-
RCB Vs PBKS: సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
ఐపీఎల్-2024లో పంజాబ్ కింగ్స్ కథ ముగిసింది. రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో గురువారం నాటి మ్యాచ్లో ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించింది.ఈ నేపథ్యంలో పంజాబ్ అభిమానులతో పాటు ఆ జట్టు మేనేజ్మెంట్కు సైతం భంగపాటు తప్పలేదు. అయితే, జట్టు పరాభవం నేపథ్యంలోనూ పంజాబ్ ఫ్రాంఛైజీ సహ యజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా వ్యవహరించిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది.కోహ్లి వికెట్ పడగానే కాగా ధర్మశాల వేదికగా జరిగిన మ్యాచ్లో పంజాబ్ను ఆర్సీబీ 60 పరుగులతో చిత్తు చేసింది. ఇక ఈ విజయంలో విరాట్ కోహ్లిదే కీలక పాత్ర అన్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో 47 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 7 ఫోర్లు, 6 సిక్స్ల సాయంతో 92 పరుగులు చేశాడు.Going..Going..GONE!Virat Kohli clobbers that delivery into the stands in grand fashion! 💥Watch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/Y5eVp7Q6fN— IndianPremierLeague (@IPL) May 9, 2024అర్ష్దీప్ సింగ్ బౌలింగ్లో రిలీ రొసోవ్కు క్యాచ్ ఇవ్వడంతో ఈ ఆర్సీబీ ఓపెనర్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ నేపథ్యంలో ప్రీతి జింటా చప్పట్లు కొడుతూ కోహ్లి వికెట్ను సెలబ్రేట్ చేసుకుంది. అయితే, ఆ సంతోషం ఎక్కువసేపు నిలవలేదు.The Punjab Kings bounce back with crucial breakthroughs, especially the big one of Virat Kohli 👏👏#RCB 238/5 with 5 deliveries leftWatch the match LIVE on @JioCinema and @StarSportsIndia 💻📱#TATAIPL | #PBKSvRCB pic.twitter.com/9mu2bMjrWV— IndianPremierLeague (@IPL) May 9, 2024లక్ష్య ఛేదనలో పంజాబ్ బ్యాటర్లంతా విఫలం కావడంతో ఆ జట్టుకు పరాజయమే ఎదురైంది. ఈ నేపథ్యంలో నిరాశకు లోనైనా ప్రీతి జింటా హుందాగా వ్యవహరించింది.సారీ చెప్పిన కోహ్లి!.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు అందుకున్న సమయంలో.. మ్యాచ్ను తాము లాగేసుకున్నందుకు ప్రీతి జింటాకు సారీ చెప్పాడు. ఇందుకు బదులుగా కోహ్లితో కరచాలనం చేస్తూ... ‘‘మరేం పర్లేదు’’ అన్నట్లుగా నవ్వులు చిందించిందామె.ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో లక్నో యజమాని సంజీవ్ గోయెంకాను ప్రీతి జింటాతో పోలుస్తూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు. సంజీవ్ గోయెంకాకు చురకలుమ్యాచ్ ఓడటమే కాదు.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించినా ప్రీతి ఆ బాధ బయటకు తెలియకుండా నవ్వుతూ కవర్ చేసిందని.. ఆమెను చూసి గోయెంకా చాలా నేర్చుకోవాలని చురకలు అంటిస్తున్నారు. కాగా సన్రైజర్స్ హైదరాబాద్ చేతిలో లక్నో ఓటమి నేపథ్యంలో ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్కు బహిరంగంగానే చీవాట్లు పెట్టిన విషయం తెలిసిందే. చదవండి: ద్రవిడ్ గుడ్ బై!.. టీమిండియా కొత్త కోచ్గా ఫారినర్?.. జై షా కామెంట్స్ వైరల్Preity Zinta with Virat Kohli at the post match presentation ceremony. ❤️ pic.twitter.com/z1G2L1IIr8— Mufaddal Vohra (@mufaddal_vohra) May 10, 2024Virat Kohli said Sorry to Preity Zinta when he met with her in post match award presentation & Preity Zinta smiles.- King Kohli winning the hearts of everyone, He's a pure soul. ❤️🐐 pic.twitter.com/2h2JFnZsyz— Tanuj Singh (@ImTanujSingh) May 10, 2024 -
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
చెన్నై సూపర్ కింగ్స్పై జైత్రయాత్రను కొనసాగించాలనుకున్న పంజాబ్ కింగ్స్కు భంగపాటు ఎదురైంది. ధర్మశాల వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్లో సీఎస్కే 28 పరుగుల తేడాతో సామ్ కరన్ బృందాన్ని చిత్తు చేసింది.తద్వారా ఐపీఎల్లో వరుసగా ఆరోసారి సీఎస్కేపై గెలుపొందాలని భావించిన పంజాబ్కు చేదు అనుభవమే మిగిలింది. ఆల్రౌండర్ రవీంద్ర జడేజా తన బ్యాటింగ్ మెరుపులతో పాటు.. స్పిన్ మాయాజాలంతో గైక్వాడ్ సేనకు ఈ విజయాన్ని అందించాడు.ఫలితంగా 2021 నుంచి చెన్నైపై పంజాబ్ కొనసాగిస్తున్న ఆధిపత్యానికి గండిపడింది. దీంతో ఆటగాళ్లతో పాటు అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. అయితే, ఈ మ్యాచ్లో చెన్నై సూపర్ స్టార్ మహేంద్ర సింగ్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరగడం మాత్రం నిరాశను కలిగించింది.ఐపీఎల్-2024లో మూడో మ్యాచ్ నుంచి బ్యాటింగ్ మొదలుపెట్టిన తలా.. పంజాబ్తో పోరుకు ముందు ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. వింటేజ్ ధోనిని గుర్తు చేస్తూ పరుగుల విధ్వంసం సృష్టించాడు.కానీ ధర్మశాల మ్యాచ్లో ఈ ఫీట్ను పునరావృతం చేయలేకపోయాడు. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ధోని హర్షల్ పటేల్ బౌలింగ్లో ఎదుర్కొన్న తొలి బంతికే బౌల్డ్ అయ్యాడు.ఈ నేపథ్యంలో పంజాబ్ కెప్టెన్ సామ్ కరన్తో పాటు ఫ్రాంఛైజీ సహ యజమాని ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ధోని బౌల్డ్ కాగానే సీఎస్కే ఫ్యాన్స్ అంతా సైలెంట్ అయిపోగా.. ప్రీతి జింటా అయితే సీట్లో నుంచి లేచి నిలబడి మరీ ధోని వికెట్ను సెలబ్రేట్ చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.The reactions say it all! #IPLonJioCinema #TATAIPL #PBKSvCSK pic.twitter.com/owCucgYN8d— JioCinema (@JioCinema) May 5, 2024కాగా సీఎస్కేతో మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ తొలుత బౌలింగ్ చేసింది. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్(21 బంతుల్లో 32), వన్డౌన్ బ్యాటర్ డారిల్ మిచెల్(19 బంతుల్లో 30)తో పాటు రవీంద్ర జడేజా(26 బంతుల్లో 43) రాణించారు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో సీఎస్కే తొమ్మిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ను జడ్డూ దెబ్బ కొట్టాడు. ప్రభ్సిమ్రన్ సింగ్(30), సామ్ కరన్(7), అశుతోశ్ శర్మ(3) రూపంలో కీలక వికెట్లు తీశాడు. మిగతా బౌలర్లు కూడా రాణించడంతో సీఎస్కే పంజాబ్ను 139 పరుగులకే పరిమితం చేసి.. ‘కింగ్స్’ పోరులో తామే ‘సూపర్’ అనిపించుకుంది.Full highlight of MS DHONI's greatest knock, 0(1). pic.twitter.com/FrlDKHKE5H— bitch (@TheJinxyyy) May 5, 2024 -
ప్రీతి ఈజ్ బ్యాక్
ఆరేళ్ల తర్వాత సినిమా సెట్స్లోకి అడుగుపెట్టారు బాలీవుడ్ నటి ప్రీతీ జింటా. సన్నీడియోల్ హీరోగా రాజ్కుమార్ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘లాహోర్ 1947’. హీరో ఆమిర్ఖాన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర సరిహద్దులోని లొకేషన్స్ లో ఈ సినిమా నైట్ షూట్ జరుగుతోందని సమాచారం. తాజాగా ఈ సినిమాలో తాను ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించి, చిత్రీకరణలో పాల్గొన్నట్లు సోషల్మీడియా వేదికగా వెల్లడించారు ప్రీతీ జింటా.ఈ సంగతి ఇలా ఉంచితే... 2018లో రిలీజైన హిందీ చిత్రం ‘భయ్యాజీ సూపర్హిట్’ మూవీలో సన్నీడియోల్, ప్రీతీ జింటా జోడీగా నటించారు. ఆ సినిమా తర్వాత మరో మూవీలో నటించలేదు ప్రీతీజింటా. మళ్లీ ఇప్పుడు ‘లాహోర్ 1947’కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారామె. ఇక ప్రీతీ జింటా తిరిగి సినిమాలు చేస్తుండటంతో ఆమె అభిమానులు ‘ప్రీతి ఈజ్ బ్యాక్’, ‘ప్రీతి రిటర్న్స్’ అంటూ పోస్ట్లు షేర్ చేస్తున్నారు. -
బ్యూటిఫుల్ పిక్ స్టోరీ చెప్పిన సొట్టబుగ్గల సుందరి: ఫోటో వైరల్
స్టార్ హీరోయిన్గా బాలీవుడ్ను ఏలిన అందాల తార ప్రీతి జింటా. యాపిల్బ్యూటీగా, డింపుల్ గర్ల్గా పాపులర్ అయిన ప్రీతి తాజాగా ఒక ఫోటోను ట్విటర్లో షేర్ చేసింది. హిమాచల్లోని సిమ్లాలో పుట్టిన ప్రీతి వెండి తెర మీద చెరగని సంతకం. ఆమె అందమైన నవ్వు, సొట్టబుగ్గలంటే అప్పట్లో కుర్రకారుకి ఒక వ్యామోహం. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసింది. తొలి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకుంది. ఆ సందర్బంగా తీసిన ఒక ఫోటోను, దానికి సంబంధించిన జ్ఞాపకాలను ట్వీట్ చేసింది.( మహిళా ఖైదీల గర్భంపై హైకోర్టు సీరియస్!) ‘‘దిల్ సే సెట్లో తొలి రోజు ఈ ఫోటో తీశారు. మణిరత్నం, షారూఖ్ ఖాన్తో కలిసి వర్క్ చేస్తుందకు చాలా ఎక్సైటింగ్ ఉన్నా. ఇంతలో మణిసార్ నన్ను చూడగానే మొహం కడుక్కుని రమ్మని, నవ్వుతూ మర్యాదగా అడిగారు. అయితే సార్... నా మేకప్ పోతుంది సార్ అని చెప్పా. నాకు కావలసింది అదే.. వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని రా అని చెప్పారు అంతే మర్యాదగా. తమాషా చేస్తున్నారా అనుకున్నా మొదట. కానీ కాదని ఈ ఫోటో చూసిన తర్వాత అర్థం అయింది. ఫోటోగ్రఫీ డైరెక్టర్ సంతోష్ శివన్ గారు నిజంగా మనసు పెట్టి (దిల్సే) తీసిన ఫోటో. ప్రెష్గా, ప్రశాంత ముఖంతో అద్భుతమైన ఫోటో ఇది. ఆయనకు ధన్యవాదాలు’’ అంటూ తన మొమోరీస్ ట్వీట్ చేసింది. ఇప్పటికే ఈ ట్వీట్ 10లక్షలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. (ఆ చిన్ని గుండె సవ్వడి...అంటూ గుడ్ న్యూస్ చెప్పిన లవ్బర్డ్స్) This picture was taken on the first day on the set of Dil Se. I was so excited to be working with Mani Ratnam sir & Shah Rukh Khan. When Mani sir saw me he smiled and politely asked me to wash my face…. But sir… my make up will come off, I said smiling …. That’s exactly what I… pic.twitter.com/Lrr6CpSMFA — Preity G Zinta (@realpreityzinta) February 8, 2024 కాగా 1975 జనవరి 31న పుట్టిన ప్రీతి జింటా హిందీతో పాటు తెలుగు, పంజాబీ, ఇంగ్లీష్ సినిమాల్లో నటించారు. బాలీవుడ్లో అనేక సూపర్హిట్ మూవీలతోపాటు టాలీవుడ్లో కూడా తనదైన ముద్రను వేసుకుంది. ప్రేమంటే ఇదేరాతో టాలీవుడ్లోకి ప్రవేశించి, ప్రిన్స్ మహేష్బాబు సరసన 1999లో రొమాంటిక్ కామెడీ రాజ కుమారుడులో నటించి టాలీవుడ్ ఆడియెన్స్ను ఆకట్టుకుంది. 2016 ఫిబ్రవరి 29న వ్యాపారవేత్త జీన్ గూడెనఫ్ ను పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఇండస్ట్రీకి దూరమైనా నటిగా, నిర్మాతగా, వ్యాపార వేత్తగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఈ జంటకు ఇద్దరు(ట్విన్స్) పిల్లలు ఉన్నారు. -
IPL 2024: పొరపాటు పడ్డ ప్రీతి జింటా.. ఒకరి బదుల ఇంకొకరి కొనుగోలు..!
దుబాయ్లోని కోలోకోలా ఎరీనా వేదికగా నిన్న (డిసెంబర్ 19) జరిగిన ఐపీఎల్ 2024 వేలంలో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. పంజాబ్ కింగ్స్ కో ఓనర్ ప్రీతి జింటా పొరపాటున ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడిని కొనుగోలు చేసింది. అయితే, వెంటనే తప్పు తెలుసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే జరగాల్సిందంతా జరిగిపోయింది. వేలం నిర్వహకులు సదరు ఆటగాడిని పంజాబ్ కింగ్స్కు లాక్ చేసేసినట్లు ప్రకటించారు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం ఒక్కసారి ఆటగాడు ఫ్రాంచైజీకి లాక్ చేయబడితే తిరిగి అతన్ని వేలానికి విడిచిపెట్టడానికి వీలు ఉండదు. ఏం జరిగిందంటే.. నిన్న జరిగిన ఐపీఎల్ 2024 వేలం సందర్భంగా 32 ఏళ్ల ఛత్తీస్ఘడ్ ఆల్రౌండర్ శశాంక్ సింగ్ పేరు వేలానికి వచ్చింది. ప్రీతి జింటా, నెస్ వాడియాలతో కూడిన పంజాబ్ కింగ్స్ మేనేజ్మెంట్ పొరపాటున ఓ శశాంక్ సింగ్ అనుకుని మరో శశాంక్ సింగ్ను కొనుగోలు చేసింది. శశాంక్ను పంజాబ్ అతని కనీస ధర 20 లక్షలకు కొనుగోలు చేసింది. శశాంక్ కోసం మరే ఇతర ఫ్రాంచైజీలు పోటీపడలేదు. అయితే శశాంక్ను తాము సొంతం చేసుకున్నట్లు దృవీకరించబడిన తర్వాత పంజాబ్ యాజమాన్యం పొరబడ్డామని తెలుసుకుంది. Fantastic scenes here as the notoriously inept Punjab Kings manage to not only purchase a player they didn’t want, (Shashank Singh), they also admit to this in front of literally everyone. Singh we can guess is sat at home wondering whether to show up in March. #IPLAuction #pbks pic.twitter.com/PtLQv9t07H — Punjab Kings UK🇬🇧👑 (@PunjabKingsUK) December 19, 2023 అయితే అప్పటికే సమయం మించి పోవడంతో చేసేదేమీ లేక సర్దుకుపోయింది. తాము పొరబడ్డామని తెలుసుకున్న క్షణంలో పంజాబ్ కో ఓనర్ పడ్డ ఆందోళన నెట్టింట వైరలవుతుంది. ఓ శశాంక్ అనుకుని మరో శశాంక్ను సొంతం చేసుకున్నామని ప్రీతి జింటా బాధపడుతున్న వీడియో సోషల్మీడియాలో హల్చల్ చేస్తుంది. కాగా, పంజాబ్ పొరపాటున సొంతం చేసుకున్న శశాంక్ సింగ్ ట్రాక్ రికార్డు మరీ అంత తీసి పారేయడానికి వీల్లేదు. అతను 55 టీ20ల్లో 724 పరుగులు చేసి 15 వికెట్లు పడగొట్టాడు. శశాంక్ను 2022లో సన్రైజర్స్ హైదరాబాద్ వేలానికి విడిచి పెట్టింది. 2023 సీజన్ వేలంలో శశాంక్ను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. నిన్నటి వేలంలో పంజాబ్ చేసిన పొరపాటే మరో ఫ్రాంచైజీ కూడా చేయబోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కూడా ఓ ఆటగాడు అనుకుని మరో ఆటగాడి కోసం వేలంలో ప్రయత్నించింది. అయితే వారు తప్పు తెలుసుకుని డ్రాప్ అయిపోయారు. -
కోట్లు ఖరీదు చేసే అపార్ట్మెంట్ కొన్న ప్రీతి జింటా!
ప్రముఖ నటి 'ప్రీతి జింటా' (Preity Zinta) ముంబైలోని బాంద్రాలో ఓ ఖరీదైన అపార్ట్మెంట్ కొనుగోలు చేసినట్లు 'రియల్టీ ప్లాట్ఫామ్ ఇండెక్స్టాప్.కామ్' ద్వారా తెలిసింది. ఈ అపార్ట్మెంట్ ధర ఎంత? ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేసారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ప్రీతి జింటా ముంబైలోని పాష్ బాంద్రాలో సుమారు 1,474 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన అపార్ట్మెంట్ను రూ. 17.01 కోట్లు వెచ్చించి కొనుగోలు చేసినట్లు, డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అక్టోబర్ 23న జరిగినట్లు తెలుస్తోంది. కీస్టోన్ రియల్టర్స్ లిమిటెడ్ దీనిని విక్రయించినట్లు, దీని కోసం నటి రూ. 85.07 లక్షల స్టాంప్ డ్యూటీని చెల్లించినట్లు సమాచారం. ప్రీతి జింటా మొత్తం ఆస్తుల విలువ ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు వంటి తెలుగు సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మదిదోచిన ఈ సొట్టబుగ్గల సుందరి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంది. అయితే ఈమె మొత్తం ఆస్తుల విలువ 15 మిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా. భారతీయ కరెన్సీ ప్రకారం దీని విలువ సుమారు రూ. 110 కోట్లు. ముంబై రియల్ ఎస్టేట్ ముంబై రియల్ ఎస్టేట్ రోజురోజుకి అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, పారిశ్రామిక వేత్తలు ఇక్కడ స్థలాలను కొనుగోలు చేశారు. ఇటీవల బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్పేయి, అతని భార్య షబానా బాజ్పేయి ముంబైలోని ఓషివారా ప్రాంతంలో రూ. 32.94 కోట్లతో 7,620 చదరపు అడుగుల కార్పెట్ ఏరియాలో నాలుగు ఆఫిస్ యూనిట్లను కొనుగోలు చేశారు. ఇదీ చదవండి: బుర్జ్ ఖలీఫాను మించి.. నిర్మాణ సామగ్రి ఉత్పత్తి గురించి ఆసక్తికర విషయాలు! సినీ నటులు అమితాబ్ బచ్చన్ , కార్తీక్ ఆర్యన్ గతంలో ముంబై, దాని పరిసర ప్రాంతాలలో స్థలాలను కొనుగోలు చేశారు. ఎక్కువ మంది నివాస స్థలాల కంటే ఎక్కువ అద్దె రాబడి కోసం కమర్షియల్ ఆస్తుల మీద పెట్టుబడులు పెడుతున్నారు. -
పిల్లలూ తల్లులూ చల్లని వారే!
దృశ్యం:1 ప్రియాంక చోప్రా తన కూతురు మాల్తీ మేరీ జోనాస్ కోసం ఇంట్లో ‘ప్లే డేట్’ నిర్వహించింది. ఈ ఆటల కార్యక్రమానికి ప్రీతీ జింటా పిల్లలు జే, గియాలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ‘ఇన్క్రెడిబుల్ వీకెండ్’ కాప్షన్తో ప్రియాంక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఈ పిల్లల ఆటల ఫొటోలు నెటిజనులను ఆకట్టుకున్నాయి. ‘మంచి ఐడియా దొరికింది. మా చిన్నారి కోసం ఇలాంటి కార్యక్రమం త్వరలో మా ఇంట్లో ఏర్పాటు చేయనున్నాను’ అని ఒక నెటిజన్ స్పందించారు. దృశ్యం: 2 అమ్మ గురించి చెప్పడానికి ఎన్నో మాటలు అక్కర్లేదు. ‘అమ్మా’ అనే పిలుపులోనే ఎన్నో వినిపిస్తాయి. తల్లి ఒమ్న కురియన్ పుట్టినరోజు సందర్భంగా ‘హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్’ అంటూ ఇన్స్టాగ్రామ్లో శుభాకాంక్షలు తెలియజేసింది నయనతార. తన సర్వస్వం అయిన తల్లి గురించి ఎన్నో సందర్భాల్లో నయన్ చెప్పింది. ఇటీవలే ఇన్స్టాలోకి అడుగు పెట్టింది. తన కుమారులు ఉయిర్, ఉలాగ్లతో ఉన్న ఫస్ట్ పోస్ట్ 2.6 మిలియన్ల లైక్లను దక్కించుకుంది. -
ఆ హీరోయిన్ వల్లే నాకు విడాకులు.. ఇప్పటికీ తనను క్షమించను: సింగర్
ప్రముఖ గాయని, చిత్రకారిణి, నటి సుచిత్రా కృష్ణమూర్తి చాలాకాలం తర్వాత మరోసారి తన విడాకుల గురించి ప్రస్తావించింది. 1999లో దర్శకుడు శేఖర్ కపూర్ను ప్రేమించి పెళ్లాడిన ఆమె 2007లో అతడికి విడాకులిచ్చింది. అయితే పెళ్లికి ముందు వరకు నటిగానూ మంచి క్రేజ్ అందుకున్న ఆమె వివాహం తర్వాత నటించకూడదని శేఖర్ పెట్టిన కండీషన్ వల్ల నటనకు దూరైంది. తనకంటే 30 ఏళ్లు పెద్దవాడు, అందులోనూ అప్పటికే పెళ్లి చేసుకుని విడాకులు కూడా తీసుకోవడంతో ఇంట్లో ఎవరూ ఒప్పుకోకపోయినా వాళ్లను ఎదిరించి మరీ శేఖర్తో ఏడడుగులు వేసింది. వీరికి ఒక కూతురు కూడా పుట్టింది. కానీ అతడి ప్రేమలో నిజాయితీ లేదంటూ శేఖర్కు విడాకులిచ్చేసి తన దారి తాను చూసుకుంది. ఈ విషయాలన్నీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆమె హీరోయిన్ ప్రీతిజింటాపై మరోసారి నిప్పులు చెరిగింది. తన విడాకులకు కారణం ప్రీతినే అని వెల్లడించిన సుచిత్రా.. ఇప్పటికీ తనను క్షమించేది లేదని చెప్పుకొచ్చింది. భార్యాభర్తల మధ్యలో ప్రీతి దూరడం వల్లే తమ వైవాహిక జీవితం తెరపడిందని గతంలో కూడా హీరోయిన్పై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ రోజుల్లోనే ఈ ఆరోపణలను ప్రీతి ధీటుగా తిప్పికొట్టింది. 'నేనిప్పుడు ఇండస్ట్రీలో నెంబర్ 1 హీరోయిన్ను. కనీసం నువ్వు సినిమాల్లో కూడా యాక్ట్ చేయడం లేదు. కేవలం ఇంట్లో ఒక సాధారణ గృహిణిగా మిగిలిపోయావు. సుచిత్రా.. నువ్వు నాతో ఇష్టమొచ్చినట్లు మాట్లాడకు. నీ మానసిక స్థితి సరిగా లేనట్లుంది.. ముందు వెళ్లి ఏదైనా మంచి సైకియాట్రిస్ట్కు చూపించుకో' అని కౌంటర్ ఇచ్చింది. సదరు వ్యాఖ్యలను ఇంటర్వ్యూ చేస్తున్న వ్యక్తి గుర్తు చేయగా.. సుచిత్ర స్పందిస్తూ.. 'తన మాటలను నేను పట్టించుకోవాల్సిన పని లేదు. ఈ ప్రపంచంలో ఎవరు ఏదైనా మాట్లాడవచ్చు. ఒక గృహిణిగా ఉన్నందుకు నేను గర్విస్తున్నాను. 20 ఏళ్లు తల్లిగా ఉన్నందుకు ఎంతో గర్వపడుతున్నాను. ఎవరెన్ని మాట్లాడినా సత్యానికే బలం ఉంటుంది. చివరకు అదే నిలబడుతుంది. ఇప్పటికీ నేను ఆమెను క్షమించను. అసలు తను ఉందా? లేదా? అన్నది కూడా పట్టించుకోను' అని చెప్పుకొచ్చింది. (చదవండి: ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దు.. పవన్ 'బ్రో'పై థమన్ సీరియస్ కామెంట్స్) -
ట్రాక్లో పడాలంటే ఆలు పరోటాలు చేయాల్సిందేనా!
ఐపీఎల్ 16వ సీజన్లో భాగంగా శుక్రవారం లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ 56 పరుగులు తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 258 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యాన్ని చేధించే క్రమంలో పంజాబ్ పోరాటం 201 పరుగుల వద్ద ముగిసింది. అయితే పంజాబ్ తరపున 33 బంతుల్లో 66 పరుగులు చేసిన అథర్వ తైదే మాత్రం ఆకట్టుకున్నాడు. ఇక ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ జట్టు సహ యజమాని ప్రీతి జింటా అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తొలి ఎడిషన్ నుంచి ఉన్న పంజాబ్ కింగ్స్(కింగ్స్ ఎలెవెన్ పంజాబ్) టైటిల్ కోరిక మాత్రం నెరవేరలేదు. మరి ఈసారైనా పంజాబ్ కింగ్స్ టైటిల్ కొట్టి ప్రీతి జింటా కోరిక నెరవేరుస్తుందేమో చూడాలి. తాజాగా స్టార్స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రీతి గతంలో జరిగిన ఒక ఆసక్తికర విషయాన్ని చెప్పింది. తమ జట్టు ప్లేయర్ల కోసం 120 పరోటాలు చేసినట్లు గుర్తు చేసింది. స్టార్ స్పోర్ట్స్ యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బదులిస్తూ.. అబ్బాయిలు ఇంతలా తినంటారన్న విషయం తనకు అప్పుడే తెలిసిందని పేర్కొంది. 2009లో ఐపీఎల్ సౌతాఫ్రికాలో జరిగింది. అక్కడ తమ ప్లేయర్లకు మంచి పరోటాలు దొరకలేదని, పరోటాలు చేయడం మీకు నేర్పిస్తానని ప్రీతి అన్నారు. అయితే తమకు ఆలూ పరోటాలు కావాలని ప్లేయర్లు అడిగారని, వచ్చే మ్యాచ్ గెలిస్తే పరోటాలు చేసి ఇస్తానని ప్రీతి హామీ ఇచ్చింది. ఇక పంజాబీ జట్టు ఆ మ్యాచ్ను నెగ్గింది. దీంతో ప్రీతి స్వయంగా 120 పరోటాలు చేసిన ప్లేయర్లకు ఇచ్చింది. ప్రీతి ఇచ్చిన సమాధానం విన్న హర్భజన్.. ఇర్ఫాన్ పఠాన్ ఒక్కడే 20 పరోటాలు తిన్నట్లు చెప్పాడు. చివర్లో మా జట్టు ట్రాక్లో పడాలంటే మళ్లీ ఆలు పరోటాలు చేయాలేమో అని ప్రీతి జింటా అనడంతో నవ్వులు విరపూశాయి. 🚨 Star Sports Exclusive 🚨 Throwback to when @realpreityzinta discovered that her @PunjabKingsIPL side have an appetite for more than just winning! 🤣 Tune-in to #PBKSvLSG at #IPLonStar Today | Pre-show at 6:30 PM & LIVE action at 7:30 PM | Star Sports Network#BetterTogether pic.twitter.com/XpeYglFUSf — Star Sports (@StarSportsIndia) April 28, 2023 చదవండి: పంజాబ్ ఓడినా తాను గెలిచాడు.. ఎవరీ అథర్వ తైదే? -
ప్రీతి జింటాతో షమీ ముచ్చట.. ఫోటో వైరల్
పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటాకు ఈ ఏడాదైనా తన కల నెరవేరుతుందేమో చూడాలి. ఐపీఎల్ ఆరంభం నుంచి ఉన్న పంజాబ్ కింగ్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. కింగ్స్ ఎలెవెన్ పంజాబ్గా ఐపీఎల్లో తమ ప్రస్థానం ఆరంభించి 2014లో ఫైనల్ మెట్టుపై బోల్తా పడింది. అంతే అప్పటి నుంచి ఇప్పటివరకు మరోసారి ఫైనల్ మెట్టు ఎక్కలేదు. ఇక కింగ్స్ పంజాబ్ అని పేరును మార్చుకున్న తర్వాత కూడా జట్టుకు కలిసిరావడం లేదు. అందుకే ఈసారి శిఖర్ ధావన్ను కెప్టెన్గా ఎంచుకొని ఈ సీజన్లో రెండు వరుస విజయాలు నమోదు చేసింది. అయితే తర్వాతి రెండు మ్యాచ్ల్లో మాత్రం ఓటమి పాలైంది. గురువారం గుజరాత్ టైటాన్స్తో మ్యాచ్లో ఆఖరి బంతికి ఓడింది. ఈ సంగతి పక్కనబెడితే మ్యాచ్ ముగిశాకా ప్రీతి జింటా.. గుజరాత్ టైటాన్స్ బౌలర్ మహ్మద్ షమీతో ముచ్చటించడం ఆసక్తిగా మారింది. ఇద్దరు చాలాసేపు మాట్లాడుకుంటూ పిచ్చాపాటి కబుర్లు చెప్పుకుంటూ నవ్వుకున్నారు. వీరిద్దరు నవ్వుతున్న ఫోటోను కెమెరామన్ క్లిక్మనిపించాడు. గుజరాత్ టైటాన్స్ ఈ ఫోటోను షేర్ చేస్తూ పాత స్నేహితుడిని కలిసిన ఆనందం అనుకుంటా అంటూ క్యాప్షన్ జత చేసింది. ఇక మహ్మద్ షమీ 2019 నుంచి 2021 వరకు పంజాబ్ కింగ్స్కు ప్రాతినిధ్యం వహించాడు. అప్పుడు పంజాబ్ కింగ్స్కు మెయిన్ బౌలర్గా వ్యవహరించాడు. POV: 𝘞𝘩𝘦𝘯 𝘺𝘰𝘶 𝘳𝘶𝘯 𝘪𝘯𝘵𝘰 𝘢𝘯 𝘰𝘭𝘥 𝘧𝘳𝘪𝘦𝘯𝘥! 😃#PBKSvGT | #TATAIPL 2023 | @MdShami11 @realpreityzinta pic.twitter.com/VKqAl36bH0 — Gujarat Titans (@gujarat_titans) April 13, 2023 చదవండి: కేకేఆర్ వద్దన్నోడిని ఎస్ఆర్హెచ్ హత్తుకుంది.. ప్రతీకారం తీర్చుకునేనా? -
గిల్ క్లీన్ బౌల్డ్.. ప్రీతీ జింటా రియాక్షన్ సూపర్! వీడియో వైరల్
ఐపీఎల్-2023లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలూండగానే లక్ష్యాన్ని ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్మన్ గిల్(67) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. కాగా గుజరాత్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుగులు అవసరమవ్వగా.. ధావన్ సామ్ కర్రాన్ చేతికి బంతిని ఇచ్చాడు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీసి గిల్కు స్ట్రైక్ ఇచ్చాడు. అయితే కర్రాన్ వేసిన అద్భుత బంతికి గిల్ క్లీన్ బౌల్డయ్యాడు. దీంతో ఒక్క సారిగా పంజాబ్ డగౌట్ మొత్తం సంబరాల్లో మునిగి తేలిపోయింది. ముఖ్యంగా స్టాండ్స్ నుంచి మ్యాచ్ను వీక్షిస్తున్న పంజాబ్ సహ యాజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా అనందానికి అవధులు లేకుండా పోయాయి. గిల్ ఔటైన వెంటనే ప్రీతి జింటా.. బాలీవుడ్ నటులు అర్బాజ్ ఖాన్, సోనూ సూద్లతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకుంది. అయితే ఆమె ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. ఆ తర్వాతి రెండు బంతులు తర్వాత తెవాటియా ఫోరు బాది పంజాబ్కు ఓటమి మిగిలించాడు. కాగా ప్రీతి జింటా రియాక్షన్కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చదవండి: IPL 2023: ఏంటి హార్దిక్.. ఎంత కెప్టెన్ అయితే? మరీ చెత్త బ్యాటింగ్! A last-over finish yet AGAIN! 👌 👌 It's the @gujarat_titans who hold their nerve against the spirited @PunjabKingsIPL ! 👏👏 Scorecard ▶️ https://t.co/RkqkycoCcd #TATAIPL | #PBKSvGT pic.twitter.com/jYOqN5GBtK — IndianPremierLeague (@IPL) April 13, 2023 #TATAIPL2023#PBKSvsGT #SamKaran #RahulTewatia #Miller #SumanGill #PreityZinta #SonuSud pic.twitter.com/hdqpIjVkPB — सुर्गीव विश्वकर्मा (@Sugreev96733097) April 13, 2023 -
మేడమ్ ప్లీజ్ అంటూ భిక్షమడిగిన దివ్యాంగుడు.. పట్టించుకోని హీరోయిన్
బాలీవుడ్ క్యూట్ హీరోయిన్ ప్రీతి జింటా ఏరికోరి తలనొప్పులు తెచ్చుకుంది. ఎయిర్పోర్టుకు వెళ్లే బిజీలో ఉన్న ప్రీతి అక్కడ భిక్షాటన చేస్తున్న వ్యక్తిని పట్టించుకోకుండా తన దారిన తను వెళ్లిపోయింది. అతడేమో ఎంతో కొంత డబ్బు ఇవ్వకపోతుందా అన్న ఆశతో హీరోయిన్ కారు వైపే వీల్చైర్ తోసుకుంటూ వెళ్లాడు. ప్లీజ్ మేడమ్ ప్లీజ్ అంటూ ఆర్తిగా అభ్యర్థించాడు. అది గమనించని ప్రీతి కారులో రయ్యిమని ముందుకు దూసుకుపోయింది. అయినా సరే ఆమె కారును అందుకుందామని ప్రయత్నించిన దివ్యాంగుడి ప్రయత్నం వృధా అయింది. ఇది చూసిన జనాలు ప్రీతిని తిట్టిపోస్తున్నారు. రూ.100 కోట్లు ఉన్న నువ్వు కనీసం వంద రూపాయలు కూడా ఇవ్వలేవా? కొంచెమైనా సిగ్గనిపించడం లేదా? అని తిట్టిపోస్తున్నారు. 'పాపం, ఎంతో ఆశపడ్డ అతడికి తోచినంత ఇవ్వాల్సింది, ఏమీ ఇవ్వకుండా వెళ్లిపోయినందుకు అతడు ఎంత బాధపడి ఉంటాడో' అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా 1998లో మణిరత్నం డైరెక్ట్ చేసిన 'దిల్ సే' సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టింది ప్రీతి జింటా. ఈ చిత్రంతో ఉత్తమ డెబ్యూగా ఫిలింఫేర్ అవార్డు అందుకుంది. అదే ఏడాది 'ప్రేమంటే ఇదేరా' చిత్రంతో టాలీవుడ్లోనూ ఎంట్రీ ఇచ్చింది. ఆ మరుసటి ఏడాది మహేశ్బాబుతో 'రాజకుమారుడు'లో నటించింది. హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసిన ఆమె బుల్లితెరపై ప్రసారమైన పలు షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించింది. ఇకపోతే ప్రీతి జింటా ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ సహ యజమానురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే! View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
Punjab Kings: అనిల్ కుంబ్లేతో పంజాబ్ కటీఫ్! మయాంక్ విషయంలో మాత్రం..
మొహాలి: మూడు ఐపీఎల్ సీజన్లలో తమ జట్టుకు హెడ్ కోచ్గా వ్యవహరించినా... ఆశించిన ఫలితాలు అందించలేకపోయిన అనిల్ కుంబ్లేతో పంజాబ్ కింగ్స్ బంధం తెంచుకుంది. వచ్చే సీజన్ కోసం కుంబ్లేతో ఒప్పందాన్ని పునరుద్ధరించడం లేదని ప్రకటించింది. టీమ్ యజమానులైన ప్రీతి జింటా, నెస్ వాడియా తదితరులు కలిసి సమష్టిగా ఈ నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే కొత్త కోచ్ను ఫ్రాంచైజీ ఎంపిక చేస్తుంది. 2020లో కుంబ్లే హెడ్ కోచ్గా బాధ్యతలు చేపట్టగా వరుసగా రెండేళ్లు టీమ్ ఐదో స్థానంలో నిలిచింది. 2022లో పది టీమ్ల ఐపీఎల్లో పంజాబ్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. జట్టులో ఎన్ని మార్పులు చేసినా, వ్యూహాలు మార్చినా పంజాబ్ కోచ్ పదవి ఎవరికీ కలిసి రాలేదు. 2014 నుంచి చూస్తే ఆ జట్టుకు కుంబ్లే ఐదో కోచ్. వరుసగా సంజయ్ బంగర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రాడ్ హాడ్జ్, మైక్ హెసన్ కోచ్గా పని చేసినా జట్టు రాత మారలేదు. కుంబ్లే కోచ్గా ఉన్న సమయంలో పంజాబ్ 42 మ్యాచ్లు ఆడగా... 18 గెలిచి, 22 ఓడింది.మరో 2 మ్యాచ్లు ‘టై’గా ముగిశాయి. ఓవరాల్గా కూడా 2008 నుంచి ఐపీఎల్లో ఉన్నా రెండుసార్లు మాత్రమే పంజాబ్ ప్లే ఆఫ్స్కు వెళ్లగలిగింది. 2014లో ఫైనల్ చేరడం ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన. గత సీజన్ వేలంలో బెయిర్స్టో, రబడ, లివింగ్స్టోన్, శిఖర్ ధావన్లాంటి ఆటగాళ్లను ఎంచుకున్నా ఫలితం మాత్రం మారలేదు. కోచ్ను తప్పించిన పంజాబ్ మరోవైపు కెప్టెన్గా మయాంక్ అగర్వాల్ను కొనసాగించే విషయంలో ఇంకా ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదు. చదవండి: Asia Cup 2022: పాక్ క్రికెటర్పై పుజారా ప్రశంసల వర్షం -
వింత సెంటిమెంట్: విరాట్ చేతికి అవే గ్లోవ్స్. ఆ నటి కాళ్లు కడుక్కోవాల్సిందేట!
క్రియేటివిటీ క్లిక్ అవడమనేది అదృష్టంతో కూడుకున్నదని భావిస్తుంటారు మన దగ్గర ఆ రంగంలో ఉన్నవాళ్లు. అందుకే సినీ ఫీల్డ్లో మూఢనమ్మకాల ప్రదర్శన ఎక్కువగా కనిపిస్తుంటుంది. అలాగే టెక్నిక్, శారీరక శ్రమతో సాగే ఆటల మైదానాల్లోనూ ఈ అదృష్టమే గెలుస్తుందన్న అభిప్రాయమూ ఉంది.. అందుకే అక్కడా నమ్మకాలు పందెం వేసుకుంటూంటాయి. ఆ రెండు రంగాల్లోని ఘనాపాటీల సెంటిమెంట్ల పోటీ ఇది.. తీన్ పత్తీ మన దేశంలో.. ఆటల్లో క్రికెట్ మర్రి చెట్టులా వేళ్లూనుకుంది. ఇంకే ఆటకూ గ్రౌండ్ సరిపోనంతగా. అందుకే క్రికెట్ ప్లేయర్స్కున్నంత క్రేజ్.. గ్లామర్ మిగతా ఆటగాళ్లకు లేదు. వాళ్ల అలవాట్లు, ఆలోచనలూ వార్తలకెక్కలేదు. ఇక్కడ మాత్రం ఫుట్బాల్లో మన లెజెండ్ భైచుంగ్ భుటియా వింత అలవాటును ప్లేస్ చేద్దాం. అదేంటంటే.. తను ఫుట్బాల్ పిచ్లోకి ఎంటరయ్యే ముందు ‘తీన్ పత్తీ (మూడు ముక్కలాట)’ ఆడి మరీ వెళ్తాడట. దానివల్ల తన గేమ్.. తన టీమ్ విజయం సాధిస్తుందని భైచింగ్ విశ్వాసమట. కచ్చితంగా చెక్ చేసుకుంటుంది.. ప్రీతి జింటాకూ ఓసీడీ (అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్) ఉంది. పరాయి ఊరు, దేశం ఇలా ఎక్కడికి వెళ్లాల్సి వచ్చినా హోటల్లో బస బుక్ చేసుకునే ముందు అక్కడి బాత్రూమ్స్ గురించి వాకబు చేస్తుందట. శుభ్రంగా ఉంటాయనే రివ్యూ వస్తేనే ఆ హోటల్లో బస చేస్తుందట. అంతేకాదు హోటల్లోకి చెకిన్ అయ్యేకంటే ముందు బాత్రూమ్ని నీట్గా కడిగించాకే ఆ స్వీట్లోకి ఎంటర్ అవుతుందట. అదీ ఆమె ఓసీడీ. కాళ్లు కడుక్కోవాల్సిందే నటి సన్నీ లియోనికి పదే పదే కాళ్లు కడుక్కునే అలవాటు ఉందిట. ‘అలవాటు అంటారేంటండీ బాబూ.. అదో పిచ్చి’ అంటూ గుర్రుమంటారు ఆమెతో పనిచేసే వాళ్లు. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి కాళ్లు కడుక్కుంటూ ఉంటుందట. ‘ఆ పిచ్చి వల్ల జిస్మ్ 2 సినిమా షూటింగ్ అనుకున్నదానికన్నా ఎంతో ఆలస్యంగా పూర్తయింది. దాంతో నిర్మాతలే కాదు యూనిట్ అంతా సఫర్ అయింది తెలుసా?’ అంటూ కామెంట్ చేస్తారు ఆ యూనిట్ సభ్యులు సెలబ్రిటీల సెంటిమెంట్స్ చర్చకు వచ్చినప్పుడల్లా. ఇప్పటికీ? ఏమో మరి! సినిమా వాళ్లకెన్ని సెంటిమెంట్స్ ఉంటాయో క్రికెట్ స్టార్స్కూ అన్నే సెంటిమెంట్స్ ఉంటాయి. ఇక్కడ ఏస్ క్రికెటర్ విరాట్ కొహ్లీకున్న సెంటిమెంట్ లేక నమ్మకం గురించి చెప్పుకుందాం. కెరీర్లో ఫస్ట్ టైమ్ మంచి స్కోర్ చేసినప్పుడు ఏ గ్లోవ్స్ అయితే వేసుకున్నాడో.. తర్వాత ఆడిన ప్రతి మ్యాచ్లోనూ అవే గ్లోవ్స్ వేసుకోవడం మొదలుపెట్టాడట ఈ బాట్స్మన్. దాన్ని అలవాటుగా స్థిరపరచుకుని కొన్నాళ్లు కంటిన్యూ చేశాడని చెప్తారు అతని సన్నిహితులు. ‘ఇప్పటికీ అవే గ్లోవ్స్ వాడతాడా?’ ఏమో.. మరి! -
మెగావేలానికి ముందు పంజాబ్ కింగ్స్కు మరో బ్యాడ్న్యూస్..
ఐపీఎల్ మెగావేలానికి అంతా సిద్దమవుతున్న వేళ పంజాబ్ కింగ్స్కు ఒక బ్యాడ్న్యూస్. పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతిజింటా ఈసారి మెగావేలానికి అందుబాటులో ఉండదంట. ఇది బ్యాడ్న్యూస్ ఏంటని ఆశ్యర్యపోకండి. ఇంతకముందు ఎప్పుడు వేలం జరిగినా ప్రీతిజింటా ప్రత్యేక ఆకర్షణగా కనిపించేది. తనదైన చలాకీ నవ్వుతో అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటే ఎంతో సందడిగా ఉండేది. మరి అలాంటి నవ్వులు మిస్సవుతున్నామంటే కచ్చితంగా అది బ్యాడ్న్యూసే కదా... ప్రీతిజింటా మెగావేలానికి దూరమైన కారణాన్ని తన ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చారు.'' ఈ ఏడాది ఐపీఎల్ మెగావేలానికి దూరం కాబోతున్నా. ఈ విషయం చెప్పడానికి కాస్త బాధగా ఉన్నప్పటికి తప్పదు. ఈ మధ్యనే మేం కవల పిల్లలకు జన్మనిచ్చాం. కాలిఫోర్నియాలో ఉంటున్న నేను.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నా పిల్లలను వదిలి ఇండియాకు రాలేను. వాడి బాగోగులు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈసారి వేలానికి దూరంగా ఉండబోతున్నా. ఈసారి పంజాబ్ కింగ్స్ టీమ్ కొత్తగా ఉండబోతున్న సంగతి మాత్రం చెప్పగలను. అందుకు ఇప్పటికే క్రికెట్ ఫ్యాన్స్ నుంచి అభిప్రాయాలు సేకరించాం. మరి ఈసారి రెడ్ జెర్సీ వేసుకోనున్న ఆటగాళ్ల కోసం నేను ఎదురుచూస్తున్నా'' అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈసారి మెగావేలంలో పాల్గొంటున్న పంజాబ్ కింగ్స్ పర్స్లో రూ.72 కోట్లు ఉన్నాయి. మయాంక్ అగర్వాల్, అర్ష్దీప్ సింగ్లను మాత్రమే రిటైన్ చేసుకుంది. కేఎల్ రాహుల్ సహా మిగతా ఆటగాళ్లందరిని రిలీజ్ చేసింది. దీంతో ఈసారి వేలంలో పంజాబ్ కింగ్స్ జట్టులో కొత్త ఆటగాళ్లు కనిపించడం ఖాయం. ముఖ్యంగా డేవిడ్ వార్నర్, శ్రేయాస్ అయ్యర్, డికాక్లతో పాటు మహ్మద్ షమీలను భారీ ధరకు సొంతం చేసుకోవాలని భావిస్తోంది. -
సరోగసి ద్వారా ప్రీతి జింటాకు కవలలు
ముంబై: ప్రేమంటే ఇదేరా చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన బాలీవుడ్ నటి ప్రీతి జింటా అద్దె గర్భం (సరోగసి) ద్వారా తల్లయింది. ఆమెకు కవల పిల్లలు.. ఒక కుమారుడు, కుమార్తె జన్మించారు. ఈ శుభవార్తని ప్రీతి జింటా గురువారం ట్విటర్ ద్వారా వెల్లడించారు. అమెరికాకు చెందిన ఆర్థిక నిపుణుడు జెనె గుడెనఫ్ను 2016లో పెళ్లిచేసుకున్న ప్రీతి జింటా అప్పట్నుంచి వెండితెరకి దూరమయ్యారు. అమెరికాలో లాస్ఏంజెల్స్లో ఉంటున్న 46 ఏళ్ల వయసున్న ప్రీతి ఇప్పుడు తల్లయిన సంబరంలో ఉన్నారు. సరోగసి ద్వారా తల్లినయ్యే అపురూపమైన ఈ ప్రయాణంలో తమకు తోడ్పాటునందించిన డాక్టర్లు, నర్సులు, మెడికల్ సిబ్బంది, అద్దె గర్భాన్ని మోసిన మహిళకి ప్రీతి ధన్యవాదాలు తెలిపారు. తన పిల్లలకి జై, జియా అని పేర్లు పెట్టినట్టు ఆ ట్వీట్లో వెల్లడించారు. ‘‘నేను, నా భర్త ఆనందంలో తలమునకలై ఉన్నాము. ఇద్దరు పిల్లలు ఒడిలోకి వచ్చిన ఈ సంబరంలో మా హృదయాలు ఎంతో ప్రేమతో నిండిపోయి ఉన్నాయి. వైద్య సిబ్బందిపై అపారమైన కృతజ్ఞత ఉంది. పిల్లలతో కొత్త ప్రయాణంపై ఎంతో ఉద్వేగంగా ఉంది’’ అని ప్రీతి ఆ ట్వీట్లో పేర్కొన్నారు. బాలీవుడ్లో బిడ్డల్ని కనడానికి సరోగసి విధానాన్ని ఎంచుకోవడం కొత్తకాదు. గతంలో కరణ్ జోహార్, షారూక్ ఖాన్, ఏక్తాకపూర్, అమీర్ఖాన్ వంటి వారు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు. -
46 ఏళ్లకు తల్లైన స్టార్ హీరోయిన్, కవలలకు జననం
Actress Preity Zinta And Her Husband Gene welcome Twins Jai and Gia: ప్రముఖ బాలీవుడ్ నటి, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ప్రీతి జింటా(46) గుడ్ న్యూస్ చెప్పింది. కవలలకు ఆమె తల్లైనట్లు సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. సరోగసి(అద్దె గర్భం) పద్దతిలో తాను, జీన్ తల్లిదండ్రులైనట్లు ఈ సందర్భంగా ఆమె వెల్లడించింది. ఇక విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్లో ప్రకటిస్తూ పిల్లల పేర్లను కూడా వెల్లడించింది. భర్త జీన్తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘అందరికి నమస్కారం. ఈ రోజు మా జీవితాల్లో నెలకొన్న అంత్యంత సంతోషకరమైన వార్తను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. జీన్, నేను కవలలకు జన్మనిచ్చాం. చదవండి: రాశీ ఖన్నాకు బంపర్ ఆఫర్.. కరణ్ జోహార్ సినిమాలో ఛాన్స్..! ప్రస్తుతం మా హృదయాలు కృతజ్ఞత, ప్రేమతో నిండిపోయాయి. సరోగసి ద్వారా కవలలను మా కుటుంబంలోకి స్వాగతించాం. వారి పేర్లు జై జింటా, గియా జింటా నిర్ణయించాం’ అంటూ ఆమె రాసుకొచ్చింది. అలాగే సరోగసి ప్రక్రియలో తమకు సహకరించిన డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బందికి ఈ సందర్భంగా ప్రీతి జింటా కృతజ్ఞతలు తెలిపింది. కాగా అమెరికాకు చెందిన జీన్ గుడెనఫ్ను ప్రీతి జింటా 2016లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లికి ముందు జీన్తో రిలేషన్లో ఉన్న ఆమె.. 2016 ఫిబ్రవరి 29న రహస్య వివాహం చేసుకుంది. చదవండి: నయన్కు సర్ప్రైజ్: విక్కీ బర్త్డే బ్యాష్ మామూలుగా లేదుగా View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) -
ప్రీతితో రితేష్.. కోపంగా జెనీలియా.. అసలు నిజం ఇదేనా?
ఐఫా అవార్డ్స్ 2019 సందర్భంగా కలిసిన ప్రీతి జింటా చేతులపై రితేష్ దేశ్ముఖ్ ముద్దు పెట్డుకోవడం, ఆ సమయంలో ఆయన భార్య జెనీలియా డిసౌజా కొంచెం ఇబ్బందిగా ముఖం పెట్టడం తెలిసిందే. అనుకోకుండా క్యాప్చర్ అయిన ఆ వీడియో చాలాకాలం తర్వాత బయటకి వచ్చి సోషల్ మీడియాలో వైరల్గా మారగా.. దానిపై ఎన్నో మీమ్స్, జోకులు హల్చల్ చేశాయి. తాజాగా అలా కోపంగా ఉండడానికి కారణాన్ని తెలియజేసింది జెనీలియా. తాజాగా జెనీలియా తన భర్త రితేష్తో కలిసి అర్భాజ్ఖాన్ హోస్ట్ చేస్తున్న డిజిటల్ షో ‘పించ్’ సీజన్ 2కి అతిథిగా వచ్చింది. ఆ సమయంలో ఆ వీడియోపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ గురించి అడగగా.. ‘చాలా కాలం తర్వాత, నేను ఓ అవార్డు ఫంక్షన్కు హాజరయ్యాను. కొత్త డ్రెస్ వేసుకొని, హై హీల్స్ వేసుకొని వెళ్లాను. చాలా రోజుల అనంతరం వేసుకున్న హై హీల్స్ నన్ను ఎంతో ఇబ్బంది పెడుతుండగా అలా ఉన్నాను. అలా నేను ఇబ్బంది పడుతుంటే రితేష్, ప్రీతి చేతులపై ముద్దు పెట్టుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో క్యామెరాలో బంధించారు. అంతేకానీ మరేం లేదని’ జెన్నీ తెలిపింది. అయితే ఆ వీడియో వైరల్ అయిన తర్వాత ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేసింది ఈ నటి. అందులో ఇంటికి రాగానే ఈ భామ.. భర్త రితేష్ను కొడుతున్నట్లు, ఆయన వద్దని వేడుకుంటున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీనిపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందించారు. కాగా వీరిద్దరూ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా.. సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్గా ఉంటుంది ఈ బ్యూటీ. చదవండి: ‘వల్గర్ ఆంటీ’ అంటూ ట్రోలింగ్.. జెనీలియా ఘాటు రిప్లై View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) -
‘క్యా కెహ్నా’ షూటింగ్లో ప్రమాదం, సైఫ్ అలీఖాన్ గాయానికి 100 కుట్లు
సైఫ్ అలీ ఖాన్, ప్రీతి జింటా జంటగా నటించిన తొలి చిత్రం ‘క్యా కెహ్నా’. 2000 సంవత్సరం మే 19న విడుదలైన ఈ మూవీలో సైఫ్ ప్లేబాయ్గా కనిపించగా, ప్రీతి జింటా పెళ్లి కాకుండా టీనేజీలోనే తల్లి అవుతుంది. డైరెక్టర్ కుందన్ షా తెరకెక్కించిన ఈ చిత్రం విడుదలై నేటికి 21 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే విడుదలకు ముందే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ మూవీ బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్గా నిలిచింది. కాగా ఈ మూవీ షూటింగ్ సమయంలో హీరో సైఫ్ ప్రమాదానికి గురై కొన్ని రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాల్సి వచ్చిందట. ఈ ప్రమాదంలో సైఫ్ తలకు గాయమవడంతో దాదాపు 100 కుట్లు పడినట్లు కాఫీ విత్ కరణ్ జోహార్ షోలో ప్రీతి జింటా వెల్లడించింది. 2004లోని కాఫీ విత్ కరణ్ జోహార్ మొదటి సీజన్కు సైఫ్, ప్రీతిలు అతిథిలుగా హాజరయ్యారు. ఈ షోలో ‘క్యా కెహ్నా’ షూటింగ్లో జరిగిన ప్రమాదాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా సైఫ్ మాట్లాడుతూ.. ‘జూహులోని ఓ పార్కు సమీపంలో సీన్ రీహార్సల్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పాడు .‘ ప్రీతిని ఫ్లట్ చేసే సన్నివేశం అది. నా మోటరు సైకిల్తో స్టంట్స్ చేస్తూ ఆమెను ఇంప్రెస్ చేయాలి. అలా ఫస్ట్ టైం బాగానే వచ్చింది. ఇక రెండవ సారి ఫుల్ జోష్లో బైక్ను ర్యాంప్ చేస్తుండగా బైక్ స్కిడ్ అయ్యింది. అయితే ఆ రోజు ఫుల్ వర్షం, నేలంతా బురదగా ఉండేసరికి ఈ ప్రమాదం జరిగింది. బైక్ స్కిడ్ కాగానే నేను గాల్లోకి ఎగిరి నేరుగా ఓ రాతిపై పడ్డాను. అలా బౌన్స్ అవుతూ పలుమార్లు కింద పడ్డాను. ఈ క్రమంలో నా తలకు పెద్ద గాయమై రక్తస్రావం అవ్వడం చూశాను. ఆ తర్వాత కళ్లు తిరిగి పడిపోయాను’ అని చెప్పుకొచ్చాడు. ఇక తర్వాత ప్రీతి జింటా మాట్లాడుతూ.. ‘ఆ రోజు డైరెక్టర్కు జ్వరంగా ఉండటంతో సెట్కి రాలేదు. సైఫ్ భార్య అమృత సింగ్ కూడా ఆ సమయంలో ముంబైలో లేరు. ఇక ప్రమాదం జరగానే ఆయన స్నేహితుడికి ఫోన్ చేశాను కానీ అతడు నమ్మలేదు, మేము జోక్ చేశామనుకుని ఫోన్ పెట్టేశాడు. నేను మాత్రమే అక్కడ ఉండటంతో వెంటనే హాస్పిటల్కు తీసుకెళ్లాను. హాస్పిటల్లో గార్డియన్గా నేను సంతకం చేశాను’ అని తెలిపింది. ఆ తర్వాత ఒకవేళ సైఫ్ మరణిస్తే ఏంటి పరిస్థితి అని తను పిచ్చిగా ఆలోచించానంటూ ఆమె చెప్పింది. -
పేరు, జెర్సీ మారినా ఇంకా హార్ట్ ఎటాక్ తెప్పిస్తున్నారు!
ముంబై: ఈ ఐపీఎల్ సీజస్లో కొత్త జెర్సీ, పేరులో స్వల్ప మార్పుతో బరిలోకి దిగిన జట్టు పంజాబ్ కింగ్స్. గత సీజన్ వరకూ కింగ్స్ ఎలెవన్ పంజాబ్గా ఉన్న ఆ జట్టు.. ఈసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకునే క్రమంలో పంజాబ్ కింగ్స్(పీబీకేఎస్)గా మార్చుకుంది. 2020 సీజన్లో భారీ స్కోర్లు చేసినా ఆ జట్టు ఓటమి పాలవడం యాజమాన్యంలో ఆందోళన రేకెత్తించింది. దాంతో పేరు మార్చుకుని మరీ ఈ ఐపీఎల్కు సిద్ధమయ్యారు. కాగా, సోమవారం పంజాబ్ కింగ్స్ ఆడిన తొలి మ్యాచ్లో 4 పరుగుల తేడాతో గట్టెక్కింది. పంజాబ్ 221 పరుగులు చేసినా దాదాపు ఓడిపోయే స్థితి నుంచి బయటపడి చివరకు గెలుపుతో హమ్మయ్యా అనుకుంది. టీవీల ముందు కూర్చొన్న ప్రేక్షకుల్లో అక్కడ కామెంటరీ చెప్పేవాళ్లు కూడా పంజాబ్ పేరు మారినా రాత మారదా అంటూ చమత్కరించే పరిస్థితి నుంచి తేరుకుని విజయంతో శుభారంభం చేసింది. జట్టు కో-ఓనర్, బాలీవుడ్ నటి ప్రీతి జింటా కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. జట్టు పేరు, జెర్సీ మారినా ఇంకా హార్ట్ ఎటాక్లు తెప్పిస్తున్నారు అంటూ ట్వీటర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు తన ట్వీటర్ అకౌంట్లో పంజాబ్ కింగ్స్ను ప్రశంసిస్తూనే.. ఇంకా హార్ట్ ఎటాక్ తెప్పిస్తూనే ఉంటారా? అని ప్రశ్నించారు. ‘ వాటే గేమ్. మేము కొత్త జెర్సీ-కొత్త పేరుతో ఈ ఐపీఎల్ను ఆరంభించాం. అయినా గేమ్ ద్వారా మాకు హార్ట్ ఎటాక్లు తెప్పించడం ఆపలేదు. ఇది కచ్చితంగా మాకు పర్ఫెక్ట్ గేమ్ కాదు. కానీ చివరి అంకంలో కాస్త ఫర్ఫెక్ట్గా అనిపించారు’ అని ట్వీట్ చేశారు. ఇక్కడ చదవండి: అత్యధిక సెంచరీ వీరులు వీరే.. సెహ్వాగ్ సరసన సామ్సన్ సకారియా సక్సెస్ వెనుక ఓ విషాద గాధ.. Yeah 👊What a game ! We have a New name & a New Jersey, still #saddapunjab won’t stop giving us heart attacks in a game. What to do ? Not a perfect game for us but in the end it was PERFECT🤩Wow @klrahul11 @iamdeepakhooda & all the boys @PunjabKingsIPL #RRvsPBKS #IPL2021 #Ting pic.twitter.com/UDwPlBlgl0 — Preity G Zinta (@realpreityzinta) April 12, 2021 -
ముద్దు వీడియోపై నటి ప్రీతి జింటా రియాక్షన్
ముంబై : ఓ అవార్డు ఫంక్షన్లో నటి ప్రీతి జింటాను హీరో రితేష్ దేశ్ముఖ్ ముద్దు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తన భర్త రితేష్..తన కళ్ల ముందే నటి ప్రీతి జింటా చేతులకు ముద్దు పెట్టుకోవడంతో తెగ ఫీల్ అవుతుంటుంది. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై జెనీలియా ఇటీవలె మరో వీడియోను రిలీజ్ చేసింది. ఆ ఫంక్షన్ అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత ఏం జరిగిందో తెలుసా అంటూ రితేష్ను చితకబాదుతూ ఓ ఫన్నీ వీడియోను రూపొందించింది. దీనిపై నటి ప్రీతి జింటా స్పందించారు. 'చాలా ఫన్నీగా ఉంది..రితేష్- జెనీలియా మీరు ఇలాంటి ఎన్నో ఫన్నీ వీడియోలు తీయండి. లవ్ యూ బోత్' అంటూ కామెంట్ చేసింది. ఇక జెనీలియా- రితేష్ల వీడియోపై నటులు టైగర్ ష్రాఫ్, మాధురి దీక్షిత్, సంజయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. View this post on Instagram A post shared by Preity G Zinta (@realpz) సామాన్యులకూనా, సెలబ్రిటీలకైనా తన ముందే భర్త మరో మహిళతో క్లోజ్గా ఉంటే తట్టుకోలేరు కదా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బాలీవుడ్లోనే ఎలాంటి కంట్రవర్సీలు లేకుండా హ్యాపీగా సాగిపోతున్న జంటల్లో రితేష్- జెనీలియా ముందు వరుసలో ఉంటారు. ఓ షూటింగ్ సమయంలో ప్రేమలో పడ్డ వీరు 2012లో వివాహం చేసుకున్నారు. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎప్పటికప్పుడు క్రేజీ వీడియోలతో ఆకట్టుకునే ఈ జంటకు బాలీవుడ్లో మోస్ట్ లవబుల్ కపుల్స్గా పేరుంది. చదవండి : వైరల్ : నటిని ముద్దుపెట్టుకున్న బాలీవుడ్ హీరో హీరో కార్తీక్కు కరోనా..టెన్షన్లో కియారా అద్వానీ -
నటిని ముద్దుపెట్టుకున్నహీరో ...జెనీలియా ఎక్స్ప్రెషన్స్
-
నటి ప్రీతికి హీరో ముద్దులు..చిర్రెత్తిన భార్య ఏం చేసిందంటే..
ముంబై : భర్త తన ముందే వేరే మహిళతో క్లోజ్గా ఉంటే ఏ భార్యకైనా కోపం వస్తుంది. దీనికి సినిమా స్టార్స్ కూడా అతీతం కాదు. ఎంత ఫ్రెండ్లీ నేచర్ ఉన్నా, భర్త తన కళ్లముందే మరో నటితో సన్నిహితంగా ఉంటే ఈర్వ్స, చిరాకు, కోపం..ఇలా అన్నీ వస్తాయి. హీరోయిన్ జెనీలియాకు కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఓ అవార్డు ఫంక్షన్లో జెనీలియా భర్త రితేష్ దేశ్ముఖ్..నటి ప్రీతి జింటాను కలిశారు. ఈ సందర్భంగా రితేష్..ప్రీతి చేతులకు ఫ్రెండ్లీగా ముద్దు పెట్టాడు. ఇది చూసి పక్కనే ఉన్న జెనీలియా చాలా అసౌకర్యానికి ఫీల్ అవుతుంటుంది. మీ సంభాషణ ఎప్పుడు ముగిస్తారురా బాబు..అన్నట్లు ఇద్దరినీ చాలా జలస్గా చూస్తుంటుంది. నిజానికి ఇది 2019లో ఐఫా అవార్డుల సందర్భంగా జరిగిన సన్నివేశం. సోషల్ మీడియా పుణ్యమా అని ఇప్పుడు ఈ వీడియో బయటికొచ్చొంది. ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. రితీష్- ప్రీతి జింటాలను చూసి జెనీలియా జలస్గా చూస్తున్న ఎక్స్ప్రెషన్స్ వీడియోలో చాలా క్లియర్గా కనిపిస్తుంటుంది. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటుంది. దీనిపై పలు స్పూఫ్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన జెనీలియా..ఈ ఫంక్షన్ తర్వాత ఇంట్లో ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నారా అంటూ మరో వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో ఇంటికి రాగానే జెనీలియా..భర్త రితీష్ను కొడుతున్నట్లు ఫన్నీగా ఓ వీడియోను చేసింది. దీన్ని రితేష్- ప్రీతి జింటాలకు సైతం ట్యాగ్ చేసింది. ఈ ఫన్నీ వీడియోపై టైగర్ ష్రాప్, ప్రీతి జింటా సహా పలువురు ప్రముఖులు స్పందిచారు. కాగా జెనీలియా-రితేష్ దేశ్ముఖ్ 2012లో ప్రేమ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీరికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. కెరీర్లో దూసుకుపోతున్న సమయంలో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైనా..సోషల్ మీడియాలో మాత్రం క్రేజీ వీడియాలు చేస్తూ ఫ్యాన్స్తో ఎప్పుడూ టచ్లో ఉంటారు. చదవండి :జెనీలియా చేతికి గాయం: భర్త సపర్యలు త్వరలో పెళ్లి పీటలెక్కనున్న బాలీవుడ్ నటుడు, పిక్స్ వైరల్ -
షారూక్ ఖాన్ని కొనేసిన ప్రీతి జింటా..
షారూక్ ఖాన్, ప్రీతి జింటా కలిసి ‘వీర్ జారా’లో నటించారు. కాని వారు ఆ సినిమాలో కలవలేకపోతారు. కాని ఇప్పుడు కలిశారు. ప్రీతి జింటాకు షారూక్ ఖాన్ దక్కాడు. అవును. అయితే నిజం షారూక్ ఖాన్ కాదు. క్రికెటర్ షారూక్ ఖాన్. ప్రీతి జింటా యజమాని గా వ్యవహరించే పంజాబ్ కింగ్స్ ఐపిఎల్ టీమ్ ఈ రైట్ ఆర్మ్ స్పిన్నర్ని 5.25 కోట్లకు వేలం ద్వారా సొంతం చేసుకుంది. దాంతో ఇప్పుడు నెటిజన్స్ అందరూ ఎవరీ షారూక్ ఖాన్ అని గూగుల్ చేస్తున్నారు. షారూక్ ఖాన్ తమిళనాడుకు చెందిన 25 ఏళ్ల క్రికెటర్. 2012లో జూనియర్ ఐపిఎల్ జరిగినప్పుడు తొలిసారి వెలుగులోకి వచ్చాడు. బంతిని చావబాదడంలో కూడా దిట్ట. క్విక్ సింగిల్స్ తీస్తాడని పేరు. స్విమ్మింగ్ చాంపియన్ అట కూడా. షారూక్ ఖాన్ క్రేజ్ దేశంలో ఉన్నప్పుడు పుట్టడం వల్ల షారూక్ దాంతో ఐపిఎల్ వేలంలో ఇతని మీద అందరి దృష్టి పడింది. 2021 ఐపిఎల్లో సత్తా చూపిస్తాడని అందరూ అనుకుంటున్నారు. మరోవైపు నటుడు షారూక్ ఖాన్కు కోల్కతా నైట్ రైడర్స్ టీమ్ ఉన్న సంగతి తెలిసిందే. గతంలోనే షారూక్కు షారూక్ గురించి తెలుసు. తన పేరుతో ఒక క్రికెటర్ ఉన్నాడని తన పేరే పెట్టుకున్నాడని సంతోషించాడు. ‘అతడు నాకు ఎదురు పడితే నేనేం మాట్లాడను. అతడు నాతో ‘నా పేరు షారూక్ ఖాన్’ అని అనేదాకా ఉంటాను. ఆ తర్వాత నేను ‘నా పేరు కూడా’ అంటాను’ అన్నాడు. ఏమైనా ఎవరు ఎప్పుడు మెరుస్తారో ఎవరికి దశ తిరుగుతుందో చెప్పలేం. ఇప్పుడు షారూక్ ఖాన్ వంతు. -
బొమ్మ పడితే యాక్ట్ చేస్తా.. లేదంటే
మొన్న జనవరి 31తో ప్రీతి జింటాకు 46 ఏళ్లు నిండాయి. బాలీవుడ్లో టాప్ స్టార్ అయి ఆ తర్వాత అంట్రప్రెన్యూర్గా మారిన ప్రీతి తను సినిమాల్లోకి వచ్చేందుకు కాయిన్ ఎగరేసి నిర్ణయం తీసుకున్నానని తెలిపింది. ‘లిరిల్’ యాడ్ చేసి లిరిల్ గర్ల్గా క్రేజ్ సంపాదించుకుంది ప్రీతి జింటా. తండ్రి చిన్నప్పుడే మరణించడం, కుటుంబానికి తనే ఆధారం కావడంతో ఈ సిమ్లా అమ్మాయి త్వరత్వరగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ (క్రిమినల్ సైకాలజీ) చేసి ముంబై చేరుకుంది. అక్కడ మోడల్గా కెరీర్ మొదలెడితే సహజంగానే బాలీవుడ్ కన్ను పడింది. ‘దర్శకుడు శేఖర్ కపూర్ నన్ను మొదటగా ‘తర రమ్ పమ్’ సినిమా కోసం అప్రోచ్ అయ్యారు. ఆయనను నేను నోరు తెరుచుకుని చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే అప్పటికే ఆయన పెద్ద దర్శకుడు. కాని నాకు సినిమా కెరీర్ పట్ల అప్పటికి ఆలోచన లేదు. విధి నిర్ణయం అలాగే ఉంటే తప్పక నటిస్తాను అని ఆయనతో చెప్పి ఆయన దగ్గరే కాయిన్ ఎగరేశాను. బొమ్మ పడితే సినిమా చేస్తాను. బొరుసు పడితే చేయను అనుకున్నాను. బొమ్మ పడింది. సినిమా ఒప్పుకున్నాను’ అని అప్పటి సంగతి గుర్తు చేసుకుందామె. అయితే ఆ సినిమా కొన్నాళ్లకు మూలన పడింది. ప్రీతి జింటా మణిరత్నం ‘దిల్ సే’ తో మొదట పరిచయం అయ్యి స్టార్గా మారింది. ఆ తర్వాత కొన్నాళ్లకు వేరే టీమ్ ‘తర రమ్ పమ్’ చేసింది సైఫ్ అలీఖాన్, రాణి ముఖర్జీలతో. ‘అది కూడా విధి నిర్ణయమే కావచ్చు’ అంటుంది ప్రీతి. ఎందుకంటే ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. ప్రీతి సెంటిమెంట్స్ ఎలా ఉన్నా ఆమె ఎగరేసిన కాయిన్కు మనం థ్యాంక్స్ చెప్పాలి. అది బొమ్మ పడటం వల్లే కదా ఈ చక్కటి బొమ్మ తెర మీద కనిపించింది.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
- బడుగు, బలహీనవర్గాల అధికారులపైనే పచ్చకుట్ర
- ఈసీ ద్వంద్వ వైఖరి
- Lok Sabha Election 2024: ప్రజలే నా వారసులు
- మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
- వైఎస్ విజయమ్మ పేరుతో టీడీపీ తప్పుడు లేఖ
- ఐరాస కాంక్షించే అభివృద్ధికి ఏపీయే వేదిక
- పేదింటి పిల్లలకు వర్సిటీ చదువులు ఉచితం
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
- జగన్ ఒక నిజం... ఒక భావోద్వేగం
Advertisement