-
పేటీఎం ఈ–కామర్స్ ఇక పాయ్ ప్లాట్ఫామ్స్
న్యూఢిల్లీ: పేటీఎం ఈ–కామర్స్ పేరు పాయ్ ప్లాట్ఫామ్స్గా మారింది. పేరు మార్పు కోసం మూడు నెలల క్రితం దరఖాస్తు చేసుకోగా ఫిబ్రవరి 8న రిజి్రస్టార్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఆమోదం లభించిందని సంస్థ శుక్రవారం తెలిపింది. పేటీఎం ఈ–కామర్స్లో ఎలివేషన్ క్యాపిటల్కు మెజారిటీ వాటా ఉంది. పేటీఎం ఫౌండర్, సీఈవో విజయ్ శేఖర్ శర్మతోపాటు సాఫ్ట్ బ్యాంక్, ఈబే సైతం ఈ కంపెనీలో పెట్టుబడి చేశాయి. అలాగే ఓఎన్డీసీ వేదికగా విక్రయాలు సాగిస్తున్న ఇన్నోబిట్స్ సొల్యూషన్స్ (బిట్సిలా) అనే కంపెనీని పేటీఎం ఈ–కామర్స్ కొనుగోలు చేసినట్టు సమాచారం. 2020లో బిట్సిలా కార్యకలాపాలు ప్రారంభించింది. ఓఎన్డీసీలో టాప్ –3 సెల్లర్ ప్లాట్ఫామ్స్లో ఒకటిగా నిలిచింది. నిబంధనలు పాటించడంపై కమిటీ: పేటీఎం అసోసియేట్ పేమెంటు బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించిన నేపథ్యంలో నిబంధనల పాటింపు, నియంత్రణపరమైన వ్యవహారాలపై తగు సూచనలు ఇచ్చేందుకు ప్రత్యేక అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేసినట్లు పేటీఎం బ్రాండు మాతృసంస్థ వన్97 కమ్యూనికేషన్స్ తెలిపింది. దీనికి మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ ఎం దామోదరన్ నేతృత్వం వహిస్తారని వివరించింది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) మాజీ ప్రెసిడెంట్ ఎంఎం చితాలే, ఆంధ్రా బ్యాంక్ మాజీ సీఎండీ ఆర్ రామచంద్రన్ ఇందులో సభ్యులుగా ఉంటారని పేర్కొంది. -
పాలనలో కేరళ టాప్
బెంగళూరు: దేశంలో అత్యుత్తమ పాలన సాగి స్తున్న రాష్ట్రంగా కేరళ అగ్రస్థానంలో నిలిచింది. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. కర్ణాటకకు చెందిన ప్రజా వ్యవహారాల కేంద్రం (పీఏసీ) శనివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఒక కార్యక్రమం లో 2018 ప్రజా వ్యవహారాల సూచిక (పీఏఐ) ను విడుదల చేసింది. ప్రముఖ భారతీయ ఆర్థికవేత్త శామ్యూల్ పాల్ 1994లో స్థాపించిన ఈ సంస్థ.. దేశంలో మెరుగైన పాలన సాధిం చడం కోసం కృషి చేస్తూ వస్తోంది. ఈ క్రమం లో దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాల పాలనపై అధ్యయనం చేసి గత మూడేళ్లుగా ర్యాంకులు ఇస్తోంది. ఆయా రాష్ట్రాల్లో సాం ఘిక, ఆర్థికాభివృద్ధిని గణాంకాల సహితంగా పరిగణనలోకి తీసుకుని ఈ ర్యాంకులు కేటా యిస్తోంది. తాజా నివేదిక ప్రకారం మెరుగైన పాలన చేస్తున్న పెద్ద రాష్ట్రాల్లో కేరళ అగ్రస్థానం సాధించగా.. మధ్యప్రదేశ్, జార్ఖండ్, బిహార్ అట్టడుగున నిలిచాయి. చిన్న రాష్ట్రాల్లో హిమాచల్ప్రదేశ్ టాప్ పీఏసీ నివేదిక ప్రకారం మెరుగైన పాలన సాగి స్తున్న చిన్న రాష్ట్రాల్లో (జనాభా రెండు కోట్ల కంటే తక్కువగా ఉన్న రాష్ట్రాలు) హిమాచల్ ప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. గోవా, మిజో రం, సిక్కిం, త్రిపుర వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాలు సాధించాయి. నాగా లాండ్, మణిపూర్, మేఘాలయ సూచికలో అట్ట డుగున మిగిలిపోయాయి. పెరుగుతున్న జనాభా ఆధారంగా అభివృద్ధికి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించాలని ఈ సందర్భంగా పీఏసీ చైర్మన్ కస్తూరిరంగన్ పేర్కొన్నారు. -
ముదురుతున్న ఇన్పీ శాలరీ రగడ
ముంబై:దేశీయ అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో సంక్షోభం మరింత ముదురుతోంది. ముఖ్యంగా మేనేజ్మెంట్ కు వ్యవస్థాపకుల మధ్య నెలకొన్న బోర్డు వివాదం తీవ్ర రూపం దాల్చుతోంది. ముఖ్యంగా కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ యూబీ ప్రవీణ్ రావు భారీ వేతన పెంపుపై రగడ మరోసారి రాజుకుంది. ఈ వ్యవహారంపై ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు నారాయణమూర్తి బహిరంగ వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. కంపెనీలో కింది స్థాయి ఉద్యోగుల జీతాలు 8 శాతం , ఉన్నత స్థాయి ఉద్యోగుల జీతాలను 60 శాతం పెంచుకోవడం సరికాదంటూ ఆయన లేఖను విడుదల చేశారు. దీంతో వివాదం ముదురు పాకానపడుతోంది. ఫౌండర్ నారాయణ మూర్తి వాదనను బలపరుస్తూ ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్వో వీ బాలకృష్ణన్ (బాల) బోర్డు చైర్మన్ రాజీనామా చేయాలని మరోసారి డిమాండ్ చేశారు. బోర్డును పునరుద్ధరించాలని కోరారు. ఈ పరిష్కరించేందుకు బోర్డు ముందడుగు వేయాలన్నారు. అటు ఇన్ఫోసిస్ మాజీ ఉన్నతాదికారి మోహన్ దాస్ పాయి కూడా నారాయణమూర్తిగా మద్దతుగా స్పందించారు. నారాయణ మూర్తి చాలా ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తారనీ దీనిపై చర్చ జరగాలని చెప్పారు. ప్రవీణ్ రావు జీతం అద్భుతంగా ఉంది తప్ప ఆయన పెర్ఫామెన్స్ కాదంటూ ఎద్దేవా చేశారు. ఇన్ఫీ అమెరికా కంపెనీకాదని, అమెరికా లేదా జపాన్ కంపెనీలతో పోల్చడం సరికాదని, ఒక భారతీయ కంపెనీలో ఇలాంటి వ్యత్యాసాలు ఉండకూడదని వ్యాఖ్యానించారు. లిస్టెడ్ కంపెనీ బోర్డులు పారదర్శకత పాటించాలని కోరారు. కాగా గత ఏడాదికాలంగా విలువలు, పారదర్శకత, కార్పొరేట్ పాలన(గవర్నెన్స్)పై ఇన్ఫోసిస్లో ఆందోళనలు చెలరేగినప్పటికీ ఈ ఏడాది ఫిబ్రవరి 8,9 తేదీల్లో ఇవి మరింత వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు సీఓఓ వేతన పెంపుపై తన వైఖరిని ఇన్ఫోసిస్ సమర్ధించుకుంది. ప్రమాణాల ఆధారంగానే ప్యాకేజీ చెల్లించినట్టు పేర్కొంది. ప్రమోటర్లు వ్యక్తం చేసిన అభిప్రాయాలను జాగ్రత్తగా గమనిస్తున్నట్టు తెలిపింది. ఇన్ఫీలో రగులుతున్న అంతర్గత కుమ్ములాటతో సంస్థ భవిష్యత్తుపై ఉద్యోగులు, ఇన్వెస్టర్లలో భయాలు మొదలయ్యాయి. దీంతో ఇంట్రా డేలో భారీగా నష్టపోయింది.
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
ఆ పని నాది కాదు.. వైరముత్తుకు కౌంటర్ ఇచ్చిన ఇళయరాజా!
‘కల్తీ కల్లును అరికట్టాలి’
● జిల్లాలో విందులు, వినోదాల పేరిట పెడదారిన టీనేజ్ యువత.. ● సిగరెట్లు, మద్యపానం ఫ్యాషన్గా భావిస్తున్న యువకులు ● విందులు, వినోదాల పేరుతో సెలవులు దుర్వినియోగం ● తల్లిదండ్రుల పర్యవేక్షణ తప్పనిసరి
క్లుప్తంగా
ఆంక్షలు లేకుండా జొన్న కొనుగోళ్లు చేపట్టాలి
‘సూపర్వైజర్ను విధుల నుంచి తొలగించాలి’
‘స్వగృహ’ ఆక్రమణపై ఆర్డీవో విచారణ
‘గ్రూప్–1 ప్రిలిమినరీ’కి 18 కేంద్రాలు
పిల్లలపై ఓ కన్నేయండి..
స్టాక్ బయటకొచ్చింది
తప్పక చదవండి
- బతకాలంటే అక్కడ 'టైమ్' కొనాల్సిందే.. ఓటీటీలో ఈ మూవీ మిస్సవ్వొద్దు!
- ఇది మోదీ కూలర్.. లోకల్ బ్రాండ్ గురూ!
- ఏపీలో పెట్రోల్ బంకులకు ఈసీ సీరియస్ వార్నింగ్
- పెళ్లయినా సరే ఆ విషయంలో హన్సిక తగ్గేదేలే
- ప్రైవేట్ బస్సులో మంటలు.. తిరుపతిలో తప్పిన ఘోర ప్రమాదం
- వైన్స్ షాపు ముందు యువతి హల్చల్
- Weekly Horoscope: ఈ రాశి వారికి చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురుకావచ్చు
- ఎయిర్పోర్ట్లో సీఎం జగన్ను అడ్డుకునేందుకు కుట్ర
- Vizag: కాంబోడియాలో ఉద్యోగాల పేరిట మానవ అక్రమ రవాణా
- అయ్యో అనూష.. ప్రాణం తీసిన ఫుట్బోర్డ్ ప్రయాణం
Advertisement