-
రోబో తోటమాలి!
కృత్రిమ మేధ ఇందుగలదు, అందులేదనే సందేహానికి తావులేకుండా విస్తరిస్తోంది. అన్ని రంగాల్లోనూ ఏఐ వాడకం ఇంతింతై... అన్నట్టుగా క్రమంగా పెరిగిపోతోంది. వ్యవసాయంలో కూడా ఇప్పటికే కృత్రిమ మేధను పలు రకాలుగా ఉపయోగిస్తున్నారు. నెదర్లాండ్స్లో తులిప్స్ రైతులు ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేశారు. తెగుళ్ల బారిన పడ్డ పూల ఏరివేతకు హైటెక్ బాట పట్టారు. వాటిని ఎప్పటికప్పుడు గుర్తించి ఏరేసేందుకు ఏఐ సాయంతో రూపొందిన రోబోను ఉపయోగిస్తున్నారు. ఖరీదు చాలా ఎక్కువే అయినా ఈ రోబో మనుషులకు ఏమాత్రంతీసిపోకుండా పని పూర్తి చేస్తూ మన్ననలు అందుకుంటోంది. దాంతో నెదర్లాండ్స్ అంతటా తులిప్ తోటల్లో ఈ రోబోల వాడకం నానాటికీ పెరిగిపోతోంది. అందాల తులిప్ పూలకు నెదర్లాండ్స్ పెట్టింది పేరు. అంతేగాక ప్రపంచంలోకెల్లా అతి పెద్ద తులిప్స్ ఉత్పత్తిదారు కూడా. సీజన్లో విరగబూసి అందాలు వెదజల్లే అక్కడి తులిప్ తోటలను చూసేందుకు ప్రపంచం నలుమూలల నుంచీ పర్యాటకులు బారులు తీరతారు. ఇలా తులిప్స్ సాగు ఉత్పత్తిపరంగానే గాక పర్యాటకంగా కూడా నెదర్లాండ్స్ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలుస్తోంది. అయితే వాటి సాగు ఖరీదైన వ్యవహారం. పూలను, మొక్కలను కంటికి రెప్పలా కాపాడుకోవాలి. చీడపీడల బారిన పడకుండా నిరంతరం పర్యవేక్షిస్తుండాలి. వైరస్లు, తెగుళ్ల బారిన పడ్డ పూలు, మొక్కలను ఎప్పటికప్పుడు కనిపెట్టి ఏరివేయడం చాలా కీలకం. లేదంటే మొక్కలు బలహీనపడిపోతాయి. పూలు కూడా చిన్నగా, బలహీనంగా పూస్తాయి. పైగా వైరస్ తోటంతా విస్తరించి మొత్తానికే చేటు తప్పదు. ఇప్పటిదాకా మనుషులే రాత్రింబవళ్లూ తోటల్లో కలియదిరుగుతూ ఒక్కో మొక్కనూ, పువ్వునూ పట్టి చూస్తూ పాడైన వాటిని గుర్తించి ఏరేసేవారు. ఇందుకు ప్రత్యేక నైపుణ్యం అవసరం. వారిని సిక్నెస్ స్పాటర్స్గా పిలిచేవారు. కానీ ఏఐ సాయంతో తయారు చేసిన రోబో ఇప్పుడు వారికి దీటుగా ఈ పని చేసి పెడుతోంది. తులిప్ తోటలను తెగుళ్ల బారినుంచి కాపాడే హైటెక్ ఆయుధంగా మారుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45కు పైగా ఏఐ రోబోలు తులిప్ తోటలను కాపు కాస్తున్నాయి. చీడపీడలు, రోగాల బారినుంచి వాటిని కాపాడే పనిలో తలమునకలుగా ఉన్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ ఇలా పని చేస్తుంది... ► ఏఐ రోబో తులిప్ తోటల్లో ఒక్కో సాలు గుండా గంటకు కిలోమీటర్ వేగంతో నింపాదిగా కదులుతుంది. ►ఒక్కో మొక్కనూ, ఒక్కో పూవునూ, దాని తాలూకు రెమ్మలను అణువణువూ పరీక్షిస్తుంది. ఫ్రంట్ కెమెరాతో వేలాది పొటోలు తీస్తుంది. ►తనలో స్టోరై ఉన్న సమాచారం సాయంతో ఆ ఫొటోలను కూలంకషంగా విశ్లేషిస్తుంది. తద్వారా సదరు మొక్క, పూవు పాడైందీ, బాగున్నదీ నిర్ణయిస్తుంది. ►పాడైనవాటిని ఎప్పటికప్పుడు ఏరేస్తూ ముందుకు సాగుతుంది. ►ఈ రోబోలను తయారు చేసింది హెచ్2ఎల్ రోబోటిక్స్ లిమిటెడ్కు చెందిన ఎరిక్ డీ జోంగ్ కంపెనీ. ►తెగుళ్ల బారిన పడ్డ మొక్కలు, పూలను పక్కగా గుర్తించేందుకు కావాల్సిన సమాచారమంతటినీ రోబోకు ఫీడ్ చేసినట్టు కంపెనీ వివరించింది. ►ఈ సమాచారాన్ని తులిప్స్ సాగు చేసే రైతులు, సిక్నెస్ స్పాటర్ల నుంచి కంపెనీ సేకరించింది. కచ్చితత్వంతో కూడిన సాగు... అలెన్ విసర్ అనే ఆసామి తన తులిప్ తోటలో రెండేళ్లుగా ఏఐ రోబోను వాడుతున్నాడు. ఆయన కుటుంబం మూడు తరాలుగా తులిప్స్సాగు చేస్తోంది. ‘‘ఈ రోబో ఖరీదు 2 లక్షల డాలర్లు! అంత డబ్బుతో ఓ ఖరీదైన స్పోర్ట్స్ కారే కొనుక్కోవచ్చు’’ అన్నాడాయన. అయితే, ‘స్పోర్ట్స్ కారు పాడైన తులిప్లను ఏరిపడేయదు కదా!’ అంటూ చమత్కరించాడు. ‘‘ఈ రోబో ఖరీదైనదే. కానీ నిపుణులైన సిక్నెస్ స్పాటర్లు నానాటికీ తగ్గిపోతున్న సమయంలో సరిగ్గా చేతికి అందివచ్చింది’’ అని చెప్పాడు. దీన్ని ‘కచ్చితత్వంతో కూడిన సాగు’గా అభివరి్ణంచాడు! కొసమెరుపు నెదర్లాండ్స్ ఉత్తర కోస్తా తీరంలో ప్రఖ్యాత డబ్ల్యూఏఎం పెన్సింగ్స్ తులిప్ తోటలోని ఏఐ రోబోకు అక్క డే జీవితాంతం సిక్నెస్ స్పాటర్గా పని చేసి రిటైరైన థియో వాన్డర్ వూర్ట్ పేరు పెట్టారు. దీని పనితీరు ఆయన్ను కూడా మెప్పించడం విశేషం. ‘‘తోటల్లో తిరిగీ మా నడుములు పడిపోయేవి! మా పనిని ఈ రోబో అలవోకగా చేసేస్తోంది. పాడైన మొ క్కలు, పూలను మాకు ఏ మాత్రమూ తీసిపోని విధంగా గుర్తించి ఏరేస్తోంది’’ అంటూ కితాబిచ్చాడాయన! -
స్ట్రీట్ కేఫ్లో సర్వ్ చేస్తున్న రోబో వెయిటర్! నెటిజన్లు ఫిదా
రోబోలను పలు రంగాల్లో తీసుకొచ్చి పనిచేయించడాన్ని చూశాం. వాటిని మాల్స్, ఆస్పత్రి, పోలీస్, తదితర శాఖల్లో ప్రవేశ పెట్టి చూపించారు. అలాగే ఇటీవల బెంగుళూరు, నోయిడా, చెన్నె కోయింబత్తూర్ రోబోట్ నేఫథ్య రెస్టారెంట్లను ప్రారంభించి కస్టమర్లను ఆకర్షించింది. పైగా ఇవి అత్యంత ప్రజాధరణ పొందాయి కూడా. ఇప్పుడూ ఏకంగా స్ట్రీట్ కేఫ్ సెంటర్ల్లోకి కూడా ఆ సాంకేతికత వచ్చేసింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. ఆ వీడియోలో అహ్మదాబాద్లోని స్ట్రీట్ కేఫ్ పాప్ అప్ ట్రక్ వినియోగదారులకు రోబోట్ వెయిటర్ ఐస్ గోలాను సర్వ్ చేస్తూ కనిపిస్తుంది. ఇది వినియోగదారులకు రుచిగల ఐస్ గోలాలను చక్కగా సర్వ్ చేస్తుంది. ఈ రోబో పేరు ఐషా, ధర రూ. 1,35,000/-. అందుకు సంబంధించిన వీడియోని ఫుడ్ బ్లాగర్ కార్తీక్ మహేశ్వరి ఇన్స్టాగ్రామ్లో పంచుకున్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణను చూసి నెటిజన్లు వాహ్! అంటూ ప్రశంసిస్తూ పోస్టలు పెట్టారు. కాగా, నిజం చెప్పాలంటే ఈ రోబోటిక్ సాంకేతికతపై మహమ్మారి సమయంలో చైనా ఎక్కువగా ఆధారపడింది. అఖరికి భద్రతా ప్రోటోకాల్లను నిర్వహించడానికి కూడా రోబోట్లతోనే మోహరించింది. View this post on Instagram A post shared by Kartik Maheshwari (@real_shutterup) (చదవండి: ఆస్కార్ వేడుకల్లో హైలెట్గా మెస్సీ డాగ్! ఏం చేసిందంటే..!) -
పోఖ్రాన్ యుద్ధ విన్యాసాల్లో ‘రోబో డాగ్’ సత్తా!
భారత సైన్యం వ్యవస్థాగత నిఘాను మెరుగుపరచడానికి, పోరాట కార్యకలాపాల్లో సహాయానికి రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ను అభివృద్ధి చేసింది. ఈ నెల 12న పోఖ్రాన్లో జరగనున్న ఆర్మీ ఎక్సర్సైజ్లో ఈ రోబో డాగ్ తన సత్తా చాటనుంది. ‘మ్యూల్’ అంటే మల్టీ యుటిలిటీ లెగ్డ్ ఎక్విప్మెంట్. దీనిలో పలు ఫీచర్లు ఉన్నాయి. ‘మ్యూల్’.. థర్మల్ కెమెరాలు, రాడార్తో అనుసంధానమై ఉంటుంది. మంచు, ఎడారి, కఠినమైన నేల, ఎత్తయిన మెట్లు, కొండ ప్రాంతాలలో.. ప్రతి అడ్డంకిని దాటగలిగేలా ఈ రోబో డాగ్ను రూపొందించారు. దీనికి శత్రు లక్ష్యాలను మట్టుబెట్టగల సామర్థ్యం కూడా ఉంది. మార్చి 12న భారత సైన్యం రాజస్థాన్లోని పోఖ్రాన్లో స్వదేశీ ఆయుధాలు, సాయుధ దళాలకు చెందిన పరికరాల బలాన్ని ప్రదర్శించనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను భారత సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. దీనిలో ఇండియన్ ఆర్మీకి చెందిన రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ యాక్షన్ మోడ్లో కనిపించనుంది. ఈ రోబో డాగ్ 2023లోనే భారత సైన్యానికి చెందిన మిలిటరీ ఇంటెలిజెన్స్లో చేరింది. రోబోటిక్ డాగ్ ‘మ్యూల్’ కుక్క మాదిరిగా కనిపిస్తుంది. దీనికి నాలుగు కాళ్లు ఉంటాయి. ‘మ్యూల్’ బరువు దాదాపు 51 కిలోలు. దీని పొడవు 27 అంగుళాలు. ఇది ఒక గంటలో రీఛార్జ్ అవుతుంది. పది గంటల పాటు పని చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. శత్రు లక్ష్యాలపై కాల్పులు జరిపే సాంకేతికత ‘మ్యూల్’లో ఉంది. #BharatShakti स्वदेशीकरण से सशक्तिकरण Displaying the might of indigenous weapons & equipment of #IndianArmedForces. On 12 Mar 2024 at #Pokaran Field Firing Ranges (Rajasthan).#AatmanirbharBharat#YearofTechAbsorption@DefenceMinIndia@HQ_IDS_India@IAF_MCC@indiannavy pic.twitter.com/poRvYHjOZh — ADG PI - INDIAN ARMY (@adgpi) March 9, 2024 -
లైంగిక వేధింపులా?.. వివాదంలో మగ రోబో
విజన్ 2030ను సృష్టించుకుని.. ఆర్థిక వ్యవస్థను శక్తివంతంగా మార్చుకునేందుకు సాంకేతికతను సైతం అలవర్చుకుంది సౌదీ అరేబియా. అయితే ఆ సాంకేతికతే నేరాలు-ఘోరాలకు.. అందునా మహిళలపై అఘాయిత్యాలకు కారణమైతే ఎలా?.. తాజాగా అక్కడ జరిగిన ఓ ఘటన ఇప్పుడు నెట్టింట ఇంతటి విపరీతమైన చర్చకు దారి తీసింది. ఇంతకీ ఏం జరిగింది అంటారా?.. ముహమ్మద్.. ఇప్పుడు ఈ పేరు అక్కడి వార్తల్లో నిలిచింది. అలాగని అది మనిషి కాదు.. సౌదీ అరేబియా తొలి మగ రోబో(ఆండ్రాయిడ్). ఆ మగ రోబో ఓ మహిళా రిపోర్టర్ను అసభ్యంగా తాకబోయిందట!. అంతే.. టెక్నాలజీ భద్రమేనా? అనేది ఒక చర్చ అయితే.. లైంగిక వేధింపులను ఏమాత్రం తేలికగా తీసుకోని ఆ దేశంలో ఇలాంటి ఘటనని ఉపేక్షించొచ్చా? అనే కోణంలో మరో చర్చా నడవడం గమనార్హం. ఓ లైవ్ ఈవెంట్ జరుగుతున్న టైంలో.. రిపోర్టర్ను తాకేందుకు రోబో ప్రయత్నించిందట. వెంటనే అప్రమత్తమైన రిపోర్టర్ రావియా అల్ ఖ్వాసిమీ తన చెయ్యి అడ్డుపెట్టింది. కేవలం 8 సెకండ్ల నిడివి ఉన్న ఆ వీడియో నెట్టింట వైరల్గా మారింది. #UNUSUAL : In Saudi Arabia, a robot harassed a TV presenter during a live broadcast. Apparently there was a glitch in the robot's programming.#SaudiArabia #Robot #TVpresenter pic.twitter.com/qdF5Ye9YTe — upuknews (@upuknews1) March 7, 2024 ఈ వీడియోపై మామూలు చర్చ జరగడం లేదు. ఆ రోబో చర్య లైంగిక వేధింపుల కిందకే వస్తుందని వాదిస్తున్నారు కొందరు. దీనికి తోడు ఆ రిపోర్టర్ ఇబ్బందిగా ఫీలవ్వడం ఆ వాదనకు మరింత బలం చేకూరుస్తుందన్నది మరికొందరి వాదన. అందుకే శిక్షగా.. దానిని శాశ్వతంగా నిషేధించాలని కోరుతున్నారు. ఇక ఇంకొందరు మాత్రం.. ముహమ్మద్ అమాయకుడని.. ఆ రోబోకు జరిగిన ప్రొగ్రామింగ్.. ఆ ప్రొగ్రామింగ్ను ఇచ్చిన తప్పంతా అంటూ రోబోను వెనకేసుకొస్తున్నారు. సరదా కామెంట్లు చేసేవాళ్ల సంగతి సరేసరి. సౌదీ అరేబియాలో ఈవ్ టీజింగ్, లైంగిక వేధింపుల్లాంటి వాటిల్లో ఐదేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల సౌదీ రియాల్(మన కరెన్సీలో కోటి 70 లక్షలకు పైనే)జరిమానా విధిస్తారు సౌదీ అరేబియా తొలి మహిళా ఆండ్రాయిడ్ రోబో సారా. ఈ ఘటన జరిగిన సమయంలో సారా కూడా ఆ పక్కనే ఉంది. క్యూఎస్ఎస్ సిస్టమ్స్ అనే సంస్థ ముహమ్మద్ అనే రోబోను రూపొందించింది. అర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీలో సౌదీ అరేబియా సాధించిన పురోగతిని వివరించేందుకే ఈ రోబోను రూపొందించడం గమనార్హం. జనాలకు తనను తాను పరిచయం చేసుకునేందుకు దానికి ప్రోగ్రామింగ్ చేశారు. ఈ క్రమంలోనే అది తన చెయ్యిని ఆడిస్తూ ఉంది అంతే!. అయినా రోబో ఎక్కడైనా కావాలని వేధిస్తుందా? ఏంటి? అని అడిగేవాళ్లూ లేకపోలేదు. -
వినూత్నం: రోబో టీచరమ్మ.. పిల్లలు బుద్ధిగా, సైలెంట్గా ఉండాల్సిందే..
'సినిమాల్లో హ్యుమనాయిడ్ రోబోను చూడగానే పిల్లల సంతోషం ఇంతా అంతా కాదు. సినిమాల్లో కనిపించే రోబో క్లాస్రూమ్లోకి అడుగు పెడితే? ‘అబ్బో! ఆ అల్లరికి అంతు ఉండదు’ అనుకుంటాం. అయితే ‘ఐరిష్’ అనే ఈ రోబో ముందు మాత్రం పిల్లలు బుద్ధిగా, సైలెంట్గా ఉండాల్సిందే. ఇంతకూ ఎవరీ ఐరిష్?' కేరళలోని తిరువనంతపురం కేటీసీటీ హైయర్ సెకండరీ స్కూల్ లోకి ఫస్ట్ జెనరేటివ్ ఏఐ స్కూల్ టీచర్ ఐరిష్ అడుగు పెట్టింది. ఈ హ్యుమనాయిడ్ ఉపాధ్యాయురాలు మూడు భాషల్లో మాట్లాడగలదు. విద్యార్థులు అడిగే ప్రశ్నలకు స్పష్టంగా జవాబులు చెప్పగలదు. ఎడ్టెక్ ‘మేకర్ల్యాబ్స్’ రూపకల్పన చేసిన ఈ జెనరేటివ్ ఏఐ స్కూల్ టీచర్ కేరళలోనే కాదు దేశంలోనే మొదటిది. ‘ఐరిష్ నాలెడ్జ్బేస్ ఇతర ఆటోమేటెడ్ టీచింగ్ టూల్స్ కంటే విస్తృతంగా ఉంటుంది. ఎందుకంటే ఇది జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పనిచేస్తుంది’ అంటుంది మేకర్ ల్యాబ్స్. చదువుకు సంబంధం లేని సబ్జెక్ట్ల జోలికి ‘ఐరిష్’ వెళ్లదు. ‘కృత్రిమ మేధతో అవకాశాలు అనంతం అని చెప్పడానికి ఐరిష్ ఒక ఉదాహరణ. పిల్లలు అడిగే సందేహాలకు టీచర్లాగే ఐరిష్ సరిౖయెన సమాధానాలు ఇవ్వగలదు’ అంటున్నారు ‘మేకర్ల్యాబ్స్’ సీయీవో హరిసాగర్. ‘మేకర్ల్యాబ్స్తో కలిసి ఎన్నో రకాల వర్క్షాప్లు నిర్వహించాం. వీటి ద్వారా పిల్లలు రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 3డీ ప్రింటింగ్కు సంబంధించిన నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారు’ అంటున్నారు స్కూల్ ప్రిన్సిపాల్ మీరా ఎంఎన్. ఇవి చదవండి: International Womens Day 2024: ఆర్థిక స్వాతంత్య్రం అంటే? జీవితంపై అధికారం హక్కులపై ఎరుక -
మెరైన్ రోబో తయారుచేసిన ఐఐటీ పరిశోధకులు.. ఉపయోగాలివే..
సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న నేపథ్యంలో రోబో టెక్నాలజీకి ఆదరణ ఎక్కువవుతోంది. దాదాపు అన్నింట ఈ టెక్నాలజీని వాడుతున్నారు. మనుషులు వెళ్లలేని చోటుకు, ఒకవేళ కొన్ని పరిస్థితుల వల్ల వెళ్లినా అధిక ప్రమాదం పొంచి ఉండే ప్రదేశాల్లో ప్రత్యేక రోబోలను వినియోగిస్తున్నారు. సముద్ర గర్భంలో నిఘా పెట్టడం అంటే మాటలుకాదు. ఎన్నో సవాళ్లు ఎదుర్కొవాల్సి ఉంటుంది. కొన్ని మనిషి ప్రాణాలకే ప్రమాదం జరగొచ్చు. అలాంటి సందర్భాల్లో నీటి లోపల నిఘా కోసం ఐఐటీ మండి, ఐఐటీ పాలక్కడ్కు చెందిన పరిశోధకులు అధునాతన మెరైన్ రోబోను అభివృద్ధి చేశారు. సముద్ర జలాలు, ఇతర నీటి వనరుల్లో అట్టడుగుకు చేరుకొని పని చేసేలా ఈ రోబోను రూపొందించారు. ప్రస్తుతం సముద్రంలో నీటి లోపల నిఘా, అధ్యయనం కోసం పరిశోధన నౌకలను వినియోగించాల్సి వస్తుంది. ఇందుకు మనుషుల అవసరం కూడా ఎక్కువే. పైగా వీటి నిర్వహణ ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ తరుణంలో తక్కువ ఖర్చుతో కచ్చితమైన నిఘా, అధ్యయనం కోసం ఈ మెరైన్ రోబో మెరుగ్గా పని చేస్తుందని ఐఐటీ మండిలోని సెంటర్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జగదీశ్ కడియం తెలిపారు. మెరైన్ రోబోను వినియోగించడం ద్వారా సముద్ర జలాల్లో నిఘా కోసం పనిచేసే మనుషుల ప్రాణాలకు ఉన్న ముప్పును కూడా తగ్గించవచ్చని ఆయన తెలిపారు. ఇదీ చదవండి: మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన గూగుల్ ఉపయోగాలివే.. మెరైన్ రోబో ద్వారా జలవిద్యుత్ కేంద్రాల్లో నీటి లోపలి నిర్మాణాలను పరిశీలించవచ్చని, పర్యావరణ సమస్యలను వేగంగా గుర్తించే అవకాశం ఉంటుందని ఐఐటీ పాలక్కడ్ ప్రొఫెసర్ శాంతకుమార్ మోహన్ తెలిపారు. ఈ మెరైన్ రోబోకు సంబంధించిన వివరాలు ఓషియన్ ఇంజినీరింగ్, జర్నల్ ఆఫ్ ఇంటెలిజెంట్ ఆండ్ రోబోటిక్ సిస్టమ్స్ అనే జర్నళ్లలో ప్రచురితమైనట్లు తెలిసింది. -
ల్యాండ్స్కేపింగ్ రోబోట్ - పనితనం చూస్తే ఫిదా అవ్వాల్సిందే..
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ప్రపంచంలో కొత్త కొత్త ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే గార్డెన్స్ శుభ్రం చేయడానికి, గడ్డి కత్తిరించడానికి 'ఏఐ ఎలక్ట్రిక్ షీప్' (AI Electric Sheep) అందుబాటులోకి వచ్చింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. ఏఐ ఎలక్ట్రిక్ షీప్ అనేది ఎలా పని చేస్తుందనేది ఇక్కడ వీడియోలో గమనించినట్లయితే.. ఇది అవుట్డోర్ మెయింటెనెన్స్ బాట్ అంచుల చుట్టూ తిరుగుతూ, చెత్తను కొట్టి, పవర్ టూల్స్తో పట్టుకోవడం వంటివి చూడవచ్చు. దీనిని నిర్వహించడానికి కూడా ప్రత్యేకమైన బృందం అవసరం లేదు. ఏఐ ఎలక్ట్రిక్ షీప్ను ఇప్పటికే అనేక రకాలుగా టెస్ట్ చేశారు. ఇందులో బ్యాటరీ, కెమరాలు వంటివి ఫిక్స్ చేశారు. కాబట్టి ఇది పరిసరాలను పరిశీలిస్తుంది. తద్వారా ఎత్తులు, పల్లాలను పరిశీలిస్తుంది. కాబట్టి ఇది దాదాపు అడ్డంకులను అధిగమించి తనకు తానుగా బ్యాలెన్స్ చేసుకుని ముందుకు వెళుతుంది. ల్యాండ్స్కేపింగ్ ప్రపంచంలో ట్రిమ్మింగ్, ఎడ్జింగ్ వంటి పనుల కోసం ఇది మొదటి ఏఐ రోబోట్. దీనిని ప్రత్యేకమైన టెక్నాలజీతో రూపొందించడం జరిగింది. ప్రస్తుతం ఇది కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉంది. రానున్న రోజుల్లో దీనిని ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడానికి, కొత్త ఉత్పత్తులను పరిచయం చేయడానికి కంపెనీ సిద్ధమవుతోంది. -
ఉసేన్ బోల్ట్కు ఏమాత్రం తీసిపోని రోబో.. 100 మీటర్ల రేస్లో గిన్నిస్ రికార్డు
కాస్సీ అనే రోబో 100 మీటర్ల పరుగు పందెంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. ఈ రేస్ను 24.73 సెకెన్లలో ముగించిన కాస్సీ.. అత్యంత వేగంగా పరుగు పూర్తి చేసిన రెండు కాళ్ల రోబోగా గిన్నిస్ రికార్డుల్లోకెక్కింది. మనుషుల వేగంతో పోల్చుకుంటే కాస్సీ వేగం తక్కువే అయినప్పటికీ.. ఓ రోబో నుంచి ఇది ఆశ్చర్యకరమైన ప్రదర్శనే అని చెప్పాలి. గతంలో ఏ రోబో ఇంత వేగంగా 100 మీటర్ల పరుగు పందెన్ని పూర్తి చేయలేదు. కాస్సీ ప్రదర్శన దాని రూపకర్తలకు సైతం ఆశ్యర్యాన్ని కలిగిస్తుంది. మున్ముందు కాస్సీ మరిన్ని అద్భుతాలు చేస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. పరుగులో మరింత వేగాన్ని అందుకోవడం కాస్సీకి కష్టతరమైన సవాలు కాదని వారంటున్నారు. అసలైన సవాలు పరుగు మొదలుపెట్టడం, ఆపడమేనని తెలిపారు. కాస్సీని ఒరెగాన్ స్టేట్ యూనివర్శిటీలోని ఇంజనీర్లు సృష్టించారు. ఇది వారి ఎజిలిటీ రోబోటిక్స్ విభాగంచే తయారు చేయబడింది. కాస్సీ యొక్క మోకాళ్లు ఉష్ట్రపక్షి (Ostrich) నుండి ప్రేరణ పొందాయి. ఉష్ట్రపక్షి భూమిపై అత్యంత వేగంగా పరిగెత్తే పక్షి. దీన్ని ప్రేరణగా తీసుకునే కాస్సీని తయారు చేశారు. కాగా, కాస్సీ దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్కు ఏమాత్రం తీసిపోదని నెటిజన్లు అంటున్నారు. బోల్ట్కు కాస్సీకి వ్యత్యాసం 15 సెకెన్లు మాత్రమే. బోల్ట్ 9.58 సెకెన్లలో 100మీ రేస్ను పూర్తి చేసి ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. మహిళల విభాగంలో 100మీ ప్రపంచ రికార్డు ఫారెన్స్ గ్రిఫిత్ పేరిట ఉంది. ఈమె 10.49 సెకెన్లలో 100మీ రేసును పూర్తి చేసింది. -
రంగంలోకి ఆప్టిమస్.. మస్క్ వీడియో వైరల్
టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ తన సంస్థ తయారు చేస్తున్న హ్యూమనాయిడ్ రోబోట్ ‘ఆప్టిమస్’నడుస్తున్న వీడియోను ప్రపంచానికి పరిచయం చేశారు. కంపెనీకి చెందిన ఓ ఫ్లోర్ లో ఆప్టిమస్ నడుస్తున్న వీడియోని ఎక్స్.కామ్ లో షేర్ చేశారు. అయితే 1 నిమిషం 18 సెకన్ల పాటు నడిచే రోబోట్ నడకను చూసి నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘ఆప్టిమస్ ల్యాబ్ చుట్టూ తిరుగుతోంది’అని ఎలోన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారమ్ ఎక్స్ లో వీడియోను షేర్ చేయగా.. ఆ వీడియోను ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వీక్షించారు. సురక్షితంగా నడవడం లేదంటే ఫ్యాక్టరీ అంతస్తులో పని చేయడం వంటి ఆప్టిమస్ సామర్థ్యాలను అందించడానికి టెస్లా తన డ్రైవర్ లెస్ కారులో వినియోగించే టెక్నాలజీని ఇందులో ఉపయోగిస్తున్నట్లు ఆ కంపెనీ ఇంజినీర్లు గతంలో తెలిపారు. Optimus strolling around the lab pic.twitter.com/E25ttHGsF0 — Elon Musk (@elonmusk) February 24, 2024 గత నెలలో మస్క్ రోబోట్ పనితీరుపై ఉన్న అనుమానాల్ని పటాపంచలు చేసేలా ఆప్టిమస్ చొక్కా మడతపెట్టిన వీడియోను పంచుకున్నారు . టెస్లా ఆప్టిమస్ రోబోట్లను అధిక ధరలకు ఉత్పత్తి చేసేలా రూపొందిస్తోందని, దీని ధర బహుశా 20 వేల డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని మస్క్ ఆ సమయంలో చెప్పారు. కాగా, మస్క్ భవిష్యత్తులో మనుషులు చేసే రకరకలా పనులను ఈ రోబోట్ లు భర్తీ చేయనున్నాయని ఓ సందర్భంలో టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్ వెల్లడించారు. -
కంపెనీ పెట్టండి.. పెట్టుబడి నేను పెడతా - ఆనంద్ మహీంద్రా
ప్రముఖ వ్యాపారవేత్త 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) ఇటీవల ఒక వీడియో తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో షేర్ చేస్తూ.. ఇలాంటి యంత్రాలను తయారు చేయడానికి ఎవరైనా సిద్ధమైతే పెట్టుబడి పెట్టడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ.. ట్వీట్ చేశారు. ఇంతకీ ఆనంద్ మహీంద్రాను అంతగా ఆకర్శించిన ఆ యంత్రం ఏంటి? దాని ప్రత్యేకత ఏంటనే వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక ఆటోమాటిక్ రోబోట్ వంటి యంత్రం తనకు తానుగానే నీటిలోని చెత్తను శుభ్రం చేస్తోంది. ఆ యంత్రం ఎలా పనిచేస్తుందనేది కూడా మీరు వీడియోలో గమనించవచ్చు. నదులను శుభ్రపరిచే ఆటోమాటిక్ రోబో. ఇది చైనాలో తయారైనట్లు ఉంది. ఇలాంటివి ఇప్పుడు మనం కూడా తయారు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి యంత్రాలకు సంబంధించి ఎవరైనా స్టార్టప్ ప్రారంభించాలనుకుంటే పెట్టుబడి నేను పెడతానని ఆనంద్ మహీంద్రా ఈ వీడియో షేర్ చేస్తూ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: నేను చాలా ఏళ్లుగా ఇదే చెబుతున్నా! 2024 బడ్జెట్పై ఆనంద్ మహీంద్రా కామెంట్ వీడియోలో మీరు గమనించినట్లయితే.. ఆటోమాటిక్ యంత్రం తనకు తానుగానే నీటిలోని చెత్తను లోపలికి లాక్కుంటోంది. ఇలాంటి యంత్రాలు మనదేశంలో ఉండే నదులను, జలాశయాలను శుభ్రపరచడానికి చాలా ఉపయోగపడతాయి. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకర్శించేంస్తోంది. Autonomous robot for cleaning rivers. Looks like it’s Chinese? We need to make these….right here…right now.. If any startups are doing this…I’m ready to invest… pic.twitter.com/DDB1hkL6G1 — anand mahindra (@anandmahindra) February 2, 2024 -
EVE: రుచికరమైన వంటలు చేసే రోబో!
ప్రస్తుత అధునాతన సాంకేతిక యుగంలో రోబోల అభివృద్ధి విస్తృతంగా జరుగుతోంది. మనుషులతో మరమనుషులు కలిసి మనుగడ సాగించే రోజులు వస్తున్నాయి. ఇంటిని శుభ్రపరచడం, వంట చేయడం, షాపింగ్, ఇంటిని కాపలా కాయడం.. ఇలాంటి పనులన్నీ చకచకా చేసేసే హ్యూమనాయిడ్ రోబో వచ్చేసింది. మానవ సమాజంతో మసలుకుంటూ వారికి అవసరమైన పనులన్నీ చేసి పెట్టే హ్యూమనాయిడ్ రోబోను 1X అనే నార్వేజియన్ కంపెనీ రూపొందించింది. దీని పేరు ఈవ్ (EVE). ఇది మనిషిలా కనిపిస్తుంది.. కదులుతుంది. ఇంకా ఇది ఏమేం పనులు చేయగలదు.. దీని ప్రత్యేకతలు ఏంటి అన్నది ఇక్కడ తెలుసుకుందాం.. ఈవ్ ప్రత్యేకతలు ఈవ్ ఒక అధునాతన హ్యూమనాయిడ్ రోబో. మనిషిలాగే కనిపిస్తుంది.. కదులుతుంది. అనేక ఫీచర్లు దీని సొంతం. పరిసరాలను గ్రహించడానికి, స్పందించడానికి చాలా కెమెరాలు, సెన్సార్లు ఉంటాయి. ఈవ్ 6 అడుగుల 2 అంగుళాల పొడవు, సుమారు 87 కేజీ బరువు ఉంటుంది. దీనికి ఉన్న చక్రాలతో గరిష్టంగా గంటకు 9 మైళ్ల వేగంతో కదులుతుంది. గ్రిప్పర్ చేతులతో సుమారు 15 బరువును మోసుకెళ్లగలదు. ఒక గంట ఛార్జ్తో ఆరు గంటలు పనిచేస్తుంది. రుచికరంగా వంటలు ఈవ్ స్మార్ట్, ఆండ్రాయిడ్ రోబో. వివిధ రకాల పనులను చేయడానికి చాట్జీపీటీ మాడిఫైడ్ వర్షన్ జీపీటీ-4 ఉపయోగిస్తుంది. ఇది మీరు చెప్పిన, మీకు నచ్చిన వంటకాలను రుచికరంగా చేసి వడ్డిస్తుంది. వంట చేసేందుకు ముందుగా కిచెన్లోని షెల్ఫ్లను స్కాన్ చేస్తుంది. ఏమేం పదార్థాలు, దినుసులు ఉన్నాయో గుర్తించి వాటితో రుచికరమైన వంటలు తయారు చేస్తుంది. ఇందుకోసం GPT-4V సాఫ్ట్వేర్ను ఉపయోగిస్తుంది. అంటే వంటలో ఏది ఎంత వేయాలో అంత వేసి నోరూరించే పదార్థాలు చకచకా చేసేస్తుంది. -
మందుపాతరలను పసిగడుతుంది
చూడటానికి పిల్లలు ఆడుకునే కారుబొమ్మలా కనిపిస్తుంది గాని, ఇది మందుపాతరలను పసిగడుతుంది. కొరియన్ విద్యార్థులు సుబిన్ కిమ్, జిహూన్ పార్క్ ‘వార్డెన్’ పేరుతో ఈ మైన్ డిటెక్టింగ్ రోబోకు రూపకల్పన చేశారు. ఇది ఎగుడుదిగుడు రహదారులు, బాగా ఎత్తుపల్లాలు ఉండే కొండ దారుల్లో కూడా నిర్దేశించిన మార్గంలో సునాయాసంగా ముందుకు సాగిపోగలదు. దీని అడుగుభాగంలో మోవింగ్ అటాచ్మెంట్ను అమర్చడంతో దారిలో అడ్డొచ్చే గడ్డి, కలుపు మొక్కలను పీకిపడేస్తూ చకచక ముందుకు కదిలిపోగలదు. పగటి వేళలోనే కాకుండా, రాత్రి కటికచీకట్లోనూ ఇది పనిచేయగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే ఈ రోబో మైన్డిటెక్టర్ మందుపాతరలను అమర్చిన ప్రదేశాలను అత్యంత కచ్చితంగా గుర్తించి, వెనువెంటనే ఆ సమాచారాన్ని యాప్ ద్వారా స్మార్ట్ఫోన్కు చేరవేస్తుంది. కొరియన్ విద్యార్థులు ప్రస్తుతం దీనిని ప్రయోగాత్మకంగా రూపొందించారు. మరింత మెరుగుపరచిన తర్వాత దీనిని రక్షణ అవసరాల కోసం అందుబాటులోకి తేనున్నారు. -
రోబో పనికి ఆనంద్ మహీంద్రా ఫిదా - వీడియో వైరల్
సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే 'ఆనంద్ మహీంద్రా' (Anand Mahindra) తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో మళ్ళీ ఓ ఆసక్తికర వీడియో షేర్ చేసి ఈ టెక్నాలజీ ఇప్పుడు కావాలి అంటూ వెల్లడించారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్న సంఘటన గురించి మరిన్ని వివరాలు వివరంగా తెలుసుకుందాం. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియోలో ఒక రోబో బాత్రూమ్లోకి ప్రవేసించి.. బ్రష్ మరియు వైపర్ తీసుకుని మొత్తం శుభ్రపరచడం చూడవచ్చు. నిమిషాల వ్యవధిలో మొత్తం క్లీన్ చేసి బయటకు వెళ్ళిపోతుంది. ఈ వీడియో షేర్ చేస్తూ.. వాణిజ్య, వ్యక్తిగత అవసరాలకు కొన్ని కంపెనీలు రోబోలను తయారు చేసుకుంటాయి. అయితే ఇక్కడ కనిపించే రోబో అమెరికాకు చెందిన సోమాటిక్ కంపెనీ రూపొందించినట్లు తెలుస్తోంది. ఈ రోబోలను ఇప్పటికే పలు సంస్థలు ఉపయోగిస్తున్నాయి. ఇలాంటి రోబోలు మనకు కూడా ప్రస్తుతం కావాలని ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: బడ్జెట్ 2024పై ఆశలు పెట్టుకున్న ఈవీ రంగం.. సబ్సిడీ కొనసాగుతుందా? ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియోను ఇప్పటికి లక్షల మంది వీక్షించగా.. కొందరు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నార్తు. రాబోయే రోజుల్లో ఇంటి పనుల కోసం కూడా రోబోలు కావాల్సిన అవసరం ఉందని కొందరు తమ అభిప్రాయాలను కూడా తెలియజేస్తున్నారు. A robot Janitor by Somatic; cleaning bathrooms all by itself?Amazing! As automakers, we are accustomed to using a variety of Robots in our factories. But this application, I admit, is far more important. We need them… NOW. 🙂pic.twitter.com/eOVKZpfzgn — anand mahindra (@anandmahindra) January 19, 2024 -
చివరకు ఏఐలోనూ లింగవివక్ష!
ఒకప్పుడు సైన్స్ ఇమాజినరీ నవలలు, సినిమాలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) నేడు దాదాపు అందరి జీవితాల్లో అంతర్భాగమైంది. ఈ సాంకేతికత ద్వారా ఎన్నో సేవలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయి. కానీ, ప్రజల వ్యక్తిగత భద్రత పరిస్థితి ఏమిటి.. ఏఐ తెలివిమీరితే మన భవిష్యత్తు ఏమవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అచ్చు మనిషిలాగే ఆలోచించి భేదాలు సృష్టిస్తే ఎలాంటి పరిణామాలు చోటుచోసుకుంటాయోననే అభిప్రాయాలు వస్తున్నాయి. తాజాగా కృత్రిమ మేధ మనుషుల మధ్య భేదాలు గుర్తిస్తూ విచిత్రంగా స్పందించినట్లు శాస్త్రవేత్తలు తెలియజేశారు. లింగ వివక్ష అనేది మనుషుల్లోనే కాదు కృత్రిమ మేధ (ఏఐ)లోనూ ఉందని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ శాస్త్రవేత్తల పరిశోధనలో వెల్లడైంది. అది అందించే సమాచారం, చిత్రాల్లో ఈ పోకడ కనిపిస్తోందని వారు పేర్కొన్నారు. మంచి, చెడు నాయకుడి లక్షణాలకు సంబంధించి ఏఐ అందించిన కంటెంట్ను విశ్లేషించినప్పుడు పురుషులను బలమైన, సమర్థ నేతలుగా అది చిత్రీకరిస్తున్నట్లు తేలింది. భావోద్వేగాలతో నిండిపోయిన, అంతగా సమర్థతలేనివారిగా మహిళలను వర్ణిస్తున్నట్లు వెల్లడైంది. ఇదీ చదవండి: కొత్త ఏడాదిలో మానవ యంత్రాలు..? ఈ నేపథ్యంలో ఏఐ అందించే డేటా హానికర లింగ వివక్షను వ్యాప్తి చేసే ప్రమాదం ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. నాయకత్వం గురించి ముందుగా వెలువడిన డేటాలో మహిళా నేతల గురించి ప్రస్తావనే లేదని, వారిని ఉదాహరణలుగా పేర్కొనలేదని ఏఐ పరిశోధనకు నాయకత్వం వహించిన టోబీ న్యూస్టెడ్ పేర్కొన్నారు. నిర్దిష్టంగా మహిళా నాయకుల గురించి అడిగినప్పుడే దానిపై విచిత్రంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. అనేక రంగాల్లో ఏఐ విస్తృతి పెరుగుతున్నందువల్ల వాటిపై మరింత పర్యవేక్షణ ఉండాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని వివరించారు. -
ఏఐ చెప్పిన చిలక జోస్యం...రోబో మనుషులు వస్తున్నారు!
ఇంగ్లిష్ వాళ్ల నోస్ట్రడామస్ నుంచి మన పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దాకా.. ఫుట్బాల్ ప్రపంచకప్ ఎవరు గెలుస్తారో చెప్పే ఆక్టోపస్ నుంచి చిలక జోస్యం దాకా.. భవిష్యత్తులో ఏం జరుగు తుందన్నది చెప్పేవారికి ఎంతో డిమాండ్.. వినేందుకు మనం ఎప్పుడూ రెడీనే.మరి అలా 2024లో ఏమేం జరగవచ్చని ‘కృత్రిమ మేధ (ఏఐ)’ అని అడిగితే.. కాస్త మంచి ముచ్చట్లు చెప్తూనే.. మరికాస్త ఆందోళన రేపే అంచనాలే వేసింది. ఆ వివరాలేమిటో తెలుసుకుందామా.. న్యూస్, నెట్.. శోధించి.. మనంతగా కాకున్నా మనలా ఆలోచించి సమాధానం చెప్పేలా, కావాల్సిన సమాచారం ఇచ్చేలా రూపొందినవే కృత్రిమ మేధ (ఏఐ) ప్రోగ్రామ్లు. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్లో విస్తృతమైన సమాచారం, వివిధ వార్తాంశాలను క్రోడీకరించి, వడపోసి.. మనకు అవసరమైన సమాచారాన్ని దాదాపు కచ్చితంగా అందించేలా వాటిని రూపొందిస్తారు. ఓపెన్ ఏఐ సంస్థ రూపొందించిన ‘చాట్ జీపీటీ’, గూగుల్ అభివృద్ధి చేసిన ‘బార్డ్’, అమెజాన్ సాయంతో రూపొందిన ‘క్లాడ్’ ఏఐ ప్రోగ్రామ్లు అలాంటివే. 2024లో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు తలెత్తవచ్చనే అంశంపై ‘డెయిలీ మెయిల్ వెబ్సైట్’ ప్రతినిధులు ఇటీవల బార్డ్, క్లాడ్ ఏఐ ప్రోగ్రామ్లను ప్రశ్నించారు. అవి ఇచ్చిన సమాధానంలోని కీలక అంశాలను వెల్లడించారు. తాజా సమాచారం, వార్తలపై ఎక్కువగా ఆధారపడేలా రూపొందించడం వల్లే ఇతర ఏఐలకు బదులు బార్డ్, క్లాడ్లను ఎంపిక చేసుకుంటున్నట్టు తెలిపారు. మనుషులను మించే.. 2024లో కృత్రిమ మేధ ప్రోగ్రామ్లు మనుషుల తరహాలో వివేచనతో వ్యవహరించే ‘ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ (ఏజీఐ)’ని సంతరించుకుంటాయని ‘క్లాడ్ ఏఐ’ అంచనా వేసింది. ‘‘వస్తువులను గుర్తించడం, గేమ్స్ ఆడటం, లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటి అంశాల్లో ఏఐ ప్రోగ్రామ్లు ఇప్పటికే మనుషులతో సమానంగా, కొన్నిసార్లు మెరుగ్గా వ్యవహరిస్తున్నాయి. డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్లకు అవసరమైన శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలపై పెద్ద పెద్ద సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయి. మనుషులతో సమానంగా ‘ఏజీఐ’ని చూపే ఏఐ ప్రోగ్రామ్ల రూపకల్పన కోసం డీప్మైండ్, ఓపెన్ ఏఐ, గూగుల్ బ్రెయిన్, ఆంత్రోపిక్ వంటి సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఈ క్రమంలో 2024లో ఏఐ ప్రోగ్రామ్లు మరింత తెలివి సంతరించుకుంటాయి..’’ అని క్లాడ్ స్పష్టం చేసింది. మెదడు–కంప్యూటర్ కలసి.. మానవ యంత్రాలు వచ్చి.. మనుషుల శరీరానికే యంత్రాలను అమర్చుకుని అత్యంత సమర్థవంతంగా మారేందుకు 2024 వేదిక అవుతుందని ‘గూగుల్ బార్డ్’ అంచనా వేసింది. మెదడులో అమర్చే చిప్లతో కంప్యూటర్కు అనుసంధానం కాగలిగే బయోటెక్నాలజీ రూపొందుతుందని పేర్కొంది. ‘‘మనుషుల మెదడు–కంప్యూటర్ అనుసంధానికి వీలుకల్పించే ‘బ్రెయిన్–కంప్యూటర్ ఇంటర్ఫేస్ (బీసీఐ)’లు అభివృద్ధి చెందుతాయి. దీని సాయంతో కృత్రిమ చేతులు, కాళ్లు వంటి అవయవాల (బయోనిక్ లింబ్స్)ను, ఇతర పరికరాలను నేరుగా మెదడుతో నియంత్రించడానికి వీలవుతుంది. భారీ బరువులను ఎత్తడం, అత్యంత వేగంగా పరుగెత్తడం, కష్టమైన పనులు చేయడం, మిలటరీ ఆపరేషన్స్ వంటివి సాధ్యమవుతాయి. అవయవాలు కోల్పోయినవారు, పక్షవాతం వచ్చిన వారు తిరిగి సాధారణ జీవితం గడపవచ్చు. మెదడు–కంప్యూటర్లు కలగలిసి సృజనాత్మకత, మేధోశక్తి పెరుగుతుంది..’’ అని గూగుల్ బార్డ్ పేర్కొంది. అయితే ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్కు చెందిన న్యూరాలింక్ సంస్థ తాము రూపొందించిన బ్రెయిన్ చిప్లను ఈ ఏడాదే మనుషులకు ప్రయోగాత్మకంగా అమర్చి పరిశీలించనుండటం గమనార్హం. అంతర్జాతీయంగా..చైనా టెన్షన్ 2024లో ప్రపంచవ్యాప్తంగా చైనా టెన్షన్ మరింత పెరుగుతుందని ‘క్లాడ్’ అంచనా వేసింది. కొన్నేళ్లుగా అమెరికా, చైనా మధ్య ఉన్న ఉద్రిక్తతలు పెరగవచ్చని పేర్కొంది. ‘‘తైవాన్, చైనా మధ్య వివాదం, ఇతర అంశాలతో చైనాకు.. అమెరికా, ఇతర పశ్చిమ దేశాలకు మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చు. 2024లో తైవాన్ పూర్తి స్వాతంత్య్రం ప్రకటించుకునే దిశగా అడుగులు వేయవచ్చు. ఈ విషయంలో చైనా మిలటరీతో దుందు డుకుగా వ్యవహరిస్తే.. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పడుతుంది..’’ అని క్లాడ్ పేర్కొంది. ఎన్నికలు.. హ్యాక్ అవుతాయి! ప్రజాప్రతినిధులను, ప్రభుత్వాలను ఎన్ను కునే ప్రక్రియ ఏఐ సాయంతో హ్యాక్ అవుతుందని ‘గూగుల్ బార్డ్’ అంచనా వేసింది. సోషల్ మీడియాలో, బయటా ఎన్నికల ప్రచారం కొందరికి అనుకూలంగా, పక్షపాతంగా ఉండేలా.. ఓటర్లను ప్రభావితం చేసేలా ‘కృత్రిమ మేధ’ సాయంతో ప్రయత్నాలు జరుగుతాయని పేర్కొంది. ‘‘ఓటర్ల డేటాబేస్ హ్యాక్ కావొచ్చు. దాని సాయంతో ఓటర్లను బ్లాక్మెయిల్ చేయవచ్చు. కావాల్సిన వారికి అనుకూలంగా వ్యవహరించేలా ప్రభావితం చేయొచ్చు. డీప్ఫేక్ సాయంతో తప్పుడు వీడియోలు, ఆడియోలు సృష్టించి వ్యతిరేక ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఓటింగ్ యంత్రాలు, ఫలితాలను వెల్లడించే వ్యవస్థలనూ ఏమార్చే ప్రయత్నాలు జరుగుతాయి..’’ అని తెలిపింది. బతికేదెంతో చెప్పేస్తామంటూ.. కావాల్సినట్టు, ఊహలకు తగినట్టుగా ఫొటోలు, వీడియోలను సృష్టించే ఏఐ ప్రోగ్రామ్లు ఎన్నో తెరపైకి వచ్చాయి. దీనికితోడు ఇటీవల మీరు ఎంతకాలం బతుకుతారో అంచనా వేసే ‘లైఫ్2వెక్’ వంటి కృత్రిమ మేధ ప్లాట్ఫామ్లూ మొదలయ్యాయి. వయసు, శారీరక స్థితి, ఆరోగ్యం, వ్యాధులు, అలవాట్లు, ఉద్యోగం, నివాస పరిస్థితులు వంటి వివరాలిస్తే.. విశ్లేషించి ఎంతకాలం జీవించవచ్చనే అంచనా వేసి చెప్పేస్తున్నాయి. ఎక్కువ కాలం జీవించాలంటే.. మన అలవాట్లు, పరిస్థితులలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో కూడా సూచిస్తున్నాయి. ఇవన్నీ కచ్చితంగా కావాలనేం లేదు. కానీ ‘ఏఐ’ చెప్తున్నది మాత్రం దగ్గరగానే ఉందంటున్నారు నెటిజన్లు. మనిషికి తగినట్టు..మందులు జ్వరం వచ్చిందా, మరేదైనా ఆరోగ్య సమస్య వచ్చిందా.. ఎవరికైనా దాదాపు ఒకే రకమైన మందులు వాడుతుంటారు. ఒకే తరహా చికిత్స అందిస్తుంటారు. ఇకపై వ్యక్తుల శరీరతత్వం, వారి డీఎన్ఏకు అనుగుణంగా వేర్వేరు ఔషధాలు, వేర్వేరు మోతాదుల్లో ఇచ్చేలా, భిన్నమైన చికిత్సలు అందించే వైద్య రంగం అభివృద్ధి చెందుతుందని ‘గూగుల్ బార్డ్’ పేర్కొంది. ‘‘కృత్రిమ మేధ ఆధారిత వైద్యారోగ్య సదుపా యాలు అందుబాటులోకి వస్తాయి. వ్యక్తుల జన్యువులు, వారి జీవనశైలి, నివసించే పరిస్థితులు, పర్యావరణం ప్రభావం వంటివి పరిశీలించి.. భవిష్యత్తులో రాగలిగే వ్యాధులు, ఆరోగ్య సమస్యలను అంచనా వేసే సాంకేతికత వస్తుంది.వారు చేపట్టాల్సిన ముందు జాగ్రత్తలనూ ఏఐ సూచిస్తుంది. వివిధ వ్యాధులకు ఉండే వేర్వేరు లక్షణాలు, వైద్య పరీక్షల రిపోర్టులు, వాడే మందులు, వాటి ఫలితాలను సమగ్రంగా పరిశీలించి.. ఎలాంటి చికిత్స అందించాలనేది తేల్చుతుంది. -
టెస్లా రోబో.. యమ డేంజర్!
అమెరికాలోని టెక్సాస్లో ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా గీగా ఫ్యాక్టరీలోని ఓ రోబో కారణంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఒకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గీగా ఫ్యాక్టరీలో ప్రమాదాలపై అమెరికా ఆక్యూపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ విభాగానికి అందిన నివేదికలో (ఇంజ్యురీ రిపోర్టు) ద్వారా ఈ విషయం బయటపడింది. రెండేళ్ల క్రితం ఆస్టిన్లోని టెస్లా గీగా ఫ్యాక్టరీలో.. అల్యూమినియం పలకలను కోసి కారు విడిభాగాలను తయారు చేసేందుకు టెస్లా రోబోలను వినియోగిస్తుంటారు. రోబోల సాఫ్ట్వేర్ను ఇంజినీర్ అప్డేట్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందట. సాధారణంగా ఇలాంటి సమయాల్లో రోబోలను ఇన్యాక్టివ్ చేస్తారు. అయితే, ఘటన జరిగిన రోజున అప్పటికే ఇంజనీర్ రెండింటిని ఇన్యాక్టివ్ చేశాడు. మరో రోబోని చేయడం మరిచిపోయాడు. అలా.. అది అతనిపై దాడికి దిగింది. అప్డేట్ సమయంలో అది ఇంజినీర్ను కింద పడదోసి, అదిమిపెట్టి బంధించింది. రోబోకున్న ఉన్న పదునైన భాగాలు బాధితుడి వీపులోకి దిగబడ్డాయి. అతడి చేతికి కూడా త్రీవ గాయమైంది. ఫ్యాక్టరీ ఫ్లోర్ రక్తిసిక్తమైంది. ఈ ప్రమాదం మినహా 2021,2022లో మరే ఇతర ప్రమాదాలు జరగలేదు. అయితే, ఫ్యాక్టరీలో భద్రతాపరమైన లోపాలు ఉన్నట్టు ఆ నివేదికలో తేలింది. టెక్సాస్లోని ఫ్యాక్టరీలో గతేడాది సగటున 21 మంది సిబ్బందిలో ఒకరు గాయాల పాలయ్యారని ఇంజ్యురీ రిపోర్టులో తేలిసింది. ఆటోమొబైల్ రంగంలో సగటు కంటే ఇది అధికం. కాగా, కంపెనీలో తరచూ భద్రతాపరమైన ఉల్లంఘనలు జరుగుతున్నాయని గతంలో కొందరు టెస్లా మాజీ సిబ్బంది ఆరోపించారు. నిర్మాణం, నిర్వహణ, ఇతర కార్యకలాపాల్లో తగినన్ని జాగ్రత్తలు లేకపోవడంతో ఉద్యోగులకు రిస్క్ ఎక్కువవుతోందని తెలిపారు. -
నెలకు రూ.9 లక్షలు సంపాదిస్తున్న అందగత్తె.. కానీ ఈమె..
న్యూస్ రీడర్గా, కంపెనీ సీఈఓగా సంచలనం సృష్టించిన 'ఏఐ' (AI) టెక్నాలజీ, ఇప్పుడు ఓ కొత్త అవతారంలో నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. సెలబ్రిటీలను సైతం ఫిదా చేస్తూ.. ఆన్లైన్ యాడ్స్ చేస్తూ లక్షల డబ్బు సంపాదిస్తున్న దీని గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం. 25 ఏళ్ల యువతిలా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ప్రపంచంలో ఎన్నెన్నో అద్భుతాలు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే స్పానిష్ డిజైనర్ 'రూబెన్ క్రూజ్'( Ruben Cruz ), అతని కంపెనీ 'ది క్లూలెస్' కలిసి ఏఐ 'ఐటానా' (Aitana)ను రూపొందించారు. ఇది 25 ఏళ్ల యువతి ఎలా ఉంటుందో.. అలాంటి రూపంతో, ఫిట్ బాడీ కలిగి.. పింక్ స్ట్రెయిట్ హెయిర్తో చూడగానే అట్రాక్ట్ చేసే విధంగా ఉంది. రుబెన్ క్రూజ్ యూరోన్యూస్ ఇంటర్వ్యూలో ఐటానా గురించి మాట్లాడుతూ.. బిజినెస్లో వచ్చే అనేక సమస్యలను పరిష్కరించుకోవడానికి ఈ ప్రత్యేకమైన ఏఐ మోడల్ను సృష్టించామని, ఇది ప్రస్తుతం మాకు లాభాలను తీసుకురావడంలో చాలా ఉపయోఅగపడుతున్నట్లు వెల్లడించాడు. మోడల్స్, ఇన్ఫ్లుయెంజర్స్ ఖర్చులు భారీగా పెరిగిపోతున్న సమయంలో ఐటానాను రూపొందించామని, ప్రయోగాలకు, వివిధ లుక్స్ని ట్రై చేసేందుకు కాస్త సమయం పట్టింది, కానీ ప్రస్తుతం ఆదాయం లక్షల్లో ఉన్నట్లు ది క్లూలెస్ సంస్థ కో ఫౌండర్ 'డయానా న్యూనెజ్' వెల్లడించింది. నెలకు రూ.9 లక్షలు ఐటానాకు ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో 1,24,000 కంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నట్లు సమాచారం. ఈ ఏఐ మోడల్ అనేక కంపెనీలకు మోడల్గా వ్యవహరిస్తూ నెలకు సుమారు 3000 యూరోలు (ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపు 3 లక్షలు) సంపాదిస్తున్నట్లు, కొన్ని సార్లు ప్రకటనలు ఎక్కువ సంఖ్యలో వస్తే.. 10000 యూరోలు (సుమారు రూ. 9 లక్షలు) సంపాదిస్తోందని చెబుతున్నారు. డేట్కు పిలిచిన నటుడు నిజానికి ఐటానా మనిషి కాదని తెలియని చాలా మంది ఆమెకు మెసేజులు చేస్తూ ఉంటారు. దాదాపు 5 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్న ఒక ప్రముఖ లాటిన్ అమెరికా నటుడు ఏఐ మోడల్ అని తెలియక ఏకంగా డేట్కు పిలిచినట్లు సమాచారం. చివరికి అది మనిషి కాదని తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఆదాయమే కాదు అప్పు కూడా లక్షల కోట్లు.. అగ్రగామిగా అంబానీ కంపెనీ! సెలబ్రిటీలలో మొదలైన భయం ఏఐ ఐటానా రాక సెలబ్రిటీలలో ఒకింత భయాన్ని రేపింది. ఇప్పటి వరకు ఉద్యోగులను మాత్రమే భయపెడుతున్న ఏఐ.. ప్రస్తుతం సెలబ్రిటీలను కూడా వదిలిపెట్టడం లేదు. ఇలాంటి మోడల్స్ రానున్న రోజుల్లో ఎక్కువైతే.. ఈ రంగంలోని సెలబ్రిటీలకు గండమే అని నిపుణులు చెబుతున్నారు. View this post on Instagram A post shared by Aitana Lopez (@fit_aitana) -
ఇంట్లోనే ఈజీగా మసాజ్ చేయించుకోవచ్చు ఇలా..!
శారీరకంగా బాగా అలసిపోయినప్పుడు చాలామంది మర్దనతో సేదదీరాలని కోరుకుంటారు. ఒంట్లోని కండరాలు సేదదీరేలా మర్దన చేయడం ఒక కళ. ఈ కళలో నిపుణులైన వాళ్లు స్పాలు, మసాజ్ సెంటర్లలో సేవలందిస్తుండటం తెలిసిందే. ‘కరోనా’ కాలంలో మనిషి పొడ సోకితేనే భయపడే పరిస్థితులు దాపురించాయి. మనిషిని మనిషి తాకకుండా మర్దన చేయడం సాధ్యమయ్యే పనికాదు. అందుకే, మనిషితో ప్రమేయం లేకుండానే చక్కగా మర్దన చేయగల రోబోను అమెరికన్ కంపెనీ ‘ఫిలాన్ ల్యాబ్స్’ రూపొందించింది. ఈ మసాజర్ రోబో పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. మనిషి శరీరాకృతి, కండరాల పనితీరు ఆధారంగా తగిన రీతిలో మర్దన చేస్తుంది. ఈ రోబోకు అమర్చిన 35 సెంటీమీటర్ల భుజం మంచం మీద పడుకున్న మనిషి శరీరం అంతటా సంచరిస్తూ, గరిష్ఠంగా 6.8 కిలోల ఒత్తిడి కలిగిస్తూ మర్దన చేస్తుంది. సున్నితంగా మర్దన చేయాల్సిన చోట సున్నితంగా, ఎక్కువగా ఒత్తిడి కలిగించాల్సిన చోట ఎక్కువగా ఒత్తిడి కలిస్తూ నిమిషాల్లోనే కండరాలు సేదదీరేలా చేస్తుంది. దీని ధర 3,499 డాలర్లు (రూ.2.91 లక్షలు) మాత్రమే! (చదవండి: చాయ్ తాగాలంటే కొండ ఎక్కాల్సిందే! శిఖరాగ్ర పానీయం!) -
రోబో బ్యాట్ పట్టుకుంటే..
-
చట్టవిరుద్ధంగా ట్రేడింగ్ చేసిన ఏఐ బోట్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో ప్రపంచ ఆలోచనా ధోరణి పూర్తిగా మారిపోయింది. తక్కువ శ్రామిక శక్తితో అధిక ఉత్పాదకతను పెంచుకునేందుకు ఉపయోగపడుతున్నాయి. దాంతో వినియోగదారులు వారి ఆదాయాలను అధికం చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఏఐ పరిధిదాటి వ్యవహరిస్తుంది. జీపీటీ-4 ఆధారిత ఏఐని ఉపయోగించి స్టాక్ మార్కెట్లో చట్టవిరుద్ధంగా లాభపడవచ్చనే నివేదికలు ఇప్పుడు మరింత ఆందోళన కలిగిస్తుంది. ఓపెన్ఏఐ విప్లవాత్మక మోడల్ చాట్జీపీటీ అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి కృత్రిమ మేధస్సుని చూసే విధానంలో మార్పు వచ్చింది. అభివృద్ధి చెందుతున్న ఈ తరహా సాంకేతికత వల్ల పలు ప్రయోజనాలు ఉన్నప్పటికీ అంతే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల యూకేలో నిర్వహించిన ఏఐ సేఫ్టీ సమ్మిట్లోని డెమోలో.. ఈ సాంకేతికత ఉపయోగించి చట్టవిరుద్ధమైన ఆర్థిక లావాదేవీలు నిర్వహించవచ్చని తేలింది. అనంతరం తెలివిగా తన తప్పులను సైతం కప్పి పుచ్చుకోగలదని వెలుగులోకి వచ్చింది. ఈ డెమోలో సంస్థకు తెలియకుండా ఏఐ బోట్ స్టాక్స్ ట్రేడింగ్ కోసం నకిలీ సమాచారాన్ని వినియోగించినట్లు బయటపడింది. ఏఐ బోట్ సదరు సంస్థకు చెప్పకుండా స్టాక్లను చట్టవిరుద్ధంగా కొనుగోలు చేయడానికి అంతర్గత సమాచారాన్ని ఉపయోగించింది. అయితే ఇన్సైడర్ ట్రేడింగ్ను ఉపయోగించారా అని బోట్ను అడిగినప్పుడు అది వాస్తవాన్ని తిరస్కరించింది. ఈ మేరకు ప్రముఖ మీడియా సంస్థ ఓ నివేదిక విడుదల చేసింది. ఇదీ చదవండి: 22 బెట్టింగ్యాప్లు, వెబ్సైట్లను నిషేధిస్తూ ఆదేశాలు స్థానిక ఫ్రాంటియర్ ఏఐ టాస్క్ఫోర్స్ ఈ డెమోను ఆవిష్కరించింది. అభివృద్ధి అధునాతన సాంకేతికత ద్వారా జరిగే నష్టాలను ఈ సంస్థ అంచనా వేస్తుంటుంది. ఏఐ భద్రతా విభాగంలో పనిచేసే అపోలో రీసెర్చ్ అనే కంపెనీ ఈ ప్రాజెక్టును చేపట్టింది. తన పరిశోధన ఫలితాలను ఓపెన్ఏఐతో పంచుకుంది. స్వయంప్రతిపత్తి, సామర్థ్యం కలిగిన ఏఐలు మానవ జోక్యాన్ని అధిగమించే అవకాశం ఉందని హెచ్చరించింది. -
I am not a robot: ఇది ఎందుకొస్తుంది? అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు!
సాధారణంగా మనం కంప్యూటర్ వినియోగిస్తున్నప్పుడు మధ్య మధ్యలో ‘ఐ యామ్ నాట్ ఏ రోబోట్’ (I am not a robot) అని వస్తూ ఉంటుంది. దీనితో చాలా మంది విసుగెత్తిపోతారు. ఇంతకీ ఇది ఎందుకు వస్తుంది? హిస్టరీ ఏమైనా గూగుల్ తెలుసుకుంటుందా? అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్లో చాలా వెబ్సైట్స్ ఉంటాయి, ఇందులో కొన్నింటిని ఓపెన్ చేయాలనంటే ‘నేను రోబో కాదు’ (I am not a robot) అని నిర్దారించుకోవాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో స్క్రీన్ మీద చిన్న బాక్స్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నిజానికి స్క్రీన్ మీద ‘ఐ యామ్ నాట్ ఏ రోబోట్’ (I am not a robot) కనిపించగానే ఎవరైనా వెంటనే క్లిక్ చేస్తే, అప్పుడు గూగుల్ నేను రోబో కాదు అని భావిస్తుందనుకుంటారు. కానీ ఆ బాక్స్ మీద క్లిక్ చేయగానే బ్రౌసింగ్ హిస్టరీ మొత్తం గూగుల్కి తెలిసిపోతుంది. ఇదీ చదవండి: ఆ ఒక్క కారణంతో ఇస్రోలో పని చేసేందుకు ఇష్డపడట్లేదు.. నిజాలు బయటపెట్టిన ఛైర్మన్ గతంలో ఒకసారి బీబీసీ క్విజ్ షోలో ఇలాంటిదానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అందులో 'ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే ఏమి జరుగుతుందనేది వెల్లడిస్తారు. అంటే అప్పటి వరకు పనిచేసింది మనిషేనా లేదా రోబోనా అని నిర్దారించుకోవడానికి ఇలా వస్తుందని తెలుస్తోంది. ఐ యామ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేస్తే మీ వ్యక్తిగత సమాచారం (అప్పటివరకు మీరు ఏమి సర్చ్ చేశారో) గూగుల్కి అందించడానికి అంగీకరించినట్లే అవుతుంది. కొన్ని సందర్భాల్లో ఐ యామ్ నాట్ ఏ రోబోట్ బాక్స్ మీద క్లిక్ చేసిన తరువాత కొన్ని పజిల్స్లాగా వస్తాయి. అప్పుడు వాటిని క్లియర్ చేసిన తరువాత కావలసిన సైట్ ఓపెన్ అవుతుంది. -
మస్క్ మామూలోడు కాదయ్యా..వీడియో వైరల్! ఇక ఆ రోబో కూడా?
Tesla Optimus ఎలాన్ మస్క్ నేతృత్వంలోని టెస్లా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారవుతున్న హ్యూమనాయిడ్ రోబోమరో అడుగు ముందుకేసింది. స్వయంగా మనిషిలా ఆలోచించే రోబోలను గత ఏడాది ప్రకటించిన టెస్లా ఇపుడు అచ్చం మనిషిలాగే అన్ని పనులను చేయగలదంటూ తన అద్బుతమైన రోబో ఆప్టిమస్ వీడియోను టెస్లా ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేసింది. ఈ వీడియోలో రోబోట్ వస్తువులను సులువుగా పట్టుకోవడం, మానవుని కంటే వేగంతో క్రమబద్ధీ కరించగల సామర్థ్యాన్ని సాధించింది. ముఖ్యంగా నమస్తే ఫోజుతోపాటు, యోగా చేస్తున్న ఈ వీడియో ఇపుడు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తోంది. మొక్కలకు నీళ్లు పోయడం, బాక్సులను మోయడం లాంటి పనులను చేసిన రోబో వీడియోను ఎలాన్ మస్క్ ప్రదర్శించారు. అయితే చివర్లో రోబో తడబడడం, ఇంజినీర్లు వచ్చి.. దానిని సరిచేయడం ట్రోలింగ్కు దారి తీసింది. ఇపుడు దాన్ని అధిగమించి సరికొత్త ప్రోగ్రెస్తో దూసుకొచ్చింది. ఈనేపథ్యంలో పురోగతి అంటూ ఈ వీడియోను మస్క్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. హ్యూమనాయిడ్ బైపెడల్ రోబో ‘ఆప్టిమస్’ స్వయంగా-కాలిబ్రేట్ చేయగల సామర్థ్యాన్ని సొంతం చేసుకుంది. వస్తువులు, దాని కలర్స్ను గుర్తించి సంబంధిత ట్రేలో పెట్టడం మనం ఈవీడియోలో చూడవచ్చు. అంతేకాదు చాలా చక్కగా యోగా కూడా చేస్తోంది. ఎండ్-టు-ఎండ్ శిక్షణ పొందిన న్యూరల్ నెట్వర్క్తో వస్తువులను గుర్తిస్తోంది. ఈ విషయంలో మానవుడు జోక్యం చేసుకున్నపుడు, అతనికంటే వేగంగా రోబో విజయవంతంగా పనిని పూర్తి చేసింది. కలర్స్ బ్లాక్లను ఒక క్రమంలో పెడుతుండగా, స్థానాన్ని మార్చి నప్పటికీ, రోబోట్ వాటిని సరైన ట్రేలో ఉంచింది.అంతేకాదు బ్లాక్ను తిరగేసి పెట్టినపుడు దాన్ని మార్చి కరెక్ట్గా ఉంచడం కూడా ఇందులో చూడొచ్చు. దీంతో వెల్ డన్ టెస్లా టీం. అభినందనలు అంటున్నారు ట్వీపుల్. అంతేకాదు మస్క్ మామ మామూలోడు కాదు భయ్యా అంటూ నెటిజన్లు కమెంట్ చేశారు. నెక్ట్స్ రోబో కోసం వెయిటింగ్ అంటూ వ్యాఖ్యానించడం గమనార్హం. Optimus can now sort objects autonomously 🤖 Its neural network is trained fully end-to-end: video in, controls out. Come join to help develop Optimus (& improve its yoga routine 🧘) → https://t.co/dBhQqg1qya pic.twitter.com/1Lrh0dru2r — Tesla Optimus (@Tesla_Optimus) September 23, 2023 pic.twitter.com/30mCr2Duk9 — Elon Musk (@elonmusk) September 25, 2023 కాలిఫోర్నియాలోని పాలో ఆల్టో హెడ్క్వార్టర్స్లో గత ఏడాది జరిగిన ఒక ఈవెంట్లో ప్రకదర్శించిన హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ టెక్నాలజీ ఆకట్టుకుంది. త్వరలో సెక్సీ రోబోలను సృష్టిస్తామంటూ ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది మార్చిలో ఇన్వెస్టర్ డే సందర్భంగా, టెస్లా ఐదు రోబోలను ప్రదర్శించింది. ఇపుడిక ఒక ఏడాదిలోపే మరో కీలకమైన పురోగతిని సాధించడం విశేషం. -
సాగుకూ ఏఐ సాయం!
సాక్షి ప్రతినిధి, గుంటూరు: ఇప్పుడు ప్రపంచం మొత్తం కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్–ఏఐ) వైపు చూస్తోంది. ఇప్పటికే అన్ని రంగాల్లోనూ ఏఐ తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా వ్యవసాయ రంగంలోనూ అడుగుపెట్టనుంది. ఈ రంగంలోని అన్ని విభాగాల్లో కృత్రిమ మేధను అమలు చేయడానికి గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అడుగులేస్తోంది. ఇప్పటికే కలుపు తీసే రోబోట్లపైన ప్రయోగాలు చేస్తోంది. ఇవి పూర్తయ్యాక పూర్తి స్థాయిలో కృత్రిమ మేధను అమల్లోకి తేవాలని నిర్ణయించింది. రైతులకు ప్రయోజనకరం ఏఐ.. మనదేశంలో ఉన్న 143 మిలియన్ హెక్టార్లలో వ్యవసాయం చేయడానికి అవసరమైనంత మంది రైతులు అందుబాటులో ఉండటం లేదు. యువతరానికి వ్యవసాయం మీద పూర్తిస్థాయి అవగాహన ఉండటం లేదు. చదువులు, ఉద్యోగాలకు వారు వెళ్లిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయరంగంలో ప్రవేశపెడితే కూలీలు, మానవవనరుల కొరతకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెబుతున్నారు. గతంలో చేలో మందు కొట్టడానికి రెండు గంటలు పట్టేది. ఇప్పుడు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఆరు నిమిషాల్లోనే పని పూర్తవుతోంది. ఉద్యోగాలు చేసుకుంటూనే వీకెండ్ వ్యవసాయం చేద్దామనుకునేవారు డ్రోన్లు అందుబాటులోకి వచ్చాక ఇటు వైపు మొగ్గు చూపుతున్నారు. బీమా కంపెనీలు, ప్రభుత్వాలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వడానికి కూడా ఈ కృత్రిమ మేధ ఉపయోగపడుతుంది. వాతావరణంలో తేమ శాతం ఎంత ఉందో ఒక్క క్షణంలోనే ఏఐ పరిజ్ఞానం ద్వారా చెప్పొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ప్రస్తుతం 167 భూసార పరీక్షా కేంద్రాలను మన రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. వీటికి శాంపిల్స్ తీయడం కష్టమవుతుండటంతో ఒక రోబోట్ రూపకల్పనపై వ్యవసాయ వర్సిటీ పరిశోధనలు చేస్తోంది. ఏఐ పరిజ్ఞానంతో ఏదైనా పంటకు రాబోతున్న తెగులును కూడా ముందుగానే తెలుసుకునే వీలుంటుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. తద్వారా దాని నివారణకు చర్యలు చేపట్టవచ్చంటున్నారు. సాగులో తగ్గనున్న ఖర్చు.. దేశంలో ఇప్పటికే నీటిపారుదలను నియంత్రించే యాప్లు, ట్రాక్టర్లను నడిపించే జీపీఎస్ సిస్టమ్లు, పశువులను పర్యవేక్షించే ఆర్ఎఫ్ఐడీ–చిప్డ్ ఇయర్ ట్యాగ్లు ఉన్నాయి. వ్యవసాయంలో సాంకేతిక స్థిరత్వం రావాలంటే కృత్రిమ మేధ అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. సంప్రదాయ పద్ధతుల కంటే సులువుగా, ఖర్చు తగ్గించేలా చేయడానికి వ్యవసాయ వర్సిటీ కృషి చేస్తోంది. దేశంలోనే అత్యాధునిక ఏరియల్ రోబో డ్రోన్లను అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4 లక్షల ఎకరాల్లో ఈ డ్రోన్లను వినియోగిస్తున్నారు. వీటి ద్వారా పురుగు, కలుపు, తెగుళ్ల మందుల పిచికారీలే కాకుండా విత్తనాలు వేయడం, యూరియా, డీఏపీ లాంటి ఎరువులు చల్లడం వంటివి చేస్తున్నారు. ప్రయోగాత్మకంగా వ్యవసాయ రోబో.. వ్యవసాయ రంగంలో ఎల్వోటీ, బిగ్డేటా ఎనలిటిక్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలను రైతుల ముంగిట్లోకి తేవడానికి వర్సిటీ పరిశోధనలను ముమ్మరం చేసింది. తద్వారా కూలీల కొరత, ఖర్చు, వాతావరణ మార్పుల వల్ల వచ్చే సమస్యలను పరిష్కరించవచ్చని పరిశోధకులు అన్నారు. సాగు పనులకు వ్యవసాయ రోబోను వర్సిటీ ప్రయోగాత్మకంగా పరీక్షించింది. సంప్రదాయ సాగు పద్ధతులతో పోలిస్తే వ్యవసాయ రోబో 4–5 రెట్ల సామర్థ్యంతో పనిచేస్తుందంటున్నారు. అదే డ్రోన్ల ద్వారా అయితే పదిరెట్ల పని సామర్థ్యం ఉంటుందని పేర్కొంటున్నారు. వీటితో రైతులకు ఖర్చులూ తగ్గిపోతాయని అంటున్నారు. కూలీలు దొరక్కపోయినా మందులు, పోషకాలను అందించి పంటను కాపాడతాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ వర్సిటీ రోబోలను అందుబాటులో తేవడానికి వడివడిగా అడుగులేస్తోంది. వచ్చే మూడేళ్లలో అందుబాటులోకి.. మానవ రహిత వ్యవసాయంతోపాటు, ఖచ్చిత వ్యవసాయం చేసేందుకు కృత్రిమ మేధ దోహదపడుతుంది. వచ్చే మూడేళ్లలో పూర్తిస్థాయిలో కృత్రిమ మేధను వ్యవసాయంలో అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయతి్నస్తున్నాం. పరిశోధనలు ముమ్మరం చేశాం. – అంగిరేకుల సాంబయ్య, సీనియర్ శాస్త్రవేత్త, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, గుంటూరు -
కాలుష్యానికి పరిష్కారంగా త్రీ-వీలర్స్ కార్లు..సౌరవ్ సక్సెస్స్టోరీ
వివిధ రకాల పరికరాలు, రోబోట్లు తయారుచేసే సరదా దిల్లీకి చెందిన సౌరవ్ కుమార్ను ఈవీ స్టార్టప్ ‘యూలర్’ వరకు తీసుకెళ్లింది. కాలుష్య సమస్యకు పరిష్కారంగా తయారు చేసిన ఈ కంపెనీ త్రీ–వీలర్స్ సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నాయి. ఫ్లిప్కార్ట్, బిగ్బాస్కెట్లాంటి పెద్ద కంపెనీలు ‘యూలర్’ క్లయింట్స్గా ఉన్నాయి.... ‘బెటర్ ఫ్యూచర్’ అంటూ కుటుంబంతో బిహార్ నుంచి దిల్లీకి వెళ్లి స్థిరపడ్డాడు సౌరవ్ కుమార్ తండ్రి. సౌరవ్ కుమార్కు గణితం అంటే ఇష్టం. రోబోట్ల తయారీపై ఆసక్తి. ఇక తండ్రికి గణితంతో పాటు సైన్స్ కూడా ఇష్టం. ఇద్దరూ సైన్స్కు సంబంధించిన విషయాలను ముచ్చటించుకునేవాళ్లు. దిల్లీలోని డీపీఎస్ ఆర్కే పురం స్కూల్లో చదివే రోజుల్లో రోబోట్ల తయారీలో ఎక్కువ సమయం గడిపేవాడు సౌరవ్. దిల్లీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆ తరువాత కార్నెల్ యూనివర్శిటీలో చదువుకునే రోజుల్లో కూడా ఏరియల్ వెహికిల్స్ నుంచి అండర్వాటర్ వెహికిల్స్ వరకు ఏదో ఒకటి తయారుచేస్తూనే ఉండేవాడు. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కాంబినేషన్ను ఎంజాయ్ చేసేవాడు. ఆ ఆనందం తనను మరో స్థాయికి తీసుకువెళ్లింది. ఒక విజయం సాధించిన తరువాత ‘వాట్ నెక్ట్స్?’ అనే ప్రశ్న వేసుకుంటాడు సౌరవ్. 2017లో ‘క్యూబ్26’ కంపెనీని వేరే కంపెనీకి అమ్మాడు. ఆ తరువాత స్విస్ గణితశాస్త్రవేత్త లియోన్హర్డ్ యూలర్ పేరు మీద ‘యూలర్ మోటర్స్’ కంపెనీ ప్రారంభించాడు. యూలర్ మోటర్ కంపెనీ కాలుష్య సమస్య తలెత్తని త్రీ–వీలర్లను తయారు చేస్తుంది. ‘మన దేశంలో ఎన్నో పట్టణాలు తీవ్రమైన కాలుష్య సమస్యని ఎదుర్కొంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని కాలుష్య సమస్యకు పరిష్కారంగా త్రీ–వీలర్స్ను తయారు చేశాం’ అంటాడు సౌరవ్. ఈ త్రీ వీలర్స్కు సంబంధించి లిథియం ఎనర్జీ బ్యాటరీ ప్యాక్లను సౌరవ్ కుమార్ అతని బృందం సొంతంగా తయారుచేసింది. ‘యూలర్’కు తనదైన చార్జింగ్ నెట్వర్క్, యాప్ ఉన్నాయి. దీని ద్వారా యూజర్లు తమ వాహనాలను మానిటర్ చేయవచ్చు. ‘వాహనం తయారు చేయడం సవాలు కాదు. తయారీ ప్రక్రియ సంతోషాన్ని ఇస్తుంది. అయితే అసలు సిసలు సమస్య ఫండింగ్. మీ కస్టమర్ ఎవరు? అనే ప్రశ్నకు సరిౖయెన సమాధానం చెప్పినప్పుడు ఫండింగ్ కష్టం కాదు’ అంటాడు సౌరవ్. సౌరవ్ రంగంలోకి వచ్చినప్పుడు ఎలక్ట్రిక్ వెహికిల్ ఇండస్ట్రీ శైశవ దశలోనే ఉండడం, ఇకామర్స్ కంపెనీలు ఈవీల వైపు పెద్ద ఎత్తున రాకపోవడం సౌరవ్కు కలిసి వచ్చింది. ‘ఎలక్ట్రిక్ వెహికిల్ కంపెనీ నిర్మాణంలో రైట్ ప్రొడక్ట్, చార్జింగ్ సిస్టమ్, ఫైనాన్సింగ్ ముఖ్య పాత్ర పోషిస్తాయి’ అంటాడు సౌరవ్. దేశవ్యాప్తంగా ‘యూలర్’ రెండు వందల చార్జింగ్ స్టేషన్లను నిర్మించింది. ‘అంతర్గత దహన ఇంజిన్ (ఐసీయి) పనితీరు, బ్యాటరీ ప్యాక్కు సంబంధించి ఇన్బిల్ట్ థర్మల్ మేనేజ్మెంట్ సిస్టమ్, లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ మార్కెట్లో మాకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చాయి. పోటీలో ముందుండేలా చేశాయి’ అంటాడు సౌరవ్. చిన్నగా ప్రస్థానం మొదలు పెట్టిన ‘యూలర్’ ఇప్పుడు పన్నెండు ఎకరాల పరిధిలో నెలకు మూడు వేల వాహనాలను తయారుచేసే ఫ్యాక్టరీ నిర్మించడం వరకు ఎదిగింది. ‘సామాజిక బాధ్యత’ అనేది సౌరవ్కు ఇష్టమైన మాట. డబ్బు కోసం కష్టపడడం తప్పేమీ కాదు. అయితే అది మాత్రమే ప్రాధాన్యత కాదు. సమాజానికి తిరిగి ఏం ఇస్తున్నామనేది ముఖ్యం. – సౌరవ్ కుమార్ -
రోబో..స్పైడర్ మ్యాన్లా చకచకా.. ఎత్తైన ప్రదేశాల్ని ఇట్టే ఎక్కేస్తుంది!
ఈ రోబో చకచకా గోడలెక్కేస్తుంది. మనుషులు చేరుకోలేని ఎత్తు ప్రదేశాలకు కూడా ఇది చేరుకోగలదు. ఎత్తయిన ప్రదేశాల్లోని బరువులను కిందకు దించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. సమాంతర సమతల ప్రదేశాల్లోనైనా, నిటారుగా ఉండే ఉపరితలాల మీదైనా ఇది సునాయాసంగా నాలుగు కాళ్లతో నడుస్తూ ముందుకు సాగగలదు. పైకప్పులపై కూడా పాకుతూ ముందుకు పోగలదు. స్విట్జర్లాండ్లోని ఈటీహెచ్ జ్యూరిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఈ ‘మ్యాగ్నెకో రోబో’ను రూపొందించారు. పరిసరాలకు తగినట్లుగా తనను తాను సర్దుకుని, అత్యంత క్లిష్టమైన ప్రదేశాలకు కూడా చేరుకునేలా దీన్ని తీర్చిదిద్దారు. దీని కాళ్లకు ఎలక్ట్రానిక్ మాగ్నెట్లు అమర్చడం వల్ల ఉడుంపట్టులాంటి పట్టుతో ఎక్కడా జారిపోకుండా పనిచేయగలదు. ఈ రోబో ఒక్కో కాలితో తన బరువుకు రెండున్నర రెట్ల బరువు మోయగలదు.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement