-
సావిత్రిగారిని చూడగానే నోట మాట రాలేదు: చిరంజీవి
‘‘మహానటి సావిత్రిగారిపై రాసిన ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించడంతో నా జన్మ సార్థకం అయిందని భావిస్తున్నాను’’ అన్నారు హీరో చిరంజీవి. దివంగత నటి సావిత్రిపై సంజయ్ కిశోర్ రచించిన ‘సావిత్రి క్లాసిక్స్’ బుక్ లాంచ్ వేడుక మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ– ‘‘నా తొలి సినిమా ‘పునాదిరాళ్లు’లోనే సావిత్రిగారితో నటిస్తున్నానని తెలియగానే ఒళ్లు జలదరించింది. రాజమండ్రిలోని పంచవటి హోటల్లో ఉన్న సావిత్రిగారిని పరిచయం చేసేందుకు నన్ను తీసుకెళ్లారు. ఆమెను చూడగానే నోట మాట రాలేదు. ‘నీ పేరేంటి బాబు’ అని అడిగారామె. చిరంజీవి అన్నాను. ‘శుభం బాగుంది’ అన్నారు. మరుసటి రోజ వర్షం వల్ల ‘పునాదిరాళ్లు’ షూటింగ్ క్యాన్సిల్ అయింది. నేను సరదాగా డ్యాన్స్ చేస్తూ జారిపడ్డాను. అయినా ఆగకుండా నాగుపాములా డ్యాన్స్ చేయడంతో అందరూ క్లాప్స్ కొట్టారు. అప్పుడు సావిత్రిగారు ‘భవిష్యత్లో మంచి నటుడు అవుతావు’ అని చెప్పిన మాట నాకు వెయ్యి ఏనుగుల బలం అనిపించింది. ‘ప్రేమ తరంగాలు’లో సావిత్రిగారి కొడుకుగా నటించాను. ఆ తర్వాత ఆమెతో నటించే, ఆమెను చూసే చాన్స్ రాలేదు. కేవలం కళ్లతోనే నటించగల, హావభావాలు పలికించగల అలాంటి గొప్ప నటి ప్రపంచంలో మరెవరూ లేరు’’ అన్నారు. ఈ వేడుకలో సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి, కుమారుడు సతీశ్ కుమార్, నటీనటులు జయసుధ, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, మురళీ మోహన్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడారు. -
వినోదం.. సందేశం
కంచర్ల ఉపేంద్ర, సావిత్రీ కృష్ణ జంటగా ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుత రావు నిర్మించిన చిత్రం ‘ఉపేంద్ర గాడి అడ్డా’. ఈ చిత్రాన్ని నవంబరులో విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ చిత్రం విలేకర్ల సమావేశంలో సంగీత దర్శకురాలు ఎమ్ఎమ్ శ్రీలేఖ టీజర్ను రిలీజ్ చేశారు. ‘‘సోషల్ మీడియాలో మంచిని పెంపొందిస్తే సమాజానికి మేలు జరుగుతుందనే సందేశాన్ని ఈ సినిమాలో చూపిస్తాం. అలాగే 75 శాతం వినోదం కూడా ఉంటుంది’’ అన్నారు ఆర్యన్ సుభాన్. అచ్యుత రావుతో పాటు చిత్ర సహనిర్మాతలు కంచర్ల సుబ్బలక్ష్మి, కంచర్ల సునీత పాల్గొన్నారు. -
అందుకే సావిత్రి చనిపోయిన చూడటానికి వెళ్ళలేదు..!
-
మాస్ స్టెప్స్తో..
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఎస్కే ఆర్యన్ సుభాన్ దర్శకత్వంలో కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న చిత్రం ‘ఉపేంద్రగాడి అడ్డా’. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్లో జరుగుతోంది. ‘పోకిరీ జులాయిలు...’ అంటూ సాగే పాటను చిత్రీకరిస్తున్నారు. కంచర్ల ఉపేంద్ర, వంద మంది జూనియర్ ఆర్టిస్టులు, ఇరవై మంది డ్యాన్సర్లు పాల్గొంటుండగా ఈ మాస్ పాటను చిత్రీకరిస్తున్నారు. ఊటీలో చిత్రీకరించే మరో పాటతో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ‘‘హీరో కావాలన్న మా అబ్బాయి ఆసక్తిని గమనించి, ఐదు చిత్రాలు నిర్మిస్తున్నాం’’ అన్నారు కంచర్ల అచ్యుతరావు. ఈ చిత్రానికి సంగీతం: రాము అద్దంకి. -
సావిత్రి ఆ పని చేసినందుకు మానసికంగా కృంగిపోయింది
-
అప్పట్లో సావిత్రి అంటే పిచ్చి ఇష్టం నాకు..!
-
‘ఉపేంద్ర గాడి అడ్డా’తో యువతకి సందేశం
కంచర్ల ఉపేంద్ర, సావిత్రి కృష్ణ జంటగా ఆర్యన్ సుభాన్ ఎస్కే దర్శకత్వంలో ‘ఉపేంద్ర గాడి అడ్డా’ సినిమా సోమవారం ఆరంభమైంది. కంచర్ల అచ్యుతరావు నిర్మిస్తున్న ఈ సినిమా తొలి సీన్కి నిర్మాత సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేయగా, చిత్ర నిర్మాత కంచర్ల అచ్యుతరావు క్లాప్ ఇచ్చారు. ఆర్యన్ సుభాన్ ఎస్కే మాట్లాడుతూ– ‘‘ప్రస్తుతం వరుణ్ సందేశ్తో ‘కానిస్టేబుల్’ చిత్రం చేస్తున్నాను. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ నేటి ట్రెండ్కు తగ్గట్టు ఉంటూనే యువతకు సందేశం ఇచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘మా అబ్బాయి ఉపేంద్రతో తొమ్మిది చిత్రాలు తీయాలనుకున్నాం. ఇప్పటికే నాలుగు నిర్మాణంలో ఉన్నాయి. ‘ఉపేంద్ర గాడి అడ్డా’ ఐదో సినిమా’’ అన్నారు కంచర్ల అచ్యుతరావు. -
సావిత్రి తో షూటింగ్ తర్వాత ఇంటికి వచ్చి భార్యతో SVR ఏం చెప్పేవారంటే..
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - సావిత్రి
-
వెండి తెరపై నారీ ముద్ర.. సత్తా చాటుతున్న లేడీ డైరెక్టర్స్
సినిమా డైరెక్టర్ అనగానే మన మదిలో మెదిలేది మేల్ పోస్టరే. హాలీవుడ్ కావచ్చు. బాలీవుడ్, టాలీవుడ్ కావచ్చు. కెప్టెన్ ఆఫ్ హౌస్ మాత్రం ఖచ్చితంగా మగవాడే అన్న అభిప్రాయం అంద రిలో బలంగా పడిపోయింది. తొలి నుంచి పూర్తి స్థాయిలో మేల్ డామినేషన్ ఉండటమే అందు కు కారణం కావచ్చు. కానీ…అప్పుడు….ఇప్పుడు… మహిళా దర్శకులు స్టార్ కెమెరా, యాక్ష న్ అంటున్నారు. కాకపోతే అప్పుడప్పుడు మాత్రమే ఆ సౌండ్ వినిపిస్తూ వచ్చింది. ఇకపై టాలీవుడ్లో మహిళా దర్శకులు పెరగబోతున్నారా ? హెచ్.ఎమ్.రెడ్డి, బి.ఎన్.రెడ్డి, కె.వి.రెడ్డి, ఎల్.వి.ప్రసాద్, ఆదుర్తి సుబ్బారావు. ఇలా మొదలు పెట్టి చెప్పుకుంటూ పోతే....రాజమోళి, పూరి జగన్నాధ్, త్రివ్రికమ్, సుకుమార్ ఇలా పూర్తి చేయచ్చు. ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు. అంతా బానే ఉంది కానీ… మహానుభావురాళ్ల మాటేంటి ? తెలుగు సినీ పరిశ్రమలో మహిళా దర్శకుల ఉనికి తక్కువే. అస్సలు లేదు అనడానికి వీల్లేదు. అయితే… ఇప్పుడు పెరుగుతోంది. సక్సెస్ మంత్ర జపిస్తూ తెలుగు సినిమాని సరికొత్తగా ప్రేక్షకులకు ప్రెజంట్ చేయడానికి ఆమె రెడీ అయింది. సినిమా. రంగుల ప్రపంచం. మరో లోకం. 24 ఫ్రేమ్స్ క్రియేటివిటీ కళకళలాడే చోటు. అలాంటి సినిమాని లీడ్ చేసేది డైరెక్టర్ మాత్రమే. డైరెక్టర్ ఆలోచనలకు తగట్టుగానే ఒక కథ సినిమాగా మారుతుంది. అంత కీలకమైన దర్శకత్వ శాఖలో మహిళలు తమ ఉనికిని చాటుకోవడం తొలి నుంచి చాలా తక్కువే. ఇప్పుడు టాలీవుడ్లో మహిళా దర్శకుల సంఖ్య పెరుగుతోంది. కొత్త కొత్త ఆలోచనలతో… సరికొత్త సినిమాలకి యాక్షన్ చెప్పేస్తున్నారు. (చదవండి: వెండితెరపై హీరోయిన్ల విశ్వరూపం) సూర్య చేత ఆకాశమే హద్దు అనిపించింది మహిళా దర్శకురాలే. సుధ కొంగర దర్శకత్వంలో రూపొందిన ఆకాశమే నీ హద్దు రా సినిమా… న్యూ థాట్స్తో వస్తున్న ఉమెన్ మూవీ డైరెక్టర్స్ గురించి చెప్పకనే చెబుతుంది. త్వరలోనే సూర్యతో మరో సినిమా చేసేందుకు రెడీ అవుతోంది సుధా. సూర్యతో చేయబోయే సినిమా ఓ బయోపిక్ అని ఆ మధ్య తమిళ చానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. అయితే అది ఎవరి జీవిత చరిత్ర అనేది మాత్రం బయట పెట్టలేదు. (చదవండి: హీరోయినే..హీరో) వైజాగ్లో పుట్టి, పెరిగిన సుధ కొంగర తమిళ సినీ ఇండస్ట్రీలో ఎక్కువ కాలం పనిచేశారు. మొదట్లో స్క్రీన్ ప్లే రైటర్గా వర్క్ చేశారు. బాక్సింగ్ స్పోర్ట్స్ డ్రామాతో ఆమె తీసిన చిత్రం అటు హిందీ, ఇటు తమిళ, తెలుగు భాషల్లో విజయం సాధించింది. హిందీ, తమిళంలో మాధవన్ హీరోగా చేస్తే…తెలుగులో గురు పేరుతో తీసిన చిత్రంలో వెంకటేష్ లీడ్ రోల్ ప్లే చేశారు. సమంత హిట్స్ లిస్ట్పై ఒక లుక్ వేస్తే వెంటనే కనిపించే సినిమా ఓ బేబీ. పెట్టిన పెట్టుబడికి డబుల్ వసూళ్లు సాధించిందీ చిత్రం. ఓ బేబీ డైరెక్టర్ నందిని రెడ్డి. సౌత్ కొరియా చిత్రం మిస్ గ్రానీకి రీమేక్ ఈ చిత్రం. అయితే…కథా వస్తువు ఆ చిత్రం నుంచి తీసు కున్నా…సినిమా అంతటా నందిని రెడ్డి మార్క్ ఫీల్, కామెడీ కనిపిస్తూనే ఉంటాయి. లిటిల్ సోల్జర్స్ మూవీకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన నందిని రెడ్డి…ఆ తర్వాత కృష్ణవంశీ టీమ్లో చాలా కాలం కొనసాగారు. ఆ తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లోనూ పనిచేశారు. దర్శకు రాలు కావడానికి ముందు దశాబ్దానికి పైగానే టాలీవుడ్లో తన ప్రయాణం కొనసాగించారు నందిని రెడ్డి. 2011లో తొలి సినిమా అలా మొదలైంది విడుదలైంది. ఫస్ట్ మూవీతోనే హిట్ కొట్టిన నందినిరెడ్డి…ఆ తర్వాత ఓ…బేబీ అంటూ ప్రేక్షకులకు మరో మంచి మూవీని అందించారు. నందిని రెడ్డి నుంచి సుధా కొంగర దాకా ఫీమేల్ డైరెక్టర్స్ ఇండస్ట్రీ కొత్త కళని సంతరించుకుం టోంది కదా. కరోనా ముప్పు పూర్తిగా తగ్గిన తర్వాత ఆ జోష్ మరింత పెరిగింది. అయి తే….తెలుగు చిత్ర పరిశ్రమకి మహిళా దర్శకులు కొత్తేం కాదు. గతంలోనూ ఉన్నారు. ఎన్నో హిట్ సినిమాలు తీశారు. ఆ మాటకొస్తే…గిన్నీస్ బుక్లో తెలుగు సినిమాని ఎక్కించింది కూడా తెలుగు దర్శకురాలే. డైరెక్టర్ యాక్షన్ చెప్పగానే ఆయా పాత్రల్లో జీవించిన కథానాయికలు… మెగాఫోన్ పట్టి ప్రేక్షకులకు మంచి సినిమాలు అందించారు. టాలీవుడ్లో లేడీ డైరెక్టర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట ప్రస్తావించాల్సింది విజయ నిర్మల గురించే. మొత్తం 44 సినిమాలకు ఆమె దర్శకత్వం వహించారు. ప్రపంచంలో ఏ భాష లోనూ ఇన్ని సినిమాలను ఏ లేడీ డైరెక్టర్ తీయలేదు. అందుకే…ప్రపంచంలోనే అత్యధిక చిత్రాలు తీసిన మహిళా దర్శకురాలుగా ఆమె గిన్నీస్ బుక్ లో పేరు సంపాదించారు. 1971లో తొలి చిత్రానికి దర్శకత్వం వహించారు విజయనిర్మల. అదే మీనా. ఫస్ట్ మూవీనే భారీ విజ యం సాధించింది. భానుమతి. నటి, నిర్మాత, గాయని మాత్రమే కాదు. దర్శకురాలు కూడా. సొంత నిర్మాణ సంస్థలో చండీరాణి చిత్రాన్ని తీశారు భానుమతి. 1953 విడుదలైన ఈ చిత్రంలో ఎన్టీఆర్, భానుమతి హీరో, హీరోయిన్స్గా నటించారు. అటు నిర్మాతగా, ఇటు దర్శకురాలిగా, మరోవైపు కథానాయికగా…ఈ చిత్రంలో చాలా బాధ్యతలు పంచుకున్నారు భానువతి. అంతే కాదు. సినిమాలో ఆరు పాటలు కూడా ఆమె పాడారు. అన్నట్టు చిత్రానికి కథ అందించింది కూడా భానుమతే. స్టార్ స్టేటస్ వచ్చిన తర్వాత చాలా మంది నిర్మాణం వైపు చూస్తారు. కానీ…మహానటి సావిత్రి మాత్రం దర్శకత్వం వైపు దృష్టి పెట్టారు. నటనతోనే కాదు. విభిన్న దర్శకురాలిగా కూడా ప్రేక్ష కులను ఆకట్టుకోవాలని ప్రయత్నించారు. ఈక్రమంలోనే చిన్నారి పాపలు, మాతృదేవత చిత్రా లకు దర్శకత్వం వహించారు. సావిత్రి, విజయనిర్మల తర్వాత సక్సెస్ మూవీస్తో అందరినీ ఆకట్టుకున్న మరో దర్శకురాలు బి.జయ. జర్నలిస్ట్గా కెరీర్ స్టార్ట్ చేసిన జయ…సూపర్ హిట్ అనే సినీ వార పత్రికను స్థాపించి విజయవంతంగా నడిపారు. ఆ తర్వాత ప్రేమలో పావనీ కళ్యాణ్ చిత్రంతో దర్శకురాలిగా మారారు. మొత్తం 7 సినిమాలను డైరెక్ట్ చేశారు. -
తెలంగాణ మావోయిస్టు పార్టీకి భారీ షాక్
సాక్షి, హైదరాబాద్/ మద్దూరు: మావోయిస్టు పార్టీ కీలక నేత, ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ డివిజనల్ కమిటీ సభ్యురాలు రావుల సావిత్రి అలియాస్ మాధవి హెడెమె (46) డీజీపీ మహేందర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. తొలితరం పీపుల్స్వార్ నాయకుడు, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేసి 2019లో గుండెపోటుతో చనిపోయిన రావుల రామన్న అలి యాస్ శ్రీనివాస్ భార్య సావిత్రి. ఆమె లొంగిపోయిన విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. సావిత్రి 13 ఏళ్ల వయసులోనే మావోయిస్టు ఉద్యమంలో చేరారు. రావుల రామన్న 1992లో మావోయిస్టు పార్టీ (పీపుల్స్వార్)లో చేరిన సావిత్రిని 1994లో వివాహం చేసుకున్నారు. జనజీవన స్రవంతిలో కలిసినందుకు సావిత్రికి తక్షణ సాయం కింద రూ.50 వేల నగదును అందించారు. తెలంగాణలో లొంగిపోయిన సావిత్రికి రూ. 5 లక్షల చెక్ను అందజేయనున్నట్లు చెప్పారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు ‘మావోయిస్టు అగ్రనేతలు తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నారు. మావోయిజానికి ఆదరణ తగ్గింది. మావోయిస్టులు బలవంతపెట్టి కొంతమందిని దళంలో చేర్చుకుంటున్నారు. లొంగిపోతామంటే బెదిరిస్తున్నారు. నేను ఎవరికి తెలియకుండా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో లొంగిపోయానని సావిత్రి చెప్పారు’అని డీజీపీ వివరించారు. పోలీసులపై జరిగిన తొమ్మిది దాడుల్లో సావిత్రి పాల్గొన్నారని, ఛత్తీస్గఢ్లో ఆమెపై రూ. 10లక్షల రివార్డు ఉందని తెలిపారు. కేంద్ర కమిటీలో 13 మంది తెలుగోళ్లే.. ‘మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో ఉన్న 20 మందిలో 13 మంది తెలుగువాళ్లే. అందులో తెలంగాణ వాళ్లు 11 మంది కాగా, ఇద్దరు ఏపీకి చెందినవారు. ఛత్తీస్గఢ్ నుంచి వాళ్లు తెలంగాణలోకి ఎప్పుడైనా ప్రవేశించే అవకాశం ఉంది. వారు ఎప్పుడు తెలంగాణలోకి వచ్చినా.. వెంటనే పట్టుకుంటాం. లొంగిపోయే వారికి పునరావాసం కల్పిస్తాం. 135 మంది తెలంగాణకు చెందిన వాళ్లు బస్తర్లో అజ్ఞాతంలో ఉన్నారు. మహిళా నాయకుల్లో గణపతి భార్య సుజాతక్క, కోటేశ్వర్ రావు భార్యతోపాటు మరో మహిళ మావోయిస్టు రాష్ట్ర కమిటీలో పనిచేస్తున్నారు’అని డీజీపీ వివరించారు. కాగా, పోలీసులకు లొంగిపోయినందున ఎలాంటి ఆంక్షలు లేకుండా సావిత్రిని కుటుంబంలోకి ఆహ్వానిస్తామని రామన్న పెద్దన్నయ్య రావుల చంద్రయ్య పేర్కొన్నారు. -
అందుకే సావిత్రిపై కృష్ణకుమారికి కోపం..చనిపోయినా వెళ్లలేదు!
తెలుగు చిత్ర పరిశ్రమలో ముగ్ధ మనోహర రూపంతో, ప్రేక్షకులను కట్టిపడేసిన అలనాటి అందాల తార, హీరోయిన్ కృష్ణకుమారి. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఆమె తెలుగు, కన్నడ, తమిళ చిత్ర పరిశ్రమలో రెండు దశాబ్దాలకు పైగా నటించి మెప్పించింది. ఆమె ఎన్టీఆర్, ఏఎన్నార్,ఎంజీఆర్, రాజ్ కుమార్, శివాజీగణేషన్ వంటి స్టార్ హీరోలతో ఆమె జతకట్టింది. 16ఏళ్ల వయసప్పుడే హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన కృష్ణకుమారి నటించిన తొలి చిత్రం నవరత్నాలు. ఆ సినిమా విడుదల కాకముందే ఆమెకు 14 సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మొదటి సినిమా మొదలుకొని “బంగారు పాప” వరకూ వరుసగా ఫ్లాప్స్ వచ్చాయి. దాంతో కృష్ణకుమారిని “ఫ్లాపుల హీరోయిన్” అంటూ కొందరు ప్రచారం చేశారు. దీనిపై గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన కృష్ణకుమారి.. కావాలనే వేరే హీరోయిన్స్ కోసం అబద్దాలు ఆడి కొందరు ప్రొడ్యూసర్స్ తనను సినిమాల్లో తప్పించారని పేర్కొంది. ఇక అప్పట్లోనే ఎన్టీఆర్తో కలిసి నటించిన 'లక్షాధికారి' అనే సినిమాలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకొని వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇక అలనాటి తార సావిత్రి గురించి చెబుతూ ఆమె ఏమన్నారంటే.. 'సావిత్రి జీవితం చివరిరోజుల్లో అలా అయ్యేసరికి చాలా కోపం వచ్చింది. అంత పెద్ద స్టార్ హీరోయిన్ ఆవిడ. ఆమె ఇంటిలిజెన్స్ ఏమైంది? పర్సనల్ లైఫ్లో ఇబ్బందులు ఉన్నాయని అలా దిగజారిపోకూడదు కదా? అందుకే ఆమె చనిపోతే చూడటానికి కూడా వెళ్లలేదు' అంటూ గతంలో ఆమె మాట్లాడిన ఓ ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఇదిలా ఉండగా అనారోగ్యంతో ఆమె 2018, జనవరి 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే. -
మహానటి సావిత్రి.. చదువులమ్మ..
ఒంటి నిండా నగలు ధరించిన ఒక మహిళ ప్రధానమంత్రిని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. ప్రధానిని కలిసిన అనంతరం వీరజవాన్ల సంక్షేమ నిధికి ఏదైనా ఇద్దామని పర్సు వంక చూశారు. పర్సులో పెద్దమొత్తం నగదు ఉన్నా.. వారి త్యాగాలకు ఇవి సరిపోవనిపించింది. వెంటనే తన ఒంటిమీద నగలన్నింటిని వలిచి ఇచ్చేసి, ఇంటికి వచ్చేశారు. ఆమే మహానటి సావిత్రి.. నటనలో మేటిగా మహోన్నత శిఖరం అధిరోహించగా.. దాతృత్వంలోనూ తన సాటి ఎవరూరారని నిరూపించారు సావిత్రి. మహానటిగా దేశవ్యాప్తంగా పేరుప్రాఖ్యాతలు సంపాదించిన సావిత్రి రేపల్లె మండలంలో పాఠశాల ప్రారంభించి, విద్యాభివృద్ధికి కృషి చేశారు. నేడు ఆమె జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. రేపల్లె: మల్లెలు, వర్షమంటే మక్కువ.. ఎడమచేతివాటం.. క్రికెట్, చదరంగం ఆటలంటే మహాప్రీతి.. మాటల్లో చమత్కారం.. ఇతరులను అనుకరించటంలోనే దిట్ట.. ఇన్ని ఉన్నా దానధర్మాలు చేయటంలో ఆమెకు సాటిలేరు.. సాయం చేయటలో ఎముకలేని చెయ్యి అనటానికి నిదర్శనం. ఆమె మరెవరో కాదు వెండి తెర సామ్రాజ్ఞి, నడిగర్ తిలగమ్ మహానటి సావిత్రి. తీరంతో సావిత్రమ్మకున్న అనుబంధం... అమ్మ సుభద్రమ్మ, పెద్దమ్మ దుర్గమ్మలది గుంటూరు జిల్లా రేపల్లె మండలంలోని వడ్డివారిపాలెం గ్రామమే. దీంతో గ్రామంపై మమకారం పెంచుకున్న సావిత్రి తన పెద్దమ్మ దుర్గమ్మ కోరికతో పాఠశాల స్థాపించటం, గ్రామాన్ని పలుమార్లు పర్యటించడం ఆ గ్రామంపై ఆమెకున్న మమకారాన్ని తెలుపుతోంది. సావిత్రిని సావిత్రమ్మగా ఈ ప్రాంత ప్రజలు పిలుస్తుంటే ఆమె మనస్సు ఆనందంతో నిండిపోయేదని ఇక్కడి ప్రజలు అంటుంటారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సావిత్రి విగ్రహం గ్రామంలో పాఠశాల ఏర్పాటు కుగ్రామమైన వడ్డివారిపాలెంలో మహానటి సావిత్రి గ్రామీణులైన పేద విద్యార్థులకు విద్యను అందించాలని వారి అభ్యున్నతికై సంకల్పించుకుని 1962 సంవత్సరంలో పాఠశాల స్థాపించారు. పాఠశాల స్థాపించిన సమయంలో గ్రామస్తులే కాకుండా పాఠశాల ప్రారంభోత్సవానికి చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ఆ రోజుల్లోనే వేల సంఖ్యలో రావటం విశేషం. ప్రస్తుతం శ్రీమతి సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తోంది. విద్య, క్రీడ, సాంస్కృతిక తదితర అన్ని రంగాలలో కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రాణిస్తూ పలువురిని మన్ననలు పొందుతోంది. గత పదకొండు సంవత్సరాలుగా నూరుశాతం ఫలితాలు, పలు క్రీడల్లోనూ జిల్లా, రాష్ట్రస్థాయిల్లో గుర్తింపు పొందటం, పాఠశాలలో చదివిన విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగటం విశేషం. వడ్డివారిపాలెంలోమహానటి సావిత్రి కట్టించిన పాఠశాల సావిత్రమ్మకు తోడుగా... పాఠశాలకు అండగా... పాఠశాల స్థాపన నాటి నుంచి సావిత్రమ్మ సంకల్పానికి గ్రామప్రజలు తోడుగా నిలిచారు. సావిత్రి స్థలాన్ని కొనుగోలు చేసి పాఠశాలను నిర్మాణం చేసి ఆలనా పాలనా చూసేవారు. కొంత మంది గ్రామస్తులు వడ్డి మాధవరావు, వడ్డి పెద్ద వెంకటేశ్వరరావు, వడ్డి నరసింహారావు, వడ్డి సుబ్బారావు, కొల్లాల బసవయ్య, కోట నాగేశ్వరరావు, కొట్టి దేవేంద్రరావు, వడ్డి చినవెంకటేశ్వరరావులతో పాటు మరికొందరు పాఠశాల ఆలనా పాలనకై తమ పొలాన్ని పాఠశాలకు అందజేసి దీనిపై వచ్చే ఆదాయాన్ని పాఠశాలకు అవసరమైన వ్యయాలను భరించేవారు. దీంతో పాఠశాలకు కొంత వరకు వ్యయభారాలకు తగ్గాయి. తరు వాత ప్రభుత్వం పా ఠశాలను గుర్తించింది. అయితే ఒక సందర్భంగా ప్రభుత్వ గ్రాంటు రాకపోవటంతో ఆరు నెలలపాటు ఉపాధ్యాయులకు వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న సావిత్రి రూ.1,04,000లు అందజేసి పాఠశాలకు అండగా నిలిచారు. ఈ మొత్తం ప్రస్తుత విలువ ప్రకారం కోటి రూపాయల పైమాటే. సావిత్రి జీవితాన్ని వెండితెరకు ఎక్కించిన మహానటి చిత్ర నిర్మాతలు ప్రియాంకదత్, స్వప్నదత్, దర్శకుడు నాగ్ అశ్విన్లు సైతం పాఠశాల విద్యార్థుల సౌకర్యార్థం ఒక బస్సును అందజేశారు. ‘నాడు–నేడు’తో మరింత అభివృద్ధి.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో భాగంగా వడ్డీవారిపాలెం సావిత్రి గణేష్ జిల్లా పరిషత్ ఉన్నపాఠశాల నాడు–నేడు కార్యక్రమానికి ఎంపికైంది. నాడు–నేడులో భాగంగా రూ.42లక్షలతో పాఠశాలను అభివృద్ధి చేశారు. నిధులతో తరగతి గదుల మరమ్మతులు, విద్యుద్ధీకరణ పనులు, మరుగుదొడ్ల నిర్మాణం, తాగునీటి ఏర్పాటు, బ్లాక్ బోర్డుల ఏర్పాటు తదితర పనులు నిర్వహించగా వీటిని రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకట రమణారావు ప్రారంభించారు. -
కొత్తింటిని చూపిస్తూ మురిసిపోయిన గంగవ్వ, ఇంటి విశేషాలేంటో ఆమె మాటల్లో..
Bigg Boss Telugu 4 Fame Gangavva Shares Home Tour Moments: బిగ్బాస్ మాజీ కంటెస్టెంట్, యూట్యూబ్ స్టార్ గంగవ్వ ఇటీవల కొత్త ఇంటిలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ‘మై విలేజ్ షో’ అనే యూట్యూబ్ చానల్తో ఫేమస్ అయిన గంగవ్వ తన మాటలతో ఎంతో ప్రేక్షకుల ఆదరణను పొందింది. అనంతరం బిగ్ బాస్ 4వ సీజన్లో అడుగు పెట్టి.. యావత్ తెలుగు బుల్లి తెర ప్రేక్షకులను అలరించింది. చదవండి: మాల్దీవులో వాలిపోయిన పూజా, స్టన్నింగ్ వీడియోలు షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ ఈ నేపథ్యంలో హోస్ట్ నాగార్జునతో తన చిరకాల స్వప్నం గురించి పంచుకున్న ఆమె నాగార్జున, స్టార్ మా సాయంతో సొంత ఇంటి కలను నిజం చేసుకుంది. ఇటవల గృహప్రవేశం కూడా చేసిన గంగవ్వ ఈ క్రమంలో తన కొత్త ఇంటి గురించి, అందులోని గదుల ప్రత్యేకత గురించి వివరిస్తూ యూట్యూబ్ చానల్లో విడియో విడుదల చేసింది. దీంతో ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. చదవండి: 13 ఏళ్లుగా నరకం, ఎట్టకేలకు బ్రిట్నీ స్పియర్స్కు తండ్రి నుంచి విముక్తి ఈ సందర్భంగా గంగవ్వ తనకు ఇళ్లు కట్టిస్తానాని మాట ఇచ్చిన హీరో నాగార్జున్, బిగ్బాస్ టీం, స్టార్ మాకు ధన్యావాదాలు తెలిపింది. అలాగే గృహ ప్రవేశానికి కలగూర గంప టీంతో పాటు బిగ్బాస్ కంటెస్టెంట్స్ అఖిల్ తన తల్లితో వచ్చాడని, అలాగే సావిత్రి కూడా వచ్చినట్లు చెప్పింది. అనంతంర కొత్త బిజీ కారణంగా రాలేకపోయారు, తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపిన గంగవ్వ కొత్త ఇంటిని చూపిస్తూ మురిపోయింది. మరి తన ఇళ్లు ఎలా ఉంది, గంగవ్వ పంచుకున్న విశేషాలను మనం కూడా చూద్దాం రండి! చదవండి: కొత్త ఇంట్లోకి బిగ్బాస్ ఫేమ్ గంగవ్వ గృహప్రవేశం -
కలలు కల్లలు.. ఉద్యోగంలో చేరిన గంటల్లోనే...
నందిగామ: ఉద్యోగం వచ్చిందన్న ఆనందం ఒక్క రోజులోనే ఆవిరైంది. మృత్యువు రోడ్డు ప్రమాదం రూపంలో బలి తీసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... ఏపీలోని కృష్ణా జిల్లా పరిటాల గ్రామానికి చెందిన వేముల మారుతీరావుకు తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచకు చెందిన కాల్వ సావిత్రి (33)తో వివాహమైంది. వారు పరిటాలలోనే నివాసముంటున్నారు. మహబూబ్నగర్ పట్టణంలో అసిస్టెంట్ లైన్ ఉమెన్గా సావిత్రికి ఉద్యోగం వచ్చింది. దీంతో భార్యాభర్తలిరువురు ఆనందంగా ద్విచక్ర వాహనంపై 14న బయలుదేరి వెళ్లి ఉద్యోగంలో చేరారు. అదే రోజు పరిటాలకు తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున నందిగామ పట్టణ శివారుల్లో 65వ నంబరు జాతీయ రహదారిపై బైక్ అదుపు తప్పి రెయిలింగ్ను ఢీకొట్టింది. సావిత్రి అక్కడికక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలపాలైన మారుతీరావును స్థానికులు ఆస్పత్రికి తరలించారు. (చదవండి: ఆర్కేను రక్షించుకోలేకపోయాం: కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి) -
హీరోయిన్గా... సావిత్రి ఆఖరి చిత్రం
‘ఆడపిల్లకు చదువెందుకు? ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు ఏలాలా?’ ఇది పాత తరంలో తరచూ వినిపించిన మాట. కానీ, స్త్రీని చదివిస్తే, ఆ చదువు ఆమెకే కాదు... మొత్తం ఇంటికే వెలుగవుతుంది. విద్యావంతురాలైన స్త్రీమూర్తి సమాజానికి దిశానిర్దేశం చేస్తుంది. ఆ సంగతిని 50 ఏళ్ళ క్రితమే తెరపై చెప్పిన చిత్రం ‘నిండు దంపతులు’. నేటి సుప్రసిద్ధ దర్శకుడు కె. విశ్వనాథ్ నిర్దేశకత్వంలో ఎన్టీఆర్, సావిత్రితో, బెజవాడ లక్ష్మీటాకీస్ ఓనర్లలో ఒక రైన మిద్దె జగన్నాథరావు యస్వీయస్ ఫిలిమ్స్పై తీసిన కుటుంబ కథాచిత్రమిది. వాణిజ్య జయాప జయాల కన్నా తెరపై చర్చించిన కీలక సామాజిక అంశం రీత్యా, సావిత్రి హీరోయిన్గా నటించిన ఆఖరి చిత్రంగా ఈ సినిమాకు ఇప్పటికీ ప్రత్యేకత ఉంది. యాభై ఏళ్ళ క్రితం 1971 ఫిబ్రవరి 4న ఆ ఘట్టానికి తెర తీసిన ‘నిండు...’ జ్ఞాపకాలివి. కొన్ని కథలు, కాంబినేషన్లు విశేషం. ఆడవాళ్ళకు చదువెందుకనుకొనే రోజుల్లో స్త్రీ విద్య చుట్టూ తిరిగే ఓ కథను తెరపై చెప్పగలమా? మాస్ హీరో ఎన్టీఆర్, సంసారపక్షమైన సినిమాల దిగ్దర్శకుడు కె. విశ్వనాథ్ – ఈ ఇద్దరి కాంబినేషన్ ఊహించగలమా? కానీ, వారిద్దరి కలయికలో ఏకంగా 4 సినిమాలు వచ్చాయి. అందులో ‘నిండు దంపతులు’ ఆడవారి చదువుకు ఉన్న ప్రాముఖ్యాన్ని వెండితెరపై చెప్పింది. అప్పట్లోనే... ఆడవారి చదువు కథగా... కిళ్ళీకొట్టు నడుపుతున్నా, స్త్రీకి చదువు కావాలనుకొనే సంస్కారం ఉన్న హీరో (ఎన్టీఆర్)... ఎంత చదువుకున్నా పెళ్ళయ్యాక ఆడది ఆ ఇంటి పరువు కాపాడే కోడలనే లాయర్ హీరోయిన్ (సావిత్రి)... స్త్రీకి ఆర్థికస్వేచ్ఛ ఉండాలంటూ బి.ఏ చదువుకే గొప్పలు పోయే హీరో మేనకోడలు (లక్ష్మి)... కాపురం చేయాల్సిన ఆడదానికి చదువెం దుకనుకొనే హీరోయిన్ చెల్లె లైన టీ కొట్టు సుబ్బులు (విజయనిర్మల) – ఈ 4 పాత్రల మధ్య కథ ‘నిండు దంపతులు’. హీరో, ఏ దిక్కూ లేని మేనత్త కూతురు వాణి (లక్ష్మి)ని బి.ఏ దాకా చదివిస్తాడు. ఆమెను పెళ్ళాడాలనుకుంటాడు. కానీ ఆమె ఓ పెద్దింటి అబ్బాయిని (చంద్రమోహన్)ని పెళ్ళి చేసుకుంటుంది. లా చదివిన హీరోయిన్, చదువు లేని హీరోను పెళ్ళాడాల్సి వస్తుంది. వాణి చిక్కుల్లో పడినప్పుడు హీరోయిన్ సావిత్రి నల్లకోటు వేసుకొని, కోర్టులో వాదించి ఆమె జీవితాన్ని చక్కదిద్దుతుంది. నాయికగా సావిత్రి ఆఖరి సినిమా! ‘మహానటి’ చిత్రం ద్వారా ఈ తరానికీ సుపరిచితమైన శిఖరాగ్ర స్థాయి సినీ నాయిక సావిత్రి. ఆమె తన కెరీర్లో కథానాయికగా చేసిన చివరి చిత్రంగానూ ‘నిండు దంపతులు’ గుర్తుంటుంది. ఆ సినిమా తర్వాత మరణించే వరకు ఆ మహానటి చేసిన పాత్రలన్నీ తల్లి, వదిన లాంటి సహాయ పాత్రలే! 1966లో షూటింగ్ మొదలైన ఏయన్నార్ ‘ప్రాణమిత్రులు’లో ఏయన్నార్ సరసన సావిత్రి హీరోయిన్. తర్వాత మళ్ళీ ఏయన్నార్ సరసన నాయిక పాత్ర పోషించే అవకాశం సావిత్రికి రాలేదు. అయితే, ఆ తర్వాత ‘నిండు దంపతులు’ దాకా అయిదేళ్ళ పాటు ఎన్టీఆర్ పక్క ఆమె నాయికగా చేశారు. ఎన్టీఆర్ ‘పల్లెటూరు’ (1952)తో హీరోయిన్గా మొదలైన సావిత్రి, కథానాయికగా ఆఖరి చిత్రంలో కూడా ఆయన సరసనే నటించడం యాదృచ్ఛికం. అలా 1952 నుంచి 1971దాకా 20 క్యాలెండర్ ఇయర్స్ పాటు ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్ తెరపై వెలిగింది. కాంగ్రెస్ కార్యక్రమాల... బెజవాడ లక్ష్మీటాకీస్ బెజవాడలోని పేరున్న పాతకాలపు థియేటర్లలో ‘శ్రీలక్ష్మీటాకీస్’ ఒకటి. తెలుగు సినీ రాజధాని బెజ వాడలో మారుతీ,దుర్గాకళామందిరం తర్వాత వచ్చిన 3వ సినిమా హాలు ఇది. 1939లో మొదలైన ఆ హాలు గౌడ కులస్థులైన మిద్దె రామకృష్ణారావు, జగన్నాథరావు సోదరులది. అన్నదమ్ములిద్దరూ కాంగ్రెస్ వాదులు. ఆ రోజుల్లో కాంగ్రెస్ కార్యక్రమాలు ఈ సినిమా హాలులో జరిగేవి. రాజకీయాల పట్ల ఆసక్తి ఎక్కువున్న రామకృష్ణారావు స్వాతంత్య్రం వచ్చాకా కాంగ్రెస్లో తిరిగారు. (నిర్మాత జగన్నాథరావు, 1977 చివర్లో రామకృష్ణారావు పోయాక, ఆ హాలు 1992లో చేతులు మారింది. ఇప్పటి స్వర్ణ ప్యాలెస్గా 1995లో ముత్తవరపు వెంకటేశ్వరరావు చేత రూపుమార్చుకుంది. రామకృష్ణారావు 3వ కుమారుడు మురళీకృష్ణ మాత్రం 1996 నుంచి కృష్ణాజిల్లా చీమలపాడులో ‘శ్రీలక్ష్మీ టాకీస్’ పేరుతో ఓ థియేటర్ నడుపుతున్నారు. అదే బెజవాడ పాత లక్ష్మీటాకీస్కు మిగిలిన కొత్త తీపిగుర్తు). దర్శకుడే దైవమన్న ఎన్టీఆర్! ‘నిండు దంపతులు’ సమయానికి హీరోయిన్గా సావిత్రి కెరీర్ చివరి దశలో ఉన్న రోజులు. అప్పటికే జమున, కాంచన, వాణిశ్రీ లాంటి వారున్నా, నిర్మాత జగన్నాథరావు తమ సొంత ఊరు బెజవాడ తార అనే అభిమానంతో అభినేత్రి సావిత్రినే నాయిక లాయర్ పాత్రకు తీసుకుందామన్నారు. వైవాహిక జీవితంలోని చీకాకులతో అప్పటికే ఆమె సతమతమవుతున్నారు. ఆమె వ్యక్తిగత అలవాట్లు వృత్తి జీవితపు క్రమశిక్షణపై ప్రభావం చూపడం మొదలుపెట్టిన సమయమది. ‘‘ఒకప్పుడు పెద్ద పెద్ద డైలాగులే అలవోకగా చెప్పిన మహానటి సావిత్రికి దురదృష్టవశాత్తూ షూటింగులో డైలాగులు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. అప్పుడు ‘పెద్ద డైరెక్టర్ చెబుతున్నారమ్మా... వినాలి’ అంటూ సావిత్రికి ఎన్టీఆర్ మెత్తగా చెప్పాల్సి వచ్చింది. సినిమా రూపకల్పనలో కెప్టెన్ ఆఫ్ ది షిప్ అయిన డైరెక్టర్లకు స్టార్లు ఇవ్వాల్సిన సహకారం గురించి సావిత్రికి ఆయన చెప్పడం నాకిప్పటికీ గుర్తు’’ అని విశ్వనాథ్ అన్నారు. సినీ నిర్మాణంలో తండ్రికి వారసులుగా... బ్లాక్ అండ్ వైట్ ‘నిండు దంపతులు’ అప్పట్లో 35 ప్రింట్లతో విడుదలైంది. పాజిటివ్ రివ్యూలొచ్చినా, అప్పుడప్పుడే తెలుగులో మొదలవుతున్న కలర్సిన్మాల హవాలో కమర్షియల్గా ఈ సినిమా వెనుకబడింది. 50 రోజులే ఆడింది. రెండేళ్ళకే జగన్నాథరావు కన్ను మూశారు. ఆపైన ఆయన నలుగురు కుమారులు (చంద్రకుమార్, విజయకుమార్, జీవన్ కుమార్, వెంకట రమణ కుమార్) తండ్రి బాటలో సాగారు. దాసరితో ‘జీవితమే ఒక నాటకం’ (’77), విజయ నిర్మల డైరెక్షన్లో హీరో కృష్ణతో ‘మూడు పువ్వులు – ఆరు కాయలు’, ‘శంఖుతీర్థం’ (’79), సోదర సంస్థ పి.వి.ఎస్. (పద్మావతీ వెంకటేశ్వర స్వామి) ఫిలిమ్స్ బ్యానర్ పై కొమ్మినేని శేషగిరిరావుతో ‘కొంటె కోడళ్ళు’ (’83), రేలంగి నరసింహారావు సారథ్యంలో ‘కొంటె కాపురం’ (’86), ‘కాబోయే అల్లుడు’ (’87) తీశారు. మలయాళంలో, కన్నడంలో రెండేసి సినిమాలూ నిర్మించారు. ఆ తర్వాత మారిన పరిస్థితుల రీత్యా యస్.వి.యస్ సంస్థ చిత్ర నిర్మాణం నుంచి విరమించుకుంది. అయితే ఇప్పటికీ సినీ ప్రియులకు ఆ సంస్థ, అది తీసిన సినిమాలు చెదరని జ్ఞాపకాలే! నాలుగు సినిమాల... ఆ కాంబినేషన్ దర్శకుడు కె. విశ్వనాథ్, ఎన్టీఆర్ ఎన్టీఆర్, కె. విశ్వనాథ్ల కాంబినేషన్ ఓ విచిత్రం. ‘అన్నపూర్ణా’ సంస్థలో నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు, దర్శకుడు ఆదుర్తితో కలసి పనిచేసిన విశ్వనాథ్ నిజానికి అక్కినేనికి సన్నిహితులు. దర్శకుడిగా విశ్వనాథ్ తొలి చిత్రం కూడా ఏయన్నార్ హీరోగా అన్నపూర్ణా వారు తీసిన ‘ఆత్మగౌరవం’ (1966). తర్వాత దాదాపు పాతికేళ్ళకు ఆయన మళ్ళీ ఏయన్నార్తో చేసింది ‘సూత్రధారులు’ (1989). కారణాలు ఏమైనా, ఆ రెండే తప్ప ఏయన్నార్తో విశ్వనాథ్ మరే సినిమా చేయలేదు. కానీ, ఏయన్నార్కు ప్రత్యర్థి అయిన మరో టాప్ హీరో ఎన్టీఆర్తో కె. విశ్వనాథ్ ఏకంగా 4 సినిమాలు చేయడం విచిత్రం. గమ్మత్తేమిటంటే, ఆ కాంబినేషన్ను కుదిర్చినదీ, మొత్తం నాలుగింటిలో మూడు సినిమాలను నిర్మించిందీ ఒక్కరే – యస్.వి.యస్. ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథ రావు. ‘‘గుంటూరులో ఒకే కాలేజీలో చదివే రోజుల నుంచి ఎన్టీఆర్ గారితో నాకు పరిచయం ఉంది. నా సౌండ్ రికార్డిస్ట్ రోజుల నుంచి స్నేహం ఉంది. దర్శ కుడిగా నన్ను ఎన్టీఆర్ దగ్గరకు తీసుకెళ్ళింది బెజ వాడ లక్ష్మీ టాకీస్ ఓనర్లయిన యస్.వి.యస్. ఫిలిమ్స్ వారే’’ అన్నారు విశ్వనాథ్. అప్పటి నుంచి ఆ సంస్థలో, విశ్వ నాథ్, ఎన్టీఆర్ల కాంబినేషన్లో ‘కలిసొచ్చిన అదృష్టం’ (1968 ఆగస్టు 10), ‘నిండు హృదయాలు’ (1969 ఆగస్టు 15), ‘నిండు దంపతులు’ (1971 ఫిబ్రవరి 4) వచ్చాయి. నిర్మాత– యస్.వి.యస్. ఫిలిమ్స్ అధినేత మిద్దె జగన్నాథ రావు (1919 – 1973) శత జయంతి కూడా ఆ మధ్యనే జరిగింది. ఇవాళ్టికీ ఆయన పేరు చెప్పగానే ఆ రోజుల్లోని వారందరికీ బెజ వాడ ‘శ్రీలక్ష్మీ టాకీస్’ ఓనర్లలో ఒకరిగానే సుపరిచితులు. ఆ సినిమాలన్నీ... ఆయనతోనే! ఎన్టీఆర్తో నిర్మాత మిద్దె జగన్నాథరావు స్వాతంత్య్రం వచ్చాక... సినీప్రదర్శన నుంచి సినీ నిర్మాణం వైపు కూడా మిద్దె సోదరులు విస్తరించారు. హీరో ఎన్టీఆర్ది బెజవాడ దగ్గరి నిమ్మకూరు కావడంతో, ఆ పరిచయం, అనుబంధంతో నిర్మాతలుగా మారారు. తొలిప్రయత్నంగా జలరుహా ప్రొడక్షన్స్ పతాకంపై ఆ అన్నదమ్ములు కలసి తీసిన చిత్రం ‘రాజనందిని’ (1958). మల్లాది రామకృష్ణ శాస్త్రి రచనలో, వేదాంతం రాఘవయ్య దర్శకత్వం వహించిన ఆ జానపద చిత్రంలో హీరో ఎన్టీఆరే. ఆ తరువాత దాదాపు పదేళ్ళకు తమ్ముడు మిద్దె జగన్నాథరావు సొంతంగా యస్.వి.యస్. ఫిలిమ్స్ స్థాపించి, ఆ బ్యానర్ లో విడిగా సినిమాలు నిర్మించారు. జగన్నాథరావు తమ ఆరాధ్యదైవం పేరు మీద ‘శ్రీ వేంకటేశ్వర స్వామి’ ఫిలిమ్స్ అంటూ సంస్థను పెట్టాలనుకున్నారు. ఎన్టీఆర్ తన ఆఫీసులో కాగితాల ప్యాడ్ మీద గుండ్రటి చేతిరాతతో, అందంగా ఆ బ్యానర్ పేరును తెలుగులో రాసిచ్చారు. అలా ‘యస్.వి.యస్’ ఫిలిమ్స్ ఎన్టీఆర్ చేతుల్లో ప్రాణం పోసుకుంది. విశేషం ఏమిటంటే, నిర్మాత జగన్నాథరావు 54వ ఏట ఆకస్మికంగా మరణించే వరకు ఆ బ్యానర్ లో కేవలం ఎన్టీఆర్ హీరోగానే సినిమాలు తీశారు. అలా ఆ బ్యానర్లో 5 సినిమాలు (ఎస్.డి.లాల్ దర్శకత్వంలోని ‘నిండు మనసులు’, విశ్వనాథ్ తీసిన మూడు సినిమాలు, డి.యోగానంద్ దర్శకత్వంలోని ‘డబ్బుకు లోకం దాసోహం’) వచ్చాయి. ‘డబ్బుకు లోకం దాసోహం’ రిలీజు టైములో లావాదేవీలు చూసుకోవడానికి కీలకమైన హైదరాబాద్ కేంద్రానికి వచ్చారు నిర్మాత జగన్నాథరావు. ఎప్పుడూ అలవాటైన లక్డీకాపూల్ ద్వారకా హోటల్ రూమ్ నెంబర్ 101లోనే బస చేశారు. హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. ఉస్మానియా హాస్పిటల్కు తీసుకెళ్ళినా లాభం లేక, 1973 జనవరి 22న కన్నుమూశారు. అలా యస్.వి.యస్. ఫిలిమ్స్ – ఎన్టీఆర్ల కాంబినే షన్కు ఊహించని బ్రేక్ పడింది. చిరంజీవి సినిమాకు మూలం! చదువుకూ సంస్కారానికీ సంబంధం లేదనీ, సంస్కారానికి చదువు తోడైతే శోభిస్తుందనీ, స్త్రీకి చదువొస్తే సంసారం నిండుగా ఉంటుం దనీ హీరో, హీరోయిన్ పాత్రల ద్వారా చెబు తుంది– ‘నిండు దంపతులు’. సముద్రాల జూనియర్ డైలాగ్స్ పలు సామాజిక సమస్యలను చర్చిస్తాయి. చదువు లేని హీరో, మేనత్త కూతుర్ని చదివించి పెళ్ళి చేసుకోవాలనుకొని, నిరాశ పడే భాగం చూస్తే తర్వాతెప్పటికో వచ్చిన కె. విశ్వనాథ్ ‘స్వయంకృషి’ (1987) గుర్తుకొస్తు్తంది. ఇక్కడి ఎన్టీఆర్, లక్ష్మి – అక్కడి చిరంజీవి, అతను చదివించే సుమలత పాత్రలు అయ్యాయనిపిస్తుంది. ‘‘స్త్రీ విద్య ప్రధానాంశంగా ‘నిండు దంపతులు’ కథ, స్క్రీన్ప్లే రాసుకున్నా. అప్పటికి అది రివల్యూషనరీ థాట్. కానీ, సినిమా అనుకున్నంత ఆడలేదు. అందుకని హీరో, తన మనసుకు దగ్గరైన అమ్మాయిని చదివించడం అనే అంశం ‘స్వయంకృషి’లో మళ్ళీ వాడాం. అయితే, ‘స్వయంకృషి’ కథ, ట్రీట్మెంట్ పూర్తిగా వేరు’’ అని విశ్వనాథ్ ‘సాక్షి’కి వివరించారు. హీరో పాత్రకు కిళ్ళీ కొట్టు స్ఫూర్తి... ‘నిండు దంపతులు’లో ఎన్టీఆర్ వేసిన కిళ్ళీకొట్టు రాములు పాత్రకు ఓ నిజజీవిత పాత్ర ఓ రకంగా స్ఫూర్తి. అప్పట్లో బెజవాడలో శ్రీలక్ష్మీ టాకీస్ ఎదురు సందులో ‘రాములు కిళ్ళీ షాపు’ చాలా ఫేమస్. అక్కడ రాములు కట్టే రకరకాల, రుచికరమైన కిళ్ళీల కోసం అప్పట్లో జనం క్యూలు కట్టేవారు. ‘‘సినిమాలో హీరో పాత్ర కూడా రకరకాల కిళ్ళీలు కడుతుంది. షూటింగ్లో కిళ్ళీ తయారీ దృశ్యాల కోసం బెజవాడలోని ఆ షాపు నుంచి ప్రత్యేకంగా కిళ్ళీ కట్టే వ్యక్తిని తెప్పించాం’’ అని నిర్మాత జగన్నాథరావు పెద్దబ్బాయి చంద్రకుమార్ (చిన్ని) తెలిపారు. అరుదైన రికార్డ్ ఆ జంట సొంతం! ఎన్టీఆర్, సావిత్రి కాంబినేషన్లో తెరపై బహుముఖ పార్శా్వలు కనిపిస్తాయి. ప్రేయసీ ప్రియులు (కార్తవరాయని కథ, ఇంటిగుట్టు వగైరా) మొదలు భార్యాభర్తలుగా (గుండమ్మ కథ), అన్యోన్య దంపతులుగా (విచిత్ర కుటుంబం), అన్నా చెల్లెళ్ళుగా (రక్త సంబంధం), బాబాయి – కూతురుగా (మాయాబజార్), వదిన – మరుదులుగా (కోడలు దిద్దిన కాపురం), అక్కా తమ్ముళ్ళుగా (వరకట్నం), ప్రతినాయిక – నాయకులుగా (చంద్రహారం), కథను నడిపించే వేశ్య– యాంటీ హీరోగా (కన్యాశుల్కం), కథ ప్రకారం తల్లీ కొడుకులుగా (సర్కస్ రాముడు) ... ఇలా ఒకదానికొకటి పూర్తి విభిన్నమైన బంధాలను వారిద్దరి జంట వెండి తెరపై అవలీలగా ఒప్పించింది. జనాన్నీ మెప్పించింది. ఒక టాప్ హీరో, టాప్ హీరోయిన్ కలసి జంటగా ఇన్ని వైవిధ్యభరితమైన పాత్రలు చేయడం సినిమా చరిత్రలో మరెక్కడా కనపడని విషయం. - రెంటాల జయదేవ -
తారలు తరించిన కూడలి
సినీతారలు దర్శనమిచ్చినప్పుడు అభిమానులు ఎలా తరించి పోతారో.. నవరాత్రులకు రాజమండ్రి దేవీచౌక్లోని అమ్మవారిని దర్శించుకున్నప్పుడు సినీతారలు అలా తరించిపోయేవారట! అంతటి వైభవం ఉన్న ఆ వేడుకలకు ఇప్పటికీ స్థాయి,‘తార’స్థాయీ తగ్గలేదు. దసరా నవరాత్రులు వస్తున్నాయంటే రాజమహేంద్రవరం నడిబొడ్డున ఉన్న దేవీచౌక్ మిలమిలలాడే నక్షత్ర కాంతులతో తళతళలాడుతుంటుంది. భక్తులు ధరించే ఎర్రని వస్త్రాలతో ఆ ఆరుబయలు ప్రాంగణమంతా అరుణవర్ణ శోభితం అవుతుంది. నుదుటన ధరించిన కుంకుమ ప్రతి భక్తుని ముఖాన సూర్యుడు ఉదయించిన భావనను కలిగిస్తుంది. తొమ్మిది రోజుల పాటు సాగే అమ్మవారి ఉత్సవాలకు రాజమహేంద్రవరం మణిద్వీపంలా భాసిస్తుంది. ఎనభై ఐదేళ్ల వైభవం! కర్ణాటకలోని మైసూరు దసరా ఉత్సవాలకు, కలకత్తా కాళీమాత ఆరాధనలకు దీటుగా నిలుస్తుంది గోదావరీ తీరాన దేవీచౌక్ వేడుక. ఈ నాలుగు రోడ్ల కూడలిలో చిన్న దేవాలయంలో కొలువు తీరిన అమ్మవారిని దసరా ఉత్సవాల సమయంలో వేలమంది దర్శించుకుంటారు. ఈ ఏడాది సెప్టెంబరు 28 నుంచి (నేటి నుంచి) దేవీ చౌక్ సెంటర్లో శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి.గోదావరి సాంస్కృతిక వైభవానికి, కళలకు కాణాచి అయిన రాజమహేంద్రవరం ఖ్యాతికి ఈ వేడుకలు ఆనవాలుగా నిలుస్తాయి. తెల్లవారే వరకు పౌరాణిక నాటకాలు కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. నాడు మూడు లాంతర్ల సెంటర్ ఏళ్ల క్రితం దేవీచౌక్ను మూడు లాంతర్ల సెంటరు అని పిలిచేవారు. కరెంటు లేని రోజుల్లో వీధి దీపాలుగా ఈ సెంటరులో గుత్తిగా ఉండే మూడు లాంతర్లలో కిరోసిన్ పోసి దీపాలు వెలిగించేవారు. అందువల్ల ఈ ప్రాంతాన్ని అలా పిలిచేవారు. ఆ రోజుల్లో మొట్టమొదటగా దసరా ఉత్సవాలను 200 రూపాయలతో ప్రారంభించారు. 1934లో రాజమహేంద్రవరానికి చెందిన బత్తుల మల్లికార్జునరావు, మునెయ్య సోదరులు ఉత్సవాల రూపురేఖలను మార్చి వేశారు. ఎలక్ట్రిక్ లైట్లు వచ్చాయి. 1963లో కలకత్తా నుంచి పాలరాతితో రూపొందిన బాలాత్రిపురసుందరి విగ్రహాన్ని తెచ్చి ప్రతిష్ఠించారు. ఆ రోజు నుంచి మూడు లాంతర్ల జంక్షన్ దేవీచౌక్గా మారిపోయింది. దసరా తొమ్మిది రోజులూ ఇక్కడ ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఉదయం నుంచి రాత్రి వరకు అవిశ్రాంతంగా కుంకుమపూజలు జరుగుతాయి. ఆ తరువాత ప్రారంభమయ్యే పౌరాణిక, జానపద, సాంఘిక నాటకాల ప్రదర్శనలతో తెల్లవారిపోతుంది. ఒక దశలో మూడు వేదికలను ఏర్పాటు చేసి, ఒక వేదికపై నాటకాలు, రెండో వేదికపై హరికథలు, బుర్రకథలు, మరో వేదిక మీద భోగంమేళం సాగేవని ఆ తరానికి చెందిన పెద్దలు ఎంతో సంతోషంగా గుర్తు చేసుకుంటారు. ఇప్పుడు మాత్రం ఒకే వేదికపై నాటక ప్రదర్శనలు జరుగుతున్నాయి. – వారణాసి సుబ్రహ్మణ్యం, సాక్షి రాజమహేంద్రవరం కల్చరల్ ఫొటోలు : గరగ ప్రసాద్ ఒక్క ఛాన్స్ వస్తే చాలు రాజమండ్రి దేవీ చౌక్లో జరిగే దసరా ఉత్సవాలలో కనీసం ఒక్కసారైనా వేషం వేయగలిగితే చాలునని పెద్ద పెద్ద కళాకారులే ఉవ్విళ్లూరేవారు. సినీనటులు అక్కినేని నాగేశ్వరరావు, రేలంగి, ఎస్వీ రంగారావు, గుమ్మడి, జి.వరలక్ష్మి, గిరిజ వంటి ఎందరో నటులను ఈ వేదిక మీద సత్కరించారు. దినారాయణరావు–అంజలీదేవి, రాజసులోచన–సి.ఎస్.రావు, సావిత్రి–జెమినీగణేశ్లను కూడా ఇక్కడ సత్కరించారు. 1969 దసరా ఉత్సవాలలో నాటి మేటినటి రాజసులోచన దేవీచౌక్ వేదికపై నాట్యం చేస్తూ పడిపోవడంతో ఆమె కాలి ఎముక విరిగింది. ఆరోగ్యం కుదుటపడ్డాక, ఆమె తిరిగి ఇక్కడకు వచ్చి, మళ్లీ నాట్యం చేశారు. దేవీచౌక్ ఉత్సవాలను కళాకారులు ఎంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకునేవారో ఈ సంఘటన చెబుతుంది. నేటి అర్ధరాత్రి శ్రీకారం ఈ నెల 28వ తేదీ అర్ధరాత్రి 12.06 గంటలకు వేదికపై అమ్మవారిని ప్రతిష్ఠించడంతో 86వ శరన్నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం జరుగుతుంది. గత వైభవ దీప్తులకు పరంపరగా ఈ ఉత్సవాలు గోదావరి చరిత్రలో నిలిచిపోనున్నాయి. -
ఈ రెండు కోరికలు తక్క!
బీయే సుబ్బారావు దర్శకత్వంలో ఎన్టీఆర్, సావిత్రి, కృష్ణంరాజు...నటించిన ఒక పౌరాణిక సినిమాలోని దృశ్యాలు ఇవి. సినిమా పేరేమిటో చెప్పుకోండి చూద్దాం... భార్య చేతుల్లో ఉన్నాడు భర్త. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.‘‘నేను ఉండగా నీకే గండం రానివ్వను’’ భర్తకు ధైర్యం చెబుతుంది సావిత్రి.ఇంతలో దిక్కులు పిక్కటిల్లేలా నవ్వు.‘‘ఎవరునువ్వు?’’ రెట్టించి అడిగింది ఆమె.‘‘మృత్యువును’’ అని సమాధానం వచ్చింది.‘‘మృత్యువా? ధర్మరాజా అభివందనం. నీ దివ్యసందర్శనం ప్రసాదించు’’ అని వేడుకుంది సావిత్రి.అదిగో ఆయన దివ్యమంగళరూపం!‘‘ధన్యోస్మి ప్రభూ! ధర్మప్రభూ నీ కర్తవ్య నిర్వాహణకు వచ్చావా?’’ అని అడిగింది సావిత్రి.‘‘అవును తల్లీ’’ అన్నాడు యమధర్మరాజు.‘‘నా పతిప్రాణాలు తీసుకొనిపోక తప్పదా?’’ అని అడిగింది దీనంగా.‘‘తప్పదమ్మా. కాని నవ్వు మహాప్రతివతవు’’ అన్నాడు ఆయన చల్లగా! నీ ఒడిలో ఉన్నంత వరకు నీ పతి ప్రాణాలను తీసుకోలేను. అతనిని భూశయనం చేయించు’’ అన్నాడు యమధర్మరాజు.ఈమాటతో ఆమెలో ఒకింత ఆగ్రహం తొంగి చూసింది...‘‘ధర్మపాలన నీకే కాదు నాకూ ఉన్నది. పతిప్రాణాలను మృత్యువుకు అర్పించుట సతికి ధర్మమా?’’ అని ఆవేశంగా అడిగింది.‘‘ఇందులో మీరు అర్పించినది ఏమియును లేదు. నీ భర్త ఆయుఃకాలం తీరింది. మృత్యువు ఆవశ్యం. అనివార్యం!’’ గట్టిగా అన్నాడు ధర్మరాజు.‘‘అనివార్యమైనప్పుడు నేను భూశయనం చేయించవలసిన అవసరంఏమిటి?’’ అన్నది ఆమె.‘‘నన్ను పరీక్షిస్తున్నావా?’’ గొంతు పెద్దది చేశాడు యమధర్మరాజు.‘‘నా సతీధర్మాన్ని పాటిస్తున్నాను’’ అన్నది ఆమె.‘‘దాహం...దాహం...’’ అంటున్నాడు ఆమె భర్త.‘‘తెస్తాను ప్రభూ’’ అంటూ నీళ్ల కోసం వెళ్లింది సావిత్రి.ఇదే అదునుగా అతడిలోని ప్రాణజ్యోతిని మృత్యుదండంతో లాగాడు యముడు.సావిత్రి వచ్చే సరికి భర్త చనిపోయి ఉన్నాడు. ఆమె దుఃఖం కట్టలు తెంచుకుంది.ప్రభూ! నన్ను విడిచి వెళ్లిపోయావా? నా పసుపు కుంకుమలను తుడిచి వెళ్లిపోయావా? నా తపస్సు వృథా చేసి వెళ్లిపోయావా? మీరు కట్టిన మాంగల్యాన్ని తెంచివేసి వెళ్లిపోయావా?....యమధర్మరాజు అక్కడినుంచి మాయమయ్యాడు. అతడిని అనుసరిస్తూ ఆకాశమార్గంలోకి వెళ్లింది సావిత్రి.‘ఈ శూన్యం కంటే శూన్యమా నీ హృదయం?నా ధైన్యం కన్నా ఘనమా నీ ధర్మం?’ అని యమధర్మరాజుని ప్రశ్నించింది.‘‘తండ్రీ! నీ బిడ్డ వంటి దానను. నాతో పంతమా. వద్దు తండ్రీ వద్దు! నన్ను కరుణించు. నా పతిని నాకు ప్రసాదించు’’ అని వేడుకుంది.‘‘సావిత్రీ...ఎంత చెప్పినను నీ మొండిపట్టుదల విడువలేకున్నావు. దేవర్షి నిన్ను నాతో ప్రత్యక్ష యుద్ధానికి సన్నద్ధురాలిని చేసి పంపినట్టున్నాడు. ఆ ధైర్యంతోనే నన్ను అనుసరిస్తున్నావు. ఏమైనా నీ కోరిక నెరవేరదు. మరలిపో’’ అని మాయమయ్యాడు యమధర్మరాజు. ‘‘ధర్మరాజా! నువ్వు అదృశ్యం కాగలవు కాని అసాధ్యుడవు మాత్రం కాదు. అమృత హృదయుడవు. దయాధర్మ గుణశీలుడవు. నిన్ను నేను విడవను’’ అంటూ యముడిని అనుసరించింది సావిత్రి. ‘‘నిష్ఠుర కాల నియమ నిష్ఠా గరిష్ఠ. ప్రకృతి ధర్మ పరిరక్షణా దక్ష...సకల జీవరాశీ జీవనదాత...అనంత తేజోరాశీభూత....నమోవాకములు...నమోవాకములు’’ అని ప్రార్థించాడు యమదర్మరాజు.‘‘కుమరా, ఏమిటి విశేషం?’’ అడిగాడు సూర్యుడు.‘‘విశేషం కాదు తండ్రీ వైపరీత్యం! మృత్యువును జయించి మృతుడైన తన భర్తను బతికించుకోవాలనే సంకల్పంతో అతిలోకశక్తిని సాధించి ఒక సామాన్య మానవాంగన సావిత్రి నన్ను వెంటాడి వచ్చుచున్నది. చండప్రచండ మార్తాండ రూపం ధరించి మీరే ఆమె గమనమును అవరోధించవలెను. ధర్మమును కాపాడవలెను’’ అని వేడుకున్నాడు యముడు.‘‘కుమరా! కాలచక్ర క్రమబద్ధుడనైన నాకు అది కర్తవ్యం’’ అని అభయమిచ్చాడు సూర్యభగవానుడు.‘‘ఉజ్వల ఉగ్రరూపాయ దినకర! శుభకర! ధన్మోస్మి’’ అని ఆ భగవానుడిని ప్రార్థిస్తూనే ‘‘ధర్మరాజా! ఆగు ఆగు’’ అంటూ యముడి వెంట వెళ్లింది సావిత్రి.తన వెనకనే వస్తున్న సావిత్రిని చూసి....‘‘ఏమి ఈ సాహసము! సావిత్రి...ఇది రెక్కలకు అందని రిక్కల కూటమి. కోటి సూర్యప్రభాతమైన ఈ ప్రదేశమునకునీవు రాలేవు. ఆ నక్షత్ర కాంతిని భరించే శక్తి మర్త్యులకు లేదు. వెళ్లు...వెనుతిరిగి వెళ్లు’’ ఆదేశించాడు యముడు.‘‘దేవా! నీ దివ్యతేజస్సును వీక్షించిన నా కనులకు ఈ చుక్కలు ఒక లెక్కా!’’ అన్నది సావిత్రి. అంతేకాదు...‘‘నక్షత్రమండలాన్ని అధిష్టించిన తేజోమూర్తులారా, గ్రహములారా, పతి ప్రాణాల కోసం పయనించి వచ్చిన నన్ను అడ్డగించకండి. నా ఆర్తి బాపండి. నాపై జాలి చూపరా, నా సంకల్పబలం వమ్ము కావల్సిందేనా’’ అన్నది.ఆ సమయంలోనే అరుంధతి ప్రత్యక్షమై...‘‘సావిత్రి! సత్యసంకల్పానికి ఎప్పుడూ విఘాతం కలగదమ్మా. తల్లీ! ఏకాగ్రతను మించిన తపస్సు, ఆత్మశక్తిని మించిన శక్తి లేదమ్మా’’ అని ధైర్యం చెప్పింది.‘‘తేజోమూర్తులారా! ఖగోళాల్లారా! క్షణకాలం పాటు మీ పరిభ్రమణ ఆపండి. సావిత్రికి దారి ఇవ్వండి’’ అని సావిత్రికి ఆటంకం లేకుండా చేసింది. ‘‘ఏది ఏమైననూ కోరరాని కోరికలే కోరుతున్నావు. నీ భర్త ప్రాణాలు తిరిగి ఇవ్వడం ఎంత అసంభవమో, నీ ప్రాణములు తీసుకుపోవుట అంతే అసంభవం. ఈ రెండు కోరికలు తక్క... మరేమన్నా కోరుకో ఇస్తాను’’ అన్నాడు యమధర్మరాజు.‘‘సతికి పతి కన్నా విలువైనది ఏమున్నది?’’ అన్నది ఆమె.‘‘అయితే మీ అత్తమామలకు దృష్టి ఇస్తా...’’ ‘‘మీ అత్తమామలు కోల్పోయిన రాజ్యసంపదలను తిరిగి ఇస్తా....’’ ఇలా వరాల చిట్టా విప్పుతున్నాడు యమధర్మరాజు.సావిత్రి మాత్రం ఈ వరాలను కాదంది.భర్త ప్రాణాలు మాత్రమే కావాలంది.‘‘ఇవ్వదలచినవి కాదంటావు– ఇవ్వకూడనిది కావాలంటావు. ఏమి నీ మూర్ఖత్వం’’ అని విసుక్కున్నాడు యమధర్మరాజు.‘‘సమవర్తి! ధర్మమార్గాన్ని నమ్ముకున్న నాకు ధర్మమే దారి చూపుతుంది’’ అన్నది సావిత్రి.ఆ మాటల్లో తాను గెలుస్తాననే నమ్మకం ప్రతిధ్వనిస్తుంది. -
ప్రేమ మీటర్
వెండి తెర ప్రేమను వెలిగించిన పాటలు మేము కొన్ని అనుకున్నాం... మీకు ఇంకేవేవో గుర్తుకురావచ్చు... హ్యాపీ వాలెంటైన్స్ డే (ఫిబ్రవరి 14) డ్రామా లేని ప్రేమ పండిన దాఖలాలు లేవు. అడ్డంకులు, అవరోధాలు లేకుండా సాఫీగా ఉన్న ప్రేమ గొప్ప ప్రేమగా జ్ఞాపకాల్లో నిలువలేదు. ప్రేమ పొందేది కాదు. సాధించుకునేది. గెలుచుకునేది.నిలబెట్టుకునేది. అందులో పడ్డవాళ్లను చెడ్డవాళ్లని లోకం అనుకున్నా లెక్క చేయరు. పగవాళ్లని దూరం పెట్టినా పట్టించుకోరు. అబ్బాయి అమ్మాయి కోసం ఎదురు చూస్తుంది. అమ్మాయి కోసం అబ్బాయి కోట గోడల్ని అయినా లతలు పట్టుకొని పాకి సాహసంగా లోపలికి లంఘిస్తాడు. రాకుమారి స్వయంవరం ప్రకటించి వచ్చిన వందమందిలో ఒకరిని ఎంచుకుంటే ఏం చోద్యం ఉంది? అదే తోటలో పని చేసే ఒక కూలివాణ్ణి కోరుకుంటే అసలైన కథ ఉంది. ‘పాతాళ భైరవి’లో రాకుమారి అలా ఒక తోట రాముణ్ణి ప్రేమించి తెలుగునాట వెండి తెర మీద ప్రేమకు గట్టిగా తెర తీసింది. ‘నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది’ అని ఆమె చందురుణ్ణి చూసి పాడుతుంటే ఆ పదం విని తోటలో రాముడు ‘కలవరమాయే మదిలో నా మదిలో’ అని అరచేతిని ఛాతీకి రుద్దుకుంటాడు. ఆ కలవరం తీర్చుకోవడానికి అతడు రిస్క్ తీసుకోవడానికి వెనుకాడడు. మాంత్రికుడి వలలో పడటానికి సందేహించడు. ‘ప్రేమ కోసమై వలలో పడినే పాపం పసివాడు’ అని ప్రేక్షకులు జాలి పడేలా చేసుకోగలిగాడు. ఏమైనా ఈ ప్రేమ సుఖాంతమైంది. ఆ పాతాళభైరవి తల్లి వల్ల పది కాలాలు నిలిచింది. అయితే ప్రేమలో ఉన్నట్టుగా ప్రేమికులకు తెలియకపోవడం కూడా ఒక తియ్యటి విషయమే. ‘మిస్సమ్మ’లో టీచరమ్మ సావిత్రి, పంతులు ఎన్.టి.ఆర్ ఒకే ఇంట్లో భార్యభర్తలుగా దొంగనాటకం ఆడుతూ కాపురం పెడతారు. నిజానికి వారు దొంగ భార్యభర్తలే కాని నిజం ప్రేమికులు. ఆ సంగతి వారికి తెలియదు. అర్థం చేసుకోరు. ఒకరికొకరు చెప్పుకోరు. ప్రేమంతా లోపల ఉంటుంది. కయ్యాలు బయటకు కనిపిస్తూ ఉంటాయి. ఇది వింత ప్రేమ. అందుకే ‘రావోయి చందమామ... మా వింతగాథ వినుమా’ అని వారు పాడుకుంటే ఇలాంటి వింత ప్రేమలో పడటానికి ప్రేక్షకులు కూడా రెడీ అయ్యారు.అయితే ప్రేమ అంటేనే ప్రమాదం. ప్రేమ అంటేనే శోకం. ప్రేమ అంటేనే వేదన. ప్రేమ అంటే మరణం అని ‘దేవదాసు’ చెప్పింది. చిన్నప్పటి నుంచి ఇష్టపడ్డ పారు జీవితంలో దక్కకపోతే ఏ దేవదాసైనా దేవదాసే అవుతాడు. అటువంటి సమయంలో ఆ ప్రేమికుడికి తాత్త్వికత వస్తుంది. ‘కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్’ అంటాడు. ‘జగమే మాయ బతుకే మాయ’ అని భౌతిక జీవితాన్ని ఈసడిస్తాడు. ‘ఓ... దేవదా’ అని ఆమె పాడితే ‘ఓ.. పార్వతి’ అని ఇతడు పాడిన రోజులు మాత్రమే అతడికి వాస్తవం. అవి తప్పిపోయిన మిగలిన అన్ని రోజులూ మత్తే. అందులో చిత్తే. ఆఖరుకు మరణం మాత్రమే అతడి ప్రేమను మరిపించగలిగింది. ఆ ప్రేమను ఇప్పటికీ ప్రేక్షకులు ఇష్టంగా నిందగా ఇష్టపడుతూనే ఉన్నారు.అయితే ప్రేమ అంటే ఏమిటి? శరీరమా, మనసా, ఆ రెంటి మీద ఆధిపత్యమా? ఏమిటి ప్రేమంటే? దానికీ తెలుగు సినిమా జవాబు చెప్పింది.‘డాక్టర్ చక్రవర్తి’లో శ్రీశ్రీ కలం ఆ ప్రశ్నకు ఇలా బదులు పలికింది. ‘నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరునించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యమూ అదే స్వర్గమూ’... నిజమే కదా. ‘చీకటి మూసిన ఏకాంతంలో తోడుగా నిలవడమే కదా’ ప్రేమంటే. ఇప్పుడు ప్రేమకు యువతీ యువకులు సిద్ధంగా ఉన్నారు. పడటానికి ఉవ్విళ్లూరుతున్నారు. కాని వారికి రాయబారి కావాలి. ప్రేమ వ్యక్తం చేసే మార్గం కావాలి. ‘ప్రేమలేఖ’ ఆ కార్యాన్ని నెరవేర్చింది. ఎన్ని వేల, లక్షల ప్రేమ లేఖలు లోకాన ఒకరి నుంచి మరొకరికి అంది ఉంటాయో. ఇక్కడ చూడండి. టక్ చేసుకున్న హరనాథ్. రెండు జడలు వేసుకున్న జమున. వాళ్లకు తోడు నిలవడానికి గొంతు సవరించుకున్న పి.బి.శ్రీనివాస్, సుశీల. ‘అందాల ఓ చిలుకా... అందుకో నా లేఖ... నా మదిలోని కలలన్నీ... ఇక చేరాలి నీ దాకా’... ఇలా కాగితం మీద రాసుకున్న ప్రేమలేఖలు ఉంటాయి. రాయడం రాక, రాయలేక పూలతో చెట్లతో నివేదించుకున్న ప్రేమ లేఖలు కూడా ఉంటాయి. ‘మూగ మనసులు’ సినిమాలో ఆ పాట గుర్తుందా?... ‘ముద్దుబంతి పూవులో మూగకళ్ల ఊసులో ఎనక జనమ బాసలు ఎందరికి తెలియులే’. ప్రేమలో పడ్డవాళ్లు ‘నవ్వినా ఏడ్చినా కన్నీళ్లే వస్తాయి’ అని కూడా ఈ పాట చెప్పింది. సఫలమైతే ఒకలాగా. విఫలమైతే ఒకలాగా. ఇది కొంచెం నయం. ఎదురుగా ఉన్న మనిషితో ఏదో వంక పెట్టి మనసులో మాట చెప్పొచ్చు. అసలు కళ్లెదుటే లేని మనిషైతే? ‘మల్లీశ్వరి’లో ఆ బావామరదళ్ల కష్టం వర్ణనాతీతం. అతడు ఎక్కడో ఉన్నాడు. ఆమె మరెక్కడో ఉంది. ఉత్తరాలు అందవు. మాటలు వినపడవు. ఇక సందేశం అందించాల్సిన భారం మేఘం తీసుకుంది. ‘ఏడ తానున్నాడో బావా జాడ తెలిసిన పోయి రావా అందాల ఓ మేఘమాల’ అని వారు పాడుకుంటే ఆ విరహానికి అది కూడా బరువెక్కి వర్షించింది. కాలం మారింది. బండ్లు పోయి మోటారు బండ్లు వచ్చాయి. పంచెలు పోయి ప్యాంట్లు వచ్చాయి. మొలతాళ్లు పోయి బెల్ట్లు వచ్చాయి. కాలేజీ చదువులు చదివే వారి సంఖ్య పెరిగింది. లవ్కు వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ అనే తేడా ఎందుకు అనగలిగే తెగింపు వచ్చింది. తెలుగైతే ఏమిటి తమిళం అయితే ఏమిటి అన్నారు. ఇటువైపు తెలుగింట్లో అమ్మాయి అటువైపు తమిళింట్లో అబ్బాయి ప్రేమించుకున్నారు.వాళ్ల ప్రేమకు రోడ్లు చాల్లేదు. బీచ్లు చాల్లేదు. గుడి మెట్లు చాల్లేదు. ఆఖరుకు స్ట్రక్ అయిన లిఫ్ట్లో కూడా ప్రేమించుకున్నారు ‘కలసి ఉంటే కలదు సుఖమూ కలిసి వచ్చిన అదృష్టమూ’ అని చిందులేశారు.‘మరోచరిత్ర’ ప్రేమ పాటల్లో కూడా చరిత్ర సృష్టించింది. అమ్మాయిలు అంతటితో ఆగలేదు. చాలా బారికేడ్లను బ్రేక్ చేశారు. ‘నువ్వడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నానా’ అని ప్రియుడి సమక్షంలో పాడి పెద్దవాళ్ల గుండెలను బేజారెత్తించారు. ‘వయసు పిలిచింది’ సినిమాకు బదులు పలికినవాళ్లు బహుమంది. ప్రేమకు పెరిగిన ఈ గిరాకీని సీనియర్ హీరోలు గమనించారు. ప్రేమను ప్రేమించడంలో మేమేమీ తక్కువ తినలేదు అన్నారు. సూపర్స్టార్ కృష్ణ ‘నేనొక ప్రేమ పిపాసిని’ అని పాడి ఇప్పటికీ ఆ పాటను హిట్ చేస్తూనే ఉన్నారు. అక్కినేని ‘నా కళ్లు చెబుతున్నాయి నిను ప్రేమించానని’ అంటూ షర్ట్ మీద జర్కిన్ వేసి స్టెప్స్తో మోతెక్కించారు. శోభన్బాబు ‘ఎలా ఎలా దాచావు అలవిగాని అనురాగం’ అని నది ఒడ్డున సుజాతను రెండు చేతులతో పైకెత్తుకున్నారు. ఎన్.టి.ఆర్ ‘రెండక్షరాల ప్రేమ రెండు క్షణాల ప్రేమ’ అని నల్లడ్రస్సులో ఆవేశంగా పాడి చెట్టు కొమ్మను పట్టుకుని ఊపి పారేశారు. కాని నిజంగానే తరం మారింది.కాలేజీ వయసు కంటే ఇంకా తక్కువ వయసులోనే ప్రేమించేసుకునే పిల్లలు వచ్చారు. ‘ముద్దమందారం’ సినిమాలో ప్రదీప్–పూర్ణిమ కలిసి ఆ రోజులలోనే పారిపోయారు. పెళ్లి చేసుకున్నారు.‘అలివేణి ఆణిముత్యమా’... ఒకరి సమక్షంలో ఒకరు లాలిత్యంతో పాడుకున్నారు. ‘నాలుగు స్తంభాలాట’లో నరేశ్–పూర్ణిమ ‘చినుకులా రాలి నదులుగా పారి వరదలై పోయి కడలిలా పొంగు నీ ప్రేమ నా ప్రేమ’ అని పాడుకుంటే వయసుకు, శరీరానికీ ఆవల ఉన్న ఆరాధనను కొత్తతరం అందిపుచ్చుకుందన్న నమ్మకం కుదిరింది. నాగార్జున వెంకటేశ్ జనరేషన్ వచ్చింది. మృత్యువు ప్రేమను నిరోధించలేదని చెప్పింది. నాగార్జున ‘గీతాంజలి’ ఒక ఊటీ నీటి ఆవిరిలాంటి సినిమా. ‘నిప్పులోన కాలదు నీటిలోన నానదు గాలిలాగ మారదు ప్రేమ సత్యము’ అని ఆ సినిమా చెప్పింది. హీరో చచ్చిపోతాడని తెలిసినా హీరోయిన్ చనిపోతుందని తెలిసినా ప్రేమ బతికే ఉంటుందన్న నమ్మకంతో ఈ సినిమా చూసి హాలు నుంచి బయటకు వస్తాడు ప్రేక్షకుడు.వెంకటేశ్ ‘ప్రేమ’ ఇళయరాజా సాయంతో ఒక మంచి ప్రేమ డ్యూయెట్ను ఇచ్చింది. ‘ఈనాడే ఏదో అయ్యింది. ఏనాడూ నాలో జరగనిది’... కాని చివరిలో హీరోయిన్ చనిపోతుంది. ఇంతమంచి ప్రేమను చంపేస్తారా అని ప్రేక్షకులకు కోపం వస్తే బతికించినట్టు చూపాల్సి వచ్చింది. అదీ ప్రేమ ఎఫెక్ట్.అయితే ప్రేమ దెబ్బ మెగాస్టార్ కూడా తినకతప్పలేదు. కాకపోతే ఆయన ‘పెంటమ్మ’తో ప్రేమలో పడాల్సి వచ్చింది.‘రుద్రవీణ’లో ఆయన తొలి చూపులోనే ప్రేమించిన అమ్మాయి శోభన తమాషాకు తన పేరు పెంటమ్మ అని చెబుతుంది. పేరేదైనా ప్రేమ ప్రేమే అని తన మనసు ఆమె పాదాల దగ్గర పెడతాడు. తన హృదయంలో ‘లలిత ప్రియ కమలం విరిసినది’ అని చెబుతాడు. కాని ఊరి మేలు కోసం ఆ ప్రేమనే త్యాగం చేస్తాడు. ఆ సమయంలోనే ప్రేమ సఫలం కావడానికి హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసి వచ్చిన యువకుడిగా రాజేంద్రప్రసాద్ ‘ముత్యమంత ముద్దు’లో కనిపిస్తారు. సీతతో ఆయన పాడిన ‘ప్రేమలేఖ రాశా నీకంది ఉంటది’ పాట పెద్ద హిట్. సంగీతం కన్నడ దేశం నుంచి హంసలేఖ మోసుకొచ్చారు. ఈ సందర్భంలో ‘సాగర సంగమం’లో కమలహాసన్, జయప్రదల మధ్య చిగురించిన మూగప్రేమను చెప్పకుండా ఉండలేము. ఇద్దరూ మాట్లాడుకోకుండా ‘మౌనమేలనోయి ఈ మరపురాని రేయి’ అని పాడుకుంటూ ఉంటే ఆ నిశ్శబ్దప్రేమను ప్రేక్షకులు చెవి వొగ్గి విన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు కథలు అటూ ఇటూ నడిచాయి. జనం ప్రేమను మర్చిపోయారు అనుకుంటూ ఉండగా కరుణాకర్ వచ్చి ‘తొలి ప్రేమ’తో పెద్ద హిట్ కొట్టాడు. ప్రేమ సత్యమైనదే అయితే గెలిచే తీరుతుందని చెప్పాడు. ‘నీ మనసే... సే.. సే.. సే’... అని పవన్ కల్యాణ్ పాడిన పాట పెద్ద హిట్. ఆ తర్వాత దర్శకుడు తేజా వచ్చి ప్రేమే ‘చిత్రం’ అన్నాడు. అబ్బాయి అమ్మాయి ‘నువ్వు–నేను’గా ఉండాలన్నాడు. అలాంటి వాళ్లే జీవితంలో ‘జయం’ సాధిస్తారనన్నాడు. ఈ సినిమాలతో తెలుగునాట మళ్లీ ప్రేమ దుమారం వచ్చింది. ‘నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరు నువ్వు నేను’, ‘అందమైన మనసులో అంత అలజడెందుకో ఎందుకో ఎందుకో’ పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ మూడ్ను ‘మనసంతా నువ్వే’ పీక్కు తీసుకెళ్లింది. ‘చెప్పవే ప్రేమ చెలిమి చిరునామా’ పాట అడ్రస్ సరిగా లేని కుర్రాళ్లని కూడా ప్రేమలో పడేలా చేసింది.తరుణ్ కూడా తన పాత్ర తాను పోషించాడు. ‘నువ్వంటే నాకిష్టం నాకన్నా నువ్విష్టం’ అని ఇష్టాన్ని స్పష్టం చేశాడు. అయితే ఫ్యాక్షన్ సినిమాలో కూడా చిరుగాలి వంటి ప్రేమ పూస్తుందని ‘ఒక్కడు’లో మహేష్బాబు డాబా మీద పాడి నిరూపించాడు. ‘చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి’ పాట ప్రేక్షకుల యదను గిల్లింది. ప్రభాస్ నేను తక్కువ తినలేదని నిండా ‘వర్షం’లో మునిగి ‘మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం...’ అంటూ త్రిషకు దగ్గరయ్యాడు.అల్లు అర్జున్ ఈ ప్రేమకు కొత్త డైమన్షన్ తెచ్చాడు. ఎస్ చెప్పొద్దు నో చెప్పొద్దు ‘ఫీల్ మై లవ్’ అన్నాడు. ఈ భావన కూడా బాగుందే అని ప్రేక్షకులు అనుకున్నారు. ఆ తర్వాత ‘కొత్త బంగారులోకం’ వచ్చింది. ‘నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా’ పాటను ఇచ్చింది. ‘ఏమాయ చేశావే’ వచ్చింది. ‘ఈ హృదయం...’ అని రెహమాన్ ట్యూన్ను తెచ్చింది. అంతవరకూ మౌనంగా ఉన్న ఇళయరాజా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ సినిమా కోసం తిరిగి హార్మోనియం అందుకున్నారు. ‘ఇలా ఇలా ఇలా హాయి నీదే సుమా’ పాట ఎంతో హిట్ చేశారు. అప్పుడు దర్శకుడు హను రాఘవపూడి ‘అందాల రాక్షసి’ తీశాడు. లావణ్య త్రిపాఠి వెంట నవీన్చంద్ర పడి ‘వెన్నంటే ఉంటున్నా కడదాక వస్తున్నా’... అంటూ చేసే అల్లరిని మణిరత్నం స్టయిల్లో చూపించాడు. ప్రేమ యాత్ర కొనసాగింది. రామ్ ‘నేను శైలజా’ చేశాడు. ఎన్నాళ్లు గడిచినా ప్రేమ అనేది ‘క్రేజీ క్రేజీ క్రేజీ క్రేజీ ఫీలింగ్’ అని చెప్పాడు. శర్వానంద్ ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ చేశాడు. ‘ఎన్నో ఎన్నో వర్ణాల హరివిల్లే చెలి కళ్లై’ పాట నిత్యా మీనన్ ప్రెజెన్స్లో రంగులు పులుముకుంది. ప్రేమకు తిరుగులేదు అనడానికి నిన్న మొన్నటి సినిమాలు నిన్న మొన్న వచ్చిన హీరోలు కూడా సాక్ష్యం పలికారు.‘అర్జున్ రెడ్డి’ పెద్ద హిట్. ‘ఆర్ ఎక్స్ హండ్రెడ్’ ఇంకా పెద్ద హిట్. ‘గీత గోవిందం’ సూపర్ డూపర్ హిట్. ‘ఊపిరాగుతున్నదే ఉన్నపాటున ఇలా’ ‘అర్జున్ రెడ్డి’లో, ‘పిల్లా రా నువ్వు కనపడవా’ పాట ‘ఆర్ ఎక్స్ 100’లో, ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ పాట ‘గీత గోవిందం’లో ఇటీవలి ఆకర్షణలుగా నిలిచాయి.ప్రేమ– పాట ఒక జోడి.ప్రేమ– ప్రేక్షకుడు కూడా ఒక జోడి.ప్రేమ– ప్రపంచం ఒక జోడి.ప్రపంచం ఉన్నంత కాలం ప్రేమ ఉంటుంది.ప్రేమ ఉన్నంత కాలం మంచి పాట కూడా ఉంటుంది.మంచి మంచి పాటలు అందించిన ఆయా గేయకర్తలకు, సంగీత దర్శకులకు, గాయనీ గాయకులకు, నిర్మాత దర్శకులకు, నటీ నటులకు వాలెంటైన్స్ డే సందర్భంగా శుభాకాంక్షలు.తమిళనటుడు కార్తిక్ తెలుగులో రెండు అందమైన ప్రేమకథల్లో నటించాడు. ఒకటి సీతాకోక చిలుక, రెండు అభినందన. రెంటికీ ఇళయరాజానే సంగీతం. రెంటిలోని ప్రేమపాటలన్నీ చాలా హిట్ అయ్యాయి. ‘మాటే మంత్రమూ’, ‘మిన్నేటి సూరీడు వచ్చేనమ్మ పల్లె’ పాటలు సీతాకోక చిలుకలో. ‘ఎదుటానీవే... యదలోనా నీవే’, ‘ప్రేమ ఎంత మధురం... ప్రియురాలు అంత కఠినం’ పాటలు అభినందనలో ప్రేమికులను కట్టిపడేశాయి. కథనం: కె -
అనసూయను ట్రోల్ చేస్తోన్న నెటిజన్లు..
‘క్లాసిక్ను ఎప్పటికి టచ్ చేయకూడదు.. మాస్టర్ పీస్ని చెడగొట్టకూడదు’ ఇది సిని ప్రపంచంలో మొదటి నియమం. ఫెయిల్యూర్ అవుతుందనే భయం కన్నా ఫీల్ చెడితే జనాల నుంచి వచ్చే వ్యతిరేకతను ఎదుర్కొవడం అంత ఇజీ కాదు. ఇంతకు ముందంటే మన సినిమాల గురించి జనాలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు పెద్దగా అవకాశం ఉండేది కాదు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా వల్ల తమకు నచ్చని వాటి గురించి మొహం మీదే చెప్పేస్తున్నారు అభిమానులు. నచ్చితే పొగడటం.. లేదంటే ట్రోల్ చేయడం వెంటవెంటనే జరిగిపోతుంది. ప్రస్తుతం నెటిజన్ల ఆగ్రహానికే కాక మహానటి సావిత్రి అభిమానుల ఆగ్రహానికి గురయ్యారు టాలీవుడ్ బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ. ఓ పక్క టీవీ షోలు.. అడపదడపా సినిమాలు చేస్తూ అభిమానులను అలరిస్తోన్న అనసూయ తాజగా ప్రకటనల రంగంలోకి కూడా ప్రవేశించారు. ఈ క్రమంలో ఓ ప్రముఖ వస్త్రాల కంపెనీ యాడ్లో నటించిన అనసూయపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యాడ్ కోసం సదరు కంపెనీ ఎవర్ గ్రీన్ హిట్ ‘మాయాబజార్’ సినిమాలోని ‘ఆహా నా పెళ్లంట’ పాటను ఎంచుకున్నారు. ఈ పాటలో అనసూయ ఏకంగా మహానటి సావిత్రిని ఇమిటేట్ చేస్తూ నటించారు. దాంతో నెటిజన్లు అనసూయనే కాక సదరు మాల్ యాజమాన్యాన్ని కూడా తెగ ట్రోల్ చేస్తున్నారు. ‘మీరు సావిత్రి గారిని అవమానించారు’.. ‘అనసూయ.. సావిత్రి గారితో నీకు పోలికా’.. ‘దయ చేసి సావిత్రమ్మని ఇలాంటి పనులకు ఉపయోగించుకోకండి’.. అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ యాడ్లో ఘటోత్కచుడి పాత్రలో యస్వీఆర్ను ఇమిటేట్ చేస్తూ ప్రముఖ గాయకుడు మనో నటించారు. View this post on Instagram Something which I’ve been super anxious about but also feel super lucky to be the one to do.. #Savitramma #Mahanati 🙏🏻🙇🏻♀️!! The attempt itself is an acheivement for me!! Thank you @chandanabros @YamunaKishore garu for considering me🙏🏻🙏🏻 I will cherish this work forever🥰🙏🏻 A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) on Dec 2, 2018 at 9:51pm PST -
మహానటిగా నిత్య మీనన్
అలనాటి అందాల నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా మహానటి. ఈ సినిమాలో సావిత్రి పాత్రలో కనిపించిన కీర్తి సురేష్ అద్భుతంగా నటించిందన్న ప్రశంసలు దక్కాయి. అయితే ముందుగా ఈ పాత్ర నిత్యమీనన్ దగ్గరకే వెళ్లిందట. కానీ అనివార్య కారణాల వల్ల నిత్య మహానటి సినిమాలో నటించలేకపోయింది. అయితే తాజాగా సావిత్రి పాత్ర మరోసారి నిత్యను వెతుక్కుంటూ వచ్చిందట. నందమూరి బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా యన్.టి.ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సావిత్రి పాత్రకు నిత్యమీనన్ను సంప్రదించినట్టుగా తెలుస్తోంది. మాయబజార్, మిస్సమ్మ, రక్తసంబంధం లాంటి అద్భుత చిత్రాలకు సంబంధించిన సన్నివేశాలను యన్.టి.ఆర్లో చూపిస్తున్నారు. ఈ సీన్స్లో సావిత్రిగా నిత్య మీనన్ కనిపించనుంది. ప్రస్తుతానికి అధికారిక ప్రకటన లేకపోయినా.. నిత్య మీనన్, సావిత్రి పాత్రలో కనిపించటం కన్ఫమ్ అన్న టాక్ వినిపిస్తోంది. -
మిస్సమ్మ మంచి టీచర్ గోవిందం మంచి మాస్టర్
మేకప్ లేని గురువులు బడిలో ఉంటారు.మేకప్ ఉన్న గురువులు సినిమాల్లో ఉంటారు.కాని వారి పాఠాల్లో తేడా ఉండదు.వారి ఆదర్శాల్లో తేడా ఉండదు.వారు చూపించే మంచి మార్గంలో తేడా ఉండదు.దైవం కంటే ముందు మనిషి గురువునే తెలుసుకుంటాడు.తల్లిదండ్రుల చేయి తర్వాత గురువు చేయే పట్టుకుంటాడు.మంచి చెప్పాలనుకున్న సినిమాల్లో మంచి గురువు ఎప్పుడూ హిట్టే కొట్టాడు. నూటికి నూరు మార్కులు సాధించాడు. బేడ్ టీచర్స్ వల్ల కొంతమందికి గుడ్ జరుగుతూ ఉంటుంది. ‘మిస్సమ్మ’ సినిమాలో ఆ జమిందారువారి స్కూల్లో అల్లు రామలింగయ్య సరిగ్గా పాఠాలు చెప్పి ఉంటే సావిత్రి అవసరం ఉండేదే కాదు. అతను అస్తమానం పిల్లల చేత ఆయుర్వేదం మందులు నూరిస్తూ, లేహ్యాలకు సాయం పట్టిస్తూ, గుళికలను చుట్టిస్తూ చేయము అని మొరాయిస్తే బెత్తం తిరగేస్తూ నానా బాధలు పెడుతున్నాడనే జమిందారైన ఎస్వీ రంగారావు కొత్త టీచరు కోసం మేనల్లుడైన అక్కినేని చేత పేపరు ప్రకటన ఇప్పిస్తాడు. దానివల్ల మిస్సమ్మగా సావిత్రి ఆమె భర్త ఎమ్.టి.రావుగా ఎన్.టి.ఆర్ ఆ ఊరికి వచ్చి మెల్లగా ఆ ఇంటికి అయినవాళ్లమని గ్రహించి కథను సుఖాంతం చేస్తారు. పనిలో పనిగా పనివాడు దేవయ్య అను రేలంగి కూడా బాగుపడ్డాడనుకోండి. తెలుగు సినిమాల్లో పాపులర్ స్థాయిలో హీరో హీరోయిన్లు టీచర్లు అయ్యింది ‘మిస్సమ్మ’తోనే కావచ్చు. ఆ తర్వాత కాలక్రమంలో టీచర్లు, లెక్చరర్లు, ప్రొఫెసర్లు తెలుగు సినిమాల్లో టీచర్ల గౌరవం పెంచారు. టీచరు హోదాకు తమ స్టార్డమ్ను కూడా ఇచ్చారు. బడి పంతులు ఎన్.టి.ఆర్ వంటి స్టార్ ‘బడి పంతులు’గా చేయడం ఏమిటి అని ఆ రోజుల్లో మొదట అందరూ వింత పడ్డారు. ఆవేశం కలిగిన హీరో నలుగురినీ చితకబాదే వీరుడు బెత్తం కూడా పట్టకుండా మెత్తగా పాఠాలు చెప్తూ ఎలా మెప్పించగలడు అని కుతూహలం చూపారు. కాని టీచర్ అంటే ఇలా ఉంటాడు అని ఎన్.టి.ఆర్ బడిపంతులులో నిరూపించారు. విద్యార్థులకు ఆయనంటే ఎంత ఇష్టమంటే ఆ రోజులలోనే వారు స్వయం సేవ చేసి కాలిపోయిన ఇంటి స్థానంలో ఆయనకు ఇల్లు కట్టి ఇస్తారు సినిమాలో. ఆదర్శంగా నిలిచే ఉపాధ్యాయుడే విద్యార్థులకు నిజమైన ఆదర్శం. క్లాస్రూమ్లో ఆదర్శం వెల్లివిరిస్తే సంఘంలో ఆదర్శం వెల్లి విరుస్తుంది. భారతమాతకు జేజేలు... బంగరు భూమికి జేజేలు... అని అందరూ పాడుకోగలిగింది అప్పుడే. కోడెనాగు క్లాసులో అల్లరి చేస్తే టీచర్ దండిస్తాడు. క్లాసు బయట అల్లరి చేస్తే ఏం చేస్తాడు? ‘కోడెనాగు’ సినిమాలో గురువుగా వేసిన ఆచార్య ఆత్రేయ శిష్యుడైన శోభన్బాబు కోసం ఎన్నెన్ని అవస్థలు పడతాడో ఎన్నెన్ని తాపత్రయాలు అనుభవిస్తాడో చెప్పలేము. కోడెనాగును చూస్తే జనం పూజలు చేయవచ్చు. కాని దానిని వీధుల్లో ఇళ్లలో తిరగనివ్వరు. ముక్కుసూటిగా వెళ్లే శోభన్బాబులాంటి వ్యక్తులకు సంఘంలో చోటు లేదు. అలాంటి వాడికి బాసటగా ఈ సినిమాలోని ఆత్రేయ వంటి గురువు కావలసిందే. ఈ సినిమా క్లయిమాక్స్ ఆ రోజుల్లో ఊహకు అందనిది. శిష్యుడి కోసం గురువు ప్రాణాలు వదులుతాడు. ఆ గురువును వెతుక్కుంటూ శిష్యుడు కూడా తన ప్రియురాలితో ఆత్మహత్య చేసుకుంటాడు. ఆ గురుశిష్యుల అనుబంధం అమరం. విశ్వరూపం సినిమాల్లో టీచర్ ఇప్పుడు లెక్చరర్ అయ్యాడు. యువ స్టూడెంట్స్కు దారి చూపే మార్గదర్శి అయ్యాడు. దేశంలో డెబ్బయ్యవ దశకం వచ్చినప్పుడు ఫ్యాషన్ కొంచెం శృతి మించింది. విద్యార్థులలో అల్లరి, నిర్బాధ్యత పెరిగాయి. క్లాసులు ఎగ్గొట్టడం, వ్యసనాలకు పాల్పడటం, లెక్చరర్లను ఎదిరించడం... ఈ ధోరణిలో ఉన్న వారిని ఒక దారికి తేవడానికి ‘విశ్వరూపం’ సినిమా ఒక స్ఫూర్తిగా నిలిచింది. ఇందులో లెక్చరర్గా వేసిన ఎన్.టి.ఆర్ను విద్యార్థులు మొదట ఇబ్బంది పెట్టినా ఆ తర్వాత ఎంతగా అభిమానిస్తారంటే ట్రాన్స్ఫర్ అయ్యి వెళుతున్న ఆయన తన ట్రాన్స్ఫర్ లెటర్ చించి పారేసి మరీ ఆ కాలేజ్లో ఉండిపోతాడు. ఈ సినిమాలో ఎన్.టి.ఆర్ చే ప్రభావితులైన స్టూడెంట్స్ ఏకంగా డ్యామ్ కట్టేంత స్థాయిలో ఏకం అవుతారు. విద్యార్థుల శక్తి సంఘ పురోగతికి ఉపయోగించవచ్చని చెప్పిన బెస్ట్ టీచర్ సినిమా ఇది. శంకర శాస్త్రి పాఠాలు చెప్తేనే గురువా... సంగీత పాఠాలు చెప్తే గురువు కాదా? శంకరాభరణంలో శంకరశాస్త్రికి మించిన గురువు లేడు. ఆ గురువుకు శిష్యుడిగా చేరాలంటే తులసికి చాలా శుశ్రూష చేయాల్సి వస్తుంది. వినయం చూపించి మెప్పించాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ శిష్యుడిని స్వీకరించాక ‘బ్రోచేవారెవరురా’ అంటూ కీర్తనలేం ఖర్మ ఆ శిష్యుడు నిజంగా యోగ్యుడయ్యాడని తెలిసిన క్షణాన ఆ శంకరశాస్త్రి స్వయంగా తన ముంగాలి మీద ఉన్న గండపెండేరాన్ని తీసి మరీ శిష్యుడికి తొడుగుతాడు. ఏ కళ అయినా గురు ముఖతానే నేర్చుకోవాలి అప్పుడే అబ్బుతుంది రాణిస్తుంది అని చెప్పిన సినిమా ఇది. గురువు నుంచి కళను మాత్రమే కాదు విలువలను అలవర్చుకోవాలి అని రాగం తానం పల్లవులను మన మదిలో కదలాడిస్తూ మరీ చెబుతుంది. ప్రతిఘటన బెత్తం పట్టే టీచరు అవసరమైతే గొడ్డలి పట్టుకోదా? జవాబు పత్రంలో అప్పు ఆన్సర్ రాస్తే సున్నా మార్కులు వేయక తప్పదు. మరి సంఘంలో తప్పు పని చేస్తే ఏం చేయాలి? ‘ప్రతిఘటన’ రౌడీయిజం చేస్తున్న చరణ్రాజ్ తాను సంస్కరించాల్సిన మొదటి బ్యాడ్ స్టూడెంట్ అని లెక్చరర్ పాత్ర వేసిన విజయశాంతి గ్రహిస్తుంది. అతణ్ణి ఎదిరిస్తుంది. నిలువరిస్తుంది. ఎంత ప్రయత్నించినా పనికి రాకపోగా ఇతర స్టూడెంట్లకు హానికరంగా మారినవాణ్ణి డిబార్ చేయక తప్పదు. విజయశాంతి కూడా అదే పని చేస్తుంది. చరణ్రాజ్ను డిబార్ చేస్తుంది. సంఘం నుంచి చేస్తుంది. జీవం నుంచి చేస్తుంది. జీవితం నుంచి చేస్తుంది. అతడి మెడ మీద ఆమె తిప్పిన గొడ్డలే ఒక లెక్చరర్ ఇప్పటి వరకూ సినిమాలలో ఎత్తిన అతి ఉత్తమ బెత్తం అని చెప్పక తప్పదు. ముగ్గురు స్టార్లూ మూడు సినిమాలు హీరో ఎస్.ఐ అంటే ఉత్సాహపడే హీరోలు– హీరో టీచర్ అంటే వేయడానికి అంగీకరించకపోవచ్చు. తెలుగులో పెద్ద హీరోలు చాలామంది గురుస్థానంలో నిలబడ్డానికి ముందుకు వచ్చారు. వెంకటేశ్ ‘సుందరకాండ’లో, చిరంజీవి ‘మాస్టర్’లో, బాలకృష్ణ ‘సింహా’లో చేతిలో టెక్స్›్టబుక్స్ పట్టుకుని బ్లాక్బోర్డు మీద లెసన్స్ రాశారు. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరాం వంటి నటులు హాస్యం పుట్టించే లెక్చరర్ పాత్రలు వేస్తున్నప్పుడు ప్రేమికులు తమ ప్రేమను అర్థం చేసుకుని ఎదిగేలా చేయగలిగే మంచి లెక్చరర్ పాత్రలో రావు రమేశ్ ‘కొత్త బంగారులోకం’ సినిమాలో కనిపిస్తాడు. ఓనమాలు ఊరికి నడిబొడ్డు ఎలాగో ఊరిలోని టీచర్ అలాగా. టీచర్ ఊరు విడిస్తే ఏమవుతుంది? ఊరే దారి తప్పుతుంది. ఎవరు ఎంత ఎదిగినా ఎన్ని దూర తీరాలకు చేరినా జన్మభూమికి వస్తూ పోతుండాలని ఊరి మంచి చెడ్డలలో పాలు పంచుకోవాలని అందుకు ఆ ఊరి టీచరు మూలాధారం కావాలని చెప్పిన సినిమా ‘ఓనమాలు’. ఇందులో టీచర్గా రాజేంద్రప్రసాద్ ఊరి నుంచి చదువుకుని వెళ్లిన విద్యార్థులు తిరిగి ఊరికి రావాల్సిన అవసరాన్ని క్లయిమాక్స్లో చెబుతాడు. సంవత్సరానికి ఒక రోజు ‘మాతృభూమి దినోత్సవం’ పేరుతో ప్రతి ఒక్కరూ సొంత ఊరికి రావాలని కోరుతాడు. ఇంగ్లిష్ చదువులు పరాయి సంస్కృతిలో పడి మూలాలు మరిచిపోయినవారి చేత ఓనమాలు దిద్దించిన సినిమా ఇది. గీత గోవిందం నాటి సినిమాలలోనే కాదు నేటి సినిమాలలో కూడా నాటి హీరోలే కాదు నేటి హీరోలు కూడా గురు పరంపరను గురువు సంస్కారాన్ని గురువు ఔన్నత్యాన్ని నిలబెడుతున్నారు. ‘గీత గోవిందం’ సినిమాలో లెక్చరర్ అయిన విజయ్ దేవరకొండ కూడా తన శిష్యురాలిని దారిలో పెడతాడు. డబ్బునో లేదా అందాన్నో ఎర వేస్తే గురువును దారికి తెచ్చుకోవచ్చు అనుకున్న ఒక విద్యార్థినిని చీవాట్లు పెట్టి ఎప్పటికీ ఆమెకు తానొక వెల్విషర్గా ఉంటానని చెబుతాడు. ఆ అమ్మాయికే కాదు మనకు కూడా ఒక ధైర్యం వస్తుంది అలాంటి గురువు తోడుగా నిలుస్తాడనుకుంటే.సినిమా శక్తిమంతమైన మీడియా. మార్గదర్శిగా నిలిచే పాత్రలను అది ఆ స్థాయిలో చూపించినప్పుడే వాటి ప్రభావం సినిమాలోనూ సంఘంలోనూ గొప్పగా ఉంటుంది. గురుబ్రహ్మ గురుర్వివిష్ణుః అంటూ దైవం కంటే ముందు గురువును నిలబెట్టారు. తల్లిదండ్రుల తర్వాత ఏ మనిషైనా రుణపడేది గురువుకే.అలాంటి గురువుకి నమస్కారం.సినిమా గురువుకు దండాలు. – కె -
తియ్యటి కబురు
1960లో విడుదలైన ‘శ్రీ వేంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రానికి ఆత్రేయ రచయిత. ఎన్టీఆర్, సావిత్రి, ఎస్.వరలక్ష్మి, శాంతకుమారి నటించిన ఈ మూడు గంటల సినిమాకు పి.పుల్లయ్య దర్శకుడు. ప్రేక్షకులు దేవుడిలా దండం పెట్టేంత ఇమేజ్ ఎన్టీఆర్కు ఇచ్చింది ఈ చిత్రం. అందులో ఒక చోట ‘కబురు’ అనే మాట వస్తుంది. ఖబర్ అనే ఉర్దూ మాట నుంచి ఈ కబురు అనే మాట పుట్టింది. ఈ ‘పొరపాటు’కు ఆత్రేయ నొచ్చుకున్నారు. ‘అయ్యో, పౌరాణిక చిత్రంలో కబురు అనే మాట వాడానే’ అని తన అసమర్థతకు విలపించారు. ఇదే సంగతిని ఓసారి గీత రచయిత, కథకుడు అయిన మల్లాది రామకృష్ణశాస్త్రితో చెప్పుకుని బాధపడ్డారు. ‘వేంకటేశ్వరుడు బీబీ నాంచారిని పెళ్లాడాడు కదా, అంటే ఆ కాలంలో ఉరుదూ ఉన్నట్టే, అప్పుడు కబురు అనే మాట తప్పు ఎలా అవుతుంది?’ అని సాంత్వన వచనాలు పలికారు రామకృష్ణశాస్త్రి. అప్పుడుగానీ ఆత్రేయ మనసు కుదుటపడలేదు. -
మహానటి ఓ కథేనా?!
మహానటి సినిమా చూశారా? అయితే టైటిల్స్ గమనించారా? చూస్తే.. గమనిస్తే.. గార్లపాటి పల్లవి పేరు కనిపించిందా? ఇప్పుడు అదో సినిమా అయింది! సావిత్రి మీద అభిమానంతో ఆమె గురించి అక్కడ చదివి.. ఇక్కడ చదివి.. వాళ్లను వాకబు చేసి.. వీళ్లను వాకబు చేసి ‘మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి’ అనే పుస్తకం రాశారు! సావిత్రి వాస్తవంగా ఓ మహానటి. అయితే.. మహానటి వాస్తవంగా సావిత్రి కాదు.. అని సోషల్ మీడియా వాల్స్ మీద ఈ మధ్య పోస్టర్లు వెలిసినప్పుడు.. మహానటి నిజంగానే ఓ కథేనా? లేక దాంట్లో వాస్తవాలున్నాయా అని తెలుసుకోవడానికి పల్లవిని పలకరించింది... సాక్షి. ‘మహానటి’.. సావిత్రిని ఈ తరానికి పరిచయం చేసిన సినిమా. అయితే అంతకుముందే ఆమె బయోగ్రఫీ వచ్చింది ‘మహానటి సావిత్రి.. వెండితెర సామ్రాజ్ఞి’ అనే పేరుతో. ఆ పుస్తకాన్ని రాసింది సావిత్రి కుటుంబీకురాలో.. ఆమె సన్నిహితురాలో.. లేదా ఇంకే సినిమా పర్సనాలిటీనో కాదు. రచయిత అంతకన్నా కాదు. ఓ సాధారణ గృహిణి. గార్లపాటి పల్లవి. సావిత్రి పుస్తకంతోనే ఆమె రచయిత్రిగా మారారు. మహానటి సావిత్రి సినిమాకు ఓ సోర్స్గా కూడా మారారు. అయినా ‘‘ఆ సినిమా తెలుగువారి మహానటి కాదు.. మద్రాస్వారి మహానటి’’ అంటారు ఆమె. అన్ని వివరాలు పల్లవి మాటల్లోనే విందాం.‘‘నాకోసం నేను రాసుకున్న పుస్తకం సావిత్రి. ఆమె సినిమాలు పెద్దగా చూసిందీ లేదు. ఎందుకంటే నాకు ఊహ తెలిసేటప్పటికే సావిత్రి క్యారెక్టర్ రోల్స్కి వచ్చేశారు. ఆవిడంటే మా నాన్నగారికి చాలా ఇష్టమని మా అమ్మ చెప్తుండేది. అలా ఆవిడ నా మైండ్లో అచ్చయిపోయారు. నేను ట్వల్త్క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంట్లోకి వీసీఆర్ వచ్చింది. అందులో మేం చూసిన మొదటి సినిమా ‘‘కన్యాశుల్కం’’. మధురవాణిగా సావిత్రిని ఎవరైనా మరిచిపోగలరా? ఆ తర్వాత 1990ల్లో మళ్లీ సావిత్రిగారి సినిమా చూశా. ఐ ఫాలెన్ ఇన్ లవ్ విత్ హర్. ఆ లవ్వే ఆమె బయోగ్రఫీ రాసేలా చేసింది. 2004లో అనుకుంటా ఘంటసాల గారి మీద రాసిన పుస్తకం చూపిస్తూ మాకు తెలిసినొకాయన..‘‘ దీని కోసం 6 లక్షలు ఖర్చయింది’’ అన్నారు. ‘నేనైతే సావిత్రి కోసం ఎన్ని లక్షలయినా ఖర్చుపెట్టేస్తా’ అన్నాను ఆసువుగా. అప్పటికి నాకు పెళ్లయి ముగ్గురు పిల్లలు. పాప ప్రణతి యూకేజీలో ఉంది. ఇద్దరు మగపిల్లలు ట్విన్స్ ఆకాశ్, పృథ్వీ. ఎల్కేజీలో ఉన్నారు. నేనూ ఏదో కాంపిటీటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా. ఆ పరీక్ష అయిపోయిన వెంటనే ఆ వ్యక్తికి కాల్ చేశా ‘‘అంకుల్ విల్ గో ఫర్ బుక్’’ అని. అప్పటిదాకా నేను క్లాసిక్స్ అనదగ్గవి 20 వరకూ చదివుంటా. కానీ ఎప్పుడూ రాయలేదు. డైరెక్ట్గా మహానటి సావిత్రే. ముందు భూషణ్ (ప్రముఖ ఫొటోగ్రాఫర్) గారి దగ్గరకు తీసుకెళ్లారు. ఆయన సావిత్రి ఫొటోస్ కొన్ని ఇచ్చారు, ఆ తర్వాత చెన్నైకి వెళ్లాను. ఫిల్మ్ న్యూస్ ఆనంద్ను కలిశాను. సంజయ్కిశోర్ను కలిశాను. దశాదిశ లేకుండానే.. నేను మామూలు హౌస్వైఫ్ని. సినిమాలతో కానీ, సినిమా వాళ్లతో కానీ మా ఫ్యామిలీకి ఎలాంటి స్నేహం లేదు. సావిత్రిగారిమీదున్న ప్రేమ, పుస్తకం రాయాలి అన్న సంకల్పమే తప్ప ఎవరిని కలవాలి, ఎక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి అన్నవేమీ తెలియవు. గుమ్మడి గారిని కలిశాను. ఆయన రాసిన ‘తీపి గుర్తులు.. చేదు జ్ఞాపకాలు’ పుస్తకం తీసుకున్నాను. భూషణ్ (ప్రముఖ ఫొటోగ్రాఫర్)ను కలిస్తే ఆయన కొన్ని ఫొటోస్ ఇచ్చారు. సంజయ్ కిశోర్ను, జమున గారిని, కాంతారావుగారిని, చెన్నైలో ఫిల్మ్న్యూస్ ఆనంద్ను కలిశాను. అప్పుడే జమునగారి కూతురి పెళ్లి ఉండడంతో ఆమె తర్వాత కలవమని చెప్పారు. కానీ వెళ్లలేకపోయాను. కాంతారావు గారేమో బ్యాడ్ హెల్త్ కండిషన్లో ఉండి ఏమీ చెప్పలేక పోయారు. ఆతర్వాత విజయ చాముండేశ్వరి గారినీ కలిశాను. నా పిల్లలు చిన్నవాళ్లవడంతో అవుట్స్టేషన్స్కు వెళ్లడం కుదర్లేదు. సావిత్రిగారి మీది ఆర్టికల్స్, ఆమె ఇంటర్వ్యూ బాగా ఉపయోగపడ్డాయి. వనితాజ్యోతిలోని పసుపులేటి రామారావుగారు రాసిన ఆర్టికల్.. ఇంకా అలాంటివి చాలా. పుస్తకం రాయడం మొదలుపెట్టాక, ఇంకా చెప్పాలంటే పూర్తయ్యాక ఒక్కొక్కరూ తెలియడం మొదలుపెట్టారు. సావిత్రిగారి అక్క భర్త మా ఇంటి దగ్గరే ఉంటారని తెలిసింది. నాకు దొరికిన సోర్స్ని బట్టి రాస్తూ వచ్చాను. అలాగని గ్రౌండ్ వర్క్ చేయలేదని చెప్పను. విజయవాడ, సత్యనారాయణపురంలో సావిత్రిగారు వాళ్లున్న వీధికి వెళ్లా. ఆ తరం వాళ్లను కలిసి మాట్లాడా. అలాగే ఆవిడ స్కూల్ కట్టించిన ఊరికీ వెళ్లా. వేటపాలెం లైబ్రరీనీ కాంటాక్ట్ చేశా. సావిత్రిగారు లక్స్ యాడ్కు మోడలింగ్ చేశారన్న సంగతి ఆ లైబ్రరీతోనే తెలిసింది. పుస్తకంలో చాముండి పాత్ర పుస్తకం రాసేటప్పుడు అప్పటికప్పుడు నాకు తట్టిన పాత్ర అది. సావిత్రికి ఫ్రెండ్గా పెట్టాను. ఆమె జీవితంలో వెన్నంటి ఉండే పాత్ర. సినిమాలు తీయకు, దానాలు చేయకు, జెమినీని నమ్మకు అంటూ సావిత్రికి అడుగడుగునా మంచిచెడులు చెప్తుంటుంది. అయితే ఈ పాత్ర మాత్రమే కల్పితం. కానీ ఆ మిగిలినవన్నీ సావిత్రిగారి జీవితం లో జరిగినవే. మరెందుకు ఆ కల్పిత పాత్ర? అంటే చెప్పలేను. చాముండి వల్లే నా పుస్తకం అంతా ఫిక్టీషియస్ అనుకున్నారు. సూజెన్ హెవర్డ్ ఉత్తరం కూడా అంతే. సావిత్రి లైఫ్ గురించే ఎక్కువ చెప్పాను. నటిగా ఆమెను ఎక్కడా డిస్క్రైబ్ చేయలేదు. ఆ ఉత్తరం ఒకటి క్రియేట్ చేసి దాని ద్వారా ఆమె నటనను వర్ణించాలనుకున్నాను. ఈ ఉత్తరం నా కల్పితమని నా పుస్తకం ముందుమాటలో గుమ్మడిగారు స్పష్టం చేశారు కూడా. అంతెందుకు గుమ్మడిగారి పుస్తకంలో.. సావిత్రిగారు బెంగళూరు హోటల్లో బస చేసినప్పుడు (తనతో స్నేహంగా ఉన్న) ఒక నటిని పిలిపించుకొని ఎప్పుడో ఆమెకు ఇచ్చిన తన నగను ఇవ్వమని సావిత్రి అడిగినట్టు, దానికి ఆ నటి తన దగ్గర ఆ నగలేదని చెప్పినట్టు, డబ్బు అవసరంలో ఉన్న సావిత్రిగారు ఆ మాట విని షాకైనట్టు అలా కోమాలోకి వెళ్లినట్టూ రాశారు. ‘‘ఇది నిజమేనా అండీ.. ’’ అని నేను గుమ్మడిగారిని అడిగా. ఆయన నిజమని చెప్పలేదు.. అబద్ధమనీ నిర్ధారించలేదు. మౌనంగా ఉన్నారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే ఉన్న సోర్సెస్ కూడా నిజాలను తేల్చలేదని తెలియజేయడానికే. స్టార్ట్చేసిన యేడాదికల్లా పుస్తకం రెడీ అయింది. మా నాన్నగారికి శాంతాబయోటిక్ వరప్రసాద్రెడ్డిగారు మంచి ఫ్రెండ్. ఆయనకు ఈ పుస్తకాన్ని అంకితమిచ్చాను. ఇప్పటి వరకు పన్నెండు వేల కాపీలను ప్రింట్ చేశాం. ప్రతి యేడాది రెండు వేల కాపీలను ప్రింట్ చేస్తూనే ఉన్నాం. ఈ పుస్తకంలో నేనెంత లీనమయ్యానంటే మా పిల్లలు ‘‘అమ్మా సావిత్రమ్మ మాకు అమ్మమ్మ అవుతుంది కదా’ అని అడిగేంతగా! రెండో పుస్తకం.. ఎమ్మెస్గారి మీద ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారు అంటే నాకు శ్రీ వేంకటేశ్వరస్వామి సుప్రభాతమే. అంతకుమించి ఆమె పాడినవి ఏవీ నేను వినలేదు. ఆమెను చూడలేదు. ఆమె పాడిన భజగోవిందంలోని పునరపి జననం.. పునరపి మరణం అనే వాక్యాలు కలిగించిన కుతూహలం టీజేఎస్ జార్జ్ .. ఎమ్మెస్ మీద రాసిన పుస్తకాన్ని పరిచయం చేసింది. అది చదివాక ఆమె బయోగ్రఫీ తెలుగులో రాస్తే బాగుంటుందనిపించింది. సావిత్రి బయోగ్రఫీ ఇచ్చిన ఎక్స్పీరియెన్స్తో ఈ పుస్తకానికి రీసెర్చ్ మొదలుపెట్టా. దాదాపు ఎనిమిదేళ్లు సాగింది. సావిత్రి పుస్తకం ఇష్టమైతే.. ఎమ్మెస్ మీద పుస్తకం ఓ యజ్ఞం. జార్జ్ మొదలు, ఎమ్మెస్గారి వదిన, ఎమ్మెస్ గారి మనవడు, మునిమనవరాలు, సదాశివం (ఎమ్మెస్ భర్త) కాంటెంపరరీస్ అయిన ఖాసా సుబ్బారావు గారి కూతురు, వీఏకే రంగారావు, స్వామినాథన్ ఇలా చాలామందిని కలిశాను. చెన్నై, కోయంబత్తూరు, మధురై, రాజుపాళెం వంటి చోట్లకూ వెళ్లా. ఆమె మీద వచ్చిన ఎన్నో పుస్తకాలను, ఆర్టికల్స్నూ ఔపోసన పట్టా. ఆమె మీద తీసిన ‘ఫరెవర్ లెజెండ్’ డాక్యుమెంటరీ చూశా. ఆడియోస్ విన్నా. అన్నీ హెల్ప్ అయ్యాయి. ఈ ప్రయాణం స్టార్ట్చేసేనాటికి నా పిల్లలు పెద్దవాళ్లయ్యారు. ఈ పుస్తక రచనలో చాలా సాయపడ్డారు. ఫొటోలు తీయడం దగ్గర్నుంచి ఇంటర్వ్యూలను రికార్డ్చేయడం వరకు ఒకరకంగా నాకు అసిస్టెంట్స్గా ఉన్నారని చెప్పొచ్చు. మా నాన్నా అంతే తోడుగా ఉన్నారు. ఇలా మా ఇంట్లో వాళ్లంతా ఎవరికి తోచిన సహాయం వాళ్లు చేశారే తప్ప ఎందుకు ఈ ప్రయాస అంటూ నన్ను డిస్కరేజ్ చేయలేదు. ఈ రీసెర్చ్ నాకు చాలా విషయాలను నేర్పింది. ఎమ్మెస్ సుబ్బులక్ష్మిగారికి సంబంధించి ఒక క్లూ ఇచ్చింది మాత్రం ఆమె వదినగారే. ఎమ్మెస్ భర్త సదాశివం..ఆమెను పెళ్లిచేసుకున్నాక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నారట. ఈ విషయం తెలిసి సుబ్బులక్ష్మిగారు తన అన్నతో చెప్పి ఏడ్చారని చెప్పింది వాళ్ల వదిన. కానీ సుబ్బులక్ష్మి మనవడు చెప్పేదానికంటే కూడా ‘‘మీరు జార్జ్ లాగా రాయొద్దు’’ అని ఆంక్షలే ఎక్కువ పెట్టాడు. కానీ నేను జార్జ్ కన్నా నాలుగు నిజాలు ఎక్కువే రాశాను. జార్జ్ తన పుస్తకంలో ప్రశ్నార్థకాలు పెట్టిన వాస్తవాల దగ్గర నా పుస్తకంలో నేను ఫుల్స్టాప్ పెట్టా. ఎమ్మెస్ వాళ్లమ్మ చనిపోతే ఆమె వెళ్లలేదని ఎమ్మెస్ కుటుంబానికి దగ్గరగా ఉన్న వ్యక్తి చెప్పాడు. నేనూ అదే రాశాను. పుస్తకం అచ్చుకి రెడీ అయిన టైమ్లో ఎమ్మెస్ సుబ్బులక్ష్మి మీద ‘ది హిందూ’లో ఓ వ్యాసం వచ్చింది. అందులో ఆమె వాళ్లమ్మ చనిపోయినప్పుడు వెళ్లింది అని రాశారు. ఆ ఆర్టికల్ రాసిన వ్యక్తి కాంటాక్ట్ నంబర్ పట్టుకొని క్రాస్ చెక్ చేసుకున్నా. నిజమే అని తేలింది. దాంతో నేను రాసింది మళ్లీ మార్చాల్సి వచ్చింది. అలాంటి ఎన్నో సంఘటనలు మళ్లీ మళ్లీ క్రాస్ చెక్ చేసుకుంటూ పోయా. ‘సుస్వరాల లక్ష్మి ఎమ్మెస్ సుబ్బులక్ష్మి’గా పుస్తకాన్ని అచ్చువేశా. వరప్రసాద్రెడ్డి గారి తల్లిదండ్రులైన శాంతమ్మగారు, వెంకటరమణారెడ్డి గారికి ఆ పుస్తకాన్ని అంకితమిచ్చా. రిలీజ్ అయిన రోజే రెండు వందల కాపీలు అమ్ముడుపోయాయి. వితిన్ సిక్స్ మంత్స్ సెకండ్ ప్రింట్కు వెళ్లాల్సి వచ్చింది. ఎమ్మెస్ ఎక్స్పీరియెన్స్తో సావిత్రి పుస్తకం మళ్లీ రాయాలనుంది. ఈ పుస్తకం నాకు సావిత్రి అభిమాని శిల్పను మంచి ఫ్రెండ్గా చేస్తే, తెలుగు యూనివర్సిటీ వారి ఉత్తమ వచన రచన పురస్కారాన్ని అందించింది. విమర్శలను పట్టించుకుంటూనే నా పని నేను చేసుకుంటా. ఏ పనికైనా ప్రత్యేకంగా ప్లాన్ అంటూ ఏమీ ఉండదు. అప్పటికప్పుడు బలంగా ఏదనిపిస్తే అది చేస్తా’’ అంటూ ముగించారు గార్లపాటి పల్లవి. పల్లవి.. కుటుంబం పల్లవి స్వస్థలం గుంటూరు జిల్లా, బోడిపాలెం. ఆమె తండ్రి రావిపాటి నాగేశ్వరరావు సెంట్రల్ ఎక్సైజ్ సూపరింటెండెంట్గా పనిచేశారు. తల్లి శాంతి. నిజానికి పల్లవి తెలుగు చదివింది మూడో తరగతి వరకే. ఎందుకంటే తర్వాత ఆమె విద్యాభ్యాసమంతా సెంట్రల్ స్కూల్స్లోనే సాగింది. ఎనిమిదో తరగతి వరకు గుంటూరులోనే. తండ్రి ఉద్యోగరీత్యా తర్వాత నుంచి అంతా హైదరాబాదే. కేంద్రీయ విద్యాలయాల్లో స్పోర్ట్స్కి చాలా ప్రాముఖ్యం ఉంటుంది. అందువల్ల పల్లవి కూడా టేబుల్ టెన్నిస్ ఆడేవారు. స్కూల్స్ నేషనల్స్ వరకూ వెళ్లారు. ఎమ్మే హిస్టరీ చేశారు. సివిల్స్కూ ప్రిపేర్ అయ్యారు. ఆమె భర్త గార్లపాటి మధుసూదన్రావు. సాఫ్ట్వేర్ ఇంజనీర్. కూతురు ప్రణతి. ఇంజనీరింగ్ చదువుతోంది. మగపిల్లలు ఆకాశ్, పృథ్వీ ట్విన్స్. ఇంటర్లో ఉన్నారు. – సరస్వతి రమ -
కన్నులలో దాచుకొంటి నిన్నే నా స్వామి
‘ఆ మబ్బు తెరలలోన దాగుంది చందమామా’ అని పాడుకున్నారు వారిద్దరూ.‘ఇల్లాలే ఈ జగతికి జీవనజ్యోతి’ అని ఆవిడను చూసి అనురాగం పెంచుకున్నారాయన.‘మరుమల్లెలలో మావయ్యా... మంచి మాట సెలవీవయ్యా’ అని ఆయన మాటనే శిరోధార్యం చేసుకున్నారు ఆవిడ.‘హాయిగా ఆలుమగలై కాలం గడపాలి’ అని జీవించారు ఇరువురూ.‘ఎక్కడ ఉన్నా ఏమైనా నీ సుఖమే నే కోరుకున్నా’ అని వీడ్కోలు తీసుకున్నారు ఆయన.‘కన్నులలో దాచుకొందు నిన్నే నా స్వామీ’ అని ఆయన జ్ఞాపకాలలో జీవిస్తున్నారు ఆవిడ. పల్లవి చరణాల వలే ఘంటసాల, ఆయన శ్రీమతి సావిత్రి ముప్పై ఏళ్ల పాటు వైవాహిక జీవితం గడిపారు. పల్లవిని విడిచి చరణం వెళ్లిపోయి నలభై ఏళ్లు దాటిపోయింది.అయినప్పటికీ ఆ పాట ఆమె మనసులో అనుక్షణం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఆ జ్ఞాపకం పదేపదే సాక్షాత్కారం అవుతూనే ఉంది. సావిత్రి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. తెలుగువారికి ఎంతో ఆత్మీయుడైన గాయకుడి గురించి సాక్షితో తన జ్ఞాపకాలు పంచుకున్నారు. ఘంటసాలను మావయ్య అని పిలిచేవారట! సావిత్రి: మాది కృష్ణాజిల్లా రేపల్లె తాలూకా పెదపులిపర్రు గ్రామం. ఘంటసాల మాస్టారు నాకు వేలువిడిచిన మేనత్త కొడుకు. మా ఇంట్లో నేను మూడో పిల్లను. ఘంటసాల మాస్టారు కూడా వాళ్లింట్లో మూడో సంతానమే. మావి ఉమ్మడి కుటుంబాలు. ఇరుగుపొరుగు అంతా చుట్టాలే. మా అమ్మ, మా అత్తగారిని అమ్మ అని పిలిచేది. నేను అమ్మమ్మ అనేదాన్ని. అందువల్ల ఘంటసాల మాస్టారు వరసకు బావ అయినా, ‘మావయ్య’ అని పిలిచేదాన్ని. ఘంటసాల జీవితం మలుపు తిరిగింది విజయనగరం లోనే కదా! ఘంటసాల గారిని విజయనగరం పంపించి సంగీతం నేర్పించాలని మా మామగారి కోరిక. కాని దురదృష్టవశాత్తు ఘంటసాలకు పది సంవత్సరాల వయసున్నప్పుడు తండ్రిగారు గతించారు. వాళ్లు కాని, మేము కాని ధనవంతులం కాదు. డబ్బులు ఇచ్చి బయటకు పంపి సంగీతం చెప్పించే స్థోమత లేదు. తండ్రి మరణం తరవాత ఆయన కోర్కె ¯ð రవేర్చాలనే సంకల్పంతో, మాస్టారు తన పన్నెండో ఏట ఇంటి నుంచి పారిపోయి విజయనగరం చేరుకుని, ఐదేళ్లపాటు సంగీతం కోర్సు పూర్తి చేసి, తిరిగి వచ్చారు. మోపిదేవి, కళ్లేపల్లి వంటి చుట్టుపక్కల గ్రామాలలో నాటకాలు వేసేవారు. స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని 18 నెలలు జైలులో గడపడంతో, వీడికి పెళ్లి చేస్తేనే గాని నిలకడగా ఉండడు అనుకున్నారు మాస్టారి తల్లి. బంధువులందరినీ పిల్లను ఇవ్వమని అడిగారు. అందరూ తిరస్కరించారు. చివరికి మా ఇంటికి వచ్చి, మా నాన్నతో.. ‘రత్తయ్యా, మీ సావిత్రిని మావాడికి ఇవ్వచ్చు కదా’ అని అడిగారు. ‘మా పిల్ల ఇంకా చిన్నది. అప్పుడే పెళ్లేంటి’ అన్నారు నాన్న. ‘ఇప్పుడు మాట ఇస్తే, వచ్చే సంవత్సరం వివాహం చేద్దాం’ అన్నారు ఆవిడ. మా నాన్న ‘దేవుడిని ప్రశ్న అడిగి చెప్తాను’ అన్నారట. ఆయన దేవుడిని ఏం అడిగారో, భగవంతుడు ఏం సమాధానం చెప్పాడో తెలియదు కాని, మా వివాహం నిశ్చయం అయింది. నా పదకొండో ఏట1944 మార్చి స్వభాను నామ సంవత్సరం ఫాల్గుణ బహుళ విదియనాడు మా వివాహం జరిగిపోయింది. పెళ్లినాటికి ఆయన వయస్సు 21 సంవత్సరాలు. ఘంటసాలను ప్రోత్సహించింది సముద్రాల గారే కదా... సముద్రాల రాఘవాచారిగారిది మా ఊరే. ఆయన మా ఇంటి పక్కనే ఉన్న లైబ్రరీకి వస్తుండేవారు. ఆయన ఘంటసాల మాస్టారితో పాడించుకుని, ‘నీ కంఠం ఇంత బావుంది, మద్రాసు వస్తే అవకాశాల కోసం ప్రయత్నిద్దాం’ అన్నారు. అలా ఘంటసాల గారిని మద్రాసు తీసుకువెళ్లి కొందరు పెద్దల దగ్గరకు వెళ్లమని ఉత్తరాలిచ్చి పంపారు సముద్రాల. అప్పట్లో బిఎన్ రెడ్డి గారు ‘స్వర్గసీమ’ సినిమా చేస్తున్నారు. అందులో మాస్టారితో పాట పాడించారు. ఆ తరవాత గూడవల్లి వారి ‘పల్నాటి యుద్ధం’, నాగయ్య గారి ‘త్యాగయ్య’, ఘంటసాల గారి బలరామయ్యగారి ‘బాలరాజు’... ఇలా మెల్లమెల్లగా అవకాశాలు వచ్చాయి. కాపురానికి ఎప్పుడు వచ్చారు? మాస్టారికి మద్రాసులో ఇల్లు దొరకడం కష్టమైంది. బ్రహ్మచారులకు, అందునా సినిమా వారికి ఇల్లు అద్దెకు ఇచ్చేవారు కాదు. అందువల్ల మాకు కబురు చేసి ‘నీ పెళ్లాన్ని తీసుకువెళ్లు’ అని ఉత్తరం రాయించు, ఆ ఉత్తరం చూపిస్తే ఇల్లు దొరుకుతుందని చెప్పడంతో, మా అమ్మమ్మ మా బాబాయి చేత ఉత్తరం రాయించారు. 1947 సెప్టెంబరులో మా బంధువులు నన్ను కాపురానికి మద్రాసు పంపారు. ఆ ఇంటి మామ్మగారికి నేనంటే పంచ ప్రాణాలు. ఎప్పుడైనా మాస్టారు రికార్డింగ్ నుంచి రావడం ఆలస్యమైతే∙నన్ను ఆవిడ దగ్గర పడుకోబెట్టుకునేవారు. మాస్టారు వచ్చాక, ‘ఇవాళ ఇక్కడ నిద్రపోతుందిలే’ అని చెప్పేవారు. మాస్టారికి పాటల అవకాశాలు పెరిగాయి. ఇంట్లో పాటలు స్వరపరచుకోవడం కోసం తబలాలు, హార్మోనియం వాయిస్తుండేవారు. మామ్మగారు ఆ శబ్దాలకు చికాకు పడ్డారు. ‘ఈ గోల ఏంటి, ఇల్లు ఖాళీ చేసేయండి’ అన్నారు. వాళ్లకు నేను వెళ్లడం ఇష్టం లేదు. కాని మాస్టారు శబ్దం చేయడం నచ్చలేదు. అలా ఆ ఇంటి నుంచి మరో ఇంటికి మకాం మార్చాం. మీ ఆటపాటల గురించి... అది పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో మొత్తం 30 మంది ఉండేవారు. ఇంటి నిండా పిల్లలు. మాస్టారు రికార్డింగులకి వెళ్లగానే నేను ఇరుగుపొరుగు ఆడపిల్లలతో ఆడుకునేదాన్ని. పొరపాటున ఆయన కంటబడితే, ‘ఎవరైనా, ఘంటసాల గారి భార్య ఆడుకుంటోంది అంటుంటే ఎలా ఉంటుందో చెప్పు’ అనేవారు. ఒకరోజు ‘గుణసుందరి కథ’ చిత్రంలో రికార్డింగుకి వెళ్లి చాలా ఆలస్యంగా వచ్చారు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉండవలసి రావడంతో బిగ్గరగా ఏడ్చేశాను. ఇలా అద్దె ఇళ్లలో నాలుగేళ్లు గడిచిపోయాయి. మాస్టారి ప్రాక్టీసు వల్ల ఇబ్బందులు తప్పవనే ఉద్దేశంతో, ‘మనం ఇల్లు కొనుక్కుందాం’ అని చెప్పేదాన్ని. మరి కొన్నారా? నన్ను కాపురానికి పంపుతూ మా నాన్న ‘వచ్చిన ఆదాయంలో రేపటి కోసం కొంత, ధర్మకార్యాలకు కొంత, దైవకార్యానికి కొంత డబ్బు దాచాలి’ అని చెప్పారు. నేను మద్రాసు వచ్చిన దగ్గర్నుంచి ఆయన డబ్బులన్నీ నా చేతికే ఇచ్చేవారు. నేను జాగ్రత్తగా ఖర్చు చేస్తూ, మూడు సంవత్సరాలలో 12 వేల రూపాయలు దాచాను. ఆ డబ్బుతోనే ఇల్లు కొందామన్నాను. పదివేల రూపాయలలో ఒక ఇల్లు చూశాం. అది బాగా చిన్నది కావడంతో వద్దనుకున్నాం. అప్పుడు మాస్టారు, ‘ఇంటి విషయం నాకు వదిలై, నేను చూస్తాను’ అన్నారు. ఇలా అన్న కొద్దిరోజులకే ఉస్మాన్ రోడ్లో 40 వేలకు ఇల్లు కొన్నానని చెప్పారు. 30 వేల రూపాయలు అప్పు అంటే నాకు భయం వేసింది. కాని చాలా తొందరగానే అప్పు తీరిపోయింది. ఆ ఇల్లే మాస్టారికి కలిసొచ్చిందేమో కదా! 1950 జూన్ 20న గృహప్రవేశమయ్యాక అన్నీ కలిసొచ్చాయి. విజయా నాగిరెడ్డిగారు కాంపౌండ్ వాల్ కట్టించారు. అదే సంవత్సరం ఆగస్టు మాసంలో భానుమతి గారి భర్త రామకృష్ణ మా కోసం కారు బుక్ చేశారు. అదే సంవత్సరం డిసెంబరు 15వ తేదీ బాబు పుట్టాడు. అప్పటి జ్ఞాపకాలు చెప్పండి పెద్ద అబ్బాయి పుట్టిన పదోరోజుకి 100 రూపాయలు పెట్టి రోజ్వుడ్తో తయారు చేసిన ఉయ్యాల తెచ్చారు మాస్టారు. అబ్బాయి బారసాల నాడు తన ఆర్కెస్ట్రాలో పనిచేస్తున్నవారినందరినీ పిలిచి వేడుక చేశారు. అప్పటికి విజయా కంపెనీలో పని చేస్తున్నాం కనుక ఆ పేరు వచ్చేలా బాబుకి ‘విజయకుమార్’ అని పేరుపెట్టుకున్నాం. ఆ రోజు ఆయన కొన్న ఉయ్యాలను ఈ రోజు మా మునిమనవరాలికి కూడా వాడుతున్నాం. పెద్దబాబు పుట్టిన ఏడేళ్లకు మా చిన్నబాబు రత్నకుమార్ పుట్టాడు. పెద్ద అమ్మాయి పుట్టిన నాలుగు రోజులకి మాస్టారు ‘కాళిదాసు’ చిత్రంలో శ్యామలా దండకం పాడారు. అందువల్ల ఆమెకు ‘శ్యామల అని పేరు పెట్టాం. రెండో అమ్మాయికి – రకరకాల పేర్లు రాసి చీటీలు తీశాం. ఎక్కువ మంది తీసిన చీటీలో ‘సుగుణ’ పేరు ఉండటంతో సుగుణ అని పేరుపెట్టాం. మూడో అమ్మాయి పుట్టే నాటికి ఆంధ్రప్రభ వారపత్రికలో ‘శాంతినికేతన్’ అనే సీరియల్ వచ్చేది. అందుకని శాంతి అని పేరు పెట్టాం. మాస్టారు ఇంటి విషయాలు పట్టించుకునేవారా? ఆయనకు ఇంటి విషయాలు పట్టించుకోనవసరం లేకుండా అన్నీ నేనే చూసేదాన్ని. ఆయన బయటకు వెళ్లేటప్పుడు అన్నీ నాకు వివరాలన్నీ చెప్పేవారు. ఆయన కోసం ఎవరైనా ఫోన్ చేస్తే, వాళ్లకి తప్పుడు వివరాలు చెప్పకూడదనేది ఆయన ఉద్దేశం. మాస్టారు మంచి పాట పాడిన రోజున ఇంటికి వస్తూనే పాట వినిపించేవారు. బట్టలు మార్చుకోమని చెబుతున్నా వినిపించుకునేవారు కాదు. నన్ను ఆప్యాయంగా ‘రాజీ’ అని పిలిచేవారు. ఎందుకు అలా పిలుస్తారు అని ఎన్నడూ నేను అడగలేదు. ఆయన పాటల్లో మీకు ఏవి ఇష్టం? ఆయన పాడిన పాటలన్నీ నాకు ఇష్టమే. ఒక గంపెడు మల్లెపూలు తీసుకువచ్చి, ఇందులో ఏ పువ్వు ఇష్టం అంటే ఏం చెప్తాను. అన్నీ మల్లెలే, అన్నీ ఇష్టమే. మాస్టారు ‘బుద్ధిమంతుడు’ చిత్రంలోని ‘నను పాలింపగ నడచీ వచ్చితివా’ పాట పాడి వచ్చాక అందులోని ‘ఖైదీ’ పదాన్ని ఎన్నిరకాలుగా ప్రయోగించారో వివరించారు. ‘జయభేరి’ చిత్రంలో ‘మది శారదాదేవి మందిరమే’ పాట పాడుతుంటే ఆ పాటలో గురుస్థానంలో ఉన్న నాగయ్యగారిని చూస్తుంటే, తన గురువులు పట్రాయని సీతారామశాస్త్రిగారిని చూస్తున్నట్లు భావించేవారినని చెప్పేవారు. మీ ఇంటికి ఎవరెవరు వచ్చేవారు? మా ఇంటికి సంగీత విద్వాంసులందరూ వస్తూండేవారు. ఎవరు వచ్చినా కనీసం వారం రోజులు మా ఇంట్లోనే ఉండేవారు. ప్రముఖ వయొలిన్ విద్వాంసులు ద్వారం వెంకట స్వామి నాయుడుగారు ఎనిమిది మందితో కలిసి మా ఇంట్లో పదిహేను రోజులు ఉన్నారు. అన్ని రోజులూ వారికి కావలసినవన్నీ అభిమానంగా వండేదాన్ని. బడే గులామ్ అలీ ఖాన్ కూడా తోటి విద్వాంసులతో మా ఇంటికి వచ్చినప్పుడు వారందరికీ చపాతీలు చేసి పెట్టాను. మాస్టారుతో గడిపిన మధురక్షణాలు ఎన్నని చెప్పగలను. ఇప్పుడు కూడా ఆయనతోనే గడపాలని ఉంది. ఆయన పనులన్నీ చూసిపెట్టాలని ఉంది. – సంభాషణ: వైజయంతి పురాణపండ పద్మశ్రీ సమ్మతమేనా! ఒకరోజున ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది... ‘మేం కేంద్ర ప్రభుత్వం తరఫున ఫోన్ చేస్తున్నాం, ఘంటసాల మాస్టారికి పద్మశ్రీ ఇవ్వాలనుకుంటున్నాం, సమ్మతమేనా!’ అని అడిగారు. అరగంటలో చేయండి, మాస్టారుని అడిగి చెబుతాను అన్నాను. మాస్టారు విజయా స్టూడియోకి రికార్డింగుకి వెళ్లారు. సాధారణంగా నేను స్టూడియోలకి ఫోన్ చేయను. కాని మళ్లీ అరగంటలో ఫోన్ చేసేటప్పటికి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో మాస్టారికి ఫోన్ చేసి, ‘మీకు ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందచేయాలనుకుంటోంది, సమ్మతమేనా! అని అడుగుతున్నారు’ అన్నాను. ఆయన మౌనంగా నవ్వారు. ఆ మౌనాన్ని నేను అంగీకారంగా అర్థం చేసుకున్నాను. ఆ రోజు ఆయన ఇంటికి వచ్చేసరికి ఇంటినిండా పూల బొకేలు వచ్చి చేరాయి. ఆయన మెడ నిండా దండలతో పెళ్లికొడుకులా వచ్చారు. భగవద్గీత రికార్డింగు భగవద్గీత రికార్డింగుకి మాస్టారితో స్టూడియోకి నేను కూడా వెళ్లాను. ఆ స్టూడియో చూసినవారంతా, ఇలాంటి స్టూడియోలోనా మాస్టారు ఇంత అద్భుతంగా పాడారు అనుకునేవారు. ఆయనతో ఎన్నడూ నేను రికార్డింగులకి వెళ్లలేదు. కాని ఆయన ఆరోగ్యం బాగుండకపోవడంతో ఆయన వెంట వెళ్లవలసి వచ్చింది. నన్ను చూస్తూనే, అక్కడి వారంతా, ‘అమ్మగారు వచ్చారు’ అంటూ సంబరపడ్డారు...’’ అంటూ కంట నీరు పెట్టుకున్నారు. భగవద్గీత పేరు చెబితే నాకు మాటలు రావు, ఇప్పుడు ఈ 87 ఏళ్ల వయసులో ఈ బాధను తట్టుకోలేను’ అంటూ కళ్లు తుడుచుకున్నారు సావిత్రి. మాస్టారు మచ్చలేని మనిషి. ఆయన కన్నుమూసినప్పుడు మిన్ను విరిగి నెత్తిమీద పడ్డట్లయింది. కుటుంబం మొత్తం కుంగిపోయింది. ఏం చేయాలో తెలియని పరిస్థితి. నా జీవితంలో ఒక అదృష్టం ఏంటంటే, మాస్టారు నాకు తెలియకుండా ఒక్క పని కూడా చేయలేదు. నాకు ఇన్కమ్ టాక్స్, వెల్త్ టాక్స్ వంటి బయటి వ్యవహారాలు తెలియవు. ఆయన లేకపోవడంతో ఆ పనులన్నీ ఆ భగవంతుడే నాకు నేర్పాడు.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
కౌంటింగ్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు
తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీదే గెలుపు!
ముగిసిన తెప్పోత్సవాలు
పోలీసుల అదుపులో ఒడిశా వేటగాళ్లు
పిడుగుపాటుకు యువకుడికి గాయాలు
తిమ్మాపురంలో విజయ్ దేవరకొండ సందడి
అప్పన్నకు రెండవ విడత చందనం సమర్పణ
ఫ్లైఓవర్పై లారీ బోల్తా
ఇసుకకొండకు పోటెత్తిన భక్తులు
కమనీయం.. కల్యాణోత్సవం
తప్పక చదవండి
- వీడియో: కేదార్నాథ్ ఆలయం వద్ద తృటిలో తప్పిన ప్రమాదం
- T20: బంగ్లాదేశ్కు ఊహించని షాకిచ్చిన పసికూన.. సిరీస్ సొంతం
- రైసీ హెలికాఫ్టర్ క్రాష్: ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో ఏముందంటే..
- ఆపరేషన్ కంబోడియాపై విశాఖ సీపీ కీలక వ్యాఖ్యలు
- తళుకుల మాటున కల్తీమాయ!
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- ఉమామహేశ్వరరావు లెక్క ఇంకా తేల్చాల్సి ఉంది!
- తగ్గిన ప్లేస్మెంట్లు.. ఐఐటియన్లకు ఉద్యోగాలు కరువు
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- పచ్చమూక అరాచకం.. ఆనవాళ్లివిగో..
Advertisement