-
మంత్రి బొత్సపై చంద్రబాబు కొత్త కుట్ర
విశాఖ సిటీ: టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి ఓటమి ఖాయమని తేలిపోవడంతో పోలింగ్కు ముందు రోజు చంద్రబాబు కొత్త కుట్రకు తెరతీశారు. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖ సృష్టించారు. బొత్స లెటర్ హెడ్పైనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాస్తున్నట్లుగా లేఖను తయారు చేశారు. దాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తూ అధికార పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు.వైఎస్సార్సీపీ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రకు తెరలేపారు. ఈ కుతంత్రంపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఓటమి భయంతో చంద్రబాబు ఇంతటి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇటువంటి నీచ రాజకీయాలు చంద్రబాబుకు అలవాటే అని మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్కు ఫిర్యాదు చేశారు. నకిలీ లేఖను సృష్టించి తప్పుడు ప్రచారం చేస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులను వెంటనే అరెస్టు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.రోజుకో కుట్ర..ఓటమి ముంగిట నిలిచిన చంద్రబాబు రోజుకో కుట్రతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం చేసిన ప్రతి సంస్కరణ, నిర్ణయంలో లేని వివాదాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు. భూ యజమానులకు మేలు చేసే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్పై తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టించాలని చూశారు. అయినా ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో ఇప్పుడు మంత్రి బొత్స సత్యనారాయణను టార్గెట్ చేశారు. ఆయన వైఎస్సార్సీపీకి రాజీనామా చేస్తున్నట్లు నకిలీ లేఖను సృష్టించారు. -
శామ్ పిట్రోడా మరో దుమారం
న్యూఢిల్లీ: అమెరికాలో అమల్లో ఉన్న వారసత్వ పన్ను తనకు బాగా నచి్చందని, అది న్యాయంగా ఉందని వ్యాఖ్యానించి రాజకీయ వివాదానికి తెరతీసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు శామ్ పిట్రోడా ఆ గొడవ సద్దుమణగ ముందే మరో దుమారం సృష్టించారు. దక్షిణ భారతదేశ ప్రజలు అఫ్రికన్లలా ఉంటారని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. పిట్రోడాను సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం తప్పుపట్టారు. తాజాగా ఓ పత్రికకు ఇచి్చన ఇంటర్వ్యూలో శామ్ పిట్రోడా మాట్లాడుతూ... భారత్ విభిన్నమైన దేశం అని అభివరి్ణస్తూ కొన్ని పోలికలను ప్రస్తావించారు. అవే ఆయనను ఇప్పుడు ఇరకాటంలోకి నెట్టేశాయి. ‘‘మనది లౌకిక దేశం. బ్రిటిష్ పాలకులపై మన స్వాతంత్య్ర సమరయోధులు సాగించిన పోరాటాల వల్ల భారత్ లౌకిక దేశంగా ఆవిర్భవించింది. ప్రపంచవ్యాప్తంగా మనది ఉత్తమమైన ప్రజాస్వామ్య దేశం. 75 ఏళ్లుగా ప్రజలు సంతోషకరమైన వాతావరణంలో కలిసిమెలిసి జీవిస్తున్నారు. అక్కడక్కడా జరిగిన చిన్నపాటి గొడవలను పక్కనపెడితే ఇక్కడెంతో వైవిధ్యం, భిన్నత్వం కనిపిస్తాయి. భారత్లో ఈశాన్య ప్రాంతాల ప్రజలు చైనీయుల్లా, పశి్చమ ప్రాంతాల జనం అరబ్బుల్లాగా, ఉత్తరాది ప్రజలు శ్వేతజాతీయుల్లాగా, దక్షిణాది ప్రజలు ఆఫ్రికన్లలా కనిపిస్తారు. అది పెద్ద విషయం కాదు. ఏది ఎలా ఉన్నప్పటికీ మనమంతా సోదర సోదరీమణులం. దేశంలోని విభిన్నమైన భాషలు, మతాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లను మనం పరస్పరం గౌరవించుకుంటున్నాం. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మన మూలాల్లోనే ఉన్నాయి’’ అని శామ్ పిట్రోడా చెప్పారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు తీవ్రంగా స్పందించారు. మరోవైపు పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ వివరణ ఇచ్చింది. పిట్రోడా రాజీనామా.. ఆమోదించిన అధిష్టానం తన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీయడంతో శామ్ పిట్రోడా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ పదవికి బుధవారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను కాంగ్రెస్ అధిష్టానం వెంటనే ఆమోదించింది. రాజీనామా చేయాలన్నది పిట్రోడా సొంత నిర్ణయమని కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ చెప్పారు. -
కాంగ్రెస్కు శామ్ పిట్రోడా రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి శామ్ పిట్రోడా బుధవారం(మే8) సాయంత్రం రాజీనామా చేశారు. పిట్రోడా రాజీనామా చేసిన వెంటనే పార్టీ దానిని ఆమోదించింది. భారత్లోని వివిధ ప్రాంతాల వారి శరీర రంగులపై పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ముఖ్యంగా దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా ఉంటారనడంపై దుమారం రేగింది. పిట్రోడా వ్యాఖ్యలతో తమ పార్టీకి సంబంధం లేదని కాంగ్రెస్ ఇప్పటికే ప్రకటించింది. పిట్రోడా వ్యాఖ్యలను ప్రధాని మోదీ కూడా ఎన్నికల ప్రచార సభలో ప్రస్తావించడంతో వివాదం పెద్ద దైంది. మొత్తం వ్యవహారం పిట్రోడా రాజీనామాతో క్లైమాక్స్కు చేరింది. -
అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
రాయ్పూర్: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతోంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి మాత్రం రోజురోజుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఎన్నికల నేపథ్యంలో పలువురు నేతలు పార్టీలకు రాజీనామా చేయటం తీవ్ర తలనొప్పిగా మారింది.తాజాగా ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నేత రాధికా ఖేరా కాంగ్రెస్ పార్టీకి, ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపించారు.‘‘అయోధ్యలోని రామమందిరం సందర్శించినందుకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చాలా తీవ్రమైన వివక్షను ఎదుర్కొన్నా. ఎన్ఎస్యూఐ నుంచి కాంగ్రెస్ పార్టీ మీడియా విభాగానికి 22 ఏళ్లుగా నా జీవితం అంకితం చేశా. పార్టీకి చాలా నిజాయితీగా పని చేశా. కానీ, నేను అయోధ్య రామ మందిరానికి మద్దతు తెలిపటం కారణంగా పార్టీలో చాలా వ్యతిరేకతను అనుభవించా. నేను ఒక మహిళను. న్యాయం కోసం, దేశం కోసం పోరాడుతా. కానీ, కాంగ్రెస్ పార్టీలో పోరాడటంలో ఓడిపోయా. ఒక రామ భక్తురాలిగా నేను చాలా బాధించబడ్డాను’’ అని రాధికా ఖేరా తెలిపారు. -
హరీశ్.. పేజీన్నర లేఖ రాసి రాజీనామానా?
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్రావుపై రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్ర రాజకీయాల్లో హరీశ్ రావు ఓ జోకర్లా మారారని, ఆయన అన్నీ హౌలా(పులిష్) పనులు చేస్తున్నారని అందుకే ఆయన్ను హౌవ్లేష్రావు అంటారని మండిపడ్డారు. ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సిద్ధపడితే.. ఆయన స్పీకర్ ఫార్మాట్లో లేఖ ఇవ్వాలే తప్ప.. సుదీర్ఘంగా పేజీన్నర లేఖ రాసి రాజీనామా చేస్తు న్నట్లు ప్రకటించడం ఏమిటని మంత్రి కోమటిరెడ్డి నిలదీశారు. శుక్రవారం ఆయన హైదరాబాద్లో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డితో కలిసి మీడియా తో మాట్లాడారు. ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటిస్తే..ఆ ఒక్క హామీ కాదు.. మొత్తం 13 హామీలు నెరవేర్చాలని.. లేదంటే రాజీనామాకు సిద్ధం కావాలని హరీశ్ సవాల్ చేస్తూ.. ఓ డూప్లికేట్ రాజీనామా పట్టుకుని అమరవీరుల స్తూపం వద్ద రాజీనామా డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. దమ్ముంటే మెదక్లో బీఆర్ఎస్ అభ్యర్థికి డిపాజిట్ తెచ్చుకోవాలని హరీశ్రావుకు సవాల్ విసిరారు. హరీశ్కు మతిభ్రమించింది అధికారం పోయాక హరీశ్కు మతిభ్రమించిందని మంత్రి విమర్శించారు. ఆర్థిక మంత్రిగా ఉండి ఉద్యోగులకు ఒకటో తారీఖు జీతాలు ఇవ్వడం చేతకాని ఈ దద్దమ్మ, ఇవ్వాళ తాము ఒకటో తారీఖు జీతాలు ఇస్తుంటే ఓర్వలేకపోతున్నాడని నిందించారు. ఆయన, ఆయన మామ చేసిన రూ.లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.26 వేల కోట్ల వడ్డీలు కడుతున్నామని మంత్రి కోమటిరెడ్డి వెల్లడించారు. జూన్ 3 తరువాత బీఆర్ఎస్ మూతే... పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా మూతపడుతుందని మంత్రి జోస్యం చెప్పారు. మీ మామ చేసిన పలు హామీలు అమలు చేయనప్పుడు ఆ రాజీనామా లేఖ తీసుకుని అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. రుణమాఫీ కాంగ్రెస్ బ్రాండ్ అనీ.. అప్పటికే రుణం చెల్లించిన వారికి కూడా అప్పటి సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 5 వేల నుంచి రూ. 10 వేలు ప్రోత్సాహం ఇచ్చిన విషయం గుర్తుంచుకోవాలని సూచించారు. నష్టమని తెలిసినా.. తెలంగాణ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కి నష్టం జరుగుతుందని తెలిసినా.. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నేరవేర్చిన దేవత సోనియాగాంధీ అని మంత్రి కోమటిరెడ్డి కొనియాడారు. తెలంగాణ వస్తే దళితున్ని సీఎం చేస్తానని ఆ తరువాత తానే సీఎం అయిన కేసీఆర్ మోసగాడని నిందించారు. -
జనసేనకు మూకుమ్మడి రాజీనామా..!
-
ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే 500 మంది వాలంటీర్లు రాజీనామా
-
చిరాగ్ పాశ్వాన్కు ఎదురుదెబ్బ.. 22 మంది నేతల రాజీనామా
పట్నా: లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఎన్డీయే కూటమిలోని లోక్జనశక్తి పార్టీ (రామ్ విలాస్)(LJP)కి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి షాకిస్తూ పలువురు నేతలు రాజీనామా చేశారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కబర్చిన 22 మంది నేతలకు టికెట్ లభించకపోవటంతో వారంతా రాజీనామా బాటపట్టారు. రాష్ట్ర మాజీ మంత్రి, జాతీయ ఉపాధ్యక్షురాలు రేణు కుష్వాహ, మాజీ ఎమ్మెల్యే, జాతీయ ప్రధాన కార్యదర్శి సతీష్ కుమార్, ఉపాధ్యక్షుడు సంజయ్ సింగ్, సంస్థాగత కార్యదర్శి రవీంద్ర సింగ్ రాజీనామా చేశారు. అదేవిధంగా వారి మద్దతుదారులు పెద్దఎత్తున రాజీనామాలను రాష్ట్ర అధ్యక్షుడు రాజు తివారీకి పంపించారు. శాంభవీ చౌదరీ( సమస్తిపూర్), రాజేశ్ వర్మ (ఖాగారియా), వీణా దేవి ( వైశాలీ) వంటి నేతలకు టికెట్లు కేటాయించటంపై రాజీనామా చేసిన నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి చిరాగ్ పాశ్వాన్, అతని సన్నిహితులు... డబ్బులకు పార్టీ టికెట్లు అమ్ముకున్నారని మండిపడ్డారు. అయితే ఈ సీట్లలో అభ్యర్థులను ఎంపిక చేసే సమయంలో సీనియర్ నేతల అభిప్రాయలు తీసుకోలేదని కార్యకర్తల్లో చర్చ జరుగుతోంది. ఇక.. నామినేషన్ల ప్రక్రియ సమయంలో తమ నేతలకు టికెట్ కేటాయించకుండా పక్కనపెట్టడంపై పార్టీ కార్యకర్తలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయే కూటమి పొత్తులో భాగంగా ఎల్జేపీకి బీజేపీ ఐదు సీట్ల కేటాయించిన విషయం తెలిసిందే. కీలకమైన హాజీపూర్ స్థానంలో చిరాగ్ పాశ్వాన్ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా చిరాగ్ బంధువు అరుణ్ భార్తి జాముయి స్థానంలో బరిలోకి దిగుతున్నారు. రాష్ట్ర మంత్రి, జేడీ(యూ) సీనియర్ నేత అశోక్ చౌదరీ కుమార్తె ఈ శంభవీ చౌదరీ. ఆమె తొలిసారి పార్లమెంట్లో ఎన్నికల్లో పోటి చేసి తన అదృష్టం పరిక్షించుకోబోతున్నారు. అయితే ఆమెకు అక్కడి బ్రాహ్మణ, భూమిహార్స్ సామాజిక వర్గాల మద్దతు ఉండటం గమనార్హం. మెజార్టీ దళీతల ఒటర్లు సైతం ఆమెకు మద్దతు ఇవ్వనున్నారు. మరోవైపు... వీణా దేవీ మళ్లీ వైశాలీ సీటు దక్కించుకున్నారు. ఆమె 2019లో అభివక్త ఎల్జేపీ నుంచి ఎంపీగా గెలుపొందారు. అనంతరం చీలిక వర్గంలో పశుపతి కుమార్ పరాస్ వైపు మద్దతు పలికినా.. తర్వాత రామ్ విలాస్ పాశ్వాన్ కుటుంబం మీద గౌరవంతో చిరాగ్ వైపే ఉండటం గమనార్హం. ఇక.. గత 2019 ఎన్నికలో ఎల్జేపీ మొత్తం ఆరుస్థానాల్లో విజయం సాధించింది. హాజీపూర్, వైశాలీ, సమస్తీపూర్, జాముయి. నావాదాలో ఎల్జేపీ గెలుపొందింది. సీట్ల పంపకంలో భాగంగా నావాదా సీటు బీజేపీకి దక్కింది. అయితే, రాజీనామా చేసిన ఎల్జేపీ నేతలంతా ప్రతిపక్షాల ఇండియా కూటమిలో మద్దతు ఇవ్వనున్నట్ల ఊహాగానాలు వస్తున్నాయి. -
టీడీపీ, జనసేన వేధింపులు తాళలేకపోతున్నాం
రాజమహేంద్రవరం సిటీ: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సచివాలయ వ్యవస్థలో ఐదేళ్లుగా పనిచేస్తున్న తమను టీడీపీ, జనసేన నాయకులు వేధిస్తుండడంతో రాజీనామా చేస్తున్నట్లు రాజమహేంద్రవరం నగరానికి చెందిన 15 మంది వలంటీర్లు చెప్పారు. బుధవారం నగరపాలక సంస్థ కమిషనర్, సచివాలయ అడ్మిన్ సెక్రటరీలకు వారి రాజీనామాలను అందజేశారు. వివరాల్లోకి వెళితే రాజమహేంద్రవరం 1వ డివిజన్ 2వ సచివాలయానికి చెందిన ఒకరు, 48వ డివిజన్ 89వ సచివాలయానికి డివిజన్కు చెందిన ఐదుగురు, 90వ సచివాలయానికి చెందిన తొమ్మిది మంది వలంటీర్లు రాజీనామాలను అడ్మిన్ సెక్రటరీలకు అందజేశారు. ఈ సందర్భంగా వలంటీర్లు మాట్లాడుతూ.. తాము ప్రజలకు నిస్వార్థంగా సేవచేస్తూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతీ పథకాన్ని ప్రజలకు చేరువ అయ్యేటట్టు చూస్తున్నామన్నారు. అయితే క్షేత్ర స్థాయిలో విధినిర్వహణ సమయంలో టీడీపీ, జనసేన నాయకులు తమను వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మిత్రులు, బంధువులతో మాట్లాడినా అనుమానంగా చూస్తున్నారని, ఇది భరించలేకపోతున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో వలంటీర్లుగా కొనసాగలేమని చెప్పారు. ఈ విషయమై నగర పాలక సంస్థ అదనపు కమిషనర్ సత్యవేణి స్పందిస్తూ.. 15 మంది వలంటీర్ల రాజీనామాలు అందాయన్నారు. వాటిపై కమిషనర్కు నివేదిక సమర్పిస్తున్నట్లు తెలిపారు. -
తిరుగుబాటు ‘సేన’
కాకినాడ రూరల్/సాక్షి, కోనసీమ: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఆయన సైన్యం తిరుగుబాటు జెండా ఎగరేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సీట్ల కేటాయింపుపై నిరసన వ్యక్తం చేస్తోంది. తమను పార్టీ కోసం వాడుకుని కరివేపాకులా తీసిపడేశారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తాజాగా పార్టీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ మహిళా నేత, కాకినాడ మాజీ మేయర్ పోతసపల్ల సరోజ చెరియన్ తన పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. స్థానిక సర్పవరం జంక్షన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్కు రాసిన రాజీనామా లేఖను ప్రదర్శించారు. ఆమె మాట్లాడుతూ, తన ఆత్మగౌరవాన్ని పార్టీ దెబ్బ తీసిందన్నారు. జనసేన తీసుకున్న ముష్టి 21 సీట్లలో ఒక్కటీ శెట్టిబలిజలకు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓడిపోయేచోట ఒక్క మహిళకు మాత్రమే సీటు ఇవ్వడంపై మండిపడ్డారు. నాదెండ్ల మనోహర్ తెలుగుదేశం పార్టీ కోవర్టు అని ఆరోపించారు. పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నట్టుగా పోల్, బూత్ మేనేజ్మెంట్లు లేకపోవడానికి కారణం కేవలం నాదెండ్ల మనోహరే అని ధ్వజమెత్తారు. వారాహి యాత్రలో కత్తిపూడి నుంచి కాకినాడ వరకూ ఊకదంపుడు ప్రసంగాలు చేసిన పవన్ కళ్యాణ్ శెట్టిబలిజలకు ఎందుకు సీటు ఇవ్వలేదని ప్రశ్నించారు. నాదెండ్ల మనోహర్ పవన్ను, జనసేనను ముంచేశారని, ఇప్పటికైనా పవన్ కళ్లు తెరవాలని హితవుపలికారు. పవన్ చుట్టూ ఉండే కోటరీలో హరిప్రసాద్, కేకే, చక్రవర్తి, మనోహర్ తదితరులే మాట్లాడతారని విమర్శించారు. తాను కాకినాడ రూరల్ సీటు ఆశించి మోసపోయానని చెప్పారు. త్వరలో భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తానని, జనసేన కాకినాడ రూరల్ అభ్యర్థి పంతం నానాజీకి వ్యతిరేకంగా పని చేస్తానని సరోజ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆమె భర్త చెరియన్ కూడా పాల్గొన్నారు. కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లా! అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జనసేన పోటీ చేసే రెండు సీట్లలోనూ కొత్తగా పార్టీలో చేరిన వారికే టికెట్లు ఇవ్వడంపై ఆ పార్టీ ఇన్చార్జులు మండిపడుతున్నారు. పి.గన్నవరం అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ స్థానికుడే అయినా తెలంగాణ క్యాడర్ ఉద్యోగి. జనసేన నుంచి టికెట్ హామీ వచ్చిన తరువాతే ఉద్యోగానికి జనవరి 31న వాలంటరీ రిటైర్మెంట్ ప్రకటించారు. పార్టీలో రెండు నెలల నుంచి మాత్రమే చురుగా>్గ ఉన్నారు. రాజోలు అభ్యర్థి దేవ వరప్రసాద్ను అధికారికంగా ప్రకటించకున్నా ప్రచారం చేస్తున్నారు. ఈయన పార్టీలో చేరి రెండేళ్లు కావస్తున్నా స్థానికంగా పెద్దగా పరిచయాలు లేవు. స్థానికంగా రాపాక రమేష్బాబు, బొంతు రాజేశ్వరరావు పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనేవారు. వీరిద్దరికీ పార్టీ మొండిచేయి చూపినట్టు తెలుస్తోంది. అమలాపురం పార్టీ ఇన్చార్జిగా ఉన్న శెట్టిబత్తుల రాజబాబు, పార్లమెంట్ ఇన్చార్జిగా ఉన్న డి.ఎం.ఆర్.శేఖర్, బీసీ నేత, శెట్టిబలిజ వర్గానికి చెందిన పితాని బాలకృష్ణలనూ పవన్ పక్కనపెట్టారు. గత ఎన్నికలలో బాలకృష్ణ ముమ్మిడివరం నుంచి పోటీ చేశారు. మండపేట, కొత్తపేట, రామచంద్రపురం పార్టీ ఇన్చార్జిలుగా ఉన్న వేగుళ్ల లీలాకృష్ణ, బండారు శ్రీనివాసరావు, పోలిశెట్టి చంద్రశేఖర్కూ పవన్ ఝలక్ ఇచ్చారు. వీరి భవిష్యత్తుపై పవన్ నుంచి ఎలాంటి హామీ లేదని సమాచారం. దీంతో వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం రూ.కోట్లు ఖర్చుచేస్తే ఇప్పుడు కరివేపాకులా తీసిపడేశారని మండిపడుతున్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో జనసేనకు 29శాతం ఓటింగ్ వచ్చినా పవన్ కేవలం రెండుస్థానాలతో సరిపెట్టుకోవడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. -
Odisha: ఎన్నికల వేళ ‘బీజేడీ’కి గట్టి దెబ్బ
భువనేశ్వర్: అసెంబ్లీ,లోక్సభ ఎన్నికలు జరగనున్న వేళ ఒడిషాలో అధికార బీజేడీకి గట్టి దెబ్బ తగిలింది. సీనియర్ నేత, ఆరుసార్లు ఎంపీ భర్తృహరి మెహతాబ్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి, బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్కు రాజీనామా లేఖ పంపినట్లు తెలిపారు. అవినీతిపై పోరాటంలో పార్టీకి కమిట్మెంట్ లేనందునే తాను రాజీనామా చేయాల్సి వచ్చిందని మెహతాబ్ వెల్లడించారు. అవినీతిపై పోరకు తాను ఇచ్చిన సలహాలు సూచనలకు పార్టీ నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి దానికి ఓపిక ఉంటుందని, ఇప్పుడది నశించిందని అందుకే పార్టీని వీడుతున్నట్లు తెలిపారు. పార్టీని వీడినప్పటికీ అవినీతిపై తన పోరాటం కొనసాగిస్తానన్నారు. ప్రస్తుతం కటక్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న భర్తృహరి మెహతాబ్ ఒడిషా తొలి ముఖ్యమంత్రి హరేకృష్ణ మెహతాబ్ కుమారుడు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేడీ, బీజేపీ పొత్తు ప్రయత్నాలు ఫలించకపోవడంతో బీజేడీ ఒంటరిగానే పోటీ చేస్తోంది. ఇదీ చదవండి.. లోక్సభ బరిలో లాలూ ఇద్దరు కుమార్తెలు -
హిమాచల్లో ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా
సిమ్లా: హిమాచల్ప్రదేశ్లో కాంగ్రెస్కు చెందిన సీఎం సుఖూ ప్రభుత్వాన్ని కష్టాలు చుట్టుముడుతున్నాయి. ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు చెందిన ఆరుగురితోపాటు సుఖూ ప్రభుత్వానికి మద్దతు తెలిపిన ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు బీజేపీకి ఓటేయడం సంచలనం రేపింది. బీజేపీకి ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరుగురు అనర్హత వేటుకు గురికాగా, ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు తాజాగా పదవులకు రాజీనామా చేశారు. బీజేపీలో చేరి, ఆ పార్టీ టిక్కెట్పై మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని వీరు తెలిపారు. శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి వెళ్లి అసెంబ్లీ లో రాజీనామా పత్రాలను అందజేశారు. -
హైతీ ప్రధాని రాజీనామా
పోర్టు ఆవ్ ప్రిన్స్: కరేబియన్ దేశం హైతీ ప్రధానమంత్రి ఆరియల్ హెన్రీ ఎట్టకేలకు పదవి నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. రాజధానిలోని 80శాతం పైగా సాయుధ ముఠాల చేతుల్లోకి వెళ్లిపోవడం, పలు ప్రభుత్వ కార్యాలయాలను ముఠాలు ఆక్రమించడం, అంతర్జాతీయంగా ఒత్తిళ్లు పెరగడంతో హెన్రీ ఈ మేరకు నిర్ణయించినట్లుగా భావిస్తున్నారు. హెన్రీ ప్రస్తుతం పొరుగుదేశం పోర్టోరికోలో ఉన్నారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం పోర్టు ఆవ్ ప్రిన్స్లోని విమానాశ్రయంలో ల్యాండయ్యేందుకు సాయుధ ముఠాలు అంగీకరించకపోవ డంతో దేశం వెలుపలే ఉండిపోయారు. 2021లో అప్పటి అధ్యక్షుడు జొవెనెల్ను సాయుధులు ఇంట్లో ఉండగా∙ చంపారు. అప్పటి నుంచి హెన్రీ ఆపద్ధర్మ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. -
ఖట్టర్ రాజీనామా
చండీగఢ్: హరియాణాలో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీనియర్ నేత మనోహర్లాల్ ఖట్టర్ రాజీనామా చేయడం మొదలు ఓబీసీ నేత నాయబ్ సైనీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడందాకా మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. సంకీర్ణ ప్రభుత్వంలో దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో విభేదాలు ముదరడంతో ఖట్టర్ సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చిందని వార్తలొచ్చాయి. అయితే ఖట్టర్ను లోక్సభ ఎన్నికల్లో బరిలో నిలిపేందుకే బీజేపీ ఆయనను సీఎం పీఠం నుంచి దింపేసిందని మరో వాదన వినిపించింది. హరియాణాలో లోక్సభ సీట్ల సర్దుబాటు విషయంలో జేజేపీతో బీజేపీకి ఏకాభిప్రాయం కుదరకపోవడంతో తెగదెంపులు చేసుకోవాల్సి వచ్చిందని సమాచారం. దీంతో చివరకు సీఎం ఖట్టర్, 13 మంది మంత్రులు రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయను కలిసి తమ రాజీనామా లేఖలను సమర్పించారు. రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. ఆ తర్వాత బీజేపీ ఎమ్మెల్యేలు హరియాణా నివాస్లో కలిసి 54 ఏళ్ల సైనీని తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలంటూ సైనీ గవర్నర్ను కలిసి కోరారు. ఇందుకు గవర్నర్ ఒప్పుకోవడంతో హరియాణా ముఖ్యమంత్రిగా నాయబ్ మంత్రులుగా మరో ఐదుగురు ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం చకచకా జరిగిపోయాయి. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఖట్టర్ హాజరయ్యారు. జేజేపీతో పొసగని పొత్తు సార్వత్రిక ఎన్నికల వేళ రాష్ట్రంలో బీజేపీ–జేజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి నూకలు చెల్లిపోయాయి. హరియాణాలోని మొత్తం 10 లోక్సభ స్థానాల్లోనూ పోటీచేస్తామని జేజేపీ పార్టీ పట్టుబట్టడంతో పార్టీతో పొత్తుకు బీజేపీ ఫుల్స్టాప్ పెట్టిందని తెలుస్తోంది. ఖట్టర్ రాజీనామా తర్వాత డెప్యూటీ సీఎం పదవి నుంచి జేజేపీ నేత దుష్యంత్ తప్పుకోవాల్సి వచ్చింది. గత లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 10 ఎంపీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈసారీ గెలుపు ఖాయమని భావిస్తోంది. అందుకే గెలవబోయే స్థానంలో ఖట్టర్ను నిలపాలని బీజేపీ భావిస్తోంది. కులగణన డిమాండ్ను కాంగ్రెస్ తెరమీదకు తెచ్చిన నేపథ్యంలో జనాభాలో 30 శాతమున్న ఓబీసీ వర్గానికి చెందిన సైనీని సీఎంగా చేసింది. 2014లో తొలిసారి ఎంపీ అయిన ఖట్టర్ను సీఎంగా ఎంచుకున్నట్లే తొలిసారి ఎంపీ అయిన నాయబ్నూ సీఎంగా కమలదళం ఎన్నుకుంది. ప్రస్తుత హరియాణా శాసనసభ కాలపరిమితి అక్టోబర్తో ముగియనుంది. ఈలోపు ఓబీసీ నేతతో సీఎం పదవిని భర్తీచేసి ఓబీసీలను తమవైపు తిప్పుకోవాలని పార్టీ భావిస్తోంది. బలపరీక్షకు అవకాశమివ్వండి తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, బలనిరూపణకు బుధవారం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ నూతన సీఎం సైనా గవర్నర్కు లేఖ రాశారు. 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో 41 మంది బీజేపీ సభ్యులున్నారు. తమకు ఆరుగురు స్వతంత్య్ర ఎమ్మెల్యేలు, ఒక హరియాణా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది. జేజేపీకి 10 మంది, కాంగ్రెస్కు 30 మంది, ఇండియన్ నేషనల్ లోక్దళ్కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. -
HAITI: హైతీ ప్రధాని రాజీనామా
పోర్ట్ ఆవ్ ప్రిన్స్: హైతీ ప్రధాని ఏరియెల్ హెన్రీ తన పదవికి రాజీనామా చేశారు. హెన్రీ రాజీనామాను ఆమోదించినట్లు చైర్ ఆఫ్ ద కరేబియన్ కమ్యూనిటీ ఇర్ఫాన్ అలీ ప్రకటించారు. హెన్రీ హైతీకి చేసిన సేవలకుగాను ఈ సందర్భంగా అలీ ధన్యవాదాలు తెలిపారు. దేశంలో తిరుగుబాటు చేసిన సాయుధ గ్యాంగులతో పోరాటంలో సహకరించాల్సిందిగా ఐక్యరాజ్యసమితి(యూఎన్) ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మిషన్ను కోరేందుకు గత నెల హెన్రీ కెన్యా వెళ్లారు. సరిగ్గా ఈ సమయంలో రాజధాని పోర్ట్ ఆవ్ ప్రిన్స్లో ఒక్కసారిగా పెద్ద ఎత్తున హింస చెలరేగింది. దీంతో హెన్రీ దేశం బయటే అమెరికాకు చెందిన పూర్టో రికో ప్రాంతంలో ఉండిపోవాల్సి వచ్చింది. సాయుధ గ్యాంగులు హెన్రీ దిగిపోవాల్సిందే అని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో హైతీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు సోమవారం జమైకాలో ప్రాంతీయ నేతల సమావేశం జరిగింది. ఇంతలోనే హెన్రీ తన రాజీనామా సమర్పించారు. 2021లో అప్పటి దేశాధ్యక్షుడు మొయిస్ హత్య తర్వాత హెన్రీ హైతీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. హైతీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటు ప్రయత్నాలు వేగవంతం చేయాలని అమెరికా కూడా ఇప్పటికే కోరింది. హెన్రీ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని, ఎన్నికలు జరగకుండా వాయిదా వేస్తున్నారని దేశంలో ఆయనపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. హైతీలో తొలుత శాంతి భద్రతలు పునరుద్ధరించాలని, స్వేచ్ఛాయుత ఎన్నికలు జరిగేందుకు కావాల్సిన వాతావరణాన్ని కల్పించాలని అమెరికా విదేశాంగ శాఖ కార్యదర్శి ఆంటోని బ్లింకెన్ కోరారు. 2016 నుంచి హైతీలో ఎన్నికలు జరగలేదు. ఇదీ చదవండి.. అమెరికాలో టిక్టాక్ పాలిటిక్స్.. ట్విస్ట్ ఇచ్చిన ట్రంప్ -
ఈసీ గోయెల్ రాజీనామా.. కపిల్ సిబల్ సంచలన వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామాపై రాజ్యసభ ఎంపీ, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ కీలక వ్యాఖ్యలు చేశారు. లోక్సభ ఎన్నికలకు ముందు ఎన్నికల కమిషనర్ రాజీనామా నేపథ్యంలో ఎన్నికల కమిషన్(ఈసీ) నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుందా అని సిబల్ ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం సిబల్ మీడియాతో మాట్లాడారు. ‘ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరపడం ఎన్నికల కమిషన్ విధి. అయితే గత పదేళ్లలో ఈసీ కేంద్ర ప్రభుత్వ మరో విభాగంలా తయారైంది’అని సిబల్ విమర్శించారు. దీనికి తోడు సిబల్ ఆదివారం ఎక్స్(ట్విటర్)లోనూ గోయెల్ రాజీనామాపై ఒక పోస్టు పెట్టారు. ‘దారి క్లియరైంది. కమిషన్ మొత్తం ఎస్ చెప్పే వ్యక్తులతో నింపండి. అన్ని రాజ్యాంగ బద్ధ సంస్థలకు ఇది వర్తిస్తుంది’ అని గోయెల్ రాజీనామాను ఉద్దేశించి సిబల్ సెటైర్లు వేశారు. కాగా, లోక్సభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ కొద్దిరోజుల్లో వెలువడుతుందనగా ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయెల్ ఆకస్మిక రాజీనామా సంచలనం రేపింది. ఈయన రాజీనామా దేశంలో రాజకీయ దుమారానికి దారి తీసింది. ఇదీ చదవండి.. ఎన్నికల వేళ ఈడీ దూకుడు.. లాలూ సన్నిహితుడి అరెస్టు -
కాంగ్రెస్కు భారీ షాక్.. పార్టీకి సీనియర్ నేత గుడ్బై
గాంధీనగర్: లోక్సభ ఎన్నికలకు ముందు గుజరాత్లో కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ సీనియర్ నేత, పోర్బందర్ ఎమ్మెల్యే అర్జున్ మోద్వాదియా ఆ పార్టీకి రాజీనామా చేశారు. కాగా మోద్వాదియా గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. తన రాజీనామాతో ఆ పార్టీతో నాలుగు దశాబ్ధాల అనుబంధానికి గుడ్బై చెప్పారు. ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సోమవారం గుజరాత్ అసెంబ్లీ స్పీకర్కు అందజేశారు. అదే విధంగా పార్టీ నుంచి వైదొలగుతున్న విషయంపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేకు అర్జున్ మోద్వాదియా లేఖ రాశారు. ప్రజలకు సేవ చేయడంలో తాను నిస్సహాయుడిగా మారినట్లు భావిస్తూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. అయోధ్యలో రామామందరం ప్రారంభ కార్యక్రమానికి ఆహ్వానాన్ని తిరస్కరించడం తన రాజీనామాకు కారణమని మోద్వాదియా తెలిపారు. కాంగ్రెస్ ప్రజల మనోభావాలను దెబ్బతీసిందని, ప్రజల మనోభావాలను అంచనా వేయడంలో ఆ పార్టీ విఫలమైందని ఆరోపించారు. ప్రాణ ప్రతిష్ట వేడుక దృష్టి మరల్చడానికి, అస్సాంలో గొడవలు సృష్టించడానికి రాహుల్ ప్రయత్నించారని మండిపడ్డారు. గత నాలుగు దశాబ్దాలుగా త పట్ల చూపుతున్న అభిమానానికి పార్టీ నాయకత్వానికి, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. మోద్వాదియా గతంలో గుజరాత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, విపక్ష నేతగా వ్యవహరించారు. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మోద్వాదియా పోర్బందర్ నుంచి ఎన్నికయ్యారు. చదవండి: ఆప్ హెడాఫీస్ ఖాళీకి డెడ్లైన్ విధించిన సుప్రీం -
టీడీపీలో రాజీనామా ప్రకంపనలు
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, అనంతపురం/మడకశిర/ఉదయగిరి: టీడీపీ అధినేత చంద్రబాబుకు సొంత పార్టీలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలపై సీనియర్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఇప్పటికే ముఖ్య నాయకులు ఆ పార్టీని వీడిపోగా మరికొందరు అదే బాటలో ఉన్నారు. అన్ని జిల్లాల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. అనంతపురంలో తొమ్మిది నియోజకవర్గాల్లో ప్రకటించిన అభ్యర్థులపై వ్యతిరేకత వ్యక్తమవడంతో మిగిలిన స్థానాల్లో అభ్యర్థిత్వాలకోసం చేపడుతున్న ఐవీఆర్ఎస్ సర్వే పార్టీలో మంటలు రేపుతున్నాయి. కోనసీమలో గొల్లపల్లి రాజీనామా ప్రభావం టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు ఆ పార్టీకి రాజీనామా చేసి బుధవారం వైఎస్సార్సీపీలో చేరిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో చర్చనీయాంశమయ్యాయి. చంద్రబాబు తనను అవమానించారని, రాజోలు సీటు ఇవ్వకుండా మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ప్రభావం రాబోయే ఎన్నికల్లో కోనసీమ ప్రాంతంలో కీలక ప్రభావం చూపుతుందని చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు(కలవపూడి శివ) కూడా కొద్దిరోజులుగా అధినేతపై తీవ్రంగా మండిపడుతున్నారు. పార్టీ కోసం ఏళ్ల తరబడి పని చేసిన తనను ఇబ్బంది పెడుతున్నారని, తనకు కాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకి సీటు ఇవ్వడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. తానేంటో ఈ ఎన్నికల్లో టీడీపీకి చూపిస్తానని, ప్రజాక్షేత్రంలో తన సత్తా చూపిస్తానని ఇప్పటికే ప్రకటించారు. త్వరలో ఆయన టీడీపీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ వీడనున్న ముఖ్యనేతలు కృష్ణా జిల్లా అవనిగడ్డ సీటును జనసేనకు కేటాయించాలని నిర్ణయించడంతో మాజీ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి జాబితాలో తన పేరు కనిపించకపోవడం చాలా సంతోషంగా ఉందంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. పార్టీని వదిలేయాలని ఆయనపై కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారు. ఆయన కూడా అందుకు సిద్ధమవుతున్నారు. ఇక పెడన సీటును కాగిత కృష్ణప్రసాద్కి కేటాయించడంతో టీడీపీ ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాస్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన కూడా టీడీపీకి దూరమవుతారనే ప్రచారం జరుగుతోంది. విజయనగరం జిల్లా గజపతినగరం మాజీ ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు, అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తమకు సీట్లు దక్కకపోవడంతో తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు వారిని బుజ్జగించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఇప్పటికే విజయవాడ ఎంపీ కేశినేని నాని, తిరువూరు మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాసు టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరగా, నూజివీడు టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు కూడా అదే బాటలో ఉన్నారు. ‘సర్వే’ అస్త్రం... బాబు తత్వం... ఏళ్ల తరబడి జెండాలు మోసేవారికి... కష్టకాలంలో అంటిపెట్టుకుని ఉన్నవారికి తెలుగుదేశం పార్టీలో ప్రాధాన్యం దక్కడం లేదన్నది ఆ పార్టీ నేతల ఆవేదన. అభ్యర్థిత్వాలను ఖరారు చేసేటపుడు నచ్చనివారిని తప్పించేందుకు సీనియర్లని కూడా చూడకుండా ఐవీఆర్ఎస్(ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్స్ సిస్టం) పేరుతో గందరగోళానికి గురిచేస్తున్నారనీ... డబ్బు పెట్టగలిగే కాంట్రాక్టర్లను ఖరారు చేసే విషయంలో ఇదేమీ పట్టించుకోవడంలేదని వారంతా వాపోతున్నారు. మొన్నటి వరకూ వ్యూహకర్త రాబిన్శర్మ రిపోర్టులో మీ పరిస్థితి బాగో లేదని చెబుతూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు ఐవీఆర్ఎస్ పేరుతో తమను తప్పించేందుకు కుయుక్తులు పన్నుతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లాలో తొమ్మిది చోట్ల ప్రకటించిన టీడీపీ అభ్యర్థుల విషయంలో వ్యతిరేకత రావడంతో మిగిలిన ఐదు స్థానాల్లో ఇప్పటికిప్పుడు సర్వే పేరుతో హడావుడి చేస్తున్నారు. గుంతకల్లులో గుమ్మనూరు జయరాం కావాలా, బి.కె.పార్థసారథి కావాలా అని అడిగారు. పుట్టపర్తిలో పల్లె రఘునాథరెడ్డి కావాలా, వేణుగోపాల్ కావాలా అని అడిగారు. ఈ వాయిస్ రెస్పాన్స్ సిస్టం సర్వేలో వచ్చిన మెజారిటీని బట్టి అభ్యర్థులను నిర్ణయిస్తారని చెబుతున్నారు. దీనిపై ఆ పార్టీ నేతల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కల్యాణదుర్గంలో అమిలినేని సురేంద్రబాబుకు ఇచ్చినపుడు ఏ సర్వే నిర్వహించారని వారు నిలదీస్తున్నారు. డబ్బున్న వారికే ప్రాధాన్యం ఇస్తామంటే ఇక పార్టీ ఎందుకు? ప్రజలు ఎందుకు? అంటూ కొంతమంది నేతలు తమ అనుచరుల ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిస్తుండటం చూస్తే ఇక్కడ వ్యతిరేకత ఎంతలా ఉందో అర్థమవుతోంది. రాజీనామాపై నేడు బొల్లినేని నిర్ణయం టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు రాజీనామా బాటలో పయనిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ స్థాయిలో పలుకుబడిన కలిగిన ఆయన చంద్రబాబు చిక్కుల్లో ఉన్నప్పుడు ఎంతగానో సహాయపడ్డారు. ఉదయగిరిలో 2012లో బొల్లినేని ఉదయగిరి టీడీపీలోకి వచ్చి 2012 ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా మేకపాటి చంద్రశేఖర్రెడ్డిపై పోటీచేసి పరాజయం చెందారు. 2014 ఎన్నికల్లో గెలిచినప్పటికీ ఆర్థికంగా దెబ్బతిన్నారు. తాను టీడీపీలో చేరకముందు మహారాష్ట్రలో చేసిన పలు కాంట్రాక్టు పనులకు సంబంధించి అవినీతి కేసుల్లో ఇరుక్కున్నా.. అధినేత తనకు సహాయపడలేదని పలుమార్లు అనుచరుల వద్ద వాపోయారు. 2019 ఎన్నికల్లో ఓటమి తప్పదని తెలిసినా అధినేత మాట కాదనలేక పోటీచేసి పరాజయం చెందారు. తీరా ఈసారి టికెట్టు ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్కు ఇవ్వడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందారు. బొల్లినేనికి చెక్పెట్టే ఆలోచనలో చంద్రబాబు, లోకేశ్ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ముందుగా పార్టీ వద్ద రూ.30 కోట్లు డిపాజిట్ చేయాలని షరతు పెట్టినట్లు సమాచారం. నగదు డిపాజట్ చేయడంలో ఆలస్యం జరగడంతో కాకర్లకు టికెట్ ఖరారు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అధినేత వైఖరికి తీవ్ర మనస్తాపం చెందిన బొల్లినేని కలిగిరిలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ముఖ్య అనుచరులతో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అనుచరుల అభీష్టం మేరకు నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. సునీల్ మాకొద్దు ‘బాబో’య్ శ్రీసత్యసాయి జిల్లా మడకశిర స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే ఈరన్న తనయుడు డాక్టర్ సునీల్కుమార్కు కేటాయించడాన్ని నియోజకవర్గ ఇన్చార్జ్ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు వ్యతిరేకిస్తున్నారు. బుధవారం మడకశిరలో ఆ వర్గానికి చెందిన ముఖ్య నాయకులంతా విలేకరుల సమావేశం నిర్వహించి సునీల్కుమార్కు ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించబోమని తేల్చి చెప్పారు. ఆయన్ను మార్చకుంటే పార్టీకి రాజీనామా చేస్తామన్నారు. -
రాజీనామా వార్తలను ఖండించిన సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు
-
AP:టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి గుడ్ బై
సాక్షి,తూర్పుగోదావరి: టీడీపీకి మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు రాజీనామా చేశారు. తన ఆత్మగౌరవాన్ని చంద్రబాబు దెబ్బతీసినందునే రాజీనమా చేస్తున్నట్లు గొల్లపల్లి తెలిపారు. ఈ మేరకు బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆయన ఒక బహిరంగ లేఖ రాశారు. కష్టకాలంలో పార్టీ కోసం పనిచేశానని లేఖలో గొల్లపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. రాజోలులో సీటు ఇవ్వకుండా అవమానించారని తెలిపారు. ఇటీవల టీడీపీ, జనసేన ప్రకటించిన ఉమ్మడి ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో గొల్లపల్లి పేరు లేకపోవడంతో ఆయన కలత చెందారు. పొత్తులో భాగంగా రాజోలు సీటును జనసేనకు టీడీపీ కేటాయించింది. దీంతో ఇక టికెట్ రాదని గొల్లపల్లి పార్టీని వీడినట్లు తెలుస్తోంది. కాగా, భవిష్యత్ కార్యాచరణపై ఆయన త్వరలో నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది. గొల్లపల్లి త్వరలో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదీ చదవండి.. టీడీపీ జనసేన మధ్య తారాస్థాయికి సీటు హీట్ -
కారు దిగిన రంగారెడ్డి జెడ్పీ చైర్పర్సన్
మీర్పేట, సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి బీఆర్ఎస్కు గుడ్బై చెప్పా రు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. సోమవారం గాంధీ భవ న్లో కాంగ్రెస్ వ్యవహా రాల రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్టు అనితారెడ్డి, తీగల కృష్ణారెడ్డి ప్రకటించారు. మీర్పేటలోని టీకేఆర్ కళాశాలలో ఆదివారం మీడియాతో జెడ్పీ చైర్పర్సన్ అనితారెడ్డి మాట్లాడారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందనీ, ఫలితంగానే ఇటీవల ఎన్నికల్లో పార్టీ ఓటమిపాలైందన్నారు. స్థానిక సంస్థల పరిస్థితిని సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా నిధులు సమకూర్చడంతో పాటు అధికారాలు ఇస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.సహకరించినా ప్రాధాన్యత ఇవ్వలేదు: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. నగర మేయర్గా, ఎమ్మెల్యేగా, హుడా చైర్మన్గా దశాబ్దాల పా టు సేవ చేశానన్నారు. తన ఓటమి తరువాత కాంగ్రెస్లో గెలిచిన వారికి బీఆర్ ఎస్లో మంత్రి పదవి ఇచ్చారని, అయినా పార్టీకి సహకరించినా ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సీఎం రేవంత్రెడ్డి, తాను గతంలో కలిసి పనిచేశామని.. ఆయన పిలుపు మేరకే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. -
లోక్సభ ఎన్నికల వేళ.. బీఎస్పీకి షాక్
లక్నో: బహుజన్ సమాజ్వాదీ పార్టీ(బీఎస్పీ) ఎంపీ రితేష్ పాండే బీఎస్పీ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. మామావతి నేతృత్వంలోని బీఎస్పీ పార్టీకి రాజీనామా చేసినట్లు ఎంపీ రితేష్ పాండే.. ఆదివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఆయన ఉత్తరప్రదేశ్లోని అంబేద్కర్నగర్ నుంచి లోక్సభ బీఎస్పీ ఎంపీగా ప్రాతినిధ్యం వస్తున్నారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయన బీఎస్పీ రాజీనామా చేయటంతో బీజేపీలో చేరుతారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. बहुजन समाज पार्टी की प्राथमिक सदस्यता से त्यागपत्र pic.twitter.com/yUzVIBaDQ9 — Ritesh Pandey (@mpriteshpandey) February 25, 2024 ఉత్తరప్రదేశ్ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించిన బీఎస్పీ పార్టీ నేతలు,కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ‘చాలా కాలంగా నాకు పార్టీలో ఎటువంటి గుర్తింపు లభించటం లేదు. పార్టీ సమావేశాల్లో కూడా నాకు సీనియర్ నేతలు తగిన ప్రాధాన్యత ఇవ్వటం లేదు. అయనా.. నా నియోజకర్గం ప్రజలు, పార్టీ కార్యకర్తలతో సమావేశం అవుతూ ఉన్నా. ఇక పార్టీని నా సేవలు అవసరం లేదని భావిస్తున్నా. అందుకే పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నా’ అని ఎంపీ రితేష్ పాండే తెలిపారు. మరోవైపు ఎంపీ రితేష్ పాండే బీజేపీ చేరుతారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. 10 రోజుల క్రితం ప్రధాన మంత్రి నరేంద్రమోదీని కలిసిన పాండే.. ఒక సోషల్ మీడియా పోస్ట్లో మోదీని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. దీంతో ఆయన బీజేపీలో చేరుతారని చర్చ జరుగుతోంది. బీజేపీలో చేరిన రితేష్ పాండే బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్సీ)కి రాజీనామా చేసిన అంబేద్కర్ నగర్ లోక్సభ నియోజకవర్గ ఎంపీ రితేష్ పాండే ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి బ్రజేష్ పాఠక్ సమక్షంలో బీజేపీలో చేరారు. -
పోర్చుగల్ ప్రధాని రాజీనామా.. ఆ ఆరోపణలే కారణం
లిస్బన్: అవినీతి ఆరోపణలపై పోర్చుగల్ ప్రధానమంత్రి కోస్టా రాజీనామా చేశారు. గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, లిథియం గనుల కుంభకోణాలకు సంబంధించి ఆయన ఇంటిపై ఇటీవల పోలీసులు దాడులు జరిపారు. ఈ దాడుల్లో భాగంగా కోస్టా ముఖ్య సలహాదారుడిని పోలీసులు అరెస్టు చేశారు. అవినీతి కేసులో కోస్టాపై దర్యాప్తు జరుగుతోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కోస్టా తన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే తాను ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని కోస్టా స్పష్టం చేశారు. దర్యాప్తులో ఏం తేలినప్పటికీ తాను మళ్లీ ప్రధాని పదవి చేపట్టనని ఆయన తేల్చి చెప్పారు. కోస్టా రాజీనామాను ఆమోదించినట్లు పార్లమెంట్ను రద్దు చేసే ప్రక్రియ ప్రారంభించినట్లు పోర్చుగల్ అధ్యక్షుడు మార్సెలో రెబెలో తెలిపారు. దేశంలో మళ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదన్నారు. అయితే సోషలిస్టులు మరో నేత ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. కోస్టా ఆధ్వర్యంలో పోర్చుగల్ వేగవంతమైన ఆర్థిక వృద్ధి సాధించింది. పర్యాటక రంగం పరుగులు పెట్టింది. పెట్టుబడిదారులకు పోర్చుగల్ గమ్యస్థానంగా మారింది. ఇదీ చదవండి.. థాయ్ మాజీ ప్రధానికి పెరోల్ -
టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి రాజీనామా
కోల్కతా: ప్రముఖ బెంగాలీ నటి, టీఎంసీ ఎంపీ మిమి చక్రవర్తి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనా మా చేసినట్లు చెప్పారు. రాజకీయాలు తనకు ఇష్టం లేని అంశమని చెప్పారు. జాదవ్పూర్ నుంచి మొదటిసారిగా లోక్సభకు ఎన్నికైన మిమి గురువారం టీఎంసీ చీఫ్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీని రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలో కలిశారు. ఈ నెల 13వ తేదీనే పదవికి రాజీనామా లేఖను పంపినట్లు అనంతరం తెలిపారు. తనకు రాజకీయాలు పడవని అనుభవం ద్వారా తెలుసుకున్నానని చెప్పారు. అయితే, రాజీనామాను సీఎం మమత అంగీకరించిందీ లేనిదీ మిమి తెలుపలేదు. టీఎంసీ అంగీకరించాక నిబంధనల మేరకు లోక్సభ స్పీకర్కు రాజీనామా లేఖను అందజేస్తానన్నారు. మరికొద్ది నెలల్లోనే లోక్సభ ఎన్నికలు జరగనుండగా ఈ పరిణామం చోటుచేసుంది. -
TN: మంత్రి పదవికి సెంథిల్ బాలాజీ రాజీనామా
చెన్నై: మనీలాండరింగ్ కేసులో అరెస్టయి జైలులో ఉన్న తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ మంగళవారం ఉదయం తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని డీఎంకే పార్టీ వర్గాలు ధృవీకరించాయి. మరో రెండు రోజుల్లో మద్రాస్ హైకోర్టులో బాలాజీ బెయిల్ పిటిషన్ విచారణకు రానున్న నేపథ్యంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. న్యాయపరమైన చిక్కుల వల్లే బాలాజీ తన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఏడాది జూన్ 14న మనీలాండరింగ్ కేసులో బాలాజీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)అరెస్టు చేసింది. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో బాలాజీపై చెన్నై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ కేసు నమోదు చేశారు. ఈ కేసులో మనీలాండరింగ్ జరిగిందన్న ఆరోపణలపై ఈడీ బాలాజీని అరెస్టు చేసింది. అరెస్టయి జైలులో ఉన్నప్పటికీ బాలాజీని సీఎం స్టాలిన్ మంత్రివర్గంలోనే కొనసాగించారు. పోర్ట్ఫోలియో మాత్రం కేటాయించలేదు. అయితే దీనిపై హైకోర్టు ఇటీవల అసంతృప్తి వ్యక్తం చేసింది. బాలాజీని మంత్రి పదవిలో కొనసాగించే విషయమై మరోసారి ఆలోచించాలని సీఎం స్టాలిన్కు కోర్టు సూచించింది. దీంతో బెయిల్ పిటిషన్ రెండోసారి హైకోర్టు ముందు విచారణకు రానున్న నేపథ్యంలో బాలాజీ మంత్రి పదవికి రాజీనామా చేయడం గమనార్హం. ఇదీ చదవండి.. హస్తినలో హై టెన్షన్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
బుల్లితెర నటి కేసులో ట్విస్ట్.. ప్రియుడు సూసైడ్!
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement