-
సరికొత్త టాక్ షోకు హోస్ట్గా టాలీవుడ్ హీరో.. ఏ ఓటీటీలో తెలుసా!
టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది బాబాయ్ వెంకటేశ్తో కలిసి రానా నాయుడు వెబ్ సిరీస్లో నటించారు. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కాగా.. ఆడియన్స్ నుంచి విశేష ఆదరణ దక్కించుకుంది. ప్రస్తుతం రానా రజినీకాంత్ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనున్నారు. అంతే కాకుండా రానా ప్రధానపాత్రలో హిరణ్య కశ్యప అనే మూవీని కూడా ప్రకటించారు. ఇదిలా ఉండగా.. రానా సరికొత్త టాక్ షోతో ప్రేక్షకులను అలరించనున్నారు. సెలెబ్రిటీలతో రానా ఈ టాక్ షో చేయనున్నారని అమెజాన్ ప్రైమ్ వీడియో తెలిపింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియో నిర్వహించిన ఈవెంట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. తన ప్రొడక్షన్ హౌస్ స్పిరిట్ మీడియాలో ఈ షోను ప్రొడ్యూస్ చేయనున్నారు. అయితే ఈ టాక్ షో ఎప్పటి నుంచి మొదలవుతుందని మాత్రం రివీల్ చేయలేదు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశముంది. గతంలో నంబర్ వన్ యారీ టాక్ షో టాలీవుడ్ హీరో రానా గతంలో నంబర్ 1 యారీ పేరుతో ఓ టాక్ షో హోస్ట్ చేశారు. తెలుగు ఇండస్ట్రీ సెలెబ్రిటీలతో ఈ టాక్ షో నిర్వహించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో రానున్న టాక్ షో ది రానా కనెక్షన్ అనే పేరును ఖరారు చేశారు. టాలీవుడ్, బాలీవుడ్తో పాటు వివిధ ఇండస్ట్రీలకు చెందిన సెలెబ్రిటీలు ఈ టాక్ షోకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయి. An exciting and curiosity-piquing talk show hosted by celebrated actor Rana Daggubati, featuring his friends and contemporaries from Indian cinema. #TheRanaConnectionOnPrime #AreYouReady #PrimeVideoPresents pic.twitter.com/Gg7fcqqeNi — prime video IN (@PrimeVideoIN) March 19, 2024 -
వేట్టయాన్ లో ఎంట్రీ
‘వేట్టయాన్ ’ సెట్స్లో జాయిన్ అయ్యారు రానా. రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ , ఫాహద్ ఫాజిల్, రానా, మంజు వారియర్, రితికా సింగ్, దుషార విజయన్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ‘వేట్టయాన్’ లేటెస్ట్ షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల హైదరాబాద్లో మొదలైంది. రజనీకాంత్– అమితాబ్ బచ్చన్ ల మధ్య కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా ఈ సినిమా సెట్స్లో తొలిసారి సోమవారం రానా జాయిన్ అయ్యారు. రజనీకాంత్–రానా కాంబినేషన్ సీన్స్ని ఈ షెడ్యూల్లో ప్లాన్ చేశారట జ్ఞానవేల్. ఈ సినిమాలో రజనీకాంత్ ఓ పోలీసాఫీసర్ పాత్రలో కనిపిస్తారని, బూటకపు ఎన్ కౌంటర్స్ నేపథ్యంలో ఈ మూవీ కథనం సాగుతుందని తెలిసింది. సుభాస్కరన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. -
కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప అడగొద్దు: రానా ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ హీరోల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే.. మరోవైపు నిర్మాతగానూ ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అయితే ఇటీవల ఆయన ఖాతాలో ఒక్క హిట్ కూడా పడలేదు. రాజమౌళి చిత్రం బాహుబలి తర్వాత ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. దీంతో మరో హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. రానా ప్రస్తుతం రాక్షస రాజా అనే చిత్రంలో నటిస్తున్నారు. కాగా.. ఇటీవలే డైరెక్టర్ నాగ్ అశ్విన్తో కలిసి గుర్గావ్లో జరిగిన సినాప్స్ -2024 ఈవెంట్కు రానా హాజరయ్యారు. ఈవెంట్కు హాజరైన రానా తన ఆరోగ్యంపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆయనకు కొన్నేళ్ల క్రితం కిడ్నీ మార్పిడి జరిగిందని తెలిపారు. అంతేకాదు చిన్న వయసులోనే కార్నియా మార్పిడి జరిగినట్లు వెల్లడించారు. ప్రకృతినే అన్నింటికంటే మెరుగైన వైద్యమని రానా పేర్కొన్నారు. గతంలో తీవ్రమైన అనారోగ్యం నుంచి కోలుకోవడానికి తనకు ప్రకృతి సాయం చేసిందని రానా వివరించారు. రానా మాట్లాడుతూ.. 'అన్నీ సౌకర్యాలున్నా ఆసుపత్రిలో అసంతృప్తితో ఉన్నా. అనారోగ్యం కారణంగా యుఎస్లోని మాయో క్లినిక్లో ఉన్నా. నాకు ఏం జరిగిందో గుర్తించగలిగే ఏకైక ప్రదేశం అదే. మనం ప్రాణాంతక స్థితిలో ఉన్నప్పుడే జీవితాన్ని చాలా భిన్నంగా చూడటం ప్రారంభిస్తాం. అప్పటి నుంచే ఈ ప్రపంచాన్ని చూసే దృక్పథం మారిపోయింది' అని అన్నారు. అన్నింటిలో మనం అనుకుంటున్నట్లుగా జీవితం ఉండదని అర్థమైందని రానా తెలిపారు. హెల్త్ కండీషన్ గురించి మాట్లాడుతూ.. 'బాహుబలి సినిమా కోసమే తాను అలా మారినట్లు అందరూ భావించారు. అనారోగ్యంతో ఉన్నారా? అని కొందరు అడిగారు కూడా. కానీ నేను వారికి సమాధానం చెప్పాలనుకోలేదు. ఆ పరిస్థితుల్లో నగర ప్రజలతో జీవించడం నాకు చాలా కష్టంగా అనిపించింది. ఎవరైనా నా ఆరోగ్యం గురించి అడిగితే.. మీరు కిడ్నీ, కన్ను దానం చేస్తే తప్ప.. దాని గురించి అడగవద్దని చెప్పా. ఆ సమయంలో నేను చేస్తున్నది నాకే నచ్చలేదు.' అని అన్నారు. 'ప్రకృతే గొప్ప వైద్యం' రానా మాట్లాడుతూ.. 'ఒకసారి నా సినిమా కోసం అడవిలో షూట్ చేసే అవకాశం వచ్చింది. దాదాపు ఏడాది పాటు అక్కడే ఉన్నా. అడవిలో ఏనుగులతో షూటింగ్ చేశాం. అక్కడ నన్ను అడిగేవాళ్లు లేరు. కనీసం నేను అనారోగ్యంతో ఉంటే ఎవరూ పట్టించుకోలేదు. ఆ సమయంలో అడవిలో నిశ్శబ్దమే నా జీవితంలో అవసరమనిపించింది. అన్నింటి కంటే ప్రకృతే గొప్ప వైద్యమని తెలిసింది' అంటూ రానా చెప్పుకొచ్చారు. కాగా.. కోలీవుడ్ డైరెక్టర్ ప్రభు సోలమన్ తెరకెక్కించిన తమళ చిత్రం కాదన్ రీమేక్లో రానా నటించారు. ఈ సినిమా ఎక్కువగా అడవిలోనే షూట్ చేశారు. ఈ మూవీని తెలుగులో అరణ్య, హిందీలో హాథీ మేరే సాథీ పేర్లతో విడుదలైంది. కాగా.. గతేడాది రానా పుట్టిన రోజు ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్ని ఖరారు చేశారు. పోస్టర్లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
BoxingBay Fight Nights: హైదరాబాద్లో మెగా బాక్సింగ్ ఈవెంట్
దేశవ్యాప్తంగా ప్రొఫెషనల్ బాక్సింగ్కు మరింత ప్రాచుర్యం కల్పించాలనే ఉద్దేశంతో రానా దగ్గుబాటి సారథ్యంలో సౌత్బే కీలక ముందడుగు వేసింది. ఇండియన్ ప్రొ బాక్సింగ్ లీగ్, ఇండియన్ బాక్సింగ్ కౌన్సిల్తో కలిసి ‘బాక్సింగ్ బే’ ఈవెంట్కు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా హైదరాబాద్ వేదికగా నాలుగు రోజుల పాటు ‘ఫైట్ నైట్స్’ నిర్వహించనుంది. ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన టాప్- 20 ప్రొఫెషనల్ బాక్సర్లు ఇందులో పాల్గొనున్నారు. ఫిబ్రవరి 29, మార్చి 7, 14, 28 తేదీల్లో బాక్సింగ్బే ఫైట్ నైట్స్కు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుంది. -
హీరో వెంకటేష్, రానాలపై కేసు నమోదుకు నాంపల్లి కోర్టు ఆదేశం
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ స్టార్ హీరోలు దగ్గుబాటి వెంకటేష్, రానాలకు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. ఫిలింనగర్ డెక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దగ్గుబాటి వెంకటేష్, సురేష్, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులకు నాంపల్లి క్రిమినల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాగా డెక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ ఇచ్చిన ఫిర్యాదుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి ఫ్యామిలీ డెక్కన్ కిచెన్ కూల్చివేతకు పాల్పడ్డారని నంద కుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్ను ధ్వంసం చేసి, ఫర్చిచర్ ఎత్తుకెళ్లారని ఫిర్యాదులో ఆరోపించారు. లీజు విషయంలో తనకు కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ అక్రమంగా కూల్చివేశారని పేర్కొన్నారు. 60 మంది ప్రైవేట్ బౌన్సర్లను పెట్టుకుని హోటల్ను ధ్వంసం చేశారని అన్నారు. దీనివల్ల తనకు రూ. 20 కోట్ల నష్టం వాటిల్లిందని చెప్పారు. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోర్టును కోరారు. ఈ క్రమంలో వెంకటేష్, ఇతర కుటుంబ సభ్యులపై IPC 448, 452,380, 506,120b కింద కేసులు నమోదు చేయాలని నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. చదవండి: 24 మంది ఎమ్మెల్యేల ఎన్నికపై పిటిషన్లు.. కేటీఆర్, హరీశ్ విజయంపై కూడా -
నా జీవితంలో మరపురాని రోజు అదే: మిహికా పోస్ట్ వైరల్!
టాలీవుడ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్లో స్టార్ దగ్గుబాటి రానా, మిహిక బజాజ్ ఒకరు. 2020 ఆగస్టు 8న ఈ జంట పెళ్లిబంధంతో ఒక్కటయ్యారు. అయితే ఇండస్ట్రీలో లేకపోయినప్పటికీ రానా భార్య మిహికా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటుంది. ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతూ అభిమానులను అలరిస్తోంది. విదేశాల్లో వేకేషన్కు వెళ్లిన సోషల్ మీడియాలో టచ్లో ఉంటూ తన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. తాజాగా ఆమె ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. పాండాలను.. నిజ జీవితంతో పోలుస్తూ ఫోటోలను పంచుకుంది. (ఇది చదవండి: మన జీవితంలో అదే గొప్ప అదృష్టం: మిహికా పోస్ట్ వైరల్) మిహికా తన ఇన్స్టాలో రాస్తూ.. 'నా గురించి తెలిసిన వారు ఎవరైనా పాండాల పట్ల నాకున్న ప్రేమను అర్ధం చేసుకుంటారు. అవి కేవలం జంతువులు మాత్రమే కాదు. అవి స్వచ్ఛమైన ఆనందం, క్యూట్నెస్, సరదాతనం, ఉల్లాసంతో నిండి ఉన్నాయి. మన కడుపులో బిడ్డ ఎలాగైతే మనల్ని తన్నడాన్ని ఆనందిస్తామో?.. అలాంటి పరిపూర్ణమైన స్వరూపాన్ని వాటిలో చూస్తున్నా. అయితే నా జీవితంలో ఆ రోజు వచ్చినప్పుడు నేను నిజమైన పాండాగా మారిపోతా. ఇలాంటి ఫీలింగ్ కేవలం అద్భుతం మాత్రమే కాదు. నా జీవితంలో ఓ కల నిజమైనట్లే. అంతే కాకుండా నా జీవితంలో అత్యంత సంతోషకరమైన మరపురాని రోజు కూడా అదే అవుతుంది!' అంటూ పోస్ట్ చేసింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Miheeka Daggubati (@miheeka) -
గ్యాంగ్స్టర్ రాక్షస రాజా
రానా హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన ‘నేనే రాజు నేనే మంత్రి’ (2017) సూపర్ హిట్ అయిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ కాంబినేషన్లో రెండో చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. రానా పుట్టినరోజు (డిసెంబర్ 14) సందర్భంగా ఈ చిత్రం టైటిల్ని ‘రాక్షస రాజా’గా ప్రకటించి, రానా ఫస్ట్ లుక్ని విడుదల చేశారు. ‘‘ఇప్పటివరకూ చూడని క్రైమ్ వరల్డ్ని ఆవిష్కరిస్తూ ఇంటెన్స్ ఎమోషన్స్, ఫ్యామిలీ డ్రామాల సమ్మేళనంతో ఈ చిత్రం ఉంటుంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా రూపొందించనున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఓ అద్భుతమైన అనుభూతికి గురి చేస్తుంది. గ్రిప్పింగ్ కథనం, వండర్ఫుల్ విజువల్స్తో ‘రాక్షస రాజా’ తెలుగు పరిశ్రమలో కొత్త బెంచ్ మార్క్ను సెట్ చేయడానికి రెడీ అవుతోంది’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. -
Rana Daggubati Unseen Photos: రానా దగ్గుబాటి పుట్టినరోజు స్పెషల్ (ఫోటోలు)
-
‘రాక్షస రాజు’గా వస్తున్న రానా.. లుక్ అదిరింది
టాలీవుడ్ మల్టీ టాలెంటెడ్ నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఒకవైపు నటుడిగా వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూనే..మరోవైపు నిర్మాతగానూ రాణిస్తున్నాడు. అయితే ఈ టాలెంటెడ్ హీరో ఖాతాలో మాత్రం ఇటీవల ఒక్క హిట్ కూడా పడలేదు. బాహుబలి తర్వాత పలు సినిమాల్లో నటించినా.. ఆ స్థాయి గుర్తింపు, విజయం మాత్రం రాలేదు. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తనకు ‘నేనే రాజు నేనే మంత్రి’ బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు తేజతో జత కట్టాడు. నేడు(డిసెంబర్ 14)రానా పుట్టిన రోజు. ఈ సందర్భంగా రానా-తేజ కాంబోలో తెరకెక్కుతున్న కొత్త సినిమా పోస్టర్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకు‘రాక్షస రాజా’అనే టైటిల్ని ఖరారు చేశారు. పోస్టర్లో రానా గన్ పట్టుకుని వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు.గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామాగా రాక్షసరాజా మూవీ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. ఇందులో రానా పాత్ర నెగెటివ్ షేడ్స్తో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు చేయని కొత్త పాత్రలో అతడు కనిపించబోతున్నట్లు చెబుతున్నారు. పాన్ ఇండియన్ మూవీగా రాక్షసరాజాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాక్షసరాజా సినిమాలో హీరోయిన్తో పాటు ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది త్వరలోనే ప్రకటించబోతున్నారు. -
Abhiram Wedding : టాలీవుడ్ హీరో రానా తమ్ముడి గ్రాండ్ వెడ్డింగ్ (ఫొటోలు)
-
ఘనంగా టాలీవుడ్ హీరో రానా తమ్ముడి పెళ్లి.. వధువు ఎవరో తెలుసా?
టాలీవుడ్ నిర్మాత సురేశ బాబు తనయుడు అభిరామ్ వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. రానాకు తమ్ముడైన అభిరామ్ వరసకు మరదలైన ప్రత్యూష అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. శ్రీలంకలో జరిగిన డెస్టినేషన్ వెడ్డింగ్కు బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. తాజాగా వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు వైరలవుతున్నాయి. దాదాపు మూడు రోజుల పాటు ఈ పెళ్లి వేడుక జరిగింది. కాగా.. ఇటీవలే వరుణ్ తేజ్ సైతం పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేశ్ బాబుకి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి రానా ఇప్పటికే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రెండో అబ్బాయి అభిరామ్ కూడా 'అహింస' అనే మూవీతో టాలీవుడ్లో హీరోగా పరిచయమయ్యాడు. కానీ ఈ మూవీ అంత గుర్తింపు తీసుకురాలేదు. దీంతో కొన్నాళ్లు గ్యాప్ తీసి సినిమాలు చేస్తానని ప్రకటించాడు. అతను ప్రస్తుతం ఎలాంటి ప్రాజెక్ట్లోనూ నటించడం లేదు. దీంతో పెళ్లి చేసుకుని సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాడు. దగ్గుబాటి కుటుంబంలోకి అడుగుపెట్టనున్న అమ్మాయి స్వస్థలం కారంచేడు అని తెలుస్తోంది. View this post on Instagram A post shared by South Celebrity (@southcelebrity.insta) -
Abhiram Daggubati Marriage: రానా తమ్ముడి అభిరామ్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరంటే?
-
అందుకే తన కంపెనీని అమ్మేసిన రానా..
తెలుగు నటుడు రానా దగ్గుబాటి తన విజువల్ ఎఫెక్ట్స్ సంస్థ స్పిరిట్ మీడియా సేవలను నిలిపివేసినట్లు వెల్లడించారు. ఓ సమావేశంలో రానా మాట్లాడారు. ‘2005లో నా 18వ ఏటా స్పిరిట్ మీడియా అనే విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీను ప్రారంభించాను. ఐదేళ్ల పాటు అందులో పనిచేశాను. ఎప్పటికైనా ఆ స్టూడియో ద్వారా సినిమా తీయాలని భావించాను. కానీ అలా జరగలేదు. అయితే దాన్ని మొదట అత్యంత సృజనాత్మకంగా నిర్మించాలని అనుకున్నాను. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాని నిర్వహణ ఖరీదైంది. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న విజువల్ ఎఫెక్ట్స్ చాలా అధునాతనమైనవి. దాంతో ఆ కంపెనీను మూసివేశాను. విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని ప్రైమ్ ఫోకస్కి విక్రయించాను. అది ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద విజువల్ ఎఫెక్ట్ కంపెనీగా అవతరించింది. అయితే 2005లో ఎ బెల్లీ ఫుల్ ఆఫ్ డ్రీమ్స్ పేరుతో ఒక చిత్రాన్ని నిర్మించాను. ఈ సినిమా అప్పట్లో విడుదలై రెండు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. అది థియేటర్లలో విడుదల కాలేదు. నా విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీని అమ్మకానికి ఉంచినపుడు నాకు బాధ అనిపించలేదు. వ్యాపారాన్ని ఎలా నిర్వహించాలో తెలియకపోతే దాన్నుంచి తప్పుకోవడమే మార్గం’అని అన్నారు. రానా ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ తలైవర్ 170లో నటిస్తున్నారు. రానా విక్రయించిన స్పిరిట్ మీడియా 'కల్కి 2898 AD' సినిమా అంతర్జాతీయ మార్కెటింగ్ భాగస్వామిగా ఉంది. ఈ చిత్రంలో ప్రభాస్, దీపికా పదుకొణె, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం. -
టాలీవుడ్ హీరోల మధ్య పోటీ? రానా ఆసక్తికర కామెంట్స్
టాలీవుడ్లో రామ్చరణ్, అల్లు అర్జున్.. మేమంతా ఒకరి సినిమాలు మరొకం చూస్తా.. బాగుంటే మెచ్చుకుంటాం, బాలేకపోతే విమర్శిస్తాం.. అంతే తప్ప మా మధ్య పోటీ అనేదే లేదు అంటున్నాడు రానా దగ్గుబాటి. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. మేమందరం ఒకటే పోటీలో లేము. ఎవరికి వారు వేర్వేరు దారుల్లో ఉన్నాం. ఎవరి పోటీ వారిదే! ఒక్కొక్కరు ఒక్కోరకమైన కాన్సెప్ట్ ఎంచుకుంటారు. ఆ సినిమాలతో విజయం సాధిస్తారు. మీకు కనిపించేవి కలెక్షన్స్ మాత్రమే! అలాంటప్పుడు దేని గురించి మేమంతా పోటీపడతాం? బాక్సాఫీస్ లెక్కల కోసమా? కలెక్షన్స్ మాత్రమే మీకు డైరెక్ట్గా కనిపిస్తాయి. కానీ కేవలం నెంబర్స్ కోసమే మేము పని చేయడం లేదు. ఇక్కడ మీకు ఇటీవల అల్లు అర్జున్తో జరిగిన సంభాషణ చెప్తాను. పుష్ప 1లో మనం ఇంకా ఏం చేయాల్సింది? సినిమాలో ఎక్కడైనా తప్పు చేశామా? అనేది చర్చ జరిగింది. మా ముగ్గురి గురించే చెప్పట్లేదు సినిమా హిట్టయినా, కాకపోయినా ఇలా ఎక్కడైనా తప్పు చేశామా? అనేదాని గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. నిజానికి ఇలాంటి సంభాషణలే మాకు ఎదగడానికి ఉపయోగపడతాయి. నేను మా ముగ్గురి(రామ్ చరణ్, అల్లు అర్జున్, రానా) గురించే చెప్పడం లేదు. నాని, అడివి శేష్.. ఇలాంటి హీరోలంతా డిఫరెంట్ కాన్సెప్ట్తో సినిమాలు చేసేవాళ్లే! మేమంతా ఎప్పుడో ఒకసారి వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటాయి. ఓ సంఘటన నాకింకా గుర్తుంది. ఫిలిం ఫెస్టివల్ కోసం గోవా వెళ్లాను. గదిలోకి వచ్చి ముఖం మీదే అడిగాడు అప్పుడు అడివి శేష్ నా గదిలోకి వచ్చి.. నువ్వు వరుసగా సినిమాలు చేయడం లేదేంటి? నీ సినిమాలంటే నాకిష్టం.. కానీ నువ్వేమో చాలా గ్యాప్తో మూవీస్ చేస్తున్నావ్ అని అడిగాడు. నేనేమో అవునా.. సరే చేద్దాంలే అని బదులిచ్చాను. అప్పుడు శేష్.. నేను నీ కోసం కథ రాస్తాను.. ఒక ఏడాదిలోపు నీ దగ్గరకు వస్తాను అని చెప్పాడు. అలా మనం పని చేయాలని కోరుకునేవాళ్లు, మనల్ని ఇష్టపడేవాళ్ల నుంచి మనకు ఎక్కడలేని శక్తి వస్తుంటుంది' అని చెప్పుకొచ్చాడు రానా దగ్గుబాటి. -
కీడా కోలా నవ్విస్తుంది
తరుణ్ భాస్కర్ కథ అందించి, నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కీడా కోలా’. బ్రహ్మానందం, చైతన్యా రావు, రాగ్ మయూర్, విష్ణు, రవీంద్ర విజయ్, రఘురామ్ ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడు – నిర్మాత రానా సమర్పణలో కె.వివేక్ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్, శ్రీనివాస్ కౌశిక్ నండూరి, శ్రీపాద్ నందిరాజ్, ఉపేంద్ర వర్మ నిర్మించిన ఈ చిత్రం నవంబరు 3న విడుదల కానుంది. ఈ చిత్రం టీజర్ను రిలీజ్ చేసిన రానా మాట్లాడుతూ– ‘‘తాము అనుకున్న కథను బలంగా నమ్మి, కథ... కథనానికి కట్టుబడి సినిమాలు చేసే తరుణ్ భాస్కర్ వంటి ఫిల్మ్ మేకర్స్ చాలా అరుదుగా ఉంటారు. ‘కీడా కోలా’ చూసి నవ్వుకున్నాను. ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారనే నమ్మకం ఉంది. నేను హీరోగా చేసే సినిమాల అప్డేట్స్ త్వరలో తెలుస్తాయి. అలాగే అరవై ఏళ్లుగా ఉన్న సురేష్ ్ర΄÷డక్షన్స్లో చాలా సినిమాల రీమేక్స్ రైట్స్ ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి నేను ఏ రీమేక్ చేయడం లేదు. ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’ తో నాకు ఉన్న అసోషియేషన్ ఏంటి? అనేది త్వరలో తెలుస్తుంది’’ అన్నారు. ‘‘లాక్డౌన్ టైమ్లో డబ్బులు ఎలా సంపాదించాలని ఆలోచిస్తున్నప్పుడు ఏదైనా డ్రింక్లో ఓ కీడా ఉంటే కన్జ్యూమర్ కేసు వేసి, కోట్లు సంపాదించవచ్చు కదా అనే ఆలోచన వచ్చింది. అలా క్రైమ్ కామెడీగా ‘కీడా కోలా’ కథను కొత్తగా రెడీ చేసుకున్నాను. వెంకటేశ్గారితో సురేష్ ప్రొడక్షన్స్లో నేను చేయాల్సిన సినిమా కథ సెకండాఫ్ వర్క్ చేస్తున్నాను’’అన్నారు. ‘‘తరుణ్ భాస్కర్తో సినిమా చేయాలన్న నా కల నేరవేరింది’’ అన్నారు చైతన్యా రావు. ‘‘ప్రేక్షకులు ఈ మూవీని ఎంజాయ్ చేస్తారు’’ అన్నారు నిర్మాతలు. -
రానా డ్రగ్స్ కేసు పై సురేష్ బాబు రియాక్షన్
-
రజనీకాంత్ 170 ప్రాజెక్ట్ షూటింగ్ ప్రారంభం.. ఎక్కడో తెలుసా?
రజనీకాంత్ 'తలైవార్ 170' చిత్రం నేడు అధికారికంగా పూజా కార్యక్రమం జరిగింది. లైకా ప్రొడక్షనన్స్ సంస్థ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక కథాచిత్రానికి 'జై భీమ్' చిత్రం ఫేమ్ టీజే జ్ఞానవేల్ కథా, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రంలో నటించనున్న ఇతర కళాకారుల గురించి చిత్ర నిర్మాణ సంస్థ వరుసగా ప్రకటిస్తూ వచ్చింది. ఇప్పటికే ఇందులో టాలీవుడ్ నటుడు దగ్గుపాటి రానా నటి మంజు వారియర్, దసరా విజయన్, రిత్విక సింగ్ తదితరులు ఇందులో ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. (ఇదీ చదవండి: సమంత- నాగ చైతన్య మళ్లీ కలుసుకోబోతున్నారా.. ఫోటోలు వైరల్) బాలీవుడ్ నటుడు అమితాబచ్చన్, మలయాళ స్టార్ నటుడు ఫాహత్ ఫాజిల్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా రజనీకాంత్ ఇందులో పవర్ ఫుల్ పోలీస్ అధికారిగా నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రం బుధవారం కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో పూజ కార్యక్రమాలతో ప్రారంభం అయింది. అందులో భాగంగా నటుడు రజనీకాంత్ మంగళవారమే చైన్నె నుంచి తిరువంతపురం బయలుదేరిన విషయం తెలిసిందే. అనంతరం ఆయన పూజలో పాల్గొని మీడియాతో ముచ్చటించారు. ఆయన నటించే 170వ చిత్రం గురించి పాత్రికేయులు అడిగిన ప్రశ్నకు బదులిస్తూ ఇది మంచి సందేశంతో కూడిన ఎంటర్టైనర్గా ఉంటుందని చెప్పారు. ఈ చిత్రానికి ఇంకా పేరు నిర్ణయించలేదనీ, త్వరలోనే పేరును వెల్లడించనున్నట్లు చెప్పారు. తాను ఇంతకు ముందు నటించిన జైలర్ చిత్రం ఊహించిన దానికంటే ఘనవిజయం సాధించిందని పేర్కొన్నారు. అదేవిధంగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో నటించిన లాల్ సలామ్ చిత్రం కూడా ఊహించిన దానికంటేబ్రహ్మాండంగా వచ్చిందని పేర్కొన్నారు. Lights ☀️ Camera 📽️ Clap 🎬 & ACTION 💥 With our Superstar @rajinikanth 🌟 and the stellar cast of #Thalaivar170🕴🏼 the team is all fired up and ready to roll! 📽️ Hope you all enjoyed the #ThalaivarFeast 🍛 Now it's time for some action! We'll come up with more updates as the… pic.twitter.com/gPUXsPmvEQ — Lyca Productions (@LycaProductions) October 4, 2023 -
పాన్ ఇండియా ప్రాజెక్ట్లోకి రానా.. అఫిషియల్ సినిమా ప్రకటన
జైలర్ తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి భారీ అంచనాలు పెరిగాయి. దీనికి ప్రధాన కారణం ‘జైభీమ్’ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేల్ అని చెప్పవచ్చు ఆ సినిమాతో ఆయనకు ఎనలేని గుర్తింపు దక్కింది. చాలా రోజుల తర్వాత ఒక యథార్థ సంఘటన ఆధారంగా రజనీకాంత్తో సినిమా అనేసరికి పాన్ ఇండియా రేంజ్లో అంచనాలను పెంచేశాయి. (ఇదీ చదవండి: 100 సినిమాల్లో నటించిన దేవయాని.. టీచర్గా చేయాల్సిన పరిస్థితి ఎలా వచ్చింది) అంతే కాకుండా ఖర్చుకు ఎలాంటి బార్డర్స్ పెట్టకోని లైకా ప్రొడక్షన్స్ సంస్థ దీనిని నిర్మిస్తుంది. తత్కాలికంగా ఈ సినిమాకు 'తలైవర్ 170' అనే వర్కింగ్ టైటిల్ పెట్టారు. తాజాగా ఈ ప్రాజెక్ట్లోకి టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి భాగం అవుతున్నట్ల ప్రకటన వచ్చేసింది. దీనిని అఫిషియల్గా లైకా ప్రొడక్షన్స్ ప్రకటించింది. బాహుబలి సినిమాలో విలన్గా రానా పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు పొందాడు. మరి తలైవార్ ప్రాజెక్ట్లో ఆయన రోల్ ఎంటి అనేది ప్రకటించలేదు. ఇప్పటికే ఈ సినిమాకు దుషారా విజయన్, రిత్విక సింగ్ వంటి యంగ్ హీరోయిన్స్తో పాటు మలయాళ నటి మంజు వారియర్ ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. త్వరలో ఈ ప్రాజెక్ట్ సెట్స్పైకి వెళ్తున్నట్లు సమాచారం. Welcoming the dapper & supercool talent 😎 Mr. Rana Daggubati ✨ on board for #Thalaivar170🕴🏼#Thalaivar170Team has gotten even more charismatic 🌟 with the addition of the dashing @RanaDaggubati 🎬🤗✌🏻@rajinikanth @tjgnan @anirudhofficial @ManjuWarrier4 @officialdushara… pic.twitter.com/XhnDpm27CH — Lyca Productions (@LycaProductions) October 3, 2023 -
నేను కట్నం ఎంత తీసుకున్న అంటే : రానా దగ్గుబాటి
-
రానా దగ్గుబాటి-మిహీకా బజాజ్ ల ప్రేమకథ గురించి..!
-
హిరణ్య కశ్యప సినిమా గురించి రానా దగ్గుబాటి
-
ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటారు : రానా దగ్గుబాటి
-
రజనీకాంత్ సినిమాలో అమితాబ్, రానా?
వరుస ఫ్లాప్లతో నిరుత్సాహంగా ఉన్న రజనీకాంత్కు ఊహించనంతగా జైలర్ చిత్రం విజయాన్ని సాధించడంతో ఆయనలో ఎక్కడలేని ఉత్సాహం వచ్చేసిందనే చెప్పాలి. ఇటీవలే తనకు ఇష్టమైన ఆధ్యాత్మిక ప్రదేశమైన హిమాలయాలను కూడా చుట్టివచ్చిన రజనీకాంత్.. ఇప్పుడు తన 170వ చిత్రానికి రెడీ అయిపోతున్నారు. జై భీమ్ చిత్రం జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్న్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో బాలీవుడ్ బిగ్బీ అమితాబచ్చన్, టాలీవుడ్ స్టార్ నటుడు రానా దగ్గుపాటి, మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్, నటి మంజువారియర్ వంటి ప్రముఖ తారాగణం నటించడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్న్స్ కార్యక్రమాలు ఇప్పటికే జరుగుతున్నట్లు తెలిసింది. చిత్రం అక్టోబర్ మొదటి వారంలో సెట్పైకి వెళ్లనున్నట్లు తాజా సమాచారం. కేరళ రాష్ట్రంలోని తిరువనంతపురంలో షూటింగ్ ప్రారంభించి, కన్యాకుమారి, నాగర్కోయిల్ ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు తెలిసింది. ఒక యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రజనీకాంత్ మరోసారి పోలీస్ అధికారిగా నటించడానికి సిద్ధమవుతున్నారు. ఆయన ఇందులో కన్యాకుమారి ప్రాంత యాసలో మాట్లాడతారని సమాచారం. కాగా ఈయన తన కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న లాల్ సలామ్ చిత్రంలో ప్రధాన పాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటోంది. కాగా రజనీకాంత్ ఈ చిత్రంలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ను కూడా పూర్తి చేశారు. -
గ్లోబల్ ప్లాట్ఫామ్కి ఇదో వేదిక
‘‘సౌత్లోని అన్ని చిత్రపరిశ్రమలూ కలిసి జరుపుకునే వేడుక సైమా. పదకొండేళ్లుగా నేనీ వేడుకల్లో భాగమవుతున్నాను. గ్లోబల్ ప్లాట్ఫామ్కి చేరుకోవడానికి ఇదొక గొప్ప వేదిక. దుబాయ్లో కలుద్దాం’’ అన్నారు రానా. ‘సైమా’ (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 అవార్డ్స్ వేడుక ఈ నెల 15, 16 తేదీల్లో దుబాయ్లో జరగనుంది. ఈ వేడుక విశేషాలు తెలియజేయడానికి ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో రానా పాల్గొన్నారు. ‘‘సైమా వేడుక అన్ని చిత్ర పరిశ్రమలకు ఒక రీ యూనియన్ లాంటిది’’ అన్నారు సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్. ‘‘సైమా వేడుకల్లో ఇదివరకు పాల్గొన్నాను. మళ్లీ ఈ వేదిక పంచుకోవడం ఆనందంగా ఉంది’’ అన్నారు నిధీ అగర్వాల్. ‘‘తొలిసారి సైమా వేడుకల్లో పాల్గొనబోతున్నాను’’ అన్నారు మీనాక్షీ చౌదరి. ఈ సమావేశంలో శశాంక్ శ్రీవాస్తవ్ పాల్గొన్నారు. -
బాసూ రెడీయా...
‘ఏం బాసూ రెడీయా.. వెల్ కమ్ టు ది వరల్డ్ ఆఫ్ మార్క్ ఆంటోని’ అనే డైలాగ్స్తో ‘మార్క్ ఆంటోని’ ట్రైలర్ ఆరంభం అయింది. విశాల్ పలు షేడ్స్లో టైటిల్ రోల్లో నటించిన చిత్రం ఇది. పాన్ ఇండియా మూవీగా ఈ చిత్రాన్ని అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో ఎస్. వినోద్ కుమార్ నిర్మించారు. ఈ నెల 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఆదివారం ఈ చిత్రం ట్రైలర్ని హీరో రానా విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘ఈ చిత్రంలో మంచివాడిగా, విలన్గా, గుండుతో స్టైలిష్గా, తండ్రిని కాపాడుకోవాలనుకునే వ్యక్తిగా... ఇలా పలు షేడ్స్లో విశాల్ కనిపిస్తారు. ఓ టైమ్ మిషన్ కాకుండా ఓ ఫోన్ హీరోని గతానికి తీసుకెళ్తే తనేం చేశాడనే కథాంశంతో ‘మార్క్ ఆంటోని’ని రూపొందించాం’’ అన్నారు. ఈ చిత్రంలో ఎస్.జె. సూర్య, సునీల్, సెల్వ రాఘవన్, రీతూ వర్మ తదితరులు కీలక పాత్రలు చేశారు.
Pagination
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement