూతిపరులపై, నేతలపై కేసులు పెడుతున్నారు. టాపిక్ డైవర్ట్ చేస్తున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు. మద్యం కేసులో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్రెడ్డిని అరెస్ట్ చేశారు. చెవిరెడ్డి అరెస్ట్ నిజంగా అశ్చర్యకరం. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వాలని గన్మెన్ను బలవంతం చేశారు. తప్పుడు స్టేట్మెంట్ ఇవ్వనందుకు గన్మెన్పై దాడి కూడా చేశారు. తనపై జరిగిన దాడిని గురించి ప్రస్తావిస్తూ రాష్ట్రపతి, గవర్నర్, డీజీపీకి గన్మెన్ లేఖ రాశారు. మరో గన్మెన్ను ప్రలోభాలకు గురిచేసి వారికి అనుకూలంగా స్టేట్మెంట్ ఇప్పించుకున్నారు. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు.. అరెస్టులు చెవిరెడ్డితో పాటు ఆయన కొడుకును కేసులో ఇరికించారు. సొంత నియోజవకర్గంలో గెలవలేని వ్యక్తి. చంద్రగిరిలో ఇబ్బంది ఉండకూడదనే చెవిరెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులో పిన్నెల్లిని అరెస్ట్ చేశారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ను అక్రమంగా అరెస్ట్ చేశారు. సుప్రీంకోర్టుకు వెళ్లి బెయిల్ తీసుకొచ్చాం. మళ్లీ తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. సురేష్ భార్యపైనా కేసులు పెట్టారు. వల్లభనేని వంశీపై 11 కేసులు పెట్టారు. జోగి రమేష్ కొడుకు, కాకాణిపై తప్పుడు కేసులు. కృష్ణమోహన్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్రెడ్డిపైనా అక్రమ కేసులు పెట్టారు. కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, పేర్నినాని, వైవి సుబ్బారెడ్డి,ఆయన కుమారుడిపై తప్పుడు కేసులు. దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యే ఆర్కే,అంబటి రాంబాబు, విడదల రజినిపై తప్పుడు కేసులు దళిత ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్పైనా అక్రమ కేసులు. బూచేపల్లి శివప్రసాద్రెడ్డిపై, ఉషశ్రీచరణ్, తోపుదుర్తి ప్రకాష్, గోరంట్ల మాధవ్పై కేసులు. ఇలా వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారు. కొమ్మినేని ఏం పాపం చేశారు.. చంద్రబాబూ?సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు ఏం పాపం చేశారు? ఏం చేశారని కొమ్మినేనిని అరెస్ట్ చేశారు?టీవీ డిబెట్లో అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం? గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని చంద్రబాబు ఊడగొట్టించారు. కేఎస్ఆర్ అరెస్ట్ అక్రమమేనన్న సుప్రీంకోర్టు.. తనకున్న విచక్షణాధికారాల్ని ఉపయోగించి ఆయన్ను వెంటనే విడుదల చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలించింది. సుప్రీం కోర్టు తీర్పు చంద్రబాబుకు చెంపపెట్టులాంటిది. మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా?మహిళల పట్ల చంద్రబాబుకు గౌరవం ఉందా అని వైఎస్ జగన్ ప్రెస్మీట్లో ప్రశ్నించారు. ఈ సందర్భంగా అరాచకాలు, దౌర్జన్యాలు, దోపిడీలకు కేరాఫ్గా మారిన ఉమ్మడి అనంతపురం జిల్లా రామగిరి ప్రాంతంలో మాజీ మంత్రి పరిటాల సునీత స్వగ్రామం వెంకటాపురానికి కూతవేటు దూరంలోని ఏడుగుర్రాలపల్లిలో ఓ దళిత బాలికపై కొందరు టీడీపీ నేతలు సామూహిక అత్యాచారం చేశారు. బాలిక గర్భం దాలిస్తే ఈ విషయం బయటకొచ్చింది. కనీసం ఫిర్యాదు కూడా ఇవ్వకుండా భయపెట్టారు. కనీసం చర్యలు తీసుకునే దమ్ము చంద్రబాబుకు లేదా? న్యాయం చేయాలనే తపన చంద్రబాబుకు లేదు. న్యాయం వైపు నిలిచే వ్యక్తి చంద్రబాబు కాదు. మరో ప్రాంతంలో ఇంటర్ గిరిజన బాలిక కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు. తర్వాత బాలిక శవమై కనిపించింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో అప్పు చెల్లించలేదని మహిళను చెట్టుకు కట్టేసి దాడి చేశారు. టీడీపీ నేత.. మహిళను చెట్టుకు కట్టేసి కొట్టారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటిప్రజల కోసం ఆలోచన చేసిన ప్రభుత్వం మాది. 32లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చాం. 22 లక్షల ఇళ్లను మంజూరు చేసి 10లక్షల ఇళ్లు పూర్తి చేశాం. చట్టం చేసి మరి నామినేటెడ్ పదవుల్లో మహిళలకు అవకాశం కల్పించ్చాం. మహిళలపై ఎవరికి గౌరవం ఉంది?. మహిళలంటే చంద్రబాబుకు గౌరవం లేదు. వెన్నుపోటు పొడవటంలో చంద్రబాబుకు ఆయనే సాటి.కరెంట్ బిల్లుల బాదుడే.. బాదుడు15వేల కోట్లు కరెంట్ బిల్లుల బాదుడు,గవర్నమెంట్ స్కూళ్లు కాలేజీ కాలేజీల్ని నిర్విర్యం చేశాడు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో ఫీజుల పేరిట బాదుడే బాదుడే. రేషన్ వెహికల్స్ వాహనాల్ని తీసేశాడు. రేషన్ ద్వారా ఇచ్చే పప్పు దాన్యాల్ని ఎగనామం పెట్టాడు. ఫలితంగా పప్పు దాన్యాల రేట్లు పెంచి బాదుడే బాదుడు. కొత్త ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి.. సుమారు 3లక్షలపై చీలూకు ఉద్యోగాల్ని తొలగించారు.ప్రభుత్వ ఉద్యోగుల సంగతి సరేసరిపంటలకు సరైన మద్దతు లేదు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఏమైనా ఒరిగిందా అంటే? అదీ లేదు. వచ్చీ రాగానే పీఆర్సీ అన్నారు. పీఆర్సీని ఆపేశారు. ఈ జులై 1వ తారీఖుతో కలిసి నాలుగు డీఏ ఇవ్వాలి. ఉద్యోగస్తులకు ఇవ్వాల్సిన 20 వేలకోట్ల వరకు ఆపేశారు. చంద్రబాబు పెట్టిన తాకట్టు.. చంద్రబాబు తాను అబద్ధమాడుతూ.. తానెప్పుడూ ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టడం లేదన్నాడు. మద్యం ఆదాయం తాకట్టుపెట్టడం లేదు. కానీ 4-4-2025 నాడు విడుదల చేసిన జీవో 69 కింద ఏపీఎండీసీ కింద 436 మినరల్ ప్రాజెక్ట్ను తాకట్టు పెట్టారు. వాటి విలువ 191,000 కోట్లు రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి ప్రెస్మీట్లో రాష్ట్ర ప్రజలకు వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టో, బాండలను అందరూ రెడీగా పెట్టుకోవాలి. చంద్రబాబు తన పాలన గురించి తెలుసుకునేందుకు మీ ఇంటికి ఎమ్మెల్యేలు, ఇతర నేతల్ని పంపిస్తున్నారు. నేతలు వచ్చినప్పుడు మ్యానిఫెస్టో, బాబుష్యూరిటీ.. భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో బాండును అందించారు. ఆ బాండు, ఎన్నికల మ్యానిఫెస్టో చూపిస్తూ ఎంత వరకు ఎన్నికల హామీలు నెరవేర్చారో అడగండి. అప్పుడైనా చంద్రబాబుకు ఎన్నికల హామీలు నెరవేర్చుతారో చూడాలి. ఒకవేళ మీ వద్ద ‘బాబు మ్యానిఫెస్టోని గుర్తు తెచ్చుకుంటూ’ అనే పేరుతో చంద్రబాబు మ్యానిఫెస్టోను డౌన్లోడ్ చేసుకునేలా క్యూఆర్ కోడ్ను వైఎస్సార్సీపీ అందుబాటులోకి తెస్తుంది’ అని అన్నారు. ప్రభుత్వంపై ఫైట్ చేయండి. రాష్ట్ర ప్రజల తరుఫున వైఎస్సార్సీపీ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందని వైఎస్సార్సీపీ అధినేత, వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారు.

ప్చ్.. పాకిస్తాన్ పీత కష్టాలు
ఆపరేషన్ బున్యాన్ ఉల్ మర్సూస్ సూపర్ సక్సెస్.. ఆపరేషన్ సిందూర్ అట్టర్ ప్లాప్ అని డప్పు కొట్టి ప్రకటించుకున్నా పాక్ను పట్టించుకునే నాథుడే(దేశం)కరువయ్యాడు. పైగా 'ది ఇంటెల్ ల్యాబ్'కు చెందిన జియో ఇంటెలిజెన్స్ పరిశోధకుడు డామియన్ సైమన్ పాక్ పాలిట పీడకలగా తయారయ్యాడు.భారత సైన్యం అసలు తమ ఎయిర్బేస్లపై దాడులే జరపలేదని పాక్ చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. ఆపరేషన్ సిందూర్లో మురిద్, జాకోబాబాద్, భోళరిలో మిలిటరీ స్థావరాలను భారత సైన్యం నాశనం చేసింది. అయితే ధ్వంసమైన ఈ ఎయిర్బేస్లను టార్పలిన్(tarpaulin)లతో కప్పి దాచేసే ప్రయత్నం చేసింది పాక్. ఈ విషయాన్ని బయటపెట్టిన డామియన్.. ఇప్పుడు మరో కీలక సమాచారాన్ని ఎక్స్ వేదికగా వదిలాడు. అందులో రహీం యార్ ఖాన్ బేస్ను పాక్ ఎంతకీ పునరుద్ధరించలేకపోతోందని వెల్లడించాడు.Pakistan once again issues a NOTAM for Rahim Yar Khan, the runway struck by India in May 2025 now remains offline estimated till 04 July 2025 pic.twitter.com/M6nE1ONTmL— Damien Symon (@detresfa_) June 19, 2025ఆపరేషన్ సిందూర్లో భాగంగా ఫేజ్1లో ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన భారత సైన్యం.. ఫేజ్2లో రహీమ్ యార్ ఖాన్ బేస్ను సైతం దెబ్బ తీసింది. అయితే జులై 4వ తేదీ దాకా దాని కార్యకలాపాలు ప్రారంభం కాబోవని పాక్ సైన్యం తాజాగా నోటామ్(notice to airmen) సైతం జారీ చేసింది.ఆపరేషన్ సిందూర్లో భాగంగా.. పక్కా ప్రణాళికతో భారత్ ఈ ఎయిర్బేస్ను దెబ్బ తీసింది. దీంతో పాకిస్తాన్కు జరిగిన నష్టం మాములిది కాదు. పంజాబ్ ప్రావిన్స్లో పాక్కు ఇదే వ్యూహాత్మక స్థావరంగా ఉండేది. అంతేకాదు.. ఈ ఎయిర్బేస్కు అనుసంధానంగా రహీమ్ యార్ ఖాన్ అంతర్జాతీయ విమానాశ్రయం కూడా ఉంది. ఒకే రన్వే ఉన్న ఈ ఎయిర్పోర్టును భారత్ జరిపిన దాడి తర్వాత వారం పాటు మూసే ఉంచుతామని అక్కడి అధికారులు ప్రకటించారు. అయితే అది కూడా ఇప్పటిదాకా తెరుచుకోకపోవడం గమనార్హం. దీంతో.. దాడి ప్రభావం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ‘‘అది ఇంకెప్పటికి తెరుచుకుంటుందో?’’ అంటూ సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి.India didn’t just respond, it decimated yet another key site of #Pakistan's attack. #Rahimyarkhan airport, a key launchpad for Pakistani drone attacks, now lies in ruins.Precision. Power. Payback.#PakistanIndianWar pic.twitter.com/zvkaaWFH5R— DrVinushaReddy (@vinushareddyb) May 10, 2025విశేషం ఏంటంటే.. రాజస్థాన్ బికనీర్లో నిర్వహించిన ఓ ర్యాలీలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఎయిర్బేస్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. పాక్ రహీమ్ యార్ ఖాన్ ఎయిర్బేస్ ఇంకా ఐసీయూలోనే ఉంది. అది ఎప్పటికీ తిరిగి తెరుచుకుంటోందో కూడా చెప్పలేకపోతున్నారు అని మోదీ తన ప్రసంగంలో వ్యంగ్యం ప్రదర్శించారు. " مودی" نے رحیم یارخان ائیر بیس تباہ کردیا 😂😂راجھستان ، رحیم یارخان بارڈر کے دوسری طرف عوامی جلسے سے خطاب#modi #rajasthan #RahimYarKhan #rahimyarkhanpakistan pic.twitter.com/9oRsvL5ql6— Rana Kashif (@ranakashi102) May 23, 2025📍రహీం యార్ ఖాన్ (Rahim Yar Khan) పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో ఉన్న ఒక ప్రముఖ నగరం(జిల్లా కేంద్రం కూడా). ఇది పాకిస్తాన్లో 21వ అతిపెద్ద నగరం. ఈ నగరం పూర్వపు పేరు నౌషెహ్రా. అయితే 1881లో బహావల్పూర్ రాష్ట్ర నవాబ్ సాదిక్ ఖాన్ IV.. తన కుమారుడు రహీం యార్ ఖాన్ (1877–1881) పేరును ఈ నగరానికి పెట్టాడు. ఈ ప్రాంతంలో పట్టన్ మినారా అనే 2000 సంవత్సరాల పురాతన బౌద్ధ స్థూపం ఉంది, ఇది మౌర్యుల హక్రా లోయ నాగరికతకు చెందినదిగా చరిత్రకారులు భావిస్తుంటారు.

నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్
లీడ్స్లోని హెడింగ్లీ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్టు శుక్రవారం(జూన్ 20) ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా అన్ని విధాల సిద్దమైంది. ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి సిరీస్లో శుభరంభం చేయాలని భారత జట్టు భావిస్తోంది. ఈ క్రమంలో గురువారం(జూన్ 18) టీమిండియా కొత్త టెస్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ విలేకరుల సమావేశంలో పాల్గోనున్నాడు.ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు గిల్ సమాధనమిచ్చాడు. భారత కెప్టెన్గా తను ఎదుర్కొనున్న ఛాలెంజ్స్ కోసం గిల్ మాట్లాడాడు. అయితే కెప్టెన్సీ భారం తన బ్యాటింగ్పై పడకుండా చూసుకుంటాని అతడు చెప్పుకొచ్చాడు. "ఇప్పటివరకు ఏ విధంగా అయితే పూర్తి స్వేఛ్చతో బ్యాటింగ్ చేశానో, ఇకపై కూడా అదే కొనసాగిస్తున్నాను. కెప్టెన్సీ గురుంచి ఎక్కువగా ఆలోచించకుండా నా బ్యాటింగ్పైనే దృష్టి పెట్టాలనుకుంటున్నాను. ఈ సిరీస్లో బెస్ట్ బ్యాటర్గా ఉండాలని భావిస్తున్నా. విరాట్ కోహ్లి బ్యాటింగ్ స్ధానం కోసం ఇప్పటికే గంభీర్ భాయ్, నేను చర్చించుకున్నాము. మా దగ్గర రెండు వేర్వేరు కాంబినేషన్లు సిద్దంగా ఉన్నాయి. పిచ్ను పరిశీలించాక ఓ నిర్ణయం తీసుకుంటాము" అని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరెన్స్లో గిల్ పేర్కొన్నాడు.భయపెడుతున్న గిల్ రికార్డు..శుబ్మన్ గిల్ తన కెరీర్లో 32 టెస్టులు ఆడి 1893 పరుగులు చేశాడు. అందులో ఆరు సెంచరీలు ఉన్నాయి. కానీ సేనా (దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి రికార్డు మాత్రం టీమ్మెనెజ్మెంట్ను కలవరపెడుతోంది. సెనాదేశాల్లో గిల్ ఇప్పటివరకు 11 టెస్టులు ఆడి 514 పరుగులు మాత్రమే చేశాడు. ఇంగ్లండ్లో అయితే అతడి ప్రదర్శన మరి దారుణంగా ఉంది. ఇంగ్లండ్ గడ్డపై మూడు టెస్టులు ఆడిన శుబ్మన్.. 14.66 సగటుతో కేవలం 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: ‘కోహ్లి చెప్పింది నిజమే.. కానీ మాకూ కుటుంబం ఉంటుంది.. డబ్బు సంపాదించాలి’

ఇంగ్లీషులో మాట్లాడేవారు సిగ్గుపడే రోజులొస్తాయ్: అమిత్ షా
ఢిల్లీ: మన దేశ భాషలే మన సంస్కృతికి రత్నాలని.. భాషలు మనుగడలో లేకుంటే నిజమైన భారతీయులుగా ఉండలేమంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. మాజీ సివిల్ సర్వెంట్ ఐఏఎస్ అశుతోష్ అగ్నిహోత్రి రచించిన ‘మెయిన్ బూంద్ స్వయం, ఖుద్ సాగర్ హూన్’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.భారతీయ భాషలు దేశ గుర్తింపుకు ఆత్మ వంటివన్న అమిత్ షా.. భారతదేశ భాషా వారసత్వాన్ని తిరిగి పొంది, మాతృభాషల పట్ల గర్వంతో ప్రపంచానికి నాయకత్వం వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. ఈ దేశంలో ఇంగ్లీష్ మాట్లాడేవారు త్వరలోనే సిగ్గుపడతారు.. అటువంటి సమాజం ఏర్పడటం ఎంతో దూరంలో లేదు. దృఢ సంకల్పం ఉన్నవారు మాత్రమే మార్పు తీసుకురాగలరు. మన దేశ భాషలు మన సంస్కృతికి రత్నాలు అని నేను నమ్ముతున్నాను.’’ అంటూ అమిత్ షా చెప్పుకొచ్చారు.మన దేశాన్ని, మన సంస్కృతి, చరిత్ర, మతాన్ని అర్థం చేసుకోవడానికి ఏవిదేశీ భాష కూడా సరిపోదని అమిత్ షా వ్యాఖ్యానించారు. పూర్తి భారతదేశ ఆలోచనను విదేశీ భాషల ద్వారా ఊహించలేం. ఈ యుద్ధం ఎంత కష్టమో నాకు పూర్తిగా తెలుసు, కానీ భారత సమాజం దానిని గెలుస్తుందని కూడా నాకు పూర్తిగా నమ్మకం ఉంది. మరోసారి ఆత్మగౌరవంతో, మన దేశాన్ని మన స్వంత భాషలలో నడుపుతాం. ప్రపంచాన్ని కూడా నడిపిస్తాం’’ అని అన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రూపొందించిన 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు) గురించి వివరిస్తూ.. ఈ ఐదు ప్రతిజ్ఞలు దేశంలోని 130 కోట్ల మంది ప్రజల సంకల్పంగా మారాయని అమిత్ షా అన్నారు. అమృత్ కాల్ కోసం మోదీ జీ 'పంచ ప్రాణ్' (ఐదు ప్రతిజ్ఞలు)కు పునాది వేశారు. 2047 నాటికి మనం శిఖరాగ్రంలో ఉంటామని.. ఈ ప్రయాణంలో మన భాషలు ప్రధాన పాత్ర పోషిస్తాయి" అని అమిత్ షా చెప్పారు.

లాడెన్ను అంత తేలికగా మరిచిపోయారా?
పహల్గాం ఘటన తర్వాత.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తన మధ్యవర్తిత్వంతోనే చల్లారాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించుకున్న మ్యాటర్ తెలిసిందే. అంతేకాదు.. అందుకు సహకరించారంటూ పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ను వైట్హౌజ్కు ఆహ్వానించి మరీ భోజనం పెట్టారు. ఈ పరిణామంపై తిరువనంతపురం(కేరళ) కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ వ్యంగ్యంగా స్పందించారు.‘‘పాకిస్తాన్ అనేది గతంలో ఒసామా బిన్ లాడెన్ను తమ సైనిక శిబిరం సమీపంలో దాచిన దేశం. అలాంటి దేశానికి చెందిన సైన్యాధిపతికి అమెరికా అధ్యక్షుడు ఆతిథ్యమివ్వడం విడ్డూరం. ఈ పరిణామం.. బహుశా అమెరికా ప్రజలు ఒసామాను మరిచిపోయారా? అనే సందేహాన్ని కలిగిస్తోంది’’ అని థరూర్ వ్యాఖ్యానించారు. .. పాక్ ప్రతినిధి బృందాన్ని కలిసిన కొంతమంది అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు ఉన్నారు. కానీ ఒసామా బిన్ లాడెన్ అనే పేరును అమెరికన్లు అంత త్వరగా మరచిపోయి ఉండరని నేను అనుకోను. ఇది అమెరికన్లకు అంత సులభంగా మరిచిపోలిగిన విషయమైతే కాదు. పాక్ లాడెన్ను తన ఆర్మీ శిబిరం దగ్గర దాచిన విషయంలో బాధ్యత వహించాల్సిందే. వారు(పాక్) అమెరికా చరిత్రలోనే అతి పెద్ద ఉగ్రదాడికి కారణమైన వ్యక్తిని రహస్యంగా దాచారు. పైగా భారత్పై ఉగ్రదాడులకు కూడా ప్రోత్సాహం ఇస్తూ ఉన్నారు... కనీసం ఈ సమావేశాన్ని ఉపయోగించుకుని అయినా అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. పాక్ ఆర్మీ చీఫ్ను హెచ్చరించి ఉండాలి. వాళ్ల దేశం నుంచి ఉగ్రవాదులను ఆర్థికంగా, సాయుధంగా, శిక్షణ ఇచ్చి మరీ భారత్కు పంపడం మంచిది కాదని చెప్పి ఉండాలి. మందు, విందుతో పాటు పాక్ ఆర్మీ చీఫ్కు అమెరికా సెనేటర్లు, కాంగ్రెస్మెన్లు ఈ విషయాలన్నీ చెప్పి ఉండాలి. ఎందుకంటే ఇదంతా అమెరికా ప్రయోజనాలకు సంబంధించిన అంశం కూడా’’ అని థరూర్ ఖ్యానించారు. పహల్గాం దాడి తర్వాత.. పాక్ ఉగ్రవాదాన్ని ఎలా పెంచి పోషిస్తుందో తెలియజేసేందుకు ఎంపీల అఖిల పక్ష బృందాలను పలు దేశాలకు కేంద్రం పంపుతోంది. అందులో శశిథరూర్ కూడా ఉన్నారు.#WATCH | Thiruvananthapuram, Kerala | On US President Donald Trump's lunch meeting with Pakistan Army Chief Asim Munir, Congress MP Shashi Tharoor says, "I hope the food was good and he gets some food for thought in the process. I hope that in these interactions, the Americans… pic.twitter.com/QJn6BHEjoY— ANI (@ANI) June 19, 20252001 సెప్టెంబర్ 11వ తేదీన వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్పై ఉగ్రదాడి జరిగి 3 వేల మందికిపైగా మరణించారు. ఈ దాడుల వెనుక ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా ఉందని తేలింది. పదేళ్ల తర్వాత.. 2011, మే 2వ తేదీన అమెరికా నేవీ సీల్ బలగాలు పాకిస్తాన్లోని అబోట్టాబాద్ అనే పట్టణంలో నిర్వహించిన రహస్య ఆపరేషన్లో లాడెన్ను హతమార్చాయి. ఇందుకోసం జరిపిన ఆపరేషన్కు Operation Neptune Spear అనే కోడ్ పేరు పెట్టారు. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్వయంగా ఈ దాడిని పర్యవేక్షించారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగాయి. అయితే తానే చెబితేనే యుద్ధం ఆగిందని ట్రంప్ ప్రకటించారు. అంతేకాదు భారత ప్రధాని నరేంద్ర మోదీ, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ల చొరవతోనే ఇది సాధ్యమైందని చెబుతూ ఇద్దరినీ వైట్హౌజ్ లంచ్ ఈవెంట్కు ఆహ్వానించారు. అసిమ్ మునీర్ అప్పటికే అమెరికా చేరుకోగా.. జీ7 సదస్సుకు హాజరైన మోదీతో ట్రంప్ ఫోన్లో 35 నిమిషాలపాటు సంభాషించారు. అయితే ఆ ఆహ్వానాన్ని తిరస్కరించిన మోదీ.. ట్రంప్ మధ్యవర్తిత్వం చేశారన్న ప్రకటనను తోసిపుచ్చారు. పాక్ ఆర్మీ బతిమాలినందు వల్లే ఆపరేషన్ సిందూర్ ఆగిపోయిందని, భారత్-పాక్ దేశాల మధ్య మధ్యవర్తిత్వం జరగలేదని.. ఇక మీదటా జరగబోదని ట్రంప్తో స్పష్టం చేశారు.

'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్ అంతమాట అన్నాడా?
పద్దెనిమిదేళ్ల నిరీక్షణ.. కోట్లాది అభిమానుల కల.. ఐపీఎల్ ట్రోఫీ. ఎట్టకేలకు కింగ్ కోహ్లి (RCB Won IPL 2025) సేన ఆ కప్పు గెలుచుకోవడంతో కేవలం కర్ణాటకలోనే కాదు దేశవ్యాప్తంగా సంబరాలు జరిగాయి. అయితే ఆర్సీబీ గెలుపు తర్వాత దేశంలో ఏదీ మంచి జరగడం లేదంటూ ఓ ట్వీట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. అంటే ఆర్సీబీ విజయం తర్వాత అన్నీ అనర్థాలే జరుగుతున్నాయని దాని అర్థం. సోనూ నిగమ్ అన్న పేరుతో ఉన్న ట్వీట్ కావడంతో ఇది కచ్చితంగా సింగర్ సోనూ పనే అని చాలామంది ఫిక్సయ్యారు. అసలే కన్నడ భాషపై ఆయన చేసిన వ్యాఖ్యల వల్ల ఇంకా అక్కడి ప్రజల ఆగ్రహం చల్లారలేదు. ఇంతలో మరోసారి కన్నడ టీమ్ గెలుపుపై ఇలా విషం చిమ్ముతున్నాడేంటి? అని నెటిజన్లు ఫైర్ అయ్యారు.అసలు నిజమిదే!ఆర్సీబీ ఐపీఎల్ గెలిచాక ప్రపంచంలో ఏదీ మంచి జరగడం లేదు అని సోనూ నిగమ్ (Sonu Nigam) ట్వీట్ చేసిన మాట వాస్తవం! కానీ ఈయన సింగర్ సోనూ నిగమ్ కాదు, బిహార్కు చెందిన లాయర్ సోనూ నిగమ్. ఇద్దరి పేర్లు ఒకటే కావడం.. అందులోనూ ఆయన ప్రొఫైల్కు బ్లూ టిక్ ఉండటంతో ఆ ట్వీట్ చేసి సింగర్ అని పలువురు పొరబడుతున్నారు. కానీ సింగర్ సోషల్ మీడియాలో ఆర్సీబీ గెలుపు గురించి ఎటువంటి విద్వేషపూరిత కామెంట్లు చేయలేదు.సోనూ నిగమ్ కన్నడ వివాదమేంటి?బెంగళూరులో సోనూ నిగమ్ ఇటీవల ఒక సంగీత కచేరీ నిర్వహించారు. ఆ సమయంలో కొందరు ప్రేక్షకులు సోనూ నిగమ్ను కన్నడ పాటలు పాడాలని కోరారు. "కన్నడ, కన్నడ" అని పదేపదే అరవడంతో ఆయన చిరాకు పడ్డారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాంలో ఏం జరిగిందో దానికి ఇదే కారణం.. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగానే ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని అసహనం వ్యక్తం చేశారు.సారీ కర్ణాటకసోనూ నిగమ్ కన్నడ భాష, సంస్కృతిని అవమానించారంటూ కన్నడిగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారంటూ ఆయనపై కేసు కూడా నమోదైంది. కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆయనపై బ్యాన్ విధించినట్లు తెలుస్తోంది. దీంతో సోనూ మెట్టు దిగి వచ్చారు. కన్నడ ప్రజలు చూపించే ప్రేమ వెలకట్టలేనిది. మీ కోసం మీ భాషలో పాటలు పాడతాను. కానీ, ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడమని బెదిరించడంతో నా మనసు నొచ్చుకుంది. సారీ కర్ణాటక, నాకున్న అహం కంటే మీపై ఉన్న ప్రేమే ఎక్కువ అని క్షమాపణలు చెప్పారు.ఇటీవల జరిగిన ప్రమాదాలు⇒ జూన్ 4న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో.. ఆర్సీబీ విజయోత్సవ వేడుకల్లో తొక్కిసలాట జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు.⇒ జూన్ 12న అహ్మదాబాద్ నుంచి లండన్ బయల్దేరిన ఎయిరిండియా విమానం పైకి ఎగిరిన కొన్ని సెకన్లలోనే మెడికల్ కాలేజీపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 241 మంది చనిపోయారు. అలాగే మెడికల్ కాలేజీ ఉన్న 34 మంది ప్రాణాలు విడిచారు.⇒ జూన్ 15న కేదార్నాథ్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలి ఏడుగురు మృతి చెందారు. Jabse RCB IPL jeeti hai tabse duniya mein kuch bhi achcha nahi ho raha hai!— Sonu Nigam (@SonuNigamSingh) June 16, 2025 చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు

ఐటీ ఉద్యోగుల నెత్తిన మరో పిడుగు?!
మీరు ఐటీ ఉద్యోగులా?. అయితే మీ నెత్తిన మరో గుదిబండ పడబోతోంది!. త్వరలో ఐటీ రంగంలో పనిగంటలు పెరుగుతున్నట్లు తెలుస్తోంది. ఆ దిశగా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా బెంగళూరులో తొలి అడుగు పడబోతోంది. ఐటీ సెక్టార్లో పని గంటలను పెంచే యోచనలో కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందంటూ దక్కన్ హెరాల్డ్ ఓ కథనాన్ని ప్రముఖంగా ప్రచురించింది.ప్రస్తుతం కర్నాటకలో సెక్షన్7,కర్ణాటక షాప్స్, కమిర్షియల్ ఎస్టాబ్లిష్ మెంట్ యాక్ట్ 1961 ప్రకారం.. 9 పని గంటలు కొనసాగుతున్నాయి. పండగలు, పబ్బాలు వంటి కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కనీసం సంవత్సరంలో ఏదైనా మూడు నెలల్లో ఉద్యోగులతో అదనంగా 10 గంటలు పనిచేయించుకోవచ్చు. ఈ పనిగంటలు 50 గంటలు మించకూడదు.కానీ కర్ణాటక ప్రభుత్వం తాజాగా కొత్త పనిగంటల ప్రతిపాదనలు తెరపైకి తెరపైకి తెచ్చినట్లు దక్కన్ హెరాల్డ్ హైలెట్ చేసింది. ఉద్యోగులు ఇకపై 10 పని గంటలు, అదనంగా 12 గంటలు పనిచేయించుకుంటే ఎలా ఉంటుందా? అనే దిశగా ప్రభుత్వం కార్మికశాఖ, ఐటీ రంగ నిపుణులతో చర్చలు జరుపుతోంది. ఫలితంగా ప్రత్యేక సందర్భాలలో అదనంగా చేసే పనిగంటలు 50 నుంచి ఏకంగా 140 గంటలు చేరుకోనున్నాయి.కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై కార్మిక సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. పనిగంటల్ని పెంచి ఉద్యోగుల హక్కుల కాలరాజేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తున్నాయి. పనిగంటలు పెంచడం వల్ల ఉద్యోగులు తమ హక్కులపై ప్రతికూల ప్రభావంతో పాటు పర్సనల్ లైఫ్, ఫ్రొఫెషనల్ లైఫ్కు విఘాతం కలుగుతోందని అంటున్నారు.కర్ణాటకతో పాటు ఏపీలో కూటమి ప్రభుత్వంపై సైతం పనిగంటల్ని పెంచే ప్రతిపాదనలు తెరపైకి తెచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో వ్యాపారాన్ని సులభతరం చేయడంతో పాటు ఇన్వెస్టర్లను ఆకట్టుకునేలా తొమ్మిది పనిగంటల్ని పది పనిగంటలు చేసే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఉద్యోగులకు, సంస్థలకు లబ్ధి చేకూరేలా కార్మిక చట్టాల్ని మార్చే యోచనలో ఉందని డక్కెన్ హెరాల్డ్ తన కథనంలో ప్రస్తావించింది. అంతేకాదు పనిగంటలు పెంచి పనిచేసే ప్రాంతాల్లో రాత్రి వేళ పనిదినాల్లో మహిళలకు వెసులు బాటు కల్పించడంతో పాటు రవాణ, భద్రత, సెక్యూరిటీ, లైటింగ్ మెరుగుపరుచుకునే దిశగా చర్యలు తీసుకోనుందని వెల్లడించింది. పని గంటలను పొడిగించాలనే ప్రభుత్వ ప్రణాళికను కర్ణాటకలోని అనేక కార్మిక సంఘాలు వ్యతిరేకించాయి. బుధవారం, రాష్ట్ర కార్మిక శాఖ పరిశ్రమ, కార్మిక సంఘాల ప్రతినిధులతో ఒక సమావేశాన్ని నిర్వహించి చట్టానికి సాధ్యమయ్యే సవరణపై చర్చించింది.కర్ణాటక రాష్ట్ర ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం (కేఐటీయూ) సమావేశంలో పాల్గొని ఈ ఆలోచనను స్పష్టంగా వ్యతిరేకించింది. కేఐటీయూ ఈ ప్రతిపాదనను బానిశత్వంగా అభివర్ణించింది. కార్మికుల ఆరోగ్యం, పని-జీవిత సమతుల్యత, ఉద్యోగ భద్రతకు హాని కలిగిస్తుందని పేర్కొంది. పనిగంటల విషయంలో ప్రభుత్వ ప్రతిపాదనల్ని టెక్నాలజీ రంగ ఉద్యోగులు వ్యతిరేకించాలని, వారికి అండగా నిలవాలని యూనియన్ విజ్ఞప్తి చేసింది.పనిగంటలు పెరిగితే భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులు.. ఉద్యోగులపై ఒత్తిడి పెరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

చంద్రబాబు.. ‘సాక్షి’పై దాడులు విచ్చలవిడి రౌడీయిజం కాదా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో సాక్షి ఆఫీసులే టార్గెట్గా టీడీపీ నేతలు దాడులు చేశారని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. టీడీపీ సహా కూటమి నేతలు సాక్షి కార్యాలయాల్లో విధ్వంసం సృష్టించారు. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు, ప్రభుత్వమే కారణం కాదా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా?. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ ఏం పాపం చేశారని అరెస్ట్ చేశారు. అనలిస్ట్ మాటలకు కొమ్మినేనికి ఏం సంబంధం?. గతంలో కేఎస్ఆర్ ఉద్యోగాన్ని కూడా చంద్రబాబు ఊడగొట్టించారు. ఆయనపై పగతోనే ఇదంతా చేశారు. పత్రికల గొంతు నులుపే కార్యక్రమం ధర్మమేనా?. సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు ప్రభుత్వానికి చెంపచెల్లుమనిపించినట్టు కాదా?. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు రాతలు రాసిన వారిపై రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తారా?. ఇది విచ్చలవిడి రౌడీయిజం కాదా?. వీటన్నింటికీ చంద్రబాబు కారణం కాదా?. పక్కా ప్లన్, ఓ ప్రణాళికతో సాక్షి ఆస్తులను ధ్వంసం చేసే కుట్ర జరిగింది. సాక్షి ఆఫీసులపై టీడీపీ నేతలు ధ్వంసం చేసినప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది. ఈరోజు సాక్షి టార్గెట్గా దాడులు చేశారు. రేపటి రోజున మరొకరిపై దాడులు చేస్తారా?. మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేయడం తప్పుడు సంప్రదాయమే కదా? ఇది ఇలాగే కొనసాగితే ఎలా?. భవిష్యత్ ప్రజలు బతుకుతారా?. ప్రజాస్వామ్యం అనేది ఏపీలో ఉందా?. చంద్రబాబుకు సుప్రీంకోర్టు తీర్పు చెంపపెట్టు కాదా?. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం బుద్ది తెచ్చుకోవాలి. ‘సాక్షి’ ఆఫీసులపై దాడులు చేసింది వీరే..శ్రీకాకుళంలో మెట్ట శైలజ-టీడీపీ అధ్యక్షురాలుమెండ దాసు నాయుడు- టీడీపీ నాయకులు.విశాఖలో.. ముక్కా శ్రావణి.. టీడీపీ కార్పొరేటర్. అనంత లక్ష్మి.. టీడీపీ జిల్లా అధ్యక్షురాలు.తూర్పుగోదావరి.. నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి(అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే).బతూలు బాలరామకృష్ణ.. జనసేన ఎమ్మెల్యే. విజయవాడలోగద్దె అనురాధ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ భార్య గద్దె క్రాంతి టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కుమారుడు. మంగళగిరిలో.. కంభంపాటి శిరీష ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్.అనంతపురంలో.. స్వప్న.. టీడీపీ మహిళా వింగ్ స్టేట్ సెక్రటరీ. సంగా తేజస్వినీ.. టీడీపీ మహిళా విభాగం స్టేట్ సెక్రటరీ.కడపలో.. బొజ్జా తిరుమలేష్.. టీఎన్ఎస్ఎఫ్ జిల్లా ప్రెసిడెంట్. తిరుపతి.. ఆర్సీ మునికృష్ణ.. తిరుపతి డిప్యూటీ మేయర్. కోడూరి బాలసుబ్రహ్మణ్యం.. టీడీపీ అధికార ప్రతినిధి.

ఖమేనీ కథ ముగిస్తాం.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన
పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ.. ఇజ్రాయెల్ సంచలన ప్రకటన చేసింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ కథ ముగిస్తామని ప్రకటించింది. తాజా టెల్ అవీవ్ ఆస్పత్రి దాడిని ఉద్దేశించి ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ఇజ్రాయెల్ కట్జ్(israel katz) స్వయంగా ఈ ప్రకటన చేశారు.తాజాగా.. టెల్ అవీవ్లోని ఓ ఆస్పత్రిపై మిస్సైల్స్తో ఇరాన్ దాడులు జరిపింది. ఈ దాడికి ఇరాన్ సుప్రీం ఖమేనీ(Khamenei)నే బాధ్యత వహించాలంటూ పేర్కొన్న ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కట్జ్ .. త్వరలోనే ఆయన కథ ముగిస్తామని, ఇరాన్ను ఖమేనీ విముక్త దేశంగా మారుస్తామని ప్రకటించారు. జూన్ 13వ తేదీ నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం కొనసాగుతుండగా.. పోటాపోటీగా దాడులు జరుపుతున్నాయి. ఈ క్రమంలో.. నేరుగా ఇరాన్ సుప్రీంను ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్రత్యక్ష హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. అయితే.. ఈ బెదిరింపులను ఖమేనీ తీవ్రంగా భావించే పరిస్థితులు కనిపించడం లేదు. ‘‘బెదిరింపులకు తలొగ్గం.. యుద్ధం తీవ్రతరం అయ్యింది’’ అంటూ సోషల్ మీడియా వేదికగా అమెరికా, ఇజ్రాయెల్కు గట్టి సందేశాలు పంపుతున్నారు. తమపై దాడి చేసి ఇజ్రాయెల్ (Israel) భారీ తప్పిదం చేసిందని, అందుకు శిక్ష తప్పదని ఓ వీడియో సందేశం సైతం విడుదల చేశారాయన. ‘‘ఇరాన్ లొంగిపోదనే విషయాన్ని వాళ్లు(ట్రంప్, నెతన్యాహులను ఉద్దేశిస్తూ) తెలుసుకోవాలి. అటువంటి బెదిరింపులకు భయపడమనే విషయం ఇరాన్ చరిత్ర తెలిసిన వారికి అర్థమవుతుంది. ఈ యుద్ధంలో వాళ్ల సైన్యం జోక్యం చేసుకుంటే కోలుకోలేని నష్టం ఉంటుందన్న విషయం అమెరికన్లు తెలుసుకోవాలి అని ఖమేనీ తన సందేశం పేర్కొన్నారు. మరోవైపు.. ఇజ్రాయెల్తో కొనసాగుతున్న పోరులో అమెరికా జోక్యం చేసుకుంటే అది పశ్చిమాసియాలో విస్తృత యుద్ధానికి దారితీస్తుందని ఇరాన్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి కూడా హెచ్చరించారు. ఇదిలా ఉంటే.. ఖమేనీని ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఖమేనీ ఎక్కడ దాక్కున్నారో తమకు తెలుసని.. ఆయన సురక్షితంగా ఉన్నారని చెప్పారు. అయితే, ప్రస్తుతానికి ఆయన్ను చంపాలనుకోవడం లేదన్నారు. ఇరాన్ బేషరతుగా లొంగిపోవాలని, లేదంటే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని ట్రంప్ హెచ్చరించారు.మరోవైపు ఖమేనీకి బెదిరింపులపై లెబనాన్ ఉగ్రసంస్థ హెజ్బొల్లా తీవ్రంగా స్పందించింది. ఈ బెదిరింపులు మూర్ఖపు చర్య అని, అలాంటి ప్రయత్నాలు జరిగితే తాము చూస్తూ ఉండబోమని, అమెరికా-ఇజ్రాయెల్ తీవ్ర పరిణామాలను ఎదుర్కొవాల్సి వస్తుందని ఒక ప్రకటనలో హెచ్చరికలు జారీ చేసింది. ఎవరీ ఖమేనీ.. అయతొల్లా సయ్యద్ అలీ ఖమేనీ (Ayatollah Sayyid Ali Khamenei) ప్రస్తుతం ఇరాన్ సుప్రీం లీడర్. అత్యంత శక్తివంతమైన ప్రపంచాధినేతల్లో ఒకరు. ఖమేనీ ఒక షియా మత పండితుడు మాత్రమే కాదు.. రాజకీయ నేతగా ఇస్లామిక్ విప్లవంలో కీలకంగా వ్యవహరించాడు. 1989లో అయతొల్లా ఖోమేనీ మరణం తర్వాత ఇరాన్కు సుప్రీం అయ్యారు. ఖమేనీ (మధ్యలో వ్యక్తి)ఖమేనీ జీవిత నేపథ్యం:పుట్టిన తేదీ: జూలై 17, 1939స్థలం: మష్హద్, ఇరాన్విద్య: మష్హద్, కూమ్ నగరాల్లో మత విద్యవృత్తి: మత పండితుడు, రచయిత, రాజకీయ నాయకుడురాజకీయ ప్రస్థానం:1979లో ఇరాన్లో జరిగిన ఇస్లామిక్ విప్లవంలో ఆయన కీలక పాత్ర పోషించారు.విప్లవం తర్వాత ఇరాన్ అధ్యక్షుడిగా 1981 నుంచి 1989 వరకు పనిచేశారు.1989లో ఖోమేనీ మరణం తర్వాత సుప్రీం లీడర్గా పగ్గాలుసుప్రీం లీడర్గా.. ఇరాన్లో సుప్రీం లీడర్ పదవి అత్యున్నతమైనది. ఖమేనీకి సైనిక, న్యాయ, మత వ్యవస్థలపై పూర్తి నియంత్రణ ఉంది. విదేశాంగ విధానాలపై తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈయనదే. ఆయన నియామకాలు, ఆదేశాలు దేశ రాజకీయ దిశను ప్రభావితం చేస్తాయి. ఇటీవల ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఖమేనీ పేరు మరింతగా వార్తల్లోకి వచ్చింది. ఆయన వ్యాఖ్యలు, నిర్ణయాలు అంతర్జాతీయంగా ప్రభావం చూపుతున్నాయి.

న్యాయమూర్తి ఇంట్లో కాలిన నోట్ల కట్టలు.. జస్టిస్ యశ్వంత్ వర్మకు భారీ ఎదురుదెబ్బ
సాక్షి,ఢిల్లీ: హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు (justice yashwant varma) భారీ ఎదురుదెబ్బ తగలనున్నట్లు తెలుస్తోంది. కాలిన నోట్ల కట్టల వ్యహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ అత్యున్నత న్యాయస్థానానికి సిఫార్స్ చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ఏడాది మార్చి నెలలో జస్టిస్ వర్మ అధికారిక నివాసంలో వెలుగులోకి వచ్చిన రూ.500 నోట్ల కట్టల వ్యవహారంపై విచారణ చేపట్టేందుకు సుప్రీం కోర్టు త్రిసభ్య కమిటీని నియమించింది. తాజాగా త్రిసభ్య కమిటీ విచారణ పూర్తి చేసి రిపోర్టును సుప్రీంకోర్టుకు అందించింది. స్టోరూంలో వెలుగులోకి వచ్చిన కరెన్సీ నోట్ల ఏపీసోడ్లో జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని గుర్తించింది. ఇదే వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మను విధుల నుంచి తొలగించాలని సుప్రీంకోర్టుకు సిఫార్సు చేసినట్లు పలు జాతీయ మీడియా కథనాలు హైలెట్ చేశాయి. సుప్రీంకోర్టు నియమించిన త్రిసభ్య కమిటీ 55 మంది సాక్షులను విచారించి, జస్టిస్ వర్మ వాంగ్మూలాన్ని రికార్డు చేసి, మొత్తం 64 పేజీల నివేదికను సిద్ధం చేసింది. ఈ నివేదికను మొదటగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి అందజేసింది. నివేదికలో కీలకమైన విషయాలను పరిశీలిస్తే..త్రిసభ్య విచారణ కమిటీ తన నివేదికలో పలు అంశాలను ప్రస్తావించింది.పేజీ 60లో: “ 30 తుగ్లక్ క్రెసెంట్లో ఉన్న స్టో రూమ్లో భారీ ఎత్తున నగదు ఉన్నట్లు గుర్తించాం. నగదు ఉన్న ప్రదేశం ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వర్మ అధికారిక నివాసం…” పేజీ 59లో: “... స్టోరుమ్లోకి వెళ్లేందుకు జస్టిస్ వర్మ, ఆయన కుటుంబ సభ్యులకే ఉన్నది. ఎవరు అనుమతి లేకుండా లోపలికి వెళ్లలేరు. మా విచారణలో తేలింది.”మార్చి 14న జరిగిన అగ్ని ప్రమాదంలో అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పుతున్న సమయంలో స్టోరూంలో పూర్తిగా కాలిన నోట్లు వెలుగులోకి వచ్చాయి. ఓ సాక్షి చెప్పిన ప్రకారం.. “లోపలికి వెళ్లగానే ఏటు వైపు చూసినా, రూ.500 నోట్ల కట్టలు నేలపై పడి ఉన్నాయి. ఇది నా జీవితంలో నేను చూసిన పెద్ద మొత్తంలో నగదు అని సదరు వ్యక్తి త్రిసభ్య కమిటీకి చెప్పారు. కమిటీ నివేదిక ప్రకారం, ఇంత పెద్దమొత్తంలో స్టోరూంలో లభ్యమవ్వడంపై అనేక అనుమానాలున్నాయి. జస్టిస్ వర్మ, అతని కుటుంబ సభ్యుల ప్రమేయం లేకుండా అక్కడ ఉంచడం అసంభవం’ అని నివేదికలో ప్రస్తావించింది.జస్టిస్ వర్మ కుమార్తె దియా వర్మ, ప్రైవేట్ సెక్రటరీ రాజీందర్ కార్కీలను కూడా కమిటీ విచారించింది. విచారణలో ఈ ఇద్దరూ స్టోరూంలో నగదు ఉన్న విషయాన్ని ఎవరికీ చెప్పొద్దని అగ్నిమాపక సిబ్బందిని కోరినట్లు తేలింది.దీంతో పాటు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ కుమార్ చేసిన ఆరోపణలు, దర్యాప్తులో తేలిన అంశాల ప్రకారం, జస్టిస్ వర్మను తొలగించే ప్రక్రియ ప్రారంభించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయి’ అని కమిటీ తేల్చింది.దేశంలో ఇప్పటి వరకు ఏ న్యాయమూర్తికి వ్యతిరేకంగా అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టలేదు. సుప్రీం త్రిసభ్య కమిటీ సిఫార్సుతో జస్టిస్ యశ్వంత్ వర్మకు వ్యతిరేకంగా అభిశంసన తీర్మానం జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఇదే విషయంపై పార్లమెంట్ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్ని రాజకీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు జస్టిస్ వర్మ మాత్రం కాలిన నోట్ల కట్టల గురించి తమకు ఎలాంటి సమాచారం లేదని, నిరుపయోగంగా ఉండే స్టోరూంలో ఇతరులు సైతం ప్రవేశించే అవకాశం ఉందని వాదిస్తున్నారు. సుప్రీం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు దొరికిన ఘటనపై సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. ఈ కమిటీలో పంజాబ్, హరియాణా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ షీల్ నాగ్, హిమాచల్ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జి.ఎస్.సంధావాలియా, కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అనూ శివరామన్ను సభ్యులుగా ఉన్నారు.
ఏమీ ఎరుగని పూవుల్లారా!
ఈ దశాబ్దంలో నాకు నచ్చిన సినిమా అదే: హీరో నాని
టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం?: వైఎస్ జగన్
‘కక్ష సాధింపునకే బాబు సర్కార్ తప్పుడు కేసులు’
నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్
'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్ అంతమాట అన్నాడా?
ప్చ్.. పాకిస్తాన్ పీత కష్టాలు
Viral Video: కర్రలతో కొట్టుకున్న కేదార్నాథ్ యాత్రికులు
నిస్సాంక సూపర్ సెంచరీ.. బంగ్లాకు ధీటుగా బదులిస్తున్న శ్రీలంక
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
ఏపీలో అమ్మకు కష్టాలు (చిత్రాలు)
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
సాక్షి కార్టూన్ 18-06-2025
ఏమీ ఎరుగని పూవుల్లారా!
ఈ దశాబ్దంలో నాకు నచ్చిన సినిమా అదే: హీరో నాని
టీసీఎస్ కొత్త పాలసీ.. అస్సలు ఒప్పుకోమంటున్న ఉద్యోగులు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్తో నాకేం సంబంధం?: వైఎస్ జగన్
‘కక్ష సాధింపునకే బాబు సర్కార్ తప్పుడు కేసులు’
నాపై ఒత్తిడి లేదు.. బెస్ట్ బ్యాటర్గా ఉండాలనుకుంటున్నా: గిల్
'RCB గెలిచాక ఏ ఒక్కటీ మంచి జరగడం లేదు' సింగర్ అంతమాట అన్నాడా?
ప్చ్.. పాకిస్తాన్ పీత కష్టాలు
Viral Video: కర్రలతో కొట్టుకున్న కేదార్నాథ్ యాత్రికులు
నిస్సాంక సూపర్ సెంచరీ.. బంగ్లాకు ధీటుగా బదులిస్తున్న శ్రీలంక
పెళ్లికి మంచి రోజులు లేవని రూంకు తీసుకెళ్లి..!
రామోజీ ఫిల్మ్ సిటీ భయంకరమైన ప్లేస్: హీరోయిన్ కాజోల్
అమ్మాయి సాఫ్ట్వేర్.. అబ్బాయి ప్రైవేట్ ఉద్యోగి
ఎన్టీఆర్ను చిన్నతనంలోనే పక్కన పెట్టడానికి కారణాలున్నాయి: పురందేశ్వరి
వాళ్ల కోసం అన్నీ ఇచ్చేశా.. ఒంటరిగా ఉండాలని ఉంది: అభిషేక్ బచ్చన్
‘హనీమూన్’ కేసు: బిగ్ ట్విస్ట్.. సంజయ్వర్మ మరెవరో కాదు..
రెండో బిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్ ఇలియానా
కోవిడ్ దెబ్బకు సిరిసిల్ల విలవిల!
భర్త పుట్టిన రోజునే బిడ్డకు జన్మనివ్వాలని పిచ్చి పని చేసిన భార్య..!
118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తో
ఈ రాశి వారికి స్థిరాస్తి వృద్ధి.. వ్యాపారాలు లాభిస్తాయి
ఈ రాశి వారికి సంఘంలో గౌరవం.. వ్యాపారాలలో పురోగతి
ఆర్టీసీలో ఔట్సోర్సింగ్ కండక్టర్లు
...ఆ ఓట్లతోనే మనం బతికిపోయాం.. ఇప్పుడెలా!!
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీం.. వరల్డ్ రికార్డు బద్దలు
ఖరీదైన 1164 ఫ్లాట్లు.. 7 రోజుల్లో ఫినిష్!
పథకాలు కత్తిరించేయడం అలవాటయిపోయి ప్రతిదానికీ కత్తిరించేస్తానంటున్నాడు!!
అది సరే! ఇక్కడ లక్షలాది మంది రోడ్డెక్కొద్దని ఎవరు చెప్పాలి సర్..!
సాక్షి కార్టూన్ 18-06-2025
నా భర్తతోనే వివాహేతర సంబంధం పెట్టుకుంటావా!
సినిమా

బిగ్బాస్లో ఎన్ని లక్షలు వచ్చాయో చెప్పిన గౌతమ్.. లైవ్లోనే గూగుల్పే..
బిగ్బాస్ షోకు రెండుసార్లు వెళ్లొచ్చాడు గౌతమ్ కృష్ణ (Gautham Krishna). మొదటిసారి ఫినాలే వరకు చేరకుండానే ఎలిమినేట్ అయ్యాడు. రెండోసారి మాత్రం వైల్డ్ కార్డ్లా వెళ్లి వైల్డ్ ఫైర్ అయ్యాడు. తెలుగు బిగ్బాస్ ఎనిమిదో సీజన్లో ఫస్ట్ రన్నరప్గా నిలిచాడు. అతడు హీరోగా నటిస్తున్న రెండో చిత్రం సోలో బాయ్ (Solo Boy Movie). ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో గౌతమ్ తన బిగ్బాస్ సంపాదనను బయటపెట్టాడు. బిగ్బాస్ షోలో నేను పది వారాలున్నాను. అందుకుగానూ నేను రూ.30 లక్షలు సంపాదించాను. నా సంపాదనలో కొంత భాగం సమాజ సేవకు ఉపయోగించాలనుకుంటున్నాను. ఈ ఆలోచన నాకెప్పుడు వచ్చిందంటే.. 25 ఏళ్ల మురళీనాయక్ అనే వ్యక్తి ఆపరేషన్ సింధూర్లో దేశం కోసం పోరాడి వీరమరణం పొందారు.స్టేజీపై ఆర్థిక సాయంమరి నేనేం చేశాను? అని ఆలోచించుకున్నాను. అందుకే సమవర్తి అనే ట్రస్ట్ ఏర్పాటు చేశాను. నా సంపాదనలో సగం ఈ ట్రస్టుకే ఇస్తాను. అలా బిగ్బాస్ ద్వారా సంపాదించినదాంట్లో సగం అంటే రూ.15 లక్షలు ఈ సంస్థ ఖాతాలో వేస్తున్నాను. మొదటగా మురళీ నాయక్ కుటుంబానికి రూ.1 లక్ష ఆర్థిక సాయం చేస్తున్నాను. నేను చచ్చేలోపు లక్ష మందికి సాయం చేయాలన్నదే నా కోరిక. నేను నా మాట నిలబెట్టుకోకపోతే నన్ను ఏకిపారేయండి అని చెప్పుకొచ్చాడు. అన్నట్లుగానే మురళీ నాయక్ కుటుంబానికి స్టేజీపై లక్ష రూపాయలు గూగుల్ పే చేశాడు. సోలోబాయ్ చిత్రం జూలై 4న విడుదల కానుంది.చదవండి: రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు

రామోజీ ఫిలిం సిటీ.. రాశీ, తాప్సీలకు అదే భయానక అనుభవాలు
కొన్ని ప్రదేశాలు నెగెటివ్ వైబ్స్ ఇస్తుంటాయి. హైదరాబాద్లోని రామోజీ ఫిలిం సిటీకి వెళ్లినప్పుడు తనకూ అలాంటి నెగెటివ్ వైబ్స్ వచ్చాయంది బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ (Kajol). షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు అంతా సరిగా ఉన్నట్లు అనిపించలేదని, వెంటనే తిరిగి వెళ్లిపోవాలనిపించిందని పేర్కొంది. ప్రపంచంలోనే అత్యంత భయానకమైన చోటుగా రామోజీ ఫిలిం సిటీని వర్ణించింది.హోటల్లో దెయ్యాలు?ఇలాంటి చేదు అనుభవం కాజోల్కు మాత్రమే కాదు, తాప్సీ (Taapsee Pannu), రాశీఖన్నా, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణికి కూడా ఎదురైందట! గతంలో తాప్సీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దెయ్యాలున్నాయని నేను బలంగా నమ్ముతాను. అవంటే నాకు చాలా భయం. రామోజీ ఫిలిం సిటీలోని ఓ హోటల్ గదిలో బస చేసినప్పుడు నాతో పాటు ఎవరో ఉన్నట్లే అనిపించింది. ఆ హోటల్లో దెయ్యాలున్నాయని అందరూ అంటుంటే విన్నాను. కానీ, తొలిసారి అది ఎక్స్పీరియన్స్ చేశాను. నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో నడుచుకుంటూ వస్తున్న శబ్ధాలు వినిపించాయి. దెయ్యంతో పోరాడలేనుభయంతో వణికిపోయినప్పటికీ అదంతా నా భ్రమే అని నాకు నేను సర్ది చెప్పుకుని నిద్రపోవడానికి ప్రయత్నించాను. దెయ్యంతో పోరాడేంత సినిమా నాకు లేదు అని చెప్పుకొచ్చింది. రాశీఖన్నా (Raashii Khanna) కూడా.. అదే హోటల్లో బస చేసినప్పుడు తన బెడ్ దానంతటదే ఊగిపోయిందని, తను కప్పుకున్న దుప్పటి కూడా ఎవరో లాగేశారంది. ఆ గదిలో కచ్చితంగా దెయ్యం ఉందని అభిప్రాయపడింది. ఎందుకంటే, తనకంటే ముందు పలువురు యాక్టర్స్కు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పినట్లు ఓ క్లిప్పింగ్ వైరల్ అవుతోంది.కీరవాణిదీ అదే అభిప్రాయంఅలాగే ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి (MM Keeravani)కి కూడా చంద్రముఖి 2 సినిమా సమయంలో ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది. కీరవాణి మాట్లాడుతూ.. అత్యంత భయంకరమైన ప్రదేశం ఏది? అని ఇంటర్నెట్లో కొడితే రామోజీ ఫిలిం సిటీ (Ramoji Film City) పేరే వస్తుంది. అక్కడున్న సింఫనీ స్టూడియోలో లేడీ సింగర్స్ పాట పాడుతున్నారు. అప్పుడు వారి చెవిలో ఏవో శబ్ధాలు వినిపించాయి అని చెప్పాడు. సెలబ్రిటీలందరూ ఇంత ఓపెన్గా చెప్తున్నారంటే రామోజీ ఫిలిం సిటీలో నిజంగానే ఏదో ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.చదవండి: నా కళ్లలో నీళ్లు తిరిగాయి.. అందుకే ఆమె పెళ్లికి సాయం చేశా: శేఖర్

మీ నాన్న పాకెట్లో ఎంత కొట్టేసేవారు?.. కుబేర డైరెక్టర్కు నాగచైతన్య సరదా ప్రశ్న!
అక్కినేని నాగార్జున, ధనుశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'కుబేర'. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా.. ఈ శుక్రవారమే థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్లో నాగార్జున కూడా పాల్గొంటున్నారు. తాజాగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల, నాగార్జునను హీరో నాగచైతన్య ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరిని నాగచైతన్య సరదా ప్రశ్నలు అడిగారు. మీ చిన్నప్పుడు నాన్న పాకెట్ నుంచి ఎంత మనీ కొట్టేశారు? అంటూ చైతూ ఇద్దరినీ ప్రశ్నించారు. దీనికి శేఖర్ కమ్ముల ఆసక్తికర సమాధానమిచ్చారు. పతంగులు కొనేందుకు 50 పైసలు తీసుకునేవాడిని డైరెక్టర్ అన్నారు. ఆ తర్వాత నాన్న జేబు నుంచి రూపాయి, రెండు రూపాయల నోట్లు తీసుకునేవాడినని నాగార్జున వెల్లడించారు. అప్పుడు వాళ్ల పాకెట్లో కూడా అంతే ఉండేవని.. పెద్ద నోటు అంటే అప్పట్లో కేవలం పది రూపాయలేనని నాగార్జున అన్నారు. ఆ తర్వాత నా టైమ్లో బిగ్ నోట్ 500 రూపాయలని నాగచైతన్య నవ్వుతూ మాట్లాడారు. కాగా.. శేఖర్ కమ్ముల డైరెక్షన్లో నాగచైతన్య- సాయిపల్లవి జంటగా లవ్ స్టోరీ మూవీలో నటించారు.

‘నన్ను పెళ్లి చేసుకో’ అని కోరిన అభిమాని.. హీరోయిన్ ఫన్నీ రిప్లై
‘నన్ను పెళ్లి చేసుకుంటావా?’ అని ఓ అమ్మాయిని ఓ అబ్బాయి డైరెక్ట్గా అడిగితే తడబడే అమ్మాయిలే ఎక్కువగా ఉంటారు. కానీ మాళవికా మోహనన్లాంటి అమ్మాయిలైతే అదే స్పీడుతో సమాధానం ఇచ్చేస్తారు. సరదాగా సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో కబుర్లు చెప్పాలనుకున్నారు ఈ బ్యూటీ. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.ఓ అభిమాని ‘నన్ను పెళ్లి చేసుకుంటారా’ అని అడిగాడు... అంతే... ‘నాకు దెయ్యాలంటే భయం’ అని సూటిగా సుత్తి లేకుండా చెప్పేశారు మాళవిక. అలా ఎందుకు చెప్పారంటే, అతని ‘ఎక్స్’ ఖాతా పేరు ‘ఘోస్ట్’ అని ఉంది. ఆ పేరుని వాడుకుని, ఇలా సరదాగా మాళవిక చెప్పారు. రెబల్ స్టార్ ప్రభాస్ "రాజా సాబ్"తో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది మాళవిక. రీసెంట్ గా రిలీజైన ఈ సినిమా టీజర్ లో మాళవిక స్టన్నింగ్ లుక్స్, బ్యూటిఫుల్ అప్పీయరెన్స్ ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఈ చిత్రం గురించి కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించింది. టీజర్ కు వస్తున్న రెస్పాన్స్ తో హ్యాపీగా ఫీలవుతున్నట్లు ఆమె తెలిపింది. ప్రభాస్ ను ఫస్ట్ టైమ్ సెట్స్ లో కలిసిన సందర్భాన్ని స్పెషల్ మూవ్ మెంట్ గా తాను ఫీలైనట్లు మాళవిక తెలిపింది. ప్రభాస్ ఎంతో గౌరవంగా, స్నేహంగా ఉంటారని, బాగా మాట్లాడతారని ఆమె పేర్కొంది.
న్యూస్ పాడ్కాస్ట్
క్రీడలు

జై షా, బీసీసీఐతో మాట్లాడాను.. వారికి నేనే చెప్పాను: సచిన్ టెండుల్కర్
‘పటౌడీ ట్రోఫీ’ పేరు మార్పు అంశంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI), ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు (ECB)దే తుది నిర్ణయమని టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ (Sachin Tendulkar) అన్నాడు. అయితే, పటౌడీ వారసత్వాన్ని కొనసాగించేలా విజేత జట్టు కెప్టెన్కు.. పటౌడీ మెడల్ అందించేలా తాను చేసిన ప్రయత్నం సఫలమైనందుకు సంతోషంగా ఉందన్నాడు.ఈసీబీ తీరుపై విమర్శలుకాగా భారత్- ఇంగ్లండ్ క్రికెట్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్కు పటౌడీ ట్రోఫీ అనే పేరు ఉండేది. అయితే, తాజాగా సిరీస్ నేపథ్యంలో ఈ పేరును టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీగా మార్చారు. ఈ నేపథ్యంలో ఈసీబీ తీరుపై విమర్శలు వచ్చాయి.అయినప్పటికీ తన నిర్ణయానికి కట్టుబడి ఇరు దేశాల దిగ్గజ ఆటగాళ్ల పేర్లు గుర్తుకు వచ్చేలా టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ పేరును ఈసీబీ ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో పటౌడీ గౌరవం తగ్గకుండా ఏదో ఒక రూపంలో వారిని గౌరవించేలా నిర్ణయం తీసుకోవాలంటూ సచిన్ టెండుల్కర్ ఈసీబీకి విజ్ఞప్తి చేసినట్లు వార్తలు వచ్చాయి.ఇందుకు సానుకూలంగా స్పందించిన ఈసీబీ భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్లో విజేతగా నిలిచిన జట్టు కెప్టెన్కు పటౌడీ మెడల్ అందజేస్తామని వెల్లడించింది. ఈ అంశాలపై సచిన్ టెండుల్కర్ తాజాగా స్పందించాడు.జై షా, బీసీసీఐ, ఈసీబీతో మాట్లాడాను‘‘పటౌడీ వారసత్వం చిరస్థాయిగా నిలిచిపోవాలి. భారత క్రికెట్కు పటౌడీ కుటుంబం చేసిన సేవలు మనకు స్ఫూర్తిదాయకం. వారి పేరుకు భంగం కలగకుండా.. లెగసీ కొనసాగేలా నా వంతు ప్రయత్నం చేస్తానని పటౌడీ ఫ్యామిలీకి చెప్పాను.ఐసీసీ చైర్మన్ జై షా, బీసీసీఐ, ఈసీబీతో ఈ విషయం గురించి మాట్లాడాను. నా ఆలోచనలను వారితో పంచుకున్నాను. ఈ క్రమంలోనే విన్నింగ్ కెప్టెన్కు పటౌడీ మెడల్ ఇవ్వాలనే నిర్ణయం జరిగింది.ఇరుజట్ల మధ్య ఏదేని ట్రోఫీ రిటైర్ చేయడంపై బీసీసీఐ, ఈసీబీలదే తుది నిర్ణయం. అయితే, పటౌడీ పేరును ఏదో ఒక రూపంలో కొనసాగించేలా చేయాలన్న నా ప్రయత్నం ఫలించింది’’ అని బోరియా మజుందార్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ టెండుల్కర్ పేర్కొన్నాడు.కాగా టీమిండియా- ఇంగ్లండ్ మధ్య శుక్రవారం (జూన్ 20) నుంచి లీడ్స్ వేదికగా ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ సిరీస్తో భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్మన్ గిల్ శకం మొదలుకానుంది. రవిచంద్రన్ అశ్విన్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ తర్వాత టీమిండియా ఆడబోయే తొలి టెస్టు సిరీస్ ఇదే కావడంతో.. టీమిండియా ప్రదర్శనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.పటౌడీ ఫ్యామిలీ గౌరవార్థంకాగా టీమిండియా అత్యుత్తమ కెప్టెన్లలో ఒకరిగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీకి పేరుంది. ఆయన ససెక్స్, ఆక్స్ఫర్డ్ జట్ల తరఫున కూడా క్రికెట్ ఆడారు. ఇక మన్సూర్ తండ్రి ఇఫ్తికార్ అలీ ఖాన్ పటౌడీ కూడా టీమిండియా, ఇంగ్లండ్ జట్లకు ఆడటం విశేషం. ఈ నేపథ్యంలోనే వారి గౌరవార్థం భారత్- ఇంగ్లండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ను పటౌడీ ట్రోఫీగా పిలిచారు. కాగా మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ భార్య షర్మిలా ఠాగూర్. ఆమె బాలీవుడ్ నటి. వీరి సంతానం సైఫ్ అలీ ఖాన్, సోహా అలీఖాన్ కూడా బాలీవుడ్ నటులుగా గుర్తింపు తెచ్చుకున్నారు. సైఫ్ కుమార్తె సారా అలీ ఖాన్ హీరోయిన్గా కొనసాగుతోంది.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’

ధోని వరల్డ్ రికార్డుపై కన్నేసిన పంత్
టీమిండియా యువ ఆటగాడు రిషభ్ పంత్ (Rishabh Pant).. భారత దిగ్గజ కెప్టెన్, లెజెండరీ వికెట్ కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) ప్రపంచ రికార్డుపై కన్నేశాడు. ఇంగ్లండ్ గడ్డ మీద సరికొత్త చరిత్ర సృష్టించేందుకు 267 పరుగుల దూరంలో నిలిచాడు. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ (WTC) 2025-27లో భాగంగా భారత్- ఇంగ్లండ్ శుక్రవారం నుంచి ఐదు మ్యాచ్ల సిరీస్లో తలపడనున్నాయి.ఇంగ్లండ్ గడ్డ మీద అరంగేట్రంఈ సిరీస్తో టీమిండియా సారథిగా శుబ్మన్ గిల్ ప్రస్థానం మొదలుకానుండగా.. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కాగా 2018లో టీమిండియా తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన పంత్.. ఇంగ్లండ్తో తన తొలి మ్యాచ్ ఆడాడు.ట్రెంట్ బ్రిడ్జి వేదికగా నాడు ఇంగ్లండ్తో జరిగిన మూడో టెస్టులో పంత్ రెండు ఇన్నింగ్స్లో వరుసగా 24, 1 పరుగు చేశాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 203 పరుగుల భారీ తేడాతో గెలిచింది. అరంగేట్రంలో అంతంత మాత్రంగానే ఆడిన పంత్.. ఇంగ్లండ్ మీద ఆ తర్వాత మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.రెండు సెంచరీలుఇప్పటి వరకు మొత్తంగా అక్కడ ఎనిమిది టెస్టు మ్యాచ్లు ఆడిన పంత్ 511 పరుగులు చేశాడు. ఇందులో రెండు శతకాలు కూడా ఉన్నాయి. ఇక ఇంగ్లండ్లో అత్యధిక పరుగులు చేసిన పర్యాటక జట్ల వికెట్ కీపర్ల జాబితాలో 27 ఏళ్ల పంత్ ప్రస్తుతం తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఈ లిస్టులో టీమిండియా లెజెండ్ ధోని అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.ఇంగ్లండ్లో ధోని మొత్తంగా 778 పరుగులు సాధించాడు. అతడిని అధిగమించాలంటే.. పంత్ ఇంకో 267 పరుగులు చేయాలి. తాజా పర్యటనలో భాగంగా టీమిండియా ఐదు టెస్టులు ఆడనున్న నేపథ్యంలో.. పంత్ గనుక బ్యాట్ ఝులిపిస్తే ఇదేమీ అంతకష్టం కాబోదు. మరి.. ఈ ఉత్తరాఖండ్ బ్యాటర్ ఈసారి ధోని వరల్డ్ రికార్డును బ్రేక్ చేస్తాడేమో చూడాలి!!కాగా రిషభ్ పంత్ టీమిండియా తరఫున ఇప్పటి వరకు 43 టెస్టు మ్యాచ్లు ఆడి 2948 పరుగులు చేశాడు. ఇందులో ఆరు శతకాలు, 15 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.ఇంగ్లండ్లో అత్యధిక పరుగులు సాధించిన పర్యాటక జట్ల వికెట్ కీపర్ బ్యాటర్లు వీరే..1. మహేంద్ర సింగ్ ధోని (ఇండియా)- 778 పరుగులు2. రోడ్నీ మార్ష్(ఆస్ట్రేలియా)- 773 పరుగులు3. జాన్ హెన్రీ (సౌతాఫ్రికా)- 684 పరుగులు4. ఇయాన్ హేలీ (ఆస్ట్రేలియా)- 624 పరుగులు5. జెఫ్రీ డుజాన్ (వెస్టిండీస్)- 604 పరుగులు6. ఫారూఖ్ ఇంజనీర్ (ఇండియా)- 563 పరుగులు7. ఆడం గిల్క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- 521 పరుగులు8. బ్రాడ్ హాడిన్ (ఆస్ట్రేలియా)- 513 పరుగులు9. రిషభ్ పంత్ (ఇండియా)- 511 పరుగులు.చదవండి: ’కర్మ ఎవరినీ వదిలిపెట్టదు.. కచ్చితంగా అనుభవిస్తారు’

గిల్ కచ్చితంగా ట్రోఫీతోనే తిరిగి వస్తాడు: టీమిండియా దిగ్గజం
భారత టెస్టు క్రికెట్లో కొత్త శకం ఆరంభం కానుంది. దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి, లెజెండరీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్, కెప్టెన్ రోహిత్ శర్మ వంటి దిగ్గజాల నిష్క్రమణ తర్వాత.. యువ ఆటగాడు శుబ్మన్ గిల్ సారథ్యంలో భారత జట్టు ఇంగ్లండ్ గడ్డ మీద తొలి టెస్టు సిరీస్ ఆడబోతోంది. లీడ్స్లో శుక్రవారం నుంచి ఇరుజట్ల మధ్య పోటీ ఆరంభం కానుంది.ఆ ముగ్గురికే సాధ్యమైందిఅయితే, ఇంగ్లండ్లో టెస్టు సిరీస్ గెలవడం అంత సులువేమీ కాదు. ఇప్పటి వరకు టీమిండియా కేవలం మూడుసార్లు మాత్రమే అక్కడ విజయపతాక ఎగురవేసింది. 1971లో అజిత్ వాడేకర్ సారథ్యంలో.. 1986లో కపిల్ దేవ్ కెప్టెన్సీలో.. చివరగా 2007లో రాహుల్ ద్రవిడ్ నాయకత్వంలో ఇంగ్లండ్ను తమ స్వదేశంలో భారత్ ఓడించగలిగింది.ఈ నేపథ్యంలో.. కఠిన సవాలుకు సిద్ధమైన గిల్ సేన.. సొంతగడ్డపై మరింత పటిష్టంగా కనిపించే స్టోక్స్ బృందాన్ని ఏ మేరకు కట్టడి చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ భారత జట్టు కొత్త సారథి శుబ్మన్ గిల్ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గిల్ తప్పక ట్రోఫీతో తిరిగి వస్తాడని ధీమా వ్యక్తం చేశాడు.ఈ మేరకు.. ‘‘అతడు ప్రతిభావంతుడైన ఆటగాడు. ఇప్పుడు భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. కచ్చితంగా ట్రోఫీతోనే అతడు ఇంగ్లండ్ నుంచి తిరిగి వస్తాడు. మనల్ని గర్వపడేలా చేస్తాడు. టీమిండియాకు గుడ్లక్. మనోళ్లు విజేతలుగా తిరిగి వస్తారు. వారికి ఆ సత్తా ఉంది’’ అని కపిల్ దేవ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో వ్యాఖ్యానించాడు.విచిత్రంగా అనిపించింది..టీమిండియా- ఇంగ్లండ్ మధ్య టెస్టు సిరీస్ను పటౌడీ ట్రోఫీగా పిలిచేవారు. అయితే, తాజాగా దీనికి ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు టెండుల్కర్-ఆండర్సన్ ట్రోఫీగా నామకరణం చేసింది. ఈ విషయంపై స్పందించిన కపిల్ దేవ్.. ‘‘నాకైతే ఇది విచిత్రంగా అనిపించింది.ఇలా కూడా జరుగుతుందా అని ఆశ్చర్యం వేసింది. మరేం పర్లేదు. క్రికెట్లో అన్నీ జరుగుతాయి. క్రికెట్ అంటే క్రికెటే. మైదానంలో ఆటగాళ్ల స్ఫూర్తి అలాగే ఉంటుంది’’ అని పేర్కొన్నాడు. కాగా పటౌడీ పేరును తొలగించడంపై ఈసీబీపై విమర్శలు వచ్చాయి.ఈ నేపథ్యంలో బీసీసీఐ, టీమిండియా లెజెండరీ బ్యాటర్ సచిన్ టెండుల్కర్ విజ్ఞప్తి నేపథ్యంలో.. భారత్- ఇంగ్లండ్ టెస్టు సిరీస్ గెలిచిన కెప్టెన్కు పటౌడీ పేరిట పతకం అందించాలని ఈసీబీ నిర్ణయించింది.చదవండి: ‘సచిన్, గంభీర్, యువీ.. ఒక్కడి కోసం అందరి కెరీర్లు నాశనం చేశారు’

CPL 2025: ప్రపంచ ప్రమాదకర బ్యాటర్లంతా ఒకే జట్టులో.. బౌలర్లకు దబిడిదిబిడే..!
కరీబియన్ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్ డ్రాఫ్ట్ (వేలం) జూన్ 18న జరిగింది. ఇందులో ప్రపంచవాప్తంగా ఉన్న చాలామంది స్టార్ ప్లేయర్లు పాల్గొన్నారు. ఆరు ఫ్రాంచైజీలు (ఆంటిగ్వా & బార్బుడా ఫాల్కన్స్, బార్బడోస్ రాయల్స్, గయానా అమెజాన్ వారియర్స్, సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్, సెయింట్ లూసియా కింగ్స్, ట్రిన్బాగో నైట్ రైడర్స్) తమకు నచ్చిన ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి.డ్రాఫ్ట్కు ముందే పలువురు హై ప్రొఫైల్ ఆటగాళ్లు ఫ్రాంచైజీలు మారారు. ప్రీ డ్రాఫ్ట్ పిక్స్లో భాగంగా జేసన్ హోల్డర్, అలిక్ అథనాజ్ బార్బడోస్ రాయల్స్ నుంచి సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్కు తరలి వెళ్లారు. షెర్ఫాన్ రూథర్ఫోర్డ్ బదులుగా ఈ వర్తకం జరిగింది. ఇలాంటి మార్పులు డ్రాఫ్ట్లో చాలా చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది డ్రాఫ్ట్లో ఓ కొత్త డెవలెప్మెంట్ చోటు చేసుకుంది. డ్రాఫ్ట్ చివరి మూడు రౌండ్లలో వెస్టిండీస్ బ్రేక్అవుట్ లీగ్లో (లోకల్ లీగ్) పాల్గొన్న ఆటగాళ్లను ఫ్రాంచైజీలు ఎంపిక చేసుకున్నాయి.డ్రాఫ్ట్ ముగిసిన అనంతరం అన్ని ఫ్రాంచైజీలు తమతమ జట్లను ప్రకటించాయి. అన్ని జట్లను పరిశీలించాక ఓ ఆసక్తికర విషయం బయటపడింది. ప్రపంచంలోని అతి ప్రమాదకర బ్యాటర్లంతా ట్రిన్బాగో నైట్ రైడర్స్ జట్టులో ఉన్నారు. ఈ ఫ్రాంచైజీ ఐపీఎల్ ఫ్రాంచైజీ కేకేఆర్కు సిస్టర్ ఫ్రాంచైజీ. ఇందులో కీరన్ పోలార్డ్, నికోలస్ పూరన్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్, అలెక్స్ హేల్స్, కొలిన్ మున్రో లాంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. వీరిని చూస్తే ప్రపంచంలో ఎంతటి గొప్ప బౌలర్కు అయిన వణుకు పట్టాల్సిందే.సీపీఎల్ 2025 డ్రాఫ్ట్ అనంతరం పూర్తి జట్లు ఇలా ఉన్నాయి..ట్రిన్బాగో నైట్ రైడర్స్ : కీరాన్ పొలార్డ్ , ఆండ్రీ రస్సెల్, సునీల్ నరైన్, నికోలస్ పూరన్, అలెక్స్ హేల్స్, అకేల్ హోసేన్, మహ్మద్ అమీర్, కాలిన్ మున్రో, ఉస్మాన్ తారిక్, అలీ ఖాన్, డారెన్ బ్రావో, యానిక్ కరియా, కీసీ కార్టీ, టెర్రెన్స్ హిండ్స్, మెక్కెన్నీ క్లార్క్, జాషువా డా సిల్వా, నాథన్ ఎడ్వర్డ్సెయింట్ లూసియా కింగ్స్ : టిమ్ డేవిడ్, అల్జరి జోసెఫ్, జాన్సన్ చార్లెస్, టిమ్ సీఫెర్ట్, రోస్టన్ చేజ్, తబ్రైజ్ షంసి, డేవిడ్ వైస్, డెలానో పోట్గీటర్, మాథ్యూ ఫోర్డ్, ఆరోన్ జోన్స్, ఖారీ పియరీ, జావెల్లె గ్లెన్, మికా మెకెంజీ, షడ్రక్ డెస్కార్టే, జోహన్ జెరెమియా, కియోన్ గాస్టన్, అకీమ్ అగస్టేగయానా అమెజాన్ వారియర్స్: ఇమ్రాన్ తాహిర్, షిమ్రాన్ హెట్మెయర్, రొమారియో షెపర్డ్, షాయ్ హోప్, గ్లెన్ ఫిలిప్స్, గుడాకేష్ మోటీ, మోయిన్ అలీ, షమర్ జోసెఫ్, కీమో పాల్, డ్వైన్ ప్రిటోరియస్, షమర్ బ్రూక్స్, కెమోల్ సావరీ, హసన్ ఖాన్, జెడియా బ్లేడ్స్, కెవ్లాన్ ఆండర్సన్, క్విన్టిన్ సాంప్సన్, రియాద్ లతీఫ్బార్బడోస్ రాయల్స్ : రోవ్మన్ పావెల్, బ్రాండన్ కింగ్, షెర్ఫేన్ రూథర్ఫోర్డ్, క్వింటన్ డి కాక్, ముజీబ్ ఉర్ రెహమాన్, అజ్మతుల్లా ఒమర్జాయ్, జోమెల్ వారికన్, కదీమ్ అలీన్, షక్కెరె ప్యారిస్, కోఫీ జేమ్స్, నైమ్ యంగ్, రివాల్డో క్లార్క్, జీషన్ మొటారా, జోహన్ లేన్, రామోన్ సిమ్మండ్స్ఆంటిగ్వా & బార్బుడా ఫాల్కన్స్ : ఇమాద్ వసీం, షకీబ్ అల్ హసన్, ఫాబియన్ అల్లెన్, నవీన్-ఉల్-హక్, ఒబెద్ మెక్కాయ్, జస్టిన్ గ్రీవ్స్, బెవాన్ జాకబ్స్, జేడెన్ సీల్స్, అల్లా గజాన్ఫర్, రహకీమ్ కార్న్వాల్, ఓడియన్ స్మిత్, జ్యువెల్ ఆండ్రూ, షమర్ స్ప్రింగర్, అమీర్ జాంగూ, కరీమా గోర్, కెవిన్ విఖం, జాషువా జేమ్స్సెయింట్ కిట్స్ & నెవిస్ పేట్రియాట్స్ : కైల్ మేయర్స్, జాసన్ హోల్డర్, రిలీ రోసౌవ్, ఎవిన్ లూయిస్, ఫజల్హాక్ ఫరూకీ, కార్బిన్ బాష్, వకార్ సలామ్ఖైల్, ఆండ్రీ ఫ్లెచర్, అలిక్ అథనాజ్, మొహమ్మద్ నవాజ్, డొమినిక్ డ్రేక్స్, మిఖైల్ లూయిస్, అష్మద్ నెడ్, జెర్మియా లూయిస్, జైడ్ గూలీ, నవీన్ బిడైసీ, లెనికో బౌచర్కాగా, ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్ అగస్ట్ 14 నుంచి సెప్టెంబర్ 21 వరకు జరుగుతుంది.
బిజినెస్

వాట్సప్, ఇన్స్టాగ్రామ్ షట్డౌన్!
ఇజ్రాయెల్తో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇరాన్ ఇంటర్నెట్ సర్వీసుల సామర్థ్యాన్ని పరిమితం చేస్తూ ఇటీవల దేశవ్యాప్తంగా దాదాపు ఇంటర్నెట్ బ్లాక్అవుట్(ఇంటర్నెట్లో తీవ్ర అంతరాయం-పూర్తి బ్లాక్అవుట్ కాదు)ను ఎదుర్కొంది. ఇజ్రాయెల్ సైబర్ దాడులకు పాల్పడుతుందని, అందుకు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఈ మేరకు ఇంటర్నెట్ను పరిమితం చేస్తూ ఉద్దేశపూర్వకంగా నిర్ణయం తీసుకున్నట్లు మీడియా నివేదికలు సూచిస్తున్నాయి.ఇరాన్ ప్రభుత్వ నిర్ణయం ద్వారా వీపీఎన్(వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్) సేవలు ప్రధానంగా ప్రభావితమయ్యాయి. తప్పుడు సమాచారం వ్యాప్తిని అణచివేయాలని దాంతోపాటు సైబర్ దాడులను అరికట్టాలని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు కొన్ని సంస్థలు తెలిపాయి. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్ కనెక్టివిటీని ట్రాక్ చేసే కంపెనీలు కెంటింక్, నెట్బ్లాక్స్ను ఉటంకిస్తూ ఎన్బీసీ తెలిపిన నివేదిక ఆధారంగా ఇరాన్ స్థానిక కాలమానం ప్రకారం జూన్ 17, సాయంత్రం 5:30 గంటలకు ఇంటర్నెట్ సేవలు పరిమితమయ్యాయి. ఇది పూర్తిగా బ్లాక్అవుట్ కాదు. విదేశీ వెబ్సైట్లకు కనెక్ట్ అయ్యేందుకు అనుమతించే వీపీఎన్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. వ్యక్తిగత సమాచారాన్ని లీక్ చేస్తారనే ఆందోళనలతో వాట్సప్ వంటి యాప్లను ఉపయోగించకుండా ఉండాలని ఇరాన్ ప్రభుత్వం ప్రకటించింది.ఇదే మొదటిసారి కాదు..ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ను నిలిపివేయడం లేదా ప్రజలు ఇంటర్నెట్ సేవలను యాక్సెస్ చేయకుండా నిరోధించడం ఇది మొదటిసారి కాదు. 2019లో దేశంలో నెలకొన్న అంతర్యుద్ధం కారణంగా వరుసగా ఆరు రోజుల పాటు పూర్తిగా లాక్డౌన్ విధించింది. అప్పుడు 100 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇజ్రాయెల్పై దాడుల తర్వాత 220 మందికి పైగా మరణించారని ఇరాన్ చెబుతుండగా, ప్రతీకార దాడుల్లో 24 మంది మరణించారని ఇజ్రాయెల్ చెబుతోంది.ఇదీ చదవండి: పుత్తడి ఈ పూట రేటెంతంటే..గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ కూడా..గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్లను కూడా ఇరాన్ నిలిపేసింది. ప్రజలు తమ డివైజ్లలో కొత్త యాప్లను డౌన్లోడ్, ఇన్స్టాల్ చేసుకోకుండా నిషేధం విధించింది. అదే సమయంలో వాట్సప్, ఇన్స్టాగ్రామ్ వంటి యాప్స్ ఇప్పటికే ఉన్న డివైజ్లలో పూర్తిగా నిరుపయోగంగా మారాయి. ఇరాన్ నేషనల్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్లో భాగమైన ప్రభుత్వం ఆమోదించిన సైట్లు అందుబాటులో ఉన్నాయి.

పుత్తడి ఈ పూట రేటెంతంటే..
స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటీవల తీవ్ర ఒడిదొడుకులకు లోనవుతున్న బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. వివిధ ప్రాంతాల్లో గురువారం రోజున గోల్డ్ రేట్లు(Today Gold Rates) ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.ఇదీ చదవండి: బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తు

బ్యాటరీ సేవ్ చేసే డిస్ప్లే.. యాపిల్ కసరత్తు
యాపిల్ సంస్థ భవిష్యత్తులో విడుదల చేయబోయే ఐఫోన్లలో కొత్త పవర్ సేవింగ్ డిస్ప్లేను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. ఐఫోన్ 18 ఎయిర్లో దీన్ని అమలు చేసే వీలుందనే అంచనాలు వెలువడుతున్నాయి. స్లిమ్ ఫోన్లలో బ్యాటరీ సామర్థ్యం తక్కువగా ఉండడంతో పవర్ అధికంగా ఖర్చు అవుతుంది. దాంతో స్లిమ్ ఫోన్లకు ఇదో సవాలుగా మారుతుంది. ఈ నేపథ్యంలో బ్యాటరీ లైఫ్ను పెంచేలా, డిస్ప్లేకు ఖర్చు అయ్యే పవర్ను తగ్గించేలా కొత్త టెక్నాలజీలను కంపెనీలు ఆవిష్కరిస్తున్నాయి. ఇందులో భాగంగా యాపిల్ కంపెనీ ఐఫోన్ 18 ఎయిర్లో ఈమేరకు టెక్నాలజీను వాడనుందని కొన్ని సంస్థలు తెలిపాయి.పరిమిత బ్యాటరీ లైఫ్ సమస్యలను పరిష్కరించడానికి, తక్కువ శక్తిని వినియోగించేలా నెక్ట్స్ జనరేషన్ ఓఎల్ఈడీ డిస్ప్లేను వాడాలని యాపిల్ పరిశీలిస్తోంది. ఇప్పటికే వీటి సరఫరాదారులతో చర్చలు జరుగుతున్నాయని సమాచారం. 2027లో ఐఫోన్ 18 ఎయిర్లో ఎల్టీపీఓ ఓఎల్ఈడీ అధునాతన వెర్షన్ను ఉపయోగించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ మోడల్లో కొత్త డిస్ప్లే ప్యానెల్ టెక్నాలజీని ఉపయోగించాలని యాపిల్ అన్వేషిస్తోంది. ప్రస్తుతం యాపిల్ తన హైఎండ్ ఐఫోన్లలో ఎల్టీపీఓ ఓఎల్ఈడీ ప్యానెళ్లను ఉపయోగిస్తుంది. కాని డిస్ప్లే అంతర్గత భాగాల్లో కొంత భాగం మాత్రమే ఆక్సైడ్ పదార్థాలను వాడుతోంది.ఇదీ చదవండి: 9 లక్షలకు ఫ్లెక్సీ స్టాఫ్కొత్త డిప్ప్లేల్లో పూర్తి ఆక్సైడ్ ఆధారిత డిజైన్కు మారడం ద్వారా మరింత సమర్థవంతంగా సర్వీసు అందించాలని యోచిస్తోంది. అయితే ఈ అప్గ్రేడ్ అంత సులభం కాదనే వాదనలున్నాయి. ఇది తయారీ ప్రక్రియలో సంక్లిష్ట మార్పులను కలిగి ఉంటుంది. దాంతో ఈ ప్యానెళ్లు మరింత ఖరీదుగా మారుతాయనే అభిప్రాయాలున్నాయి.

9 లక్షలకు ఫ్లెక్సీ స్టాఫ్
భారత ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఫ్లెక్సిబుల్ స్టాఫ్(సంస్థలకు అనుకూలంగా అవసరం మేరకే నియమకం అయ్యే ఉద్యోగులు) విధానం కీలకంగా మారుతోంది. సంస్థలు ఈ ఫ్లెక్సీ స్టాఫ్ను ప్రధాన శ్రామిక శక్తిగా స్వీకరించడంతో ఏటా 15 శాతం వృద్ధి చెందుతున్న గిగ్ ఎకానమీలో 2030 నాటికి 9 లక్షల మంది నిపుణులు చేరుతారని ఒక నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం దేశ ఐటీ / ఐటీఈఎస్ రంగంలో 3,90,000 ఫ్లెక్సీ స్టాఫ్ ఉన్నారు. ఇది ఈ రంగంలోని మొత్తం 5.8 మిలియన్ల నిపుణుల్లో 7 శాతం అని టాలెంట్ సొల్యూషన్స్ ప్రొవైడర్ కెరియర్నెట్ నివేదికలో తెలిపింది. ‘ది రైజ్ ఆఫ్ ఫ్లెక్సీ స్టాఫింగ్: అవుట్లుక్ ఫర్ ఇండియా ఐటీ / ఐటీఈఎస్ టాలెంట్ ల్యాండ్ స్కేప్’ పేరుతో రిపోర్ట్ తయారు చేసింది.2030 నాటికి ఈ ఫ్లెక్సీ స్టాఫ్ రెండింతలు పెరిగి 9,00,000కు చేరుకుంటుందని, 15 శాతం కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్ (సీఏజీఆర్)తో వృద్ధి చెందుతుందని నివేదిక అంచనా వేసింది. రియల్ టైమ్ హైరింగ్ డేటా, మార్కెట్ రీసెర్చ్, ఇండస్ట్రీ ట్రెండ్స్ ఆధారంగా కెరియర్నెట్ ఈ నివేదికను రూపొందించినట్లు తెలిపింది. ఈ రిపోర్ట్ ప్రకారం భారత్ గ్లోబల్ ఆఫ్షోరింగ్ హబ్ కావడంతో ఐటీ/ ఐటీఈఎస్ సెక్టార్లో ఫ్లెక్సీ వర్కర్లకు డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. డిజిటల్ యాక్సిలరేషన్, ప్రపంచ ఆర్థిక మార్పుల మధ్య ఫ్లెక్సీ స్టాఫింగ్ నియామకం పెరుగుతుందని, స్పెషలైజేషన్, స్కేలబిలిటీకి మద్దతు ఇచ్చేందుకు ఈ నమూనాను చాలా కంపెనీలు అనుసరిస్తున్నట్లు కెరియర్నెట్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ నీలభ్ శుక్లా తెలిపారు.ఇదీ చదవండి: పీఎస్యూల డీలిస్టింగ్ సరళతరంఐటీ/ఐటీఈఎస్ శ్రామిక శక్తిలో 25 శాతంతో ఫ్లెక్సీ స్టాఫ్ నియామల్లో బెంగళూరు దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. హైదరాబాద్ 15 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, పుణె, చెన్నై సహా ఇతర ప్రధాన నగరాలు మొత్తం వాటాలో సుమారు 10 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫ్లెక్సీ ఐటీ/ఐటీఈఎస్ ఉద్యోగుల్లో 20 శాతం మంది ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
ఫ్యామిలీ

బోధనకు సృజన తోడైతే ఇంత బాగుంటుందా..!
చూస్తుండగానే వేసవి సెలవులు అయిపోయాయి. స్కూళ్లు మొదలయ్యాయి. ఇక పిల్లలు, పెద్దలు హడావిడి మాములుగా ఉండదు. ఇన్నాళ్లు జాలీగా గడిపిన చిన్నారులకు ఇప్పుడు స్కూల్కి వెళ్లాంటే ఉంటుంది బాధ..మాములుగా ఉండదు. వాళ్లని యథావిధిగా స్కూల్కి వెళ్లేలా చేయలేక పేరెంట్స్ తంటాలు ఓ రేంజ్లో ఉంటాయి. సరిగ్గా ఈ సమయంలో సామాజిక మాధ్యమంలో ఓ టీచర్ పిల్లలను ఆకట్టుకునేలా పాఠాలు చెబుతున్న వైరల్ వీడియో అందర్నీ తెగ ఆకట్టుకుంది. ఇలా ప్రతి టీచర్ పిల్లల్నిఎంజాయ్ చేసేలా పాఠాలు చెబితే వాళ్లు స్కూల్కి వెళ్లనని మారం చెయ్యరు అంటున్నారు నెటిజన్లంతా. మరీ ఆ వీడియో కథాకమామీషు ఏంటో చూద్దామా..!.వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ తెరిచిన రోజు సామాజిక మాధ్యమాల్లో ఒక టీచర్ వీడియో వైరల్ అయింది. తొలి రోజు తరగతి గదిలో నృత్యం చేస్తూ, పాట పాడుతూ చిన్నారులను హుషారు పరచడం ఆ వీడియో సారాంశం. ఆ టీచర్ పేరు వందనరాయ్. కర్నాటకలోని కర్కలకు చెందిన వందన పిల్లలకు అర్థమయ్యే రీతిలో పాఠం చెప్పడంలో దిట్ట. కన్నడ, ఆంగ్ల అక్షరాలను నృత్యం చేస్తూ పిల్లలకు ఆమె నేర్పే తీరు ఆకట్టుకుంటోంది. పండ్లు, కూరగాయలను పరిచయం చేస్తూ వాటిని తినడం వల్ల కలిగే ప్రయోజనాలను ఆడుతూ, పాడుతూ చెబుతారు. ప్రత్యేక సందర్భాల్లో పిల్లలకు సందర్భోచితంగా మేకప్ వేసి పాటలు నేర్పుతూ ఆటలాడిస్తారు. ఆమె వీడియోలు యూట్యూబ్లో వైరల్ అయ్యాయి. బోధనకు, సృజనాత్మకత తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో ఈ వీడియోలు చెప్పకనే చెబుతాయి. "Vandana Rai Karkala, a teacher & a social media sensation"She is a teacher in Karkala, Udupi district. Her teaching methods are integrated with music & nature, rooted in our culture. No wonder her videos have gone viral with millions of views.Youtube: https://t.co/zWQbi6y3Xa pic.twitter.com/Rc3zbBUppQ— Girish Alva (@girishalva) April 24, 2023(చదవండి: రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!)

మీ పిల్లలది మంచి స్కూలేనా? ఇవన్నీ చెక్ చేశారా?
స్కూల్ ఫీజ్ ఎంత కడుతున్నారో మీకు తెలుసుగాని ఆ కట్టిన డబ్బులోని ప్రతి పైసాకు సరి పడే విధంగా అక్కడ పాఠాలు చెబుతున్నారా? సౌకర్యాలు ఉన్నాయా? టీచర్లు యోగ్యులేనా? విద్యావిధానంలో వారి తాత్త్వికత ఏమిటి? స్టూడెంట్–టీచర్ మధ్య అనుబంధం ఉందా? ఆటలు ఉన్నాయా? విద్యార్థులు, తల్లిదండ్రుల కోసం నేటి నుంచి అవగాహన కథనాలు... ‘మా పిల్లలు చాలా పెద్ద స్కూల్లో చదువుతున్నారు’ అని పేరెంట్స్ అనుకున్నంత మాత్రాన అది మంచి స్కూల్ అయిపోదు. ‘ఏదో చిన్న స్కూల్లో చదువుతున్నారులే’ అన్నంత మాత్రాన అది చెడ్డ స్కూల్ అయిపోదు. చాలా ఎక్కువ ఫీజు ఉన్నది చాలా మంచి స్కూల్ అనే భావన తల్లిదండ్రుల్లో ఉంది. దగ్గరగా ఉందనో, ట్రాన్స్పోర్ట్ ఉందనో, అందరూ అక్కడే చదువుతున్నారనో... రకరకాల కారణాల వల్ల తల్లిదండ్రులు పిల్లలను ఎంచిన స్కూళ్లలో చేరుస్తుంటారు. చేర్చి, మళ్లీ స్కూల్ వైపే చూడకుండా క్లాసుల మీద క్లాసులు చదివిస్తుంటారు. మన పిల్లలకు వచ్చే మార్కులను బట్టే అది మంచి స్కూల్ అనుకునేవారు కూడా ఉంటారు. అంటే పిల్లలకు నూటికి 90కి పైన వస్తున్నంత కాలం ఆ స్కూల్ ఎలా ఉన్నా వారికి పర్వాలేదు. కాని ఇలాంటి అంచనాలన్నింటితో ఒక స్కూల్ని ఎంచడం విద్యార్థికి ఏదో ఒక మేర నష్టం చేయడమే అంటున్నారు నిపుణులు. ఇదీ చదవండి: టెంట్ చూస్తే చాలు.. గుండెల్లో గుబులు...ఏం చేయాలి?ఒక స్కూల్ ఎప్పుడు మంచి స్కూల్ అవుతుంది అనే దానికి కొన్ని నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. పేపర్లో ఆ స్కూల్ విద్యార్థుల మార్కుల కనిపించడం వల్ల మాత్రమే మంచి స్కూల్ అనుకోక నిజంగా పిల్లలు సరైన స్కూల్లో చేరాలంటే, కొనసాగాలంటే తల్లిదండ్రులు ఆ స్కూల్ను ఈ ప్రమాణాల రీత్యా పరిశీలించాల్సి ఉంటుంది.విద్యా తాత్త్వికత ఎలాంటిది?ప్రతి మంచి స్కూల్కు ఒక తాత్త్వికత ఉంటుంది. తమ బడిలో చదివిన పిల్లల వికాసం ఏ రీతిన సాగాలో ఆ స్కూల్ ఏర్పాటు సమయంలోనే నిర్వచనం చేసుకుని ఉంటారు. భారతీయతలోని భిన్న సమాజాల పిల్లల కలయికతతో తరగతి ఉండాలనీ, అన్ని భాషల సంప్రదాయాల పిల్లల మధ్య సమ భావనతో తరగతి ఉండాలని, ఏ ఒక్క సమూహపు అహం/ ప్రాధాన్యం పెరగని విధంగా చూడగలరని, విద్యార్థుల మధ్య పోటీతత్త్వం ఎగదోసి ఒకరిని ఎక్కువ మరొకరిని తక్కువ చేసే విధానం అవలంబించరని, బోధన ఇంగ్లిష్ మీడియం అయినా ప్రతి మాతృభాషనూ గౌరవించగలిగే స్కూల్ను మంచి స్కూల్గా ఎంచవచ్చు.బుర్రలా... మరబొమ్మలా?చదువు ఎలా నేర్పిస్తారో చూడాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సిలబస్ పూర్తి చేయడమే లక్ష్యంగా, పిల్లలు పాఠాలు బట్టీయం వేసి, పరీక్షల్లో ముక్కస్య ముక్కహ రాసి, నూటికి నూరు తెచ్చుకొనేలా తోముతారా లేదా ప్రశ్న మార్చి ఇచ్చినా రాసేలాగా, బుర్ర పెట్టి ఆలోచించగలిగేలాగా, సొంతంగా నేర్చుకునే లాగా, సబ్జెక్ట్స్పై ఆసక్తి కలిగేలాగా చెబుతారా? ఈ రెండో విధానం కలిగినది మంచి స్కూల్.చదవండి: 118-80 కిలోలకు, 6 నెలల్లో 38 కిలోలు తగ్గాడు : సింపుల్ డైట్తోవినూత్నమైన టీచింగ్టీచింగ్ ఎలా ఉంటుందనేది చూడాలి? అదే మూస సంప్రదాయ పద్ధతిలోనేపాఠాలు చెబుతున్నారా? లేదంటే ఆధునికమైన ఉపకరణాలు, సాధనాల సహాయంతో చెబుతున్నారా చూడాలి. ఎప్పటికప్పుడు సిలబస్ను వర్తమాన పరిస్థితులను బట్టి మెరుగు పరుచుకుంటూ పిల్లలను ఇన్వాల్వ్ చేస్తూ అవసరమైతే ఎక్స్పర్ట్లను బయటి నుంచి పిలిపించి స్పెషల్ క్లాసెస్ నిర్వహిస్తూ పిల్లలను ఉత్సాహ పరుస్తున్నారా లేదా చూడాలి. రెండో రకం స్కూలుకు ప్రాధాన్యం ఇవ్వాలి.టీచర్లు ఉన్నారా?ఒక స్కూల్ మనుగడ ఆ స్కూల్లో పని చేసే టీచర్ల మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్కూల్ యాజమాన్యం క్వాలిఫైడ్ టీచర్లను తీసుకుంటున్నారా? వారికి మర్యాదకరమైన జీతాలు ఇస్తున్నారా? టీచర్లు ఆ యాజమాన్యానికి లాయల్గా ఉన్నారా? ఐదేళ్ల పాటైనా ఒక్కో టీచర్ ఆ స్కూల్లో పని చేయగలుగుతున్నారా? ఈ సంవత్సరం ఉండి మరో సంవత్సరం మారి΄ోయే టీచర్లు ఉన్న స్కూల్లో పాఠాలు నడవవు. స్కూల్ మీద ప్రేమతో ఉంటూ పాఠాలు చెప్పే తపన కలిగిన టీచర్లు ఉన్న స్కూల్ను ఎంచుకోవాలి. అలాగే టీచర్లు మొరటుగా ఉంటూ స్టూడెంట్స్తో మూర్ఖంగా వ్యవహరిస్తూ ఉంటే గనక ఆ స్కూల్ జోలికి పోరాదు. స్ట్రిక్ట్గా ఉండటం వేరు స్టూడెంట్స్ను అవమానిస్తూ, భయభ్రాంతం చేయడం వేరు.క్రీడలు, కళలుక్రీడలకు, కళలకు స్థానం లేని స్కూల్కు ఆమడ దూరం ఉండాలి. ఆటస్థలం లేని స్కూల్ ప్రైమరీ లెవల్ నుంచి హైస్కూల్ లెవల్ వరకూ పనికి రాదు. ప్లేగ్రౌండ్ ఉన్నా ఆటలను ప్రోత్సహించక చివరి పీరియడ్ వరకూ పాఠాలతో ఊదరగొట్టే స్కూల్స్ను మంచివి అనుకోకూడదు. పిల్లల్లో ఎంతో సృజన ఉంటుంది. దానిని ప్రోత్సహిస్తే వారికి ధన, కనక, వాహనాలిచ్చినట్టే. విద్యార్థి ఎదుగుదల సమగ్రంగా జరగాలి. పాఠాలతోపాటు ఆట పాటలకు విలువిచ్చే బడికే ఓటు.సామాజిక బాధ్యత నేర్పుతున్నదా?మన పాటికి మనం చదువుకుని, పెద్ద ఉద్యోగం తెచ్చుకుని, సుఖంగా బతికే ధోరణిని పెంచేలా వీరి తర్ఫీదు ఉంటుందా లేదంటే ఏ సమాజం నుంచి వచ్చామో ఆ సమాజం గురించి ఎరుక పరిచి, అందులో ఉన్న అంతరాల వల్ల బాధ పడేవారి కోసం, సమాజంలో ఉన్నతి కోసం ఎంతో కొంత చేయాల్సిన బాధ్యత రేపు పెద్దయ్యాక ఉంటుంది అనే చెప్పేలా తర్ఫీదు ఉంటుందా చూడాలి. రెండో రకం తర్ఫీదు మంచిది.భద్రత, పరిశుభ్రతఅన్నింటి కంటే ముఖ్యం భద్రత. పిల్లలు ఉన్న చోట వేయి కళ్లతో ఉండాలి. స్కూల్లో ఆయాలు, సెక్యూరిటీ వాళ్లు సరైన ట్రయినింగ్ ఉన్న వాళ్లేనా? బస్ల డ్రైవర్లు లైసెన్స్లు ఉన్నవాళ్లేనా? కెమెరాల నిఘా ఉందా? ఔట్ పాస్ నియమాలు ఎలా ఉన్నాయి? టాయిలెట్ల దగ్గర రక్షణ ఉందా? ఇవి చూడాలి. అలాగే స్కూల్లో పరిశుభ్రతపాటిస్తున్నారా? గాలి వెలుతురు ఉండేలా చూస్తున్నారా? మంచి నీరు ఇస్తున్నారా? పిల్లల ఆరోగ్యం హటాత్తుగా పాడైతే వారు వెంటనే తల్లిదండ్రులకు తెలియ చేస్తున్నారా? ఫస్ట్ ఎయిడ్ ఇవ్వ గలుగుతున్నారా... ఇవన్నీ చూసుకుని, సంతృప్తికరంగా ఉంటే అది మంచి స్కూల్. ప్రతి పైసాకు ప్రతిఫలంస్కూళ్లు ముక్కుపిండి ఫీజులు వసూలు చేస్తాయి. ఆ వసూలు చేసిన ఫీజుకు జవాబుదారీగా స్కూల్ను నిర్వహిస్తున్నారా? ప్రతి పైసాకు ప్రతిఫలం ఇస్తున్నంత బాగా విద్యార్థిని తీర్చిదిద్దుతున్నారా? పిల్లలు సంతోషంగా స్కూల్కు వెళ్లి సంతోషంగా తిరిగి ఇల్లు చేరుతున్నారా? ఇవన్నీ పరిశీలించుకుని ఇప్పుడు మీ పిల్లలు చదువుతున్నది మంచి స్కూలో కాదో తేల్చుకోండి.

రిస్క్ ఎంతున్న రెస్క్యూకి రెడీ..!
‘కాపాడుకో...కాపాడు’ నినాదంతో కోలిండియా వరల్డ్ క్లాస్ ఆల్–విమెన్ రెస్క్యూ అండ్ రికవరీ టీమ్లను ఏర్పాటు చేసింది.ఇప్పుడు అదే బాటలో సింగరేణి సంస్థ తొలిసారిగా ఆల్–విమెన్ రెస్క్యూ టీమ్లకు శ్రీకారం చుట్టింది. శిక్షణ మొదలైంది. సింగరేణి చరిత్రలో ఇదొక చారిత్రక ఘట్టంగా నిలవనుంది...రెండేళ్ల క్రితమే సింగరేణిలో మహిళా రెస్క్యూ టీమ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇటీవలి కాలంలో సింగరేణి నిర్వహించిన ఎక్స్టర్నల్ పోస్టుల్లో మహిళా గ్రాడ్యుయేట్ ట్రెయినీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగాల్లో చేరారు. సంస్థలో మహిళా ఉద్యోగుల సంఖ్య 1,995కి పెరిగింది. రెస్క్యూ శిక్షణ కోసం మైనింగ్ గ్య్రాడ్యుయేట్ ట్రెయినీలతో ఒక్కో బ్యాచ్కు 14 మంది చొప్పున రెండు బ్యాన్లు ఏర్పాటు చేస్తున్నారు.కోలిండియాలోని పలు సంస్థలో ఇప్పటికే మహిళా రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేశారు. గత ఏడాది సింగరేణిలో జరిగిన ఆలిండియా రెస్క్యూ పోటీల్లో కోల్ ఇండియాకు చెందిన రెండు మహిళా టీమ్లు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో సింగరేణిలో కూడా రెస్క్యూ టీమ్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రెండు జట్లకు పదహారు రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. ఫస్ట్ ఎయిడ్, రివైనింగ్, రక్షణ పద్దతులు, గనుల్లో గ్యాస్ ఏర్పడినప్పుడు వాటిని ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా గోడలు కట్టే విధానం, అత్యవసర సమయాల్లో స్పందించే పద్ధతి, అగ్ని ప్రమాదాల్లో చిక్కుకున్నప్పుడు రక్షించే విధానం...మొదలైన అంశాలపై శిక్షణ ఇస్తారు. ‘ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా రెస్క్యూ టీమ్లో చేరాను’ అంటోంది ఎన్.రక్షిత. ‘కోల్ ఇండియా స్థాయి రెస్క్యూ పోటీల్లో మా జట్టు సత్తా చూపుతాం’ అంది బి.కళ్యాణి. అందరి మాటల్లోనూ ఉత్సాహం కనిపిస్తోంది. సాహసానికి ఇంధనం ఆ ఉత్సాహమే కదా!– కాల్వ చంద్రశేఖర్రెడ్డి, సాక్షి, గోదావరిఖనిటఫ్ జాబ్ అంటే ఇష్టం...ఏదో ఒక ఉద్యోగం చేయడం అని కాకుండా టఫ్ జాబ్ చేయడం అంటే మొదటి నుంచి నాకు ఆసక్తి. ఇప్పుడు నా ఉత్సాహానికి తగిన పని దొరికింది. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎలా స్పందించాలో రెస్క్యూ శిక్షణ ద్వారా నేర్చుకుంటున్నాం. ఈ శిక్షణ మాకు భవిష్యత్లో ఎంతగానో ఉపకరిస్తుంది. – ఎం.లిఖిత, భూపాల్పల్లిఆత్మస్థైర్యం పెంచేలా...మహిళ మైనింగ్ గ్రాడ్యుయేట్ ట్రెయినీలు మూడు షిఫ్టులలో పనిచేస్తున్నారు. రెస్క్యూ బ్రిగేడియర్ శిక్షణ మాలో ఆత్మస్థైర్యం పెంచడంతోపాటు తోటివారికి సహాయ పడేలా చేస్తోంది.– అల్లం నవ్యశ్రీ, ఎంజీటీ, జీడీకే–11 (చదవండి: నీట్లో సత్తా చాటిన కూలీ, చిరువ్యాపారి, రైతుల కూతుళ్లు..!)

సైలెంట్ డీ హైడ్రేషన్..! హెచ్చరిస్తున్న వైద్యులు
‘మీకు డీహైడ్రేషన్ సమస్య ఉంది.. అనగానే చాలా మంది ‘నేను బాగానే నీరు తాగుతున్నా కదా అంటారు అయితే అది కొందరి అపోహ. నీరు మాత్రమే తాగితే సరిపోదు అని వారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటున్నారు ఆలివ్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఫిజిషియన్ డా.అబ్దుల్ మజిద్ ఖాన్. నగరంలో వాతావరణ మార్పులకు అతీతంగా వేధిస్తున్న డీహైడ్రేషన్ సమస్య గురించి వైద్యులు ఏం చెబుతున్నారంటే.. ఎండలు మండే సీజన్లో డీహైడ్రేషన్ సమస్య గురించి తరచూ చర్చిస్తుండటం సహజం.. అయితే కాలాలకు అతీతంగా ఈ డీహైడ్రేషన్కు గురయ్యే వారి సంఖ్య ఎక్కువే ఉంటోంది అంటున్నారు భాగ్యనగరం వైద్యులు. దీనికి కారణాల్లో తగినంత నీరు తాగకపోవడం ప్రధాన కారణమైతే.. విభిన్న రకాల జీవనశైలి అలవాట్లు కూడా మరో కారణంగా చెబుతున్నారు. టీ, కాఫీ, ఆల్కహాల్ వంటి పానీయాలతో పాటు ఎనర్జీ డ్రింక్స్ కూడా శరీరంలో ద్రవనష్టాలకు కారణంగా మారుతున్నాయని స్పష్టం చేస్తున్నారు. ఇవన్నీ సిటిజనుల్ని సైలెంట్ డీహైడ్రేషన్కి గురిచేస్తున్నాయని హెచ్చరిస్తున్నారు. అలాగే వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు సైతం డీహైడ్రేషన్ ముప్పును తెస్తున్నాయన్నారు. నీరు తాగితే చాలదు.. హైడ్రేషన్ అంటే కోల్పోయిన నీటిని పొందడం మాత్రమే అనే అపోహ చాలా మందిలో ఉంది. అయితే శరీరం ద్రవాలను మాత్రమే కాకుండా, మరిన్నింటిని కూడా పునరుద్ధరించాల్సి ఉంటుందని అంటున్నారు వైద్యులు. దీనినే ఫ్లూయిడ్స్, ఎలక్ట్రొలైట్స్, ఎనర్జీ(ఎఫ్ఇఇ) ఈక్వేషన్ అని పిలుస్తారు. ఉక్కపోత నుంచి అతి వ్యాయమం వరకూ.. వీటి వల్ల శరీరం సోడియం, పొటాషియం, మెగ్నిషియం మొదలైన ఎలక్ట్రోలైట్లను గ్లూకోజ్ను కోల్పోతుంది. గుండె లయ, నరాల సంకేతాలు, కండరాల కదలిక మానసిక ఆరోగ్యానికి కూడా ఇవి చాలా ముఖ్యమైనవి. అయితే కేవలం కోల్పోయిన నీటి భర్తీ వల్ల ఈ సమతుల్యత పునరుద్ధరించడం జరగదు. సాదా నీటిపై మాత్రమే ఆధారపడి ఊరుకుంటే సమస్య మరింత తీవ్రం అయ్యే ప్రమాదం ఉంది. ఆహారమూ కీలకమే.. మన ఆహారంలో తరచూ ఊరగాయలు, పాపడ్స్ ఉప్పగా ఉండే స్నాక్స్ ఉంటాయి. అవి కూడా ద్రవనష్టానికి దారి తీస్తాయి. కండరాల సంకోచాలు, నరాల పనితీరు హైడ్రేషన్ను నియంత్రించడానికి కీలకమైన ఖనిజం పొటాషియం. మన దేశంలో పోషకాహార ధోరణులపై జరిపిన అధ్యయనం ప్రకారం, ప్రతి ఐదుగురిలో ఒకరికి పొటాషియం లోపం ఉంది. వేసవిలో పొటాషియం, సోడియం అసమతుల్యత మరింత స్పష్టంగా కనిపిస్తుంది. అరటిపండ్లు, ఆకుకూరలు, పప్పులు, నారింజ లేత కొబ్బరి వంటి పొటాషియం అధికంగా ఉండే ఆహారాలను అత్యంత తక్కువగా తీసుకుంటారు. ఐసిఎంఆర్ ప్రకారం, ఈ ఆహారాలు మన ఉత్తమ సహజ వనరులు అని గుర్తించింది. సూచనలు: ద్రవాలు, ఎలక్ట్రోలైట్స్ గ్లూకోజ్. మూడింటి మేళవింపుగా లభించే రెడీ–టు–డ్రింక్ ఎలక్ట్రోలైట్ సొల్యూషన్స్ ఆదరణ పొందుతున్నాయి. సరైనవి ఎంచుకోవచ్చు. డీహైడ్రేటింగ్కు కారణమయ్యే టీ, కాఫీ వంటి కెఫిన్ కలిగిన పానీయాలు, అలాగే ఆల్కహాల్, ఎరేటెడ్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం తగ్గించండి. డీహైడ్రేషన్ వల్ల కండరాల తిమ్మిరి, నోరు పొడిబారడం, తలనొప్పి, అలసట లేదా మైకం లాంటివి కలుగుతుంటే విస్మరించవద్దు. వెంటనే లవణాలు గ్లూకోజ్ రెండింటినీ కలిగి ఉన్న హైడ్రేషన్ ద్రావణాన్ని తీసుకోండి విరేచనాలు వంటి తీవ్ర లక్షణాలు లేకుండానే శరీరాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితిని నిశ్శబ్ద డీహైడ్రేషన్ అని పిలుస్తారు.– డా.అబ్దుల్ మజిద్ ఖాన్, కన్సల్టెంట్ ఫిజీషియన్, ఆలివ్ హాస్పిటల్ (చదవండి: '4ఏ మోడల్'తో ఒత్తిడిని జయిద్దాం ఇలా..!)
ఫొటోలు
అంతర్జాతీయం

మధ్యవర్తిత్వం మాటే లేదు
కననాస్కీస్(కెనడా): ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల్లో భాగంగా భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన పరస్పర సైనిక చర్యల ముగింపు పర్వంలో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. పాక్తో పోరులో శాంతిస్థాపన కోసం తానే చొరవ తీసుకుని ఇరుదేశాల మధ్య ఆపానని ట్రంప్ పదేపదే ప్రకటించుకోవడం, అమెరికా జోక్యంపై విపక్షాలు దుమ్మెత్తిపోసిన నేపథ్యంలో ట్రంప్తో మోదీ మాట్లాడటం విశేషం. ఆపరేషన్ సిందూర్ తర్వాత ట్రంప్తో మోదీ మాట్లాడటం ఇదే తొలిసారి. అత్యవసరంగా, అర్ధంతరంగా జీ7 భేటీ నుంచి ట్రంప్ నిష్క్రమించిన నేపథ్యంలో ట్రంప్తో మోదీ మంగళవారం ఫోన్లో సుదీర్ఘంగా సంభాషించారని భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ చెప్పారు. ట్రంప్తో మోదీ సంభాషణ వివరాలను మిస్రీ మీడియాకు వెల్లడించారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ తర్వాత వెనువెంటనే భారత్, పాక్ మధ్య మొదలైన పరస్పర కాల్పుల ఉదంతంలో ఇరుదేశాల మిలిటరీ విభాగాల చర్చల తర్వాత దాడులు ఆగాయి. ఇందులో అమెరికా ఎలాంటి మధ్యవర్తిత్వ పాత్ర పోషించలేదు. అయినా మూడోవర్గం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఏనాడూ అంగీకరించలేదు. పాకిస్తాన్ అభ్యర్థించడం వల్లే భారత్ కాల్పుల విరమణకు ఒçప్పుకుంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని ఇకపై పరోక్ష యుద్ధంగానే భావించబోం. ప్రత్యక్ష యుద్ధంగానే భావిస్తాం’’ అని ట్రంప్కు మోదీ స్పష్టంచేశారు.వాణిజ్య అంశాల ఊసేలేదుయుద్ధం ఆపకపోతే మీతో వాణిజ్యాన్ని ఆపేస్తానని భారత్ను ట్రంప్ బెదిరించారని వచ్చిన వార్తలపై మోదీ ట్రంప్కు స్పష్టతనిచ్చారు. ‘‘ ఆపరేషన్ సిందూర్ తదనంతర పరిణామాల్లో అమెరికా అస్సలు జోక్యంచేసుకోలేదు. భారత్, పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహిస్తామని అమెరికా నుంచి ఎలాంటి అధికారిక ప్రతిపాదన కూడా అందలేదు. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడా, ఏ స్థాయిలోనూ భారత్–అమెరికా వాణిజ్య సంబంధాలు ప్రస్తావన అస్సలు లేదు. భారత్ ఇంతకుముందుగానీ ఇకమీదటగానీ మధ్యవర్తిత్వాన్ని ఏ రకంగానూ అంగీకరించే ఆస్కారంలేదు. ఈ అంశంలో రాజకీయాలకు అతీతంగా భారత్లో ఏకాభిప్రాయం ఉంది. మే9వ తేదీ రాత్రి మీ దేశ ఉపాద్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్చేశారు. పాకిస్తాన్ ప్రతిదాడులకు సంసిద్ధ్దమవుతోందని నాతో అన్నారు. అదే నిజమైతే పాక్కు కనీవినీ ఎరుగని రీతిలో బుద్ధిచెప్తామని స్పష్టంచేశా. మే 9 అర్ధరాత్రిదాటాక పాకిస్తాన్లోని కీలక సైనిక, వైమానిక స్థావరాలపై క్షిపణి దాడులుచేసి నాశనం చేశాం. మా దాడుల్లో వాళ్ల సైనిక ఎయిర్బేస్లు బద్దలయ్యాయి. నిరుపయోగంగా మారాయి. దీంతో దిక్కుతోచక మాతో కాల్పుల విరమణ ఒప్పందానికి వాళ్లే తొలుత అభ్యర్థించారు’’ అని ట్రంప్తో మోదీ చెప్పారు.అమెరికాకు ఆహ్వానించిన ట్రంప్35 నిమిషాలకుపైగా జరిగిన ఈ టెలిఫోన్ సంభాషణలో చివర్లో మోదీని ట్రంప్ అమెరికాకు ఆహ్వానించారు. కెనడాలో జీ7 శిఖరాగ్ర సదస్సు ముగిశాక తిరుగు ప్రయాణంలో అమెరికాకు వచ్చిపోవాలని మోదీని ట్రంప్ కోరారు. క్రొయేషియాలో పర్యటించాల్సి ఉన్నందున అమెరికాలో పర్యటించడం కుదరదని ట్రంప్కు మోదీ సుతిమెత్తగా చెప్పి అభ్యర్థనను తిరస్కరించారు.

పాత్రికేయుల ఎదుటే పౌరునిపై పోలీసు కాల్పులు
నైరోబీ: పోలీసుయంత్రాంగం కొన్ని దేశాల్లో కారాగారాలను నరకానికి నఖలుగా మార్చేస్తుంటే మరికొన్ని దేశాల్లో పోలీసులు యమునికి ప్రతిరూపాలు గా అవతరిస్తు న్నారు. కొట్టే అధికారం ఉందనే గర్వంతో లాఠీలతోపాటు తూటాలకూ పనిచెప్పిన ఓ పోలీసు ఉదంతం ఇప్పుడు కెన్యాలో వివాదమైంది. పాత్రికేయుల ఎదుటే ఒక పౌరునిపై పోలీస్ అధికారి అన్యాయంగా తుపాకీ గురిపెట్టిన కాల్చిన ఘటన తాలూకు వీడియో ఇప్పుడు సామాజికమాధ్యమాల్లో వైరల్గా మారింది. మంగళవారం నైరోబీలోని అత్యంత రద్దీగా ఉన్న ఒక రహదారిలో నిరసన ర్యాలీ జరిగింది. జూన్ ఆరో తేదీన ఆల్బర్ట్ ఒజ్వాంగ్ అనే బ్లాగర్ను పోలీసులు లాకప్డెత్ చేశారు. పోలీసుపై తప్పుడు కథనం రాశాడని అరెస్ట్చేసి పట్టుకొచ్చి చితకబాదడంతో అతను లాకప్లో కన్నుమూశాడు. సంబంధిత పోలీసులను అరెస్ట్చేయాలంటూ బుధవారం నైరోబీలో నిరసనర్యాలీ జరిగింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జ్చేశారు. అదేసమయానికి మాస్క్లను అమ్ముకునే 22 ఏళ్ల వీధి వ్యాపారి బొనిఫేస్ కరియుకీ అటుగా వచ్చాడు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపో అంటూ ఇద్దరు సాయుధ పోలీసులు హెచ్చరించారు. ఉద్యమకారులతో తనకేం సంబంధంలేదని వివరణ ఇచ్చేలోపే ఒక పోలీసు ఇతని తలకు తుపాకీ గురిపెట్టి కాల్చాడు. దీంతో రక్తమోడుతూ కరియుకీ కుప్పకూలాడు. జర్నలిస్టుల ఎదుటే ఈ దారుణం జరిగింది. అదృష్టవశాత్తు అతడికి వెంటనే శస్త్రచికిత్సచేసి బుల్లెట్ను తీసేయడంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డాడు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్సపొందుతున్నాడు. విషయం తెల్సి ఆందోళనకారులు మళ్లీ నిరసనచేపట్టారు. దీంతో చివరకు ఆ అధికారిని అరెస్ట్చేశామని పోలీస్విభాగం ఒక ప్రకటన విడుదలచేసింది.

బాలిలో బద్ధలైన అగ్ని పర్వతం
బాలి: ఇండోనేషియాలో అత్యంత చురుకైన అగ్నిపర్వతాలలో ఒకటైన మౌంట్ లెవోటోబి లకి–లకి మంగళవారం సాయంత్రం బద్దలైంది. భారీ బూడిద ఆకాశంలోకి ఎగిసిపడింది. ఈ బూడిద మేఘం దాదాపు 150 కి.మీ దూరం నుండి కనిపిస్తోంది. దీంతో అధికారులు అత్యున్నత స్థాయి అగ్నిపర్వత హెచ్చరికను జారీ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా గగనతలాన్ని మూసేశారు. బాలిలోని న్గురా రాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక విమాన కార్యకలాపాలను నిలిపివేశారు.వర్జిన్ ఆ్రస్టేలియా, జెట్స్టార్, ఎయిర్ న్యూజిలాండ్, సింగపూర్కు చెందిన టైగర్ ఎయిర్, చైనాకు చెందిన జున్యావో ఎయిర్లైన్స్, ఎయిరిండియా విమానాలను రద్దు చేశాయి. కొన్ని దారి మళ్లించాయి. ఢిల్లీ నుంచి బాలికి వెళ్తున్న ఎయిరిండియా విమానాన్ని గాల్లో ఉండగానే తిరిగి రావాలని సూచించడంతో.. అది ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ (ఐజిఐ) విమానాశ్రయానికి తిరిగి చేరుకుంది. ప్రయాణికులందరూ సురక్షితంగా దిగారని ఎయిర్లైన్స్ ధ్రువీకరించింది. భారీ వర్షాల వల్ల లావా ప్రవాహాలు పెరిగే అవకాశం ఉందని ఇండోనేషియా జియాలజీ ఏజెన్సీ హెచ్చరించింది. నివాసితులు, పర్యాటకులు అప్ర మత్తంగా ఉండాలని కోరింది. ఇండోనేషియాలోని ఫ్లోర్స్ తైమూర్ జిల్లాలో ఉన్న మౌంట్ లెవోటోబి లకి–లకి పర్వతం 5,197 అడుగుల ఎత్తున్నది. ఇది ‘రింగ్ ఆఫ్ ఫైర్’వెంబడి ఉండటంతో ఇండోనేషియాలో తరచుగా అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉంటాయి. ఇలాంటి విస్ఫోటనాల సమయంలో ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానమైన బాలిలో గగనతలాని మూసివేస్తారు. ఇదే మౌంట్ లెవోటోబి లకి లకి గతేడాది నవంబర్లో విస్ఫోటనం చెందడంతో తొమ్మిది మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు.

క్షిపణుల కుంభవృష్టి
దుబాయ్/టెహ్రాన్/టెల్ అవీవ్: ఇరాన్ సైనికసామర్థ్యం అణ్వస్త్రస్థాయికి చేరకుండా అడ్డుకోవడమే లక్ష్యంగా దాడులతో దండయాత్ర చేస్తున్న ఇజ్రాయెల్ బుధవారం తన బాంబుల కుంభవృష్టిని కురిపించింది. ఇరాన్లోని 40 కీలక ప్రాంతాలపై క్షిపణులతో విరుచుకుపడింది. యురేనియం శుద్ధి ప్రక్రియలో కీలకమైన సెంట్రీఫ్యూజ్లను తయారుచేసే కర్మాగారంపై భీకరస్థాయిలో మిస్సైళ్లను ప్రయోగించింది. ఇరాన్ సాయుధశక్తిని నిర్వీర్యం చేసేందుకు క్షిపణుల ఉత్పత్తి ఆయుధ ప్లాంట్లపైనా ఇజ్రాయెల్ వందల కొద్దీ డ్రోన్లను ఎక్కుపెట్టింది. ఇరాన్ అంతర్గత భద్రత శాఖ ప్రధాన కార్యాలయంపైనా యుద్ధవిమానాలు దాడులుచేశాయి. ప్రతిగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్ భూభాగాలపై క్షిపణులను పేలుస్తూ విధ్వంసం సృష్టిస్తోంది. దీంతో ఇరుదేశాల మధ్య ఘర్షణ పతాకస్థాయిలకు చేరుకుంటోంది. తమ ఆయుధ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని అమెరికా తన పశి్చమాసియా మిత్రదేశాల గడ్డపై వేలాది మంది సైనికులను మోహరించిందని ఇరాన్ విదేశాంగ మంత్రి ఇస్మాయిల్ బాఘై ఆరోపించారు. టెహ్రాన్ సమీపంలోని హకీమియా ప్రాంతంలోని ఇరాన్ పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్కు చెందిన అకాడమీపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపించింది. పశ్చిమ ఇరాన్లోని క్షిపణి నిల్వ కేంద్రాలపై, క్షిపణి లాంచర్లపై దాడులు చేసింది. టెహ్రాన్ నగరంపై తెల్లవారుజామునే తెగబడింది. ఐదు గంటలకే భారీ పేలుడు శబ్దం వినిపించింది. కెర్మాన్షా ప్రాంతంలోని బెల్ ఏహెచ్–1 సూపర్కోబ్రాస్ రకం దాడి హెలికాప్టర్లను కుప్పకూల్చామని ఇజ్రాయెల్ తెలిపింది. దాడుల కారణంగా మౌలికసదుపాయాలు దెబ్బతిని ఇరాన్లో ఇంటర్నెట్ సేవలు దాదాపు నిలిచిపోయాయని అంతర్జాతీయ మీడియాలో వార్తలొచ్చాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటిదాకా 585 మంది ప్రాణాలు కోల్పోయారని, 1,300 మంది గాయపడ్డారని ‘ఇరాన్ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్స్’ సంస్థ తెలిపింది. దీటుగా స్పందిస్తున్న ఇరాన్ ఇరాన్ జరిపిన ప్రతిదాడుల్లో ఇప్పటిదాకా 24 మంది చనిపోయారు. బుధవారం తమవైపు దూసుకొచ్చిన 10 క్షిపణులను నేలకూల్చామని ఇజ్రాయెల్ పేర్కొంది. జవాదాబాద్లో అత్యాధునిక ఎఫ్–35 యుద్ధవిమానాన్ని ఇరాన్ సేనలు పేల్చేశాయి. దాదాపు రూ.140 కోట్ల విలువైన హెర్మెస్ డ్రోన్నూ నేలకూల్చాయి. అత్యంత శక్తివంతమైన ఫతాహ్ హైపర్సోనిక్ క్షిపణిని ప్రయోగించామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమదేశంలో శుక్రవారం నుంచి ఇప్పటిదాకా 15,871 చోట్ల నిర్మాణాలు, దాదాపు 1,300 వాహనాలు, 1,633 ఆస్తులు నాశనమయ్యాయని ఇజ్రాయెల్ బుధవారం ఒప్పుకుంది. దాడుల నేపథ్యంలో ఇరాన్ కేబినెట్ అధ్యక్షుడు పెజెష్కియాన్ సారథ్యంలో అత్యవసరంగా భేటీ అయ్యింది. ఉపాధ్యక్షుడు మొహమ్మద్ రెజా తదితరులు తాజా పరిస్థితిని అధ్యక్షునికి వివరించారు. ఇరాన్పై దాడుల ఉధృతి కొనసాగినాసరే యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని ఆపబోమని, అణుశాస్త్రవేత్తలు నిరాటంకంగా పనిచేస్తున్నారని స్విట్జర్లాండ్లోని ఇరాన్ రాయబారి అలీ బహ్రెయినీ ప్రకటించారు. ‘‘ ఇన్నిరోజులూ కేవలం హెచ్చరికగా దాడులు చేశాం. ఇజ్రాయెల్ దాడులను అడ్డుకునేందుకే క్షిపణుల్ని ప్రయోగించాం. ఇకపై ఇజ్రాయెల్కు బుద్ధి్దచెప్పేలా దాడులను తీవ్రతరం చేస్తాం’’ అని ఇరాన్ ఆర్మీ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ అబ్దుల్ రహీమ్ మౌసావీ ప్రకటించారు.మా జోక్యం ఉండొచ్చు.. ఉండకపోవచ్చు: ట్రంప్ ఇజ్రాయెల్కు తోడుగా కయ్యానికి కాలు దువ్వితే అమెరికా అంతుచూస్తామని ఖమేనీ వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైట్హౌస్లో మీడియాతో మాట్లాడారు. ‘‘ ఇరాన్ యుద్ధంలో నేను జోక్యం చేసుకోవచ్చు. చేసుకోకపోవచ్చు కూడా. నేనేం చేస్తానో ఎవరికీ తెలీదు. ఇరాన్ తన అణ్వాయుధ తయారీ కార్యక్రమానికి స్వస్తిపలికేందుకు ఇప్పుడు కూడా సమయమేం మించిపోలేదు. న్యూక్లియర్ ప్రోగ్రామ్ను కొనసాగిస్తూ ఇరాన్ నిప్పుతో చెలగాటమాడుతోంది. మరింత సంక్షోభంలో కూరుకుపోతోంది. ఇరాన్ను అడ్డుకునేదాకా దేన్నీ ఆపబోం’’ అని ట్రంప్ అన్నారు. లొంగిపోబోమని ఖమేనీ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘ లొంగిపోయే ఉద్దేశ్యం లేదా?. అయితే సరే. గుడ్ లక్(శుభాశీస్సులు)’’ అని వ్యాఖ్యానించారు.ఇరాన్లో భయానక నిశ్శబ్దం ఇరాన్ గగనతల రక్షణ వ్యవస్థ చాలా వరకు ధ్వంసంకావడంతో ఎప్పుడు ఎటు నుంచి ఇజ్రాయెల్ క్షిపణులు మీదొచ్చి పడతాయోనన్న భయాలు ఇరాన్ ప్రజల్లో కనిపించాయి. చాలా నగరాలు, పట్టణాల్లో దుకాణాలు, ఆఫీస్లు, స్కూళ్లు, కాలేజీలు మూతబడ్డాయి. సురక్షిత ప్రాంతాలకు నిత్యావసర సామగ్రితో వలసవెళ్లేవాళ్లు తప్పితే రోడ్లపై ఇంకెవరూ కనిపించట్లేదు. ఇజ్రాయెల్లో కాస్తంత భిన్నమైన వాతావరణం కని్పంచింది. ఇరాన్ను సుదూరంగా ఉన్న ఇజ్రాయెల్ పట్టణాల్లో పౌరసంచారాన్ని స్థానిక యంత్రాంగం అనుమతించింది. ‘‘ మా ఆర్థికవ్యవస్థ మళ్లీ పుంజుకోవడమే ఇరాన్పై విజయానికి ప్రబల నిదర్శనం’’ అని ఇజ్రాయెల్ రక్షణమంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’ అన్నారు. ఆపరేషన్ రైజింగ్ లయన్ లక్ష్యంగా నెరవేరేదాకా ఇరాన్తో ఎలాంటి చర్చలు జరపబోమని స్పష్టం చేశారు.భారతీయుల తరలింపు కోసం ఆపరేషన్ సిందూ ఇరాన్లో చిక్కుకున్న భారతీయులను ‘ఆపరేషన్ సిందూ’ పేరిట తీసుకొస్తామని భారతసర్కార్ బుధవారం ప్రకటించింది. టెహ్రాన్లోని కెషవార్జ్ వీధిలోని వసతిగృహంపై ఇజ్రాయెల్ దాడిలో కొందరు భారతీయ వైద్య విద్యార్థులు గాయపడ్డారన్న వార్తల నడుమ కేంద్రం ఈ ఆపరేషన్ను చేపట్టింది. ఇరాన్లో దాదాపు 4,000 మంది భారతీయులు ఉంటున్నారు. వీరిలో సగం మంది వైద్యవిద్యార్థులే. ఇప్పటికే 110 మందిని ఉత్తర ఇరాన్ గుండా ఆర్మేనియా దేశంలోకి సురక్షితంగా తరలించారు. వీళ్లను ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకొస్తున్నారు. గురువారం ఉదయంకల్లా ఈ విమానం ఢిల్లీకి చేరుకోనుంది.
జాతీయం

ప్రియునితో పట్టుబడిన భార్య.. ముక్కు కొరికిన భర్త
హర్దోయ్: వివాహమైన తరువాత ఏర్పడే అక్రమ సంబంధాలు ఎటువంటి పరిస్థితులకైనా దారి తీస్తుంటాయి. భార్యాభర్తలలో ఏ ఒక్కరు దారితప్పి నడిచినా, వారి మధ్య కలహాలు ఏర్పడుతుంటాయి. యూపీలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుంది. ఇది స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ పరిధిలో గల ఒక గ్రామానికి చెందిన రామ్ ఖిలావన్ తన భార్యను ఆమె ప్రియునితో రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నాడు. తరువాత ఆగ్రహంతో ఆమె ముక్కును బలంగా కొరికివేశాడని హరియావన్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన 25 ఏళ్ల బాధితురాలిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించామని, నిందితుడైన భర్తను అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ ఘటనకు ముందు భార్యాభర్తల మధ్య తీవ్రవాగ్వాదం జరిగిందని, ఆమె ప్రియుని ముందు భర్త ఆమె ముక్కును కొరికాడని పోలీసులు తెలిపారు.ఆమె రోదనలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే వారు సంఘటనా స్థలానికి చేరుకుని, గాయపడిన మహిళను హర్దోయ్ మెడికల్ కాలేజీకి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు మరింత మెరుగైన చికిత్సను అందించేందుకు లక్నోలోని వైద్య కేంద్రానికి తరలించారు. ఈ కేసులో భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అదనపు ఎస్పీ నరేంద్ర కుమార్ తెలిపారు. నిందితునిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కేసును అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.ఇది కూడా చదవండి: ఉద్రిక్తతల వేళ.. ఇరాన్ నుంచి ఢిల్లీకి 110 మంది భారత విద్యార్థులు

ప్రియుడితో ఏకాంతంగా భార్య.. ఒక్కసారిగా భర్త రావడంతో..
లక్నో: ఉత్తరప్రదేశ్లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ఓ వివాహిత తన ప్రియుడితో హోటల్ గదిలో ఏకాంతంగా ఉన్న సమయంలో ఆమె భర్త ఒక్కసారిగా అక్కడికి రావడంతో.. సదరు మహిళ హోటల్ పై నుంచి కిందికి దూరి పారిపోయింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.వివరాల ప్రకారం.. యూపీలోని బాగ్పత్ జిల్లా బడౌత్ పట్టణంలో ఓ వివాహిత తన ప్రియుడి శోభిత్తో కలిసి హోటల్ గదికి వెళ్లింది. హోటల్ గదిలో వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వివాహిత భర్త.. హోటల్ గది వద్దకు వచ్చాడు. అది గమనించిన ఆమె.. ఏం చేయాలో అర్థం కాకపోవడంతో హోటల్ గది కిటికి నుంచి పారిపోయే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో హోటల్ భవనం నుంచి.. కిందికి దూకి పారిపోయింది. వెంటనే అప్రమత్తమైన భార్య.. పోలీసులకు సమాచారం ఇచ్చారు.A dramatic incident unfolded in Baraut, Baghpat, where a married woman was caught on video j*mping from a 12-foot roof of an OYO hotel, allegedly to escape her husband, in-laws, and police. According to reports, the woman was staying at the hotel with her lover when her… pic.twitter.com/aWcjEqItgz— ForMenIndia (@ForMenIndia_) June 18, 2025ఆమె ప్రియుడు శోభిత్ను మహిళ భర్త పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇక, ఈ ఘటన సోమవారం జరగ్గా.. వారిద్దరి నుంచి తన ప్రాణాలకు ముప్పు ఉందని ఆమె భర్త పోలీసులను ఆశ్రయించాడు. తనకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శోభిత్ను అదుపులోకి తీసుకొని కేసు విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. వారిద్దరు దంపతులకు 2019లో పెళ్లి కాగా, ఓ కుమారుడు ఉన్నాడు. తరచూ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ఆమె హోటల్ భవనం నుంచి దూకి పారిపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ससुरालियों ने विवाहित युवती को होटल में प्रेमी के साथ पकड़ा,Oyo होटल की पिछली खिड़की से कूदकर महिला हुई मौके से फरार,पति और पत्नी के बीच काफी समय से चल रहा विवाद....@Uppolice#बागपत #बडौत #OyoHotel #LoveAffair #viralvideo pic.twitter.com/xcxtmli0v7— Rahul kumar Vishwakarma (@Rahulku18382624) June 17, 2025

నాలుగు రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు కొనసాగుతున్న పోలింగ్..
Four states by polls Voting Updates..పంజాబ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల జరుగుతున్నాయి. ఉప ఎన్నికలకు పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉప ఎన్నికలకు ఎన్డీయే కూటమి, ఇండియా మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక, ఐదు స్థానాలకు ఓట్ల లెక్కింపు జూన్ 23న జరుగుతుంది.పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది..ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఇలా.. Polling percentage till 9 am in Assembly by-polls: Visavadar: 12.10%, Kadi: 9.05%, Nilambur: 13.15%, Ludhiana West: 8.50% and Kaliganj: 10.83%Source: Election Commission of India pic.twitter.com/NyVcI3Kai1— ANI (@ANI) June 19, 2025ఉప ఎన్నికల్లో స్థానికులు, అభ్యర్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. #WATCH | Kerala | LDF candidate M. Swaraj casts vote in Nilambur by-election, at polling booth no. 202 of the Government LP School in Muthiri Mankuth, NilamburSwaraj states that voting is a citizen's right and urges everyone in the constituency to exercise their franchise. pic.twitter.com/3IhGv0BsXv— ANI (@ANI) June 19, 2025 పంజాబ్..లూథియానా (పశ్చిమ)లో, సిట్టింగ్ ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ సింగ్ గోగి మరణం కారణంగా ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమ్ ఆద్మీ పార్టీ అర్బన్ సీటుపై తన పట్టును నిలుపుకోవడానికి రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను పోటీకి దింపింది. కాంగ్రెస్ నుండి భరత్ భూషణ్ ఆశు, బీజేపీ నుండి జీవన్ గుప్తా, శిరోమణి అకాలీదళ్ నుండి పరూప్కర్ సింగ్ ఘుమ్మాన్ పోటీలో ఉన్నారు.#WATCH | Ludhiana, Punjab | Congress candidate Bharat Bhushan Ashu casts his vote at booth number 72-76, Malwa Sr Secondary School, in Ludhiana West assembly by-pollHe says, "I have fulfilled my constitutional duty and appeal to the voters to do the same." pic.twitter.com/WBxrRVazZ0— ANI (@ANI) June 19, 2025పశ్చిమ బెంగాల్..పశ్చిమ బెంగాల్లో టీఎంసీ ఎమ్మెల్యే నసీరుద్దీన్ అహ్మద్ మరణం తరువాత కలిగంజ్లో ఉప ఎన్నిక జరుగుతోంది. మహిళలు, మైనారిటీ ఓటర్లను ఏకీకృతం చేసే లక్ష్యంతో అధికార తృణమూల్ కాంగ్రెస్ ఆయన కుమార్తె అలీఫా అహ్మద్ను పోటీకి దింపింది. బీజేపీ నుంచి ఆశిష్ ఘోష్ పోటీలో ఉన్నారు. కాంగ్రెస్-వామపక్ష కూటమి కబిల్ ఉద్దీన్ షేక్ను బరిలోకి దింపింది.#WATCH | West Bengal | Voting is underway at polling booth 171 in Nadia for the Kaliganj by-elections.TMC's Alifa Ahmed, BJP's Ashish Ghosh, and Congress' Kabil Uddin Shaikh are the candidates from the constituency. pic.twitter.com/gxKANa55DI— ANI (@ANI) June 19, 2025గుజరాత్లో త్రిముఖ పోరు..గుజరాత్లో కడి, విసావదర్లలో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. కడిలో బీజేపీ ఎమ్మెల్యే కర్సన్భాయ్ సోలంకి మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. బీజేపీ నుంచి రాజేంద్ర చావ్డాను, కాంగ్రెస్ రమేష్ చావ్డాను, ఆప్ జగదీష్ చావ్డాను పోటీకి దింపింది. ఇక, విశావదర్ సిట్టింగ్ ఎమ్మెల్యే భయాని భూపేంద్రభాయ్ ఆప్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. దీంతో, అక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. ఆ స్థానంలో బీజేపీ నుంచి కిరీట్ పటేల్ను, కాంగ్రెస్ నితిన్ రాన్పారియాను, ఆప్ గోపాల్ ఇటాలియాను పోటీకి దింపింది.Polling begins for the assembly by-elections in Kerala's Nilambur, Punjab's Ludhiana West, Kaliganj in West Bengal, and Visavadar and Kadi in Gujarat.The results will be declared on 23 June. pic.twitter.com/Wp2udg68ta— ANI (@ANI) June 19, 2025కేరళ..కేరళలో నీలంబూరులో ఉప ఎన్నిక జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే ఆర్యదన్ మొహమ్మద్ కుమారుడు ఆర్యదన్ షౌకత్ను పోటీకి దింపగా, అధికార ఎల్డిఎఫ్ ఎం. స్వరాజ్ను తమ అభ్యర్థిగా ప్రకటించింది. #WATCH | Kerala: Voting begins at polling booth number 184, at Govt Lower Primary School, Veettikkuth, in the Nilambur assembly by-electionLDF has fielded M Swaraj, UDF has fielded Aryadan Shoukath, while BJP has fielded Adv. Mohan George as candidates pic.twitter.com/YGQJxyClKJ— ANI (@ANI) June 19, 2025

బిహార్ రాజకీయాల్లోకి నితీశ్ కుమారుడు!
సాక్షి, న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలు కార్యాచరణ సిద్ధం చేస్తున్న వేళ అధికార జేడీయూలో వారసుడి రాజకీయ ఆరంగేట్రం హాట్టాపిక్గా మారింది. జేడీయూ అధినేత, సీఎం నితీశ్ కుమార్(74) కుమారుడు నిశాంత్ కుమార్ క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగిడనున్నారనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో తండ్రితో కలిసి నిశాంత్ కుమార్ బహిరంగ వేదికలపై దర్శనమిస్తున్న నేపథ్యంలో ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయంగానే కనిపిస్తోంది. నిశాంత్ను రానున్న ఎన్నికల్లో పోటీకి నిలపాలని పార్టీ ఎమ్మెల్యే వినయ్ చౌదరి ఇటీవల డిమాండ్ చేశారు. మరో మంత్రి జామా ఖాన్ దీనిని బలపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. నిశాంత్కు మంచి రాజకీయ అవగాహన ఉందని, ఆయన యువతకు స్ఫూర్తిని ఇవ్వగలరని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల్లోనే పోటీ చేయించేలా త్వరలో జరిగే శాసనసభా పక్ష భేటీల్లో ఈ విషయం ప్రస్తావిస్తామని ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రకటనలు చేస్తున్నారు. మొన్నటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న నిశాంత్, గడిచిన ఆరు నెలలుగా తండ్రితో కలిసి పార్టీ వేదికలపై కనిపిస్తున్నారు. నిశాంత్ నలంద జిల్లాలోని హర్నాట్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలంటూ ఆ పార్టీ నేతల నుంచి సైతం డిమాండ్లు వస్తున్నాయి. హర్నాట్ స్థానంలో జేడీయూకు బలమైన పట్టుంది. గత 20 ఏళ్లుగా అక్కడ ఆ పార్టీ నేతలే ప్రాతిని«ధ్యం వహిస్తున్నారు. వాస్తవానికి, నితీశ్ తన ఎన్నికల ప్రయాణాన్ని ఈ స్థానం నుండే ప్రారంభించారు. ప్రస్తుతం పార్టీకే చెందిన హరినారాయణ్ సింగ్ ఆ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వరుసగా మూడుసార్లు ఈ స్థానాన్ని గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలోనే హర్నాట్ స్థానం నుంచి పోటీపై చర్చ జరుగుతోంది. దీనిపై ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్..‘ఇది ప్రజాస్వామ్యం. ఎవరైనా, ఎక్కడి నుంచైనా పోటీ చేయవచ్చు. నిశాంత్ను రాజకీయాల్లోకి స్వాగతిస్తున్నా’అని వ్యాఖ్యానించారు.
ఎన్ఆర్ఐ

అమెరికాలో వాల్మార్ట్లో అమ్మానాన్నలతో : ఎన్ఆర్ఐ యువతి వీడియో వైరల్
పిల్లలు విద్యాబుద్ధులు నేర్చుకుని, ప్రయోజకులైతే కన్న తల్లిదండ్రులకు అంతకన్నా సంతోషం మరొకటి ఉండదు. అలాగే బాగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించి అమ్మానాన్నల్ని బాగా చూసుకోవాలని పిల్లలంతా కలలు కంటారు. తమ కల సాకారమైన వేళ వారి సంతోషానికి అవధులే ఉండవు. అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్గా మారింది.అమెరికాలోని వాల్మార్ట్లో పనిచేస్తున్న భారతీయ యువతి తన తల్లిదండ్రులను వాల్మార్ట్ కార్యాలయానికి తీసుకెళ్లింది. అక్కడ మీటింగ్ రూం, జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇలా అన్ని చోట్లకు ఆనందంగా తీసుకెళ్లింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఇది ఆన్లైన్లో పలువురి హృదయాలను తాకింది. View this post on Instagram A post shared by Devshree Bharatia (@devshree.17) వాల్మార్ట్ యుఎస్ ప్రధాన కార్యాలయంలో పనిచేసే దేవశ్రీ భారతియా తన పేరెంట్స్ను ఆఫీసుకు తీసుకెళ్లింది. లగ్జరీ ఆఫీసులోని అణువణువును వారికి పరిచేసింది. ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. తల్లి దండ్రులు సంతోషంతో ఉప్పొంగిపోయారు ఈ చిన్న క్లిప్ వీడియోకు 10.1 లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. 24,000 కంటే ఎక్కువ లైక్లు వచ్చాయి. ‘‘నా తల్లిదండ్రులు USA లోని నా వాల్మార్ట్ కార్యాలయాన్ని మొదటిసారి సందర్శించారు. ఇంత విలాసవంతమైన ఆఫీసును ఎప్పుడూ చూడలేదు. ఇక్కడి సౌకర్యాలు చూసి ఆశ్చర్యపోయారు. చాలా సంతోషించారు. బిడ్డలు ఆశపడే సంతోషంతో గర్వించే తల్లిదండ్రులు’’ అంటూ దేవ్శ్రీ పోస్ట్ చేసింది.చాలా మంది నెటిజనులు సంతోషంగా స్పందించారు. ‘‘పిల్లలకు తల్లిదండ్రులకు, ఇది చాలా గొప్ప అనుభవం. వారి చిరునవ్వులు ఎప్పటికీ శాశ్వతం. వారి కళ్లలో మెరుపు, సంతోషం వీడియో అంతా స్పష్టంగా కనిపిస్తోంది. "ప్రతి కొడుకు/కూతురు కల" అని రాశాడు. " సూపర్ ఈ అనుభూతి ఎప్పటికీ దిబెస్ట్ అని మరొకరు వ్యాఖ్యానించారు. "ఇది నన్ను భావోద్వేగానికి గురిచేసింది - ప్రతి తల్లిదండ్రులు ఈ క్షణానికి అర్హులు" చాలా బావుంది!! అభినందనలు!! ప్రతి బిడ్డకు అత్యంత గర్వకారణమైన క్షణం!!" ఇలా నెటిజన్లు కామెంట్ చేశారు. అంతేకాదు తాము కూడా ఒకరోజు ఇలాంటి విజయాన్ని సాధించాలి అంటూ ప్రేరణ పొందడం విశేషం.

వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగంలో నియామకాలు
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ విభాగం స్టేట్ కన్వీనర్లు, కో– కన్వీనర్లను పార్టీ నియమించింది. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేపట్టినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం తెలిపింది. ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాలకు ఈ నియామకాలు చేపట్టింది. ⇒ న్యూ సౌత్ వేల్స్ రాష్ట్ర కన్వీనర్గా ఎల్లా అమర్నాథ్రెడ్డి⇒ కో-కన్వీనర్గా అంకిరెడ్డిపల్లి శివ రంగారెడ్డి⇒ విక్టోరియా రాష్ట్ర కన్వీనర్గా మర్రి కృష్ణదత్త రెడ్డి⇒ కో-కన్వీనర్గా కందుల భరత్⇒ క్వీన్స్ ల్యాండ్ రాష్ట్ర కన్వీనర్గా యెరువూరి బ్రహ్మారెడ్డి⇒ కో-కన్వీనర్గా వీరంరెడ్డి శ్రీధర్ రెడ్డి⇒ సౌత్ ఆస్ట్రేలియా కన్వీనర్గా బొంతు వంశీధర్ రెడ్డి⇒ కో-కన్వీనర్గా ఆలేటి నరసింహాచారి

ఎన్నారై న్యూస్: డల్లాస్లో గోరటి వెంకన్న మాట-పాట జోష్
అమెరికాలో తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో తెలుగు సాహిత్యంలో కవితా వైభవం.. డా. గోరటి వెంకన్న మాట – పాట సాహితీసభ జరిగింది. ఆటా , డాటా , డి–టాబ్స్, జిటిఎ, నాట్స్ , టాన్ టెక్స్ , టిపాడ్ సంస్థల సహకారంతో.. డాలస్ లో పెద్ద సంఖ్యలో సాహిత్యాభిమానులతో ఈ కార్యక్రమం ఉత్సాహంగా, ఉల్లాసంగా జరిగింది. గోరటి వెంకన్న కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనకు మనకాలపు మహాకవి అనే బిరుదును ప్రదానం చేశారు. సన్మానపత్రం, కిరీటం, దుశ్శాలువాతో, పుష్పగుచ్చాలతో అందరి హర్షాతిరేకాలమధ్య ఘనంగా సన్మానించారు. అంతకు ముందు.. తానా ప్రపంచసాహిత్యవేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర అందరి హర్షధ్వానాల మధ్య గోరటి వెంకన్న ను వేదికపైకి ఘనంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డా. గోరటి వెంకన్న అనేక పాటలను గానం చేశారు. గల్లీ చిన్నది, గరీబోళ్ల కథ పెద్దది లాంటి ఎన్నో పాటలతో రెండున్నర గంటలపాటు అందరినీ మంత్రముగ్దుల్ని చేశారు.డా. గోరటి వెంకన్న మాట్లాడుతూ.. ప్రసాద్ తోటకూర సభానిర్వహణ ఆద్యంతం అందరినీ ఆకట్టుకుందని, తాను చిందులెయ్యకుండా నిలబెట్టి రెండున్నర గంటలపాటు పాటలను, దానిలో ఉన్న సాహిత్యాన్ని రాబట్టిన ఘనత ప్రసాద్ దేనని, ఇలాంటి కార్యక్రమం చెయ్యడం ఇదే తొలిసారి అన్నారు. ఎంతో ప్రేమతో అన్ని సంఘాలను ఒకే వేదికమీదకు తీసుకువచ్చి ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించిన డా.తోటకూర ప్రసాద్ కు, వివిధ సంఘాల ప్రతినిధులకు, అధిక సంఖ్యలో తరలివచ్చిన సాహిత్యాభిలాషులకు పేరు పేరునా గోరటి వెంకన్న కృతజ్ఞతలు తెలియజేశారు.

అమెరికాలో తెలుగు యువకుడి విషాదం
చిలుకూరు: ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన సూర్యాపేట జిల్లా చిలుకూరు మండలం బేతవోలు గ్రామ యువకుడు అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుని బంధువులు తెలిపిన వివరాలివి. బేతవోలు గ్రామానికి చెందిన జల్లా నాగేశ్వరరావు చిన్న కుమారుడు జల్లా నరేందర్ (25) అలియాస్ నవీన్ బీటెక్ పూర్తిచేసి నాలుగేళ్ల క్రితం ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ మిస్సోరీ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిస్సోరీలో ఎంఎస్ పూర్తిచేసి ఉద్యోగ వేటలో ఉన్నాడు.ఈ నెల 1వ తేదీన (భారత కాలమానం ప్రకారం ఉదయం 10 గంటలకు) తన రూమ్ ఫ్రెండ్స్తో కలిసి కారులో వెళ్తుండగా.. కాన్సాస్ సిటీ వద్ద అదుపు తప్పి చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారు వెనక సీటులో కూర్చున్న నరేందర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆదివారం రాత్రి శంషాబాద్ విమానాశ్రయానికి నరేందర్ మృతదేహం చేరగానే, సోమవారం బేతవోలులో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉన్నత విద్యకు అమెరికా వెళ్లిన తమ కుమారుడు విగతజీవిగా వస్తుండడంతో నరేందర్ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. చదవండి: అమెరికా ఎయిర్పోర్ట్లో భారత విద్యార్థిపై దాష్టీకం
క్రైమ్

పీక్స్కు టీడీపీ ఫేక్ ప్రచారం
ప్రత్తిపాడు/నగరంపాలెం (గుంటూరు వెస్ట్): దుష్ప్రచారంలో టీడీపీ చెలరేగిపోతోంది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న రహదారిలో ఓ రోడ్డు ప్రమాదం జరిగితే, దాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెట్టి పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తోంది. బుధవారం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు సమీపంలో వెంగళాయపాలెం గ్రామానికి చెందిన ప్లంబర్ చీలి సింగయ్య (53)ను టాటా సఫారీ (ఏపీ 26 సిఈ 0001) వాహనం ఢీకొంది. దీని వెనుక చాలా దూరంలో జగన్ కాన్వాయ్ వస్తోంది. ఇదే అదునుగా పచ్చ మీడియా రెచ్చిపోయింది.ఈ ప్రమాదాన్ని జగన్ కాన్వాయ్కి ముడిపెడుతూ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారానికి దిగింది. అంతటితో ఆగక టీడీపీ అధికారిక ట్విటర్ ఖాతాలోనూ పోస్ట్ చేసింది. ఈ ప్రమాదానికి సంబంధించి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్కుమార్ స్పష్టత ఇచ్చారు. గుంటూరు రేంజ్ ఐజీ సర్వ శ్రేష్ట త్రిపాఠితో కలిసి మధ్యాహ్నం ఆయన జిల్లా పోలీసు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘గుంటూరు ఏటుకూరు రోడ్డులో ఆంజనేయస్వామి విగ్రహం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మాజీ సీఎం వైఎస్ జగన్ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు, దానికంటే 50 మీటర్ల ముందు టాటా సఫారీ వాహనం తగిలి వెంగళాయపాలెం గ్రామానికి చెందిన చీలి సింగయ్య (53) గాయపడ్డాడు. అతన్ని 108 అంబులెన్స్లో గుంటూరు జీజీహెచ్కు తరలించారు. అయితే అప్పటికే సింగయ్య మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు’ అని స్పష్టం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేస్తామన్నారు.కాగా, సింగయ్య ప్రమాదం బారిన పడటాన్ని గమనించిన వైఎస్సార్సీపీ శ్రేణులు ఆయన్ను రోడ్డు పక్కకు తీసుకొచ్చారు. సింగయ్యకు భార్య లూర్థు మేరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. వాస్తవం ఏమిటో తెలిశాక కూడా టీడీపీ ట్విటర్ ఖాతా నుంచి ఆ తప్పుడు పోస్టును తొలగించకపోవడం గమనార్హం.

మావోయిస్టు అగ్రనేత గాజర్ల రవి ఎన్కౌంటర్
రంపచోడవరం (అల్లూరి సీతారామరాజు జిల్లా)/సాక్షి, పాడేరు : ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలంలోని కింటుకూరు అటవీ ప్రాంతంలో బుధవారం తెల్లవా రుజామున జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు కీలక నేతలు సహా ము గ్గురు మావోయిస్టులు మృతి చెందారు. కింటుకూరు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గ్రేహౌండ్స్ బల గాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈ నేపథ్యంలో మావోయి స్టుల కు, గ్రేహౌండ్స్ బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకు న్నాయి. ఈ ఘటనలో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, 2004 శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్, అలి యాస్ బిర్సు, ఏఓబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు అరుణ, ఏఓబీ జోనల్ కమిటీ ఏరియా కమిటీ సభ్యురాలు అంజు మరణించారు. వీరిలో రవి తెలంగాణ రాష్ట్రానికి చెందినవారు. ఆయన స్వస్థలం భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం వెలిశాల గ్రామం. అరుణ ఇటీవల ఎన్కౌంటర్లో మరణించిన కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి భార్య. ఈమెది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం. గాజర్ల రవి, అరుణపై పోలీస్ రివార్డులున్నాయి. మావో యిస్టులకు సంబంధించిన పలు కీలక సంఘటనల్లో వీరు పాల్గొన్నట్లు పోలీస్ కేసులు నమోదయ్యాయి. అంజుది ఛత్తీ స్గఢ్ అని తెలిసింది. కాగా సంఘటన స్థలంలో పలు ఏకే–47 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సేఫ్జోన్ అని..: ఆపరేషన్ కగార్ పేరిట దండకారణ్యాన్ని పోలీస్ బలగాలు జల్లెడపడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వరు స ఎన్కౌంటర్లతో మావోయిస్టులకు గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. ఈ నేపథ్యంలో పాపికొండలు, అభయార ణ్యంలోని కొండమొదలు, కింటుకూరు ప్రాంతాలను సేఫ్జోన్గా భావించిన మావోయిస్టులు ఇక్కడకు వచ్చినట్లు భావిస్తున్నారు. సుమారు ఆరునెలల క్రితమే పది మంది మావోయిస్టులు కింటుకూరు అటవీ ప్రాంతానికి వచ్చినట్లు నిఘా వర్గాలు పసిగట్టాయి. ఈ నేపథ్యంలో నెలరోజుల క్రితం వై. రామవరం–కొయ్యూరు అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే.అరుణ అలియాస్ అరుణక్క..వెంకటలక్ష్మి చైతన్య అలియాస్ అరుణ, అలియాస్ అరుణక్క (55) మెట్రిక్యులేషన్ వరకు చదువుకున్నారు. 20 ఏళ్ల వయస్సు లోనే మావోయిస్టు ఉద్యమం బాటపట్టారు. అమె తమ్ముడు గోపి అలియాస్ ఆజాద్ కూడా 2006లో అక్క మార్గంలోనే ఉద్యమంలో చేరాడు. 2016లో జరిగిన ఎన్కౌంటర్లో ఆజాద్ మృతిచెందారు. అరుణక్క మావోయిస్టు పార్టీలో ఏఓబీ స్పెష ల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా ఉంటూ మహిళా విభాగాల్లో 30 ఏళ్లుగా కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ చలపతి భార్య చనిపోవడంతో అరుణక్కను రెండో వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది జనవ రిలో ఒడిశా–ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో చలప తి మరణించారు. భర్త మరణంతో అరుణ కుంగిపోలేదు. అనేక ఎన్కౌంటర్ల నుంచి ఆమె తప్పించుకున్నారు. పోలీసుల నిర్బంధం తీవ్రంగా ఉండడంతో ఇటీవల కాలంలో రంపచోడ వరం అటవీ ప్రాంతాన్ని సేఫ్జోన్గా మార్చుకుని తలదాచుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఆరుగురు మావోయిస్టులు భద్ర త ఉన్నప్పటికీ ఎన్కౌంటర్లో బలయ్యారు. ఆమెకు భద్రతగా ఉన్న అంజూ కూడా మృతిచెందారు. ఇక అరుణక్కపై ఏపీలో రూ. 20 లక్షల రివార్డు ఉంది. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో అరుణక్క పాల్గొన్నట్లు పోలీసులు కేసు నమోదుచేశారు. కొద్ది రోజుల క్రితమే పట్టుకుని..నా కుమార్తెను పోలీసులు కొద్ది రోజుల క్రితమే పట్టుకుని బంధించి ఇప్పుడు హతమార్చారు. దీన్ని ప్రభుత్వ హత్యగానే భావిస్తున్నాం. గతంలో నా కుమారుడు ఆజాద్ను బూటకపు ఎన్కౌంటర్లో హత్య చేశారు. దీనిపై న్యాయపోరాటం చేస్తాం .– లక్ష్మణరావు, అరుణక్క తండ్రిఅగ్రనేతగా ఎదిగి.. శాంతి చర్చల్లో పాల్గొని..సాక్షి ప్రతినిధి, వరంగల్/టేకుమట్ల: మావోయిస్టు అగ్రనేత, శాంతి చర్చల ప్రతినిధి గాజర్ల రవి అలియాస్ గణేష్, అలియాస్ ఉదయ్ మృతితో ఆయన స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాలలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాడిక ల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ) నుంచి అజ్ఞాతవాసంలోకి వెళ్లిన రవి.. దళ సభ్యుడిగా మొదలు పెట్టి కేంద్ర కమిటీ వరకు ఎదిగారు. విద్యార్థి దశనుంచే ఉద్యమాలపై ఆసక్తితో విప్లవాల బాట పట్టారు. 1985–86 సంవత్సరంలో వరంగల్లోని ఐటీఐలో చదువుతున్న క్రమంలోనే ఉద్యమాలకు ఆకర్షితుడై ఆర్ఎస్యూలో పనిచేశారు. తన అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ అప్పటికే ఉద్యమంలో క్రియాశీలకంగా ఉండటంతో ఆ ప్రభావం రవిపై పడింది. 1992లో పూర్తిస్థాయిలో ఉద్యమంలోకి వెళ్లారు. 1994–98 మధ్య ఏటూరునాగారం దళ సభ్యుడిగా, మహాదేవ పూర్లో కమాండర్గా పని చేశారు. 1994లో లెంకలగడ్డలో మందుపాతర పేల్చి ఏడుగురు పోలీసులను చంపిన కేసులో నిందితుడిగా ఉన్నారు. 1998లో ఎన్టీఎస్జెడ్సీ సభ్యుడిగా నియమితుల య్యారు. 2000 సంవత్సరంలో ఖమ్మం – కరీంనగర్ – వరంగల్ (కేకే డబ్ల్యూ) కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. 2001లో ఏటూరునాగారం పోలీస్ స్టేషన్పై జరిగిన దాడిలో పాల్గొన్నట్టు సమాచారం ఉంది. 2002 సంవత్సరంలో మహాదేవపూర్ కమాండర్గా పనిచేస్తున్న స్వరూప అలియాస్ జిలానీ బేగంను వివాహం చేసుకోగా ఆమె ఏవోబీలోని రామగూడలో జరిగిన ఎన్కౌంటర్లో చనిపోయింది. 2007లో ఆంధ్ర ఒడిశా బోర్డర్కు బదిలీ అయిన రవి.. అక్కడ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా కొనసాగుతూనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. శాంతి చర్చల ఎజెండా రూపకల్పనలో కీలకపాత్రగాజర్ల రవి 2004లో శాంతి చర్చల ప్రతినిధిగా వ్యవహరించారు. కాల్పుల విరమణ, శాంతి చర్చల కు మేధావులు జరిపిన సంప్రదింపులకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ మేరకు చర్చల ప్రతినిధులుగా జనశక్తి పార్టీ నుంచి వెంకటేశ్ అలియాస్ రియాజ్, మావోయిస్టు పార్టీ నుంచి అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే, గౌతమ్ అలియాస్ సుధాకర్లతో పాటు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి హోదాలో గాజర్ల రవి కూడా పాల్గొన్నారు. శాంతి చర్చల ఎజెండాను తయారు చేయడంలో కీలక పాత్ర పోషించారు. రవి అన్న గాజర్ల సారయ్య అలియాస్ ఆజాద్ (మహారాష్ట్ర రాష్ట్ర కమిటీ సభ్యుడు) 2008 ఏప్రిల్ 2న ములుగు జిల్లా తాడ్వాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతిచెందగా, ఆయన తమ్ముడు గాజర్ల అశోక్ అలియాస్ ఐతూ ఛత్తీస్గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉంటూ అనారోగ్యంతో జనజీవన స్రవంతిలో కలిసిపోయారు.రవి మృతిపై జిల్లా పోలీసులు బుధవారం మధ్యాహ్నం కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వెలిశాలకు తీసుకువచ్చి గురువారం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఎన్కౌంటర్పై అనుమానాలు.. నా సోదరుడి మరణంపై అనుమానాలున్నాయి. ఇప్పటివరకు మృతదేహాల ఫొటోలను విడుదల చేయలేదు. పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు మధ్యాహ్నం వరకు సమాచారమివ్వలేదు. ఇది ఎన్కౌంటరో?.. పట్టుకుని కాల్చి చంపారో? ఏదైనా విష ప్రయోగం చేసి ఉండొచ్చు. – మాజీ మావోయిస్టు గాజర్ల అశోక్

ప్రేమను పెద్దలు అంగీకరించలేదని..
వర్గల్(గజ్వేల్): తమ ప్రేమను పెద్దలు అంగీకరించడం లేదన్న మనస్తాపంతో ప్రేమ జంట బలవన్మరణం చెందారు. ఈ విషాదకర ఘటన మంగళవారం వర్గల్ మండలం అవుసులోనిపల్లిలో చోటుచేసుకున్నది. గౌరారం ఎస్ఐ కరుణాకర్రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చెక్కల ఆంజనేయులు, మణెమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు కల్పన(18) ఉంది. కల్పన ఇంటర్మీడియట్ చదివి ఇంటి వద్దే ఉంటోంది. అదే గ్రామానికి చెందిన ఉప్పరి మల్లేశం, మంజుల దంపతులది వ్యవసాయ కుటుంబం. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు శివకుమార్ (21) ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన కల్పన, శివకుమార్ కొంతకాలం నుంచి ప్రేమించుకుంటున్నారు. కుటుంబీకులు వారి ప్రేమను అంగీకరించలేదు. మరోవైపు కూతురు వివాహం కోసం సంబంధం కుదుర్చుకునే పనిలో నిమగ్నమయ్యాడు. ఈ నేపథ్యంలో తమ ప్రేమ విఫలమైందని కల్పన, శివకుమార్ మనస్తాపానికి గురయ్యారు. మంగళవారం ఉదయం శివకుమార్ తన వ్యవసాయ క్షేత్రంలో చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణం చెందాడు. ఈ విషయం తెలిసిన కొద్ది వ్యవధిలోనే కల్పన తన ఇంట్లో పైకప్పు పైపునకు చున్నీతో ఉరివేసుకుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇరు కుటుంబాలు దుఃఖసాగరంలో మునిగిపోయాయి. మృతుల కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గజ్వేల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబీకులకు అప్పగించారు.

కసాయి కూతురు.. ప్రియుడితో కలిసి కన్నతండ్రినే కడతేర్చింది
సాక్షి, మహబూబాబాద్: కూతురి జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో అని ఆ తండ్రి భయపడ్డాడు. ఆమె ప్రేమ వ్యవహారం తెలిసి ‘వద్దూ.. బిడ్డా’ అని సున్నితంగా మందలించాడు. ఆ మందలింపు ఆమెకు నచ్చలేదు. తండ్రిపైనే కోపం పెంచుకుంది. ప్రియుడిని రప్పించి ఆ తండ్రినే హతమార్చింది. మరిపెడ మండలం జండాల తండాలో జరిగిన ఈ దారుణం వివరాల్లోకి వెళ్తే.. దారావత్ కిషన్ తన కూతురు ఓ కుర్రాడితో ప్రేమ వ్యవహారం నడిపిస్తుందని తెలిసి మందలించాడు. దీంతో తన ప్రియుడిని రప్పించిన ఆమె.. తండ్రిని కట్టేసి చితకబాదింది. తీవ్ర గాయాలపాలైన కిషన్ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆ తండ్రి చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. కూతురి ఘాతుకం పట్ల స్థానికులు రగిలిపోతున్నారు. అయితే ఘటనపై ఇంకా కేసు నమోదు కాలేదని సమాచారం.