-
సెమీస్లో అనిరుధ్, రిత్విక్ జోడీలు
అకాపుల్కో (మెక్సికో): జీఎన్పీ సెగురోస్ ఓపెన్ ఏటీపీ చాలెంజర్–125 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో హైదరాబాద్ ప్లేయర్లు అనిరుధ్ చంద్రశేఖర్, బొల్లిపల్లి రి త్విక్ చౌదరీ సంచలనం సృష్టించారు. అనిరుధ్ (భారత్)–హాన్స్ హచ్ వెర్డొగో (మెక్సికో)... రిత్విక్–నిక్కీ పునాచా (భారత్) జోడీలు సీడెడ్ జంటలను బోల్తా కొట్టించి సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్లో రి త్విక్–నిక్కీ జంట 6–4, 6–1తో రెండో సీడ్ పీటర్ మటుస్జెవ్స్కీ (పోలాండ్)–మాథ్యూ క్రిస్టోఫర్ రొమియోస్ (ఆ్రస్టేలియా) జోడీని ఓడించగా... అనిరుధ్–వెర్డొగో ద్వయం 3–6, 6–4, 10–7తో ‘సూపర్ టైబ్రేక్’లో మూడో సీడ్ రింకీ హిజికాటా (ఆ్రస్టేలియా)–మ్యాక్ కిగెర్ (అమెరికా) జంటకు షాక్ ఇచ్చింది. -
సెమీస్లో ఓడిన సిక్కిరెడ్డి–సుమీత్ జోడీ
మాడ్రిడ్: స్పెయిన్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ సూపర్–300 టోర్నీలో భారత క్రీడాకారుల పోరాటం ముగిసింది. బరిలో మిగిలిన మిక్స్డ్ డబుల్స్ జోడీ సిక్కి రెడ్డి–సుమీత్ రెడ్డి సెమీఫైనల్లో వెనుదిరిగింది. శనివారం జరిగిన మ్యాచ్లో ప్రపంచ 66వ ర్యాంక్లో ఉన్న సిక్కి–సుమీత్ 17–21, 12–21తో ప్రపంచ 17వ ర్యాంక్లో ఉన్న రినోవ్ రివాల్డీ–పితా మెంతారి (ఇండోనేసియా) జంట చేతిలో ఓడిపోయింది. సిక్కి–సుమీత్ జోడీకి 2,940 డాలర్ల (రూ. 2 లక్షల 45 వేలు) ప్రైజ్మనీతోపాటు 4,900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్లో సిక్కి–సుమీత్ జోడి
మాడ్రిడ్: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ (సూపర్ 300) టోర్నీ స్పెయిన్ మాస్టర్స్లో భారత ఆటగాళ్లకు మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో స్టార్ ప్లేయర్ పీవీ సింధు ఓడగా...మిక్స్డ్ డబుల్స్లో సిక్కి రెడ్డి – సుమీత్ రెడ్డి జోడి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. మహిళల డబుల్స్లో, పురుషుల డబుల్స్లో కూడా భారత జోడీలు క్వార్టర్స్లో వెనుదిరిగాయి. శుక్రవారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్లో సింధు పోరాడి ఓడింది. ఈ మ్యాచ్లో థాయిలాండ్కు చెందిన ఆరో సీడ్ సుపనిద కేట్టాంగ్ 24–26, 21–17, 22–20తో రెండో సీడ్ సింధును ఓడించింది. 77 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో ఇద్దరు షట్లర్లూ ఒక్కో పాయింట్ కోసం తీవ్రంగా పోరాడారు. తొలి గేమ్లో 4–8తో వెనుకబడిన తర్వాత వరుస 7 పాయింట్లతో సింధు 11–8కి వెళ్లింది. అయితే ఆ తర్వాత సుపనిద కోలుకుంది. దాంతో స్కోరు 17–17, 20–20, 24–24 వరకు సమంగా సాగగా, చివరకు గేమ్ సింధు గెలుచుకుంది. రెండో గేమ్లో 8–11తో వెనుకబడి కూడా సుపనిద పోరాడి గేమ్ను సొంతం చేసుకోగలిగింది. చివరి గేమ్లో 8–4తో సింధు ముందంజ వేసింది. అయితే భారత షట్లర్ వరుస తప్పిదాలతో ప్రత్యర్థికి అవకాశం కల్పించింది. ఒక దశలో వరుస 10 పాయింట్లలో 9 సుపనిద ఖాతాలోకే చేరాయి. 15–20తో ఓటమి దాదాపు ఖాయమైన దశలో సింధు వరుసగా 5 మ్యాచ్ పాయింట్లు సాధించి 20–20 వరకు తీసుకొచ్చింది. అయితే వరుస రెండు పాయింట్లతో సుపనిద ఆట ముగించడంతో రాకెట్ విసిరేసి సింధు కోర్టులోనే కుప్పకూలిపోయింది. డబుల్స్ జోడీల పరాజయం... 41 నిమిషాల పాటు సాగిన మిక్స్డ్ డబుల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సుమీత్ – సిక్కి జోడి 14–21, 21–11, 21–17 స్కోరుతో ఇండోనేసియాకు చెందిన రేహన్ నౌఫల్ – లిసా ఆయు ద్వయంపై విజయం సాధించింది. తొలి గేమ్ను కోల్పోయినా...పట్టుదలగా ఆడిన భారత జంట తర్వాతి రెండు గేమ్లలో సత్తా చాటి సెమీస్లోకి అడుగు పెట్టింది. మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్కు చెందిన మూడో సీడ్ అశ్విని పొన్నప్ప – తనీషా క్రాస్టోకు ఓటమి ఎదురైంది. ఆరో సీడ్ లీ చియా సిన్ – టెంగ్ చున్ సున్ (చైనీస్ తైపీ) వరుస గేమ్లలో 21–12, 21–10తో అశ్విని – తనీషాలను చిత్తు చేశారు. పురుషుల డబుల్స్ క్వార్టర్స్లోలో భారత్కు చెందిన ఎనిమిదో సీడ్ ధ్రువ్ కపిల – ఎంఆర్ అర్జున్ 19–21, 23–21, 17–21 తేడాతో మలేసియాకు చెందిన జునేదీ ఆరిఫ్ – రాయ్ కింగ్ చేతిలో పరాజయంపాలయ్యారు. -
సెమీస్లో శ్రీకాంత్ పరాజయం
స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ కిడాంబి శ్రీకాంత్కు నిరాశ ఎదురైంది. బాసెల్లో జరిగిన ఈ టోర్నీ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ శ్రీకాంత్ 65 నిమిషాల్లో 21–15, 9–21, 18–21తో లిన్ చున్ యి (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. 16 నెలల తర్వాత ఓ టోర్నీలో శ్రీకాంత్ సెమీఫైనల్ చేరడం గమనార్హం. సెమీఫైనల్లో ఓడిన శ్రీకాంత్కు 3,045 డాలర్ల (రూ. 2 లక్షల 54 వేలు) ప్రైజ్మనీతోపాటు 4900 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. -
సెమీస్లో లక్ష్యసేన్ ఓటమి
బర్మింగ్హమ్: ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్కు ఈ సారీ పతకం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పురుషుల ఈవెంట్లో ఏకైక ఆశాకిరణం లక్ష్యసేన్కు సెమీస్లో చుక్కెదురైంది. దీంతో ప్రతిష్టాత్మక టోర్నీలో భారత పోరాటం ముగిసింది. 2022 టోర్నమెంట్లో రన్నరప్గా నిలిచిన 22 ఏళ్ల లక్ష్యసేన్పై ఈ సారి భారత బృందం గంపెడాశలు పెట్టుకుంది. అయితే శనివారం జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్తో ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి. పురుషుల సింగిల్స్లో జరిగిన సెమీస్లో భారత ఆటగాడు 12–21, 21–10, 15–21తో జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) చేతిలో పోరాడి ఓడాడు. ఒక గంటా 8 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్లో తొలి గేమ్లో ప్రత్యర్థి జోరుకు ఎదురు నిలువలేకపోయిన లక్ష్యసేన్ రెండో గేమ్లో పుంజుకోవడంతో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ క్రిస్టీకి కష్టాలు తప్పలేదు. ఈ గేమ్ను కైవసం చేసుకున్న భారత షట్లర్ నిర్ణాయక మూడో గేమ్లో ఆ పట్టుదల కొనసాగించడంలో విఫలమయ్యాడు. ఫలితం నిరాశపరిచినప్పటికీ వరుసగా ఫ్రెంచ్ ఓపెన్, ఆల్ ఇంగ్లండ్ టోర్నమెంట్లలో సెమీఫైనల్స్లోకి ప్రవేశించడం ద్వారా లక్ష్యసేన్ బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్ ద్వారా ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాల్ని మెరుగుపర్చుకున్నాడు. -
సెమీస్లో అల్కరాజ్
ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్–1000 టెన్నిస్ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. కాలిఫోర్నియాలో జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ అల్కరాజ్ 6–3, 6–1తో ఆరో ర్యాంకర్ జ్వెరెవ్ (జర్మనీ)పై గెలిచాడు. మరో క్వార్టర్ ఫైనల్లో ఆ్రస్టేలియన్ ఓపెన్ విజేత సినెర్ (ఇటలీ) 6–3, 6–3తో లెహెస్కా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గి అల్కరాజ్తో సెమీఫైనల్ పోరుకు సిద్ధమయ్యాడు. -
‘శత’క్కొట్టిన తనుష్, తుషార్
ముంబై: బరోడా, ముంబై జట్ల మధ్య జరిగిన రంజీ ట్రోఫీ క్రికెట్ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో అద్భుతం చోటు చేసుకుంది. ముంబై జట్టుకు చెందిన చివరి వరుస బ్యాటర్లు తనుష్ కొటియన్ (129 బంతుల్లో 120 నాటౌట్; 10 ఫోర్లు, 4 సిక్స్లు), తుషార్ దేశ్పాండే (129 బంతుల్లో 123; 10 ఫోర్లు, 8 సిక్స్లు) శతకాలతో అదరగొట్టారు. ఫస్ట్క్లాస్ క్రికెట్లో (మూడు లేదా అంతకంటే ఎక్కువ రోజులు జరిగే మ్యాచ్లు) ఒకే ఇన్నింగ్స్లో పదో నంబర్, పదకొండో నంబర్ బ్యాటర్లిద్దరూ సెంచరీలు చేయడం కేవలం ఇది రెండోసారికాగా, రంజీ ట్రోఫీలో మాత్రం తొలిసారి. 1946లో ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా సర్రే కౌంటీ జట్టుతో జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో భారత జట్టు తరఫున పదో నంబర్ ప్లేయర్ చందూ సర్వాతే (124 నాటౌట్), పదకొండో నంబర్ ప్లేయర్ శుతె బెనర్జీ (121) సెంచరీలు చేశారు. బరోడాతో జరిగిన క్వార్టర్ ఫైనల్లో ఓవర్నైట్ స్కోరు 379/9తో ఆట చివరిరోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ముంబై 132 ఓవర్లలో 569 పరుగులకు ఆలౌటైంది. తనుష్, తుషార్ సెంచరీలు చేయడంతోపాటు పదో వికెట్కు 232 పరుగుల భాగస్వామ్యం జోడించారు. ఒక పరుగు తేడాతో రంజీ రికార్డును సమం చేసే అవకాశం కోల్పోయారు. 1992 రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో ముంబైతో జరిగిన మ్యాచ్లో అజయ్ శర్మ–మణీందర్ సింగ్ పదో వికెట్కు 233 పరుగులు జత చేశారు. ముంబై నిర్దేశించిన 606 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బరోడా రెండో ఇన్నింగ్స్లో 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు చేసింది. మ్యాచ్లో ఫలితం వచ్చే అవకాశం లేకపోవడంతో టీ సెషన్ తర్వాత రెండు జట్ల కెపె్టన్లు ‘డ్రా’కు అంగీకరించారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ముంబై జట్టు సెమీఫైనల్ చేరుకుంది. విదర్భ విజయం నాగ్పూర్లో కర్ణాటకతో జరిగిన మరో క్వార్టర్ ఫైనల్లో విదర్భ 127 పరుగుల తేడాతో గెలిచి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. విదర్భ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కర్ణాటక 62.4 ఓవర్లలో 243 పరుగులకు ఆలౌటైంది. విదర్భ బౌలర్లు హర్‡్ష దూబే (4/65), ఆదిత్య సర్వాతే (4/78) కర్ణాటకను దెబ్బ తీశారు. మార్చి 2 నుంచి జరిగే సెమీఫైనల్స్లో మధ్యప్రదేశ్తో విదర్భ; తమిళనాడుతో ముంబై తలపడతాయి. -
సెమీస్లో వైదేహి–రష్మిక జోడీ
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీవల్లి రష్మిక డబుల్స్లో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇండోర్లో గురువారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో రష్మిక–వైదేహి (భారత్) జోడీ 6–2, 6–1తో మూడో సీడ్ కరోల్ మొనెట్ (ఫ్రాన్స్) –యషీనా (రష్యా) జంటపై నెగ్గింది. 52 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్లో రష్మిక ద్వయం ప్రత్యర్థి సర్విస్ను ఐదుసార్లు బ్రేక్ చేసింది. -
భారత జట్టుకు నిరాశ
కౌలాలంపూర్: మూడోసారి జూనియర్ పురుషుల ప్రపంచకప్ హాకీ టోర్నమెంట్ టైటిల్ సాధించాలనుకున్న భారత జట్టుకు నిరాశ ఎదురైంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్గా నిలిచిన జర్మనీ జట్టుతో గురువారం జరిగిన సెమీఫైనల్లో యువ భారత్ 1–4 గోల్స్ తేడాతో ఓడిపోయింది. భారత జట్టుకు సుదీప్ చిర్మాకో (11వ ని.లో) ఏకైక గోల్ అందించాడు. జర్మనీ జట్టు తరఫున బెన్ హాస్బాష్ (8వ ని.లో, 30+వ ని.లో) రెండు గోల్స్ చేయగా... పాల్ గ్లాండర్ (41వ ని.లో), ఫ్లోరియన్ స్పెర్లింగ్ (58వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఈ గెలుపుతో జర్మనీ జట్టు తొమ్మిదోసారి ఈ మెగా ఈవెంట్లో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. భారత జట్టుకు సెమీఫైనల్లో ఏకంగా 12 పెనాల్టీ కార్నర్లు వచ్చినా ఒక్క దానిని కూడా సద్వినియోగం చేసుకోకుండా మూల్యం చెల్లించుకుంది. -
భారత్ X జర్మనీ
కౌలాలంపూర్: జూనియర్ ప్రపంచకప్ హాకీలో చక్కని ప్రదర్శన కనబరిచిన భారత్కు నేడు జరిగే సెమీ ఫైనల్లో జర్మనీతో క్లిష్టమైన పోరు ఎదురు కానుంది. పటిష్టమైన జర్మనీ అడ్డంకిని దాటితే ఇంచుమించు టైటిల్ గెలిచినట్లే! ఈ మెగా ఈవెంట్ చరిత్రలో జర్మనీ దుర్బేధ్యమైన ప్రత్యర్థి . గత టోర్నీ రన్నరప్ జర్మనీ ఆరుసార్లు (1982, 85, 89, 93, 2009, 13) టైటిల్ గెలిచింది. మరో రెండుసార్లు (1979, 2021) రన్నరప్గా నిలిచింది. అంతటి ప్రత్యర్థి ని దాటుకొని భారత్ నాలుగో సారి ఫైనల్ చేరడం అంత సులువు కాదు. అయితే క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నాలుగో ర్యాంకర్ నెదర్లాండ్స్పై ఆడిన తీరు, చేసిన పోరాటం, గెలిచిన వైనం చూస్తే భారత్ను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. మేటి జట్టు చేతిలో 0–2తో వెనుకబడిన దశనుంచి భారత్ చివరికొచ్చే సరికి 4–3 గోల్స్ తేడాతో డచ్పై జయభేరి మోగించింది. ముఖ్యంగా ప్రత్యర్థి జట్టుకు పెనాల్టీ కార్నర్లు లభించినపుడు... గోల్ కీపర్ మోహిత్తో పాటు రక్షణశ్రేణి చూపించిన సయమస్ఫూర్తి, కనబరిచిన పోరాటం అద్వితీయంగా సాగింది. ఇప్పుడు కూడా ఉత్తమ్ సింగ్ నేతృత్వంలోని భారత్ ఇదే ఆటతీరును కొనసాగిస్తే జర్మనీని కట్టడి చేయగలదు. మరో సెమీ ఫైనల్ మ్యాచ్లో స్పెయిన్తో ఫ్రాన్స్ తలపడుతుంది. -
డేవిస్ కప్ సెమీస్లో సెర్బియా
మలగ (స్పెయిన్): ప్రపంచ నంబర్వన్ టెన్నిస్ ఆటగాడు నొవాక్ జొకోవిచ్ డేవిస్ కప్ క్వార్టర్ ఫైనల్లో కీలకమైన విజయంతో సెర్బియాను సెమీస్కు చేర్చాడు. తద్వారా డేవిస్ కప్ చరిత్రలోనే అత్యంత విజయవంతమైన ఆటగాడిగా ఘనత వహించాడు. టీమ్ ఈవెంట్లో గురువారం అర్ధరాత్రి జరిగిన క్వార్టర్ఫైనల్లో సెర్బియా 2–0తో బ్రిటన్పై ఘనవిజయం సాధించింది. తొలి సింగిల్స్లో లోమిర్ కెమనొవిచ్ (సెర్బియా) 7–6 (7/2), 7–6 (8/6)తో జాక్ డ్రాపెర్ (బ్రిటన్)ను ఓడించగా... రెండో సింగిల్స్లో జొకోవిచ్ 6–4, 6–4తో కామెరాన్ నోరీ (బ్రిటన్)పై గెలుపొందాడు. 2–0తో ఫలితం తేలడంతో డుసాన్ లాజొవిక్తో కలిసి జొకోవిచ్ డబుల్స్ మ్యాచ్ ఆడాల్సిన అవసరం లేకపోయింది. డేవిస్ కప్ టోర్నీల్లో గత మూడేళ్లుగా సెర్బియన్ స్టార్ వరుసగా సాధించిన 21వ విజయమిది. ఓవరాల్గా ఈ టీమ్ ఈవెంట్లో రికార్డు స్థాయిలో జొకోవిచ్ 44 విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. కేవలం సింగిల్స్నే పరిగణిస్తే జొకోకు ఇది 40వ విజయం అవుతుంది. సెమీస్లో సెర్బియా... ఇటలీని ఎదుర్కొంటుంది. మరో క్వార్టర్స్లో ఇటలీ 2–1తో నెదర్లాండ్స్పై గెలుపొందింది. -
NZ VS SL: పెరీరా మ్యాచ్ లాగేసుకున్నాడనుకున్నాం: కేన్ విలియమ్సన్
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో న్యూజిలాండ్ 5 వికెట్ల తేడాతో గెలుపొంది, సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలుపుతో పాక్, ఆఫ్ఘనిస్తాన్లు సెమీస్ ఆశలు వదులుకున్నాయి. ఈ గెలుపుతో పాయింట్లతో పాటు రన్రేట్ను సైతం భారీగా మెరుగుపర్చుకున్న కివీస్.. పాక్, ఆఫ్ఘన్లు తమ తర్వాతి మ్యాచ్ల్లో గెలిచినా కూడా సెమీస్కు చేరే అవకాశాలు లేకుండా చేసింది. ఏదో అద్భుతాలు జరిగితే తప్ప పాక్, ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరలేవు. కివీస్తో మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకకు.. కుశాల్ పెరీరా (28 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఆరంభాన్ని అందించాడు. అయితే అతను ఔటయ్యాక ఏ ఒక్క లంక బ్యాటర్ కూడా రాణించకపోవడంతో శ్రీలంక 46.4 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. ఆఖర్లో తీక్షణ (38 నాటౌట్), మధుషంక (19) పోరాడటంతో శ్రీలంక ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ట్రెంట్ బౌల్ట్ (10-3-37-3) లంక బ్యాటర్లను గడగడలాడించగా.. రచిన్ రవీంద్ర (2/21), ఫెర్గూసన్ (2/35), సాంట్నర్ (2/22) సత్తా చాటారు. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్కు కాన్వే (45), రచిన్ (42) మెరుపు ఆరంభాన్ని అందించారు. వీరిద్దరితో పాటు డారిల్ మిచెల్ (43) కూడా రాణించడంతో కివీస్ 23.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాట్లాడుతూ ఇలా అన్నాడు. మా వాళ్లు అద్భుతంగా ఆడారు. మధ్య ఓవర్లలో స్పిన్నర్లను ఎదుర్కోవడం సవాలుగా ఉండింది. ఆరంభంలో వికెట్లు కోల్పోవడంతో కాస్త తడబడ్డాం. ఛేదనలో పిచ్ బాగా నెమ్మదించింది. మా బ్యాటర్లు కృత నిశ్చయం కలిగి బ్యాటింగ్ చేశారు. వరుణుడు అడ్డుతగులుతాడేమోనని భయపడ్డాం. పరుగులు అంత ఈజీగా రాలేదు. ఓవరాల్గా మంచి బ్యాటింగ్ ప్రదర్శన. బౌలింగ్ విషయానికొస్తే.. మా బౌలర్లు అద్భుతం. ప్రత్యర్ధిని త్వరగా ఆలౌట్ చేసి గెలుపుకు మంచి పునాది వేశారు. క్రమం తప్పకుండా వికెట్లు తీయగలిగినందుకు సంతోషంగా ఉంది. పెరీరా మా నుంచి మ్యాచ్ లాగేసుకున్నాడనుకున్నాం. అలాంటి ఆటగాళ్లు నిమిషాల వ్యవధిలో ఫలితాన్ని మార్చేయగలరు. అయితే మా బౌలర్లు అతన్ని త్వరగా సాగనంపి మ్యాచ్పై పట్టు సాధించేలా చేశారు. ఓవరాల్గా మా ఆటగాళ్ల నుంచి అద్భుత ప్రదర్శన. సెమీస్ బెర్త్పై ఇప్పుడే ఏమీ చెప్పలేను. అయితే, ఫైనల్ ఫోర్కు చేరితే బాగుంటుంది. సెమీస్లో భారత్ లాంటి పటిష్ట జట్టును ఎదుర్కోవడం సవాలుగా ఉంటుంది. ఇది జట్టుగా మమ్మల్ని పరీక్షిస్తుందని విలియమ్సన్ అన్నాడు. -
CWC 2023: పాక్ను సెమీస్కు చేర్చేందుకు వసీం అక్రమ్ మాస్టర్ ప్లాన్
ప్రస్తుత ప్రపంచకప్లో పాక్ సెమీస్కు చేరడం దాదాపుగా అసాధ్యమనే చెప్పవచ్చు. ఏదో అత్యద్భుతం జరిగితే తప్ప, దాయాది జట్టు ఫైనల్ ఫోర్కు అర్హత సాధించలేదు. శ్రీలంకపై న్యూజిలాండ్ భారీ తేడా గెలవడంతో నాలుగో సెమీస్ బెర్త్ను దాదాపుగా ఖరారు చేసుకుంది. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు ఆ జట్టు సెమీస్కు చేరడం ఖాయమైపోయింది. పాక్ సెమీస్కు చేరాలంటే ఆ జట్టు ముందు రెండు ప్రధాన అప్షన్లు ఉన్నాయి. ఇందులో ఒకటి ఇంగ్లండ్తో రేపు (నవంబర్ 11) జరుగబోయే మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసి అతి భారీ స్కోర్ చేయడం. అనంతరం ప్రత్యర్ధిని 287 పరుగుల తేడాతో ఓడించడం. ఈ మ్యాచ్లో పాక్ కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్ను 13 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. అదే 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు ప్రత్యర్ధిని మట్టుబెట్టాల్సి ఉంటుంది. వన్డేల్లో ఒక్కసారి కూడా 400 స్కోరు దాటని పాక్కు ఈ టాస్క్ అసాధ్యమనే చెప్పవచ్చు. ఈ మ్యాచ్లో పాక్ టాస్ ఓడితే బరిలోకి దిగకుండానే సెమీస్ ఆశలను వదులుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే, ఇంగ్లండ్ నిర్ధేశించే ఎంతటి లక్ష్యాన్నైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది. ఇది ఏ రకంగానూ ఊహకు అందని విషయం. కాబట్టి పాక్ సెమీస్ అవకాశాల విషయంలో ప్లాన్ ఏ ఫెయిల్ అయినట్లే అని చెప్పాలి. ప్లాన్ బి ఏంటంటే.. పాక్ సెమీస్కు చేరే అంశంపై ఆ దేశ మాజీ ఆటగాడు వసీం అక్రమ్ వ్యంగ్యంగా స్పందించాడు. ఓ స్థానిక టీవీ ఛానల్ డిబేట్లో అతను మాట్లాడుతూ పాక్ జట్టుపై సెటైర్లు వేశాడు. ఇంగ్లండ్పై తమ జట్టు 400కు పైగా స్కోర్ చేయడం లేదా 287 పరుగుల భారీ తేడాతో గెలవడం వంటివి జరగని పనులు. కాబట్టి పాక్ సెమీస్కు చేరాలంటే ఇక మిగిలింది ఒకే ఒక మార్గం. పాక్ తొలుత బ్యాటింగ్ చేసి వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలి. ఆపై ఇంగ్లండ్ జట్టును డ్రెస్సింగ్ రూమ్లో పెట్టి తాళం వేసి, వారి బ్యాటర్లందరినీ 'టైమ్డ్ ఔట్' అయ్యేలా చేయాలని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. కాగా, ప్రస్తుత ప్రపంచకప్లో బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో శ్రీలంక ఆటగాడు ఏంజెలో మాథ్యూస్ టైమ్డ్ ఔట్గా ప్రకటించబడిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే వసీం అక్రమ్ పాక్ జట్టుపై టైమ్డ్ ఔట్ సెటైర్లు వేశాడు. -
CWC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్.. ఇలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు..!
వన్డే వరల్డ్కప్-2023లో భాగంగా ఇవాళ (నవంబర్ 10) ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. అహ్మదాబాద్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. సెమీస్ బెర్త్పై ఆశ చావని ఆఫ్ఘనిస్తాన్ ఈ మ్యాచ్లో శక్తివంచన లేకుండా పోరాడాలని భావిస్తుంది. అయితే వారు సెమీస్కు చేరడం అంత ఈజీ కాదు. దాదాపుగా అసాధ్యం అని కూడా చెప్పవచ్చు. ప్రస్తుత వరల్డ్కప్లో ఆఫ్ఘన్లు అద్భుతమైన పోరాటాలు చేసినప్పటికీ.. అన్ని విభాగాల్లో పటిష్టమైన సౌతాఫ్రికా దగ్గర పప్పులు ఉడకకపోవచ్చు. 438 పరుగుల తేడాతో గెలిస్తేనే.. ప్రస్తుత వరల్డ్కప్లో ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు చేరాలంటే సౌతాఫ్రికాతో జరిగే మ్యాచ్లో 438 పరుగుల భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. వరల్డ్కప్లో ఇప్పటివరకు ఒక్కసారైన కనీసం 300 స్కోర్ దాటని ఆఫ్ఘన్లకు ఇది స్థాయికి మించిన పనే అవుతుంది. గత మ్యాచ్లో ఆస్ట్రేలియాపై గెలవాల్సిన మ్యాచ్లో ఓడటంతో ఆఫ్ఘనిస్తాన్కు ఈ దుస్థితి ఏర్పడింది. ఒకవేళ ఆ మ్యాచ్లో ఆసీస్పై ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించి ఉంటే, నాలుగో సెమీస్ బెర్త్ కోసం పోటీ ఎన్నడూ లేనంత రసవత్తరంగా ఉండేది. ప్రస్తుతానికి న్యూజిలాండ్ అనధికారికంగా సెమీస్కు చేరుకోగా.. సాంకేతికంగా పాక్, ఆఫ్ఘనిస్తాన్లకు సెమీస్ అవకాశాలు ఇంకా సజీవంగానే ఉన్నాయి. ఇదిలా ఉంటే, ఈ నెల 15న ముంబైలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి సెమీఫైనల్ జరిగే అవకాశం ఉంది. 16న కోల్కతాలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య రెండో సెమీఫైనల్ ఖరారైపోయింది. సెమీస్కు ముందు మరో మూడు లీగ్ మ్యాచ్లు జరగాల్సి ఉంది. 11న ఆసీస్, బంగ్లాదేశ్ మధ్య నామమాత్రపు మ్యాచ్, అదే రోజు ఇంగ్లండ్, పాకిస్తాన్ మ్యాచ్, 12న భారత్,నెదర్లాండ్స్ మ్యాచ్లు జరుగనున్నాయి. నవంబర్ 19న అహ్మదాబాద్లో ఫైనల్ జరుగుతుంది. చదవండి: పాక్ సెమీస్కు చేరాలంటే ఇలా జరగాలి.. టాస్ ఓడినా ఇంటికే..! -
పాక్ సెమీస్కు చేరాలంటే ఇలా జరగాలి.. టాస్ ఓడినా ఇంటికే..!
వన్డే వరల్డ్కప్ 2023లో సెమీస్ బెర్త్లు దాదాపుగా ఖరారైపోయాయి. భారత్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ సెమీస్కు చేరడం దాదాపుగా ఖాయమైపోయింది. శ్రీలంకపై భారీ తేడా గెలవడంతో న్యూజిలాండ్ నాలుగో సెమీస్ బెర్త్ను కన్ఫర్మ్ చేసుకుని భారత్తో పోటీకి సిద్ధమైంది. ఏదో అద్భుతం జరిగితే తప్ప పాక్, ఆఫ్ఘనిస్తాన్లు సెమీస్కు చేరలేవు. 287 పరుగుల తేడాతో గెలిస్తేనే పాక్ ముందుకు.. అక్షరాలా 287 పరుగులు... శనివారం ఇంగ్లండ్పై ఇంత భారీ తేడాతో విజయం సాధిస్తేనే పాకిస్తాన్ జట్టు ముందంజ వేసే అవకాశం ఉంటుంది. అంటే పాకిస్తాన్ ముందుగా బ్యాటింగ్ చేసి కనీసం 300 పరుగులు చేస్తే ఇంగ్లండ్ను 13 పరుగులకు పరిమితం చేయాలి! 350 చేస్తే 63 పరుగులకు, 400 చేస్తే 112 పరుగులకు పరిమితం చేయాల్సి ఉంటుంది. వన్డేల్లో ఇప్పటివరకు ఒక్కసారి కూడా పాక్ జట్టు 400 పరుగుల స్కోరు దాటలేదు. ఇంగ్లండ్ ఏ జట్టుకూ 400 పరుగులు సమర్పించుకోలేదు. ఇంగ్లండ్ను నిలువరించడం సంగతేమో కానీ పాక్ ప్రస్తుత ఫామ్ చూస్తే ఆ జట్టే కనీసం 300 పరుగులు చేసే స్థితిలో లేదు. అసలు 287 పరుగులు చేస్తే గానీ లెక్క రాసే అవకాశం కూడా లేదు! ఇక ఇంగ్లండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంటే మాత్రం టాస్ వద్దే పాక్ జట్టు ఖేల్ ఖతం. ఎందుకంటే ఎంతటి లక్ష్యమైనా పాక్ 3 ఓవర్లలోపే ఛేదించాల్సి ఉంటుంది! ఇది ఏ రకంగానూ ఊహకు కూడా అందనిది. చదవండి: CWC 2023: సౌతాఫ్రికాతో మ్యాచ్.. ఇలా జరిగితే ఆఫ్ఘనిస్తాన్ సెమీస్కు..! -
ఒకే ఒక్కడు మ్యాక్స్ ‘వెల్డన్’
ఆ్రస్టేలియా విజయలక్ష్యం 292... 18.3 ఓవర్ల వరకు ఆ జట్టు స్కోరు 91/7... ఇక ఐదుసార్లు విశ్వవిజేత ఆ్రస్టేలియాకు అఫ్గానిస్తాన్ చేతిలో ఘోర పరాభవం లాంఛనమేనని అందరూ భావించారు. కానీ గ్లెన్ మ్యాక్స్వెల్... కలిసొచ్చిన అదృష్టం (లైఫ్లు)... క్రీజులో కదల్లేకపోయిన దైన్యం... ఒకదాని తర్వాత ఒకటి వెంబడించినా... అదృష్టాన్ని అందిపుచ్చుకొని, కష్టాన్ని పంటిబిగువన భరించి ఈ ప్రపంచకప్కే అసాధారణ ‘షో’కు తెచ్చాడు. అఫ్గాన్ చేతుల్లో పడిన సంచలనాన్ని మ్యాక్సీ ఒంటిచేత్తో లాక్కున్నాడు. ఆ ఒక్కడే ఆసీస్ సైన్యంగా మారి గెలిచేదాకా నిలిచాడు. కాళ్లు కదలనీయలేకపోయినా... ఉక్కు పిడికిలితో బ్యాట్ పట్టి కొండంత లక్ష్యాన్ని కరిగించాడు. డబుల్ సెంచరీతో ఈ ప్రపంచకప్కే వన్నె తెచ్చాడు. ముంబై: నవంబర్ 19న వన్డే వరల్డ్కప్ ఫైనల్... టైటిల్ పోరు ఎవరి మధ్యయినా జరగొచ్చు... విజేత ఎవరైనా కావొచ్చు. కానీ ఈ ప్రపంచకప్ అంటే తప్పక గుర్తుండే క్రికెటర్ మాత్రం ఒక్కడే! అతడే మ్యాక్స్వెల్! ఛేదించలేని లక్ష్యం. కొండంత కష్టం కళ్లముందుంటే... కఠిన సవాల్ సైతం సలామ్ కొట్టేలా ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాక్స్వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్; 21 ఫోర్లు, 10 సిక్స్లు) అద్భుత ఇన్నింగ్స్ ఆడేశాడు. ఓటమి కోరల్లోంచి లాగి... మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాను ఒంటిచేత్తో సెమీఫైనల్కు తీసుకెళ్లాడు. అందరూ ముఖమంత కళ్లు చేసుకొని చూసిన ఈ మ్యాచ్లో మ్యాక్స్వెల్ మహిమతో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్పై గెలిచింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్తాన్ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 291 పరుగులు చేసింది. ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్ (143 బంతుల్లో 129 నాటౌట్; 8 ఫోర్లు, 3 సిక్స్లు) అజేయ సెంచరీ చేశాడు. ఆఖర్లో రషీద్ ఖాన్ (18 బంతుల్లో 35 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరిపించాడు. హాజల్వుడ్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం ఆ్రస్టేలియా 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 293 పరుగులు చేసి గెలిచింది. ఈ 293 పరుగుల్లో 201 మ్యాక్స్వెల్ ఒక్కడివే అంటేనే ఇంకెవరూ చెప్పుకోదగ్గ స్కోర్లే చేయలేదనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. దీంతో అఫ్గాన్ బౌలర్లు నవీనుల్ (2/47), రషీద్ (2/44), ఒమర్జాయ్ (2/52) చిందించిన చెమట... పడగొట్టిన వికెట్లు వృథా అయ్యాయి. జబర్దస్త్ జద్రాన్... ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ (25 బంతుల్లో 21; 2 ఫోర్లు) నిష్క్రమించగా, ఇబ్రహీమ్ జద్రాన్ ఆద్యంతం ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. ఈ క్రమంలో జద్రాన్ 62 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. రహ్మత్ షా (44 బంతుల్లో 30; 1 ఫోర్) కుదురుగా ఆడగా అఫ్గాన్ 21వ ఓవర్లో 100 పరుగులు దాటింది. రెండో వికెట్కు ఇద్దరు కలిసి 83 పరుగులు జోడించారు. ఆ తర్వాత కెప్టెన్ హష్మతుల్లా (26; 2 ఫోర్లు) చేసింది తక్కువే అయినా మూడో వికెట్కు 52 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. జద్రాన్కు జతయిన అజ్మతుల్లా ఒమర్జాయ్ (18 బంతుల్లో 22; 1 ఫోర్, 2 సిక్స్లు) ధాటిగా ఆడటంతో 41వ ఓవర్లో అఫ్గాన్ 200 స్కోరు చేరింది. జద్రాన్ 131 బంతుల్లో అఫ్గాన్ తరఫున తొలి శతకాన్ని లిఖించాడు. ఒక్కడే అయినా... ఒంటరి కాదు విక్టరీ! హెడ్ (0) ఖాతా తెరువలేదు. మిచెల్ మామార్ష్ (24), వార్నర్ (18)లు గొప్పగా ఆడలేదు. ఇంగ్లిస్ (0), లబుషేన్ (14), స్టొయినిస్ (6)లు అంతే! అఫ్గాన్ బౌలర్లకు కలిసికట్టుగా దాసోహమయ్యారు. జట్టు స్కోరు 50కి ముందే (49/4) ఆసీస్ నలుగురు టాప్ బ్యాటర్లను... వందకు ముందు (91/7) మిగిలిపోయిన బ్యాటింగ్ అస్త్రాలను కోల్పోయింది. గెలుపు సంగతి దేవుడెరుగు! అసలు ప్రపంచకప్లలోనే ఫేవరెట్, ఐదుసార్లు ప్రపంచ చాంపియన్ పరువు సంగతి ఏంటి? ఎంత భారీతేడాతో ఓడుతుందనే కళ్లే మ్యాచ్ను చూశాయి. కలిసొచ్చిన రివ్యూలు, మిస్ క్యాచ్లు ఒమర్జాయ్ 9వ ఓవర్ తొలి బంతికే వార్నర్, రెండో బంతికి ఇంగ్లిస్లను అవుట్ చేశాడు. జట్టుస్కోరు 49/4 వద్ద మ్యాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు. బౌలర్ ‘హ్యాట్రిక్’ కోసం ప్రయత్నించాడు. ఎల్బీకోసం రివ్యూకు సైతం వెళ్లాడు. కానీ బంతి మ్యాక్సీ బ్యాట్ అంచును తాకి కీపర్కు చాలా ముందుగా పడింది. దీంతో అఫ్గాన్కు ఫలితం దక్కలేదు. ఆ తర్వాత 22వ ఓవర్లో రెండుసార్లు... ఎల్బీగా అంపైర్ అవుటిస్తే రివ్యూతో బయటపడ్డాడు. అదే ఓవర్లో ముజీబ్ జారవిడిచిన క్యాచ్తో, కాసేపయ్యాక నబీ అందుకోలేకపోయిన క్యాచ్తో బతికి బయటపడ్డాక వెనుదిరిగి చూసుకోలేదు. అప్పటికీ మ్యాక్సీ కనీసం 35 పరుగులైనా చేయలేదు. రాత మార్చిన ఘనుడు మ్యాక్స్వెల్ భారీ హిట్టింగ్కు, మ్యాచ్ విన్నింగ్ షాట్లకు పెట్టింది పేరు. కానీ పెద్ద లక్ష్యం, అంతదూరం ఎలా పయనిస్తాడో అనుకుంటే... జతకూడిన కమిన్స్తో కలిసి జట్టు రాతను తన బ్యాట్తో మార్చేశాడు. 20 ఓవర్లదాకా మ్యాక్సీ సాధారణ ఆటే ఆడాడు. 51 బంతుల్లో ఫిఫ్టీ పూర్తిచేశాడు. నూర్ అహ్మద్ వేసిన 29వ ఓవర్లో 2 వరుస సిక్సర్లతో గేర్ మార్చాడు. స్పిన్నర్లపై దూకుడు పెంచి బౌండరీలు, సిక్సర్లతో శివమెత్తాడు. దీంతో ఛేదించాల్సిన రన్రేట్ తగ్గుతూ వచ్చింది. 76 బంతుల్లోనే శతక్కొట్టిన మ్యాక్సీ డబుల్ సెంచరీకి అవసరమైన బంతులు 128 మాత్రమే! బతికించిన ముజీబ్ ఓవర్లోనే ముగించి... సునాయాసమైన క్యాచ్ను నేలపాలుచేసిన ముజీబ్ 47వ ఓవర్ వేశాడు. అప్పటికీ 24 బంతుల్లో 21 పరుగులు కావాలి. అయితే మ్యాక్సీ 0, 6, 6, 4, 6లతో ఆ ఓవర్ కూడా పూర్తవకముందే లక్ష్యాన్ని, తన డబుల్ సెంచరీని ముగించాడు. మ్యాక్సీ, కమిన్స్లు అబేధ్యమైన 8వ వికెట్కు 202 పరుగుల భాగస్వామ్యం జోడించడంతో కొత్త ప్రపంచ రికార్డు నమోదైంది. 2006లో భారత్పై 8వ వికెట్కు దక్షిణాఫ్రికా బ్యాటర్స్ జస్టిన్ కెంప్, అండ్రూ హాల్ చేసిన 138 పరుగుల భాగస్వామ్యం కనుమరుగైంది. గ్లెన్ మ్యాక్స్వెల్ పరుగులు 201 నాటౌట్ బంతులు 128 4 x 21; 6 x 10 1 x 39; 2 x 9 స్ట్రయిక్రేట్ 157.03 201 వన్డేల్లో ఆ్రస్టేలియా తరఫున తొలి డబుల్ సెంచరీతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన ప్లేయర్గా మ్యాక్స్వెల్ నిలిచాడు. షేన్ వాట్సన్ (185 నాటౌట్; 2011లో బంగ్లాదేశ్పై మిర్పూర్లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్వెల్ బద్దలు కొట్టాడు. 3 ప్రపంచకప్ చరిత్రలో నమోదైన డబుల్ సెంచరీలు. గతంలో న్యూజిలాండ్కు చెందిన మార్టిన్ గప్టిల్ (237 నాటౌట్; వెస్టిండీస్పై 2015లో వెల్లింగ్టన్లో), వెస్టిండీస్ స్టార్ క్రిస్ గేల్ (215; జింబాబ్వేపై 2015లో కాన్బెర్రాలో) ఈ ఘనత సాధించారు. 2 వన్డేల్లో వేగవంతంగా డబుల్ సెంచరీ చేసిన రెండో ప్లేయర్గా మ్యాక్స్వెల్ (128 బంతుల్లో) నిలిచాడు. ఈ రికార్డు భారత ప్లేయర్ ఇషాన్ కిషన్ (126 బంతుల్లో; 2022లో బంగ్లాదేశ్పై చిట్టగాంగ్లో) పేరిట ఉంది. 1 వన్డేల్లో ఛేజింగ్ చేస్తూ అత్యధిక స్కోరు సాధించిన ప్లేయర్గా మ్యాక్స్వెల్ నిలిచాడు. పాకిస్తాన్ ప్లేయర్ ఫఖర్ జమాన్ (193; 2021లో దక్షిణాఫ్రికాపై జొహన్నెస్బర్గ్లో) పేరిట ఉన్న రికార్డును మ్యాక్స్వెల్ సవరించాడు. 2 ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక సిక్స్లు కొట్టిన క్రికెటర్ల జాబితాలో మ్యాక్స్వెల్ (43) మూడో స్థానానికి చేరుకున్నాడు. క్రిస్ గేల్ (49), రోహిత్ శర్మ (45) వరుసగా తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. స్కోరు వివరాలు అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) స్టార్క్ (బి) హాజల్వుడ్ 21; జద్రాన్ (నాటౌట్) 129; రహ్మత్ (సి) హాజల్వుడ్ (బి) మ్యాక్స్వెల్ 30; హష్మతుల్లా (బి) స్టార్క్) 26; ఒమర్జాయ్ (సి) మ్యాక్స్వెల్ (బి) జంపా 22; నబీ (బి) హాజల్ వుడ్ 12; రషీద్ (నాటౌట్) 35; ఎక్స్ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 291. వికెట్ల పతనం: 1–38, 2–121, 3–173, 4–210, 5–233. బౌలింగ్: స్టార్క్ 9–0–70–1, హాజల్వుడ్ 9–0–39–2, మ్యాక్స్వెల్ 10–0– 55–1, కమిన్స్ 8–0–47–0, జంపా 10–0– 58–1, హెడ్ 3–0–15–0, స్టొయినిస్ 1–0– 2–0. ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (బి) ఒమర్జాయ్ 18; హెడ్ (సి) ఇక్రామ్ (బి) నవీనుల్ 0; మామార్ష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) నవీనుల్ 24; లబుషేన్ (రనౌట్) 14; ఇంగ్లిస్ (సి) జద్రాన్ (బి) ఒమరాŠజ్య్ 0; మ్యాక్స్వెల్ (నాటౌట్) 201; స్టొయినిస్ (ఎల్బీడబ్ల్యూ) (బి) రషీద్ 6; స్టార్క్ (సి) ఇక్రామ్ (బి) రషీద్ 3; కమిన్స్ (నాటౌట్) 12; ఎక్స్ట్రాలు 15; మొత్తం (46.5 ఓవర్లలో 7 వికెట్లకు) 293. వికెట్ల పతనం: 1–4, 2–43, 3–49, 4–49, 5–69, 6–87, 7–91. బౌలింగ్: ముజీబ్ 8.5–1–72–0, నవీనుల్ 9–0–47–2, ఒమర్జాయ్ 7–1–52–2, రషీద్ ఖాన్ 10–0–44–2, నూర్ అహ్మద్ 10–1–53–0, నబీ 2–0–20–0. ప్రపంచకప్లో నేడు ఇంగ్లండ్ x నెదర్లాండ్స్ వేదిక: పుణే మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్స్టార్ యాప్లో ప్రత్యక్ష ప్రసారం -
సెమీస్లో సింధు
ఒడెన్స్: డెన్మార్క్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ –750 బ్యాడ్మింటన్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో భారత స్టార్ పీవీ సింధు సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో సింధు 21–19, 21–12తో సుపనిద కటెథోంగ్ (థాయ్లాండ్)పై గెలిచింది. 47 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో సింధుకు తొలి గేమ్లో గట్టిపోటీ ఎదురైంది. అయితే రెండో గేమ్లో సింధు పూర్తి ఆధిపత్యం చలాయించి విజయాన్ని ఖాయం చేసుకుంది. నేడు జరిగే సెమీఫైనల్లో కరోలినా మారిన్ (స్పెయిన్)తో సింధు తలపడుతుంది. ముఖా ముఖి రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉంది. క్వార్టర్ ఫైనల్లో కరోలినా మారిన్ 19–21, 21–15, 21–18తో తై జు యింగ్ (చైనీస్ తైపీ)పై విజయం సాధించింది. -
సెమీస్లో రష్మిక
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నీలో హైదరాబాద్ క్రీడాకారిణి శ్రీవల్లి రషి్మక సెమీఫైనల్లోకి ప్రవేశించింది. థాయ్లాండ్లో జరుగుతున్న ఈ టోర్నీలో శుక్రవారం జరిగిన సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో రషి్మక 6–2, 6–3తో వలెరి జినీనా (రష్యా)పై గెలిచింది. 79 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో రష్మిక నాలుగు ఏస్లు సంధించింది. మరోవైపు న్యూఢిల్లీలో జరుగుతున్న ఫెనెస్టా ఓపెన్ జాతీయ చాంపియన్íÙప్లో అండర్–14 బాలుర డబుల్స్ విభాగంలో హృతిక్ కటకం (తెలంగాణ)–తవీష్ (హరియాణా) జోడీ టైటిల్ సొంతం చేసుకుంది. ఫైనల్లో హృతిక్–తవీష్ ద్వయం 6–4, 7–5తో శౌర్య–రణ్వీర్ జంటపై నెగ్గింది. సింగిల్స్లో హృతిక్ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో హృతిక్ 6–4, 6–1తో అనురాగ్పై గెలిచాడు. -
సెమీస్లో బోపన్న జోడీ
న్యూఢిల్లీ: షాంఘై ఓపెన్ ఏటీపీ మాస్టర్స్–1000 టెన్నిస్ టోర్నీ లో రోహన్ బోపన్న (భారత్)–ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. చైనాలో గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ ద్వయం 6–4, 6–2తో అరెవాలో (ఎల్సాల్వడార్)–జీన్ జూలియన్ రోజర్ (నెదర్లాండ్స్) జంటపై గెలిచింది. 61 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్లో బోపన్న జోడీ పది ఏస్లు సంధించడంతోపాటు ప్రత్యర్థి సర్వీస్ను మూడుసార్లు బ్రేక్ చేసింది. -
‘రికార్డు’తో సెమీస్లోకి జొకోవిచ్
న్యూయార్క్: ఈ ఏడాది వరుసగా నాలుగో గ్రాండ్స్లామ్ టోర్నీలోనూ ఫైనల్ చేరడానికి సెర్బియా దిగ్గజం నొవాక్ జొకోవిచ్ మరో విజయం దూరంలో నిలిచాడు. టెన్నిస్ సీజన్ ఆఖరి గ్రాండ్స్లామ్ టోర్నీ యూఎస్ ఓపెన్లో రెండో సీడ్ జొకోవిచ్ 13వసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జొకోవిచ్ 2 గంటల 35 నిమిషాల్లో 6–1, 6–4, 6–4తో తొమ్మిదో సీడ్ టేలర్ ఫ్రిట్జ్ (అమెరికా)పై గెలుపొందాడు. ఫ్రిట్జ్తో గతంలో ఆడిన ఏడుసార్లూ గెలుపొందిన జొకోవిచ్ ఎనిమిదోసారి కూడా అదే ఫలితాన్ని పునరావృతం చేశాడు. ఏడు ఏస్లు సంధించిన జొకోవిచ్ ఐదు డబుల్ ఫాల్ట్లు చేశాడు. ఆరుసార్లు ప్రత్యర్థి సర్వీస్ను బ్రేక్ చేసిన ఈ సెర్బియా స్టార్ నెట్ వద్దకు 17 సార్లు దూసుకొచ్చి 13 సార్లు పాయింట్లు గెలిచాడు. 2016 వింబుల్డన్ టోర్నీ మూడో రౌండ్లో సామ్ క్వెరీ (అమెరికా) చేతిలో ఓడిన జొకోవిచ్ ఆ తర్వాత అమెరికా ఆటగాళ్లతో 30 సార్లు తలపడినా ఒక్క మ్యాచ్లోనూ ఓడిపోలేదు. ఫ్రిట్జ్పై విజయంతో జొకోవిచ్ రికార్డు పుస్తకాల్లోకి కూడా ఎక్కాడు. పురుషుల టెన్నిస్ చరిత్రలో అత్యధికసార్లు గ్రాండ్స్లామ్ టోర్నీలలో సెమీఫైనల్ చేరిన ప్లేయర్గా జొకోవిచ్ రికార్డు నెలకొల్పాడు. ఓవరాల్గా కెరీర్లో 47వ సారి గ్రాండ్స్లామ్ సెమీఫైనల్ బెర్త్ దక్కించుకున్న జొకోవిచ్ స్విట్జర్లాండ్ దిగ్గజం రోజర్ ఫెడరర్ (46 సార్లు) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టాడు. 2011 తర్వాత సెమీస్లోకి బోపన్న పురుషుల డబుల్స్ విభాగంలో ఆరో సీడ్ రోహన్ బోపన్న (భారత్)–మాథ్యూ ఎబ్డెన్ (ఆ్రస్టేలియా) జోడీ సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. 43 ఏళ్ల బోపన్న 2011 తర్వా త యూఎస్ ఓపెన్ డబుల్స్లో సెమీఫైనల్ చేరుకోవడం విశేషం. క్వార్టర్ ఫైనల్లో బోపన్న–ఎబ్డెన్ జంట 7–6 (12/10), 6–1తో లామోన్స్–జాక్సన్ విత్రో (అమెరికా) ద్వయంపై గెలిచింది. వరుసగా మూడో ఏడాది... మహిళల సింగిల్స్ విభాగంలో రెండో సీడ్ అరీనా సబలెంకా (బెలారస్) ఈ టోర్నీలో వరుసగా మూడో ఏడాది సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన మూడో క్వార్టర్ ఫైనల్లో సబలెంకా 6–1, 6–4తో కిన్వెన్ జెంగ్ (చైనా)పై గెలిచింది. తొమ్మిదో సీడ్, ఈ ఏడాది వింబుల్డన్ చాంపియన్ మర్కెటా వొండ్రుసోవా (చెక్ రిపబ్లిక్), 17వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా) మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ విజేతతో సెమీఫైనల్లో సబలెంకా తలపడుతుంది. మరో క్వార్టర్ ఫైనల్లో పదో సీడ్ కరోలినా ముకోవా (చెక్ రిపబ్లిక్) 6–0, 6–3తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై గెలిచి తొలిసారి యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్కు చేరింది. ఐదో అన్సీడెడ్ ప్లేయర్గా... మరో క్వార్టర్ ఫైనల్లో 20 ఏళ్ల అన్సీడెడ్ అమెరికా ప్లేయర్ బెన్ షెల్టన్ 3 గంటల 7 నిమిషాల్లో 6–2, 3–6, 7–6 (9/7), 6–2తో అమెరికాకే చెందిన పదో సీడ్ ఫ్రాన్సెస్ టియాఫోను ఓడించి కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్స్లామ్ టోర్నీలో సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. గత 23 ఏళ్లలో ఈ టోర్నీలో సెమీఫైనల్ చేరిన ఐదో అన్సీడెడ్ ప్లేయర్గా షెల్టన్ గుర్తింపు పొందాడు. ఈ జాబితాలో టాడ్ మార్టిన్ (అమెరికా; 2000లో), రాబీ జినెప్రి (అమెరికా; 2005లో), మిఖాయిల్ యూజ్నీ (రష్యా; 2006లో), దిమిత్రోవ్ (బల్గేరియా; 2019లో) ఉన్నారు. సెమీఫైనల్లో జొకోవిచ్పై షెల్టన్ గెలిస్తే 1996లో మార్క్ ఫిలిప్పోసిస్ (ఆ్రస్టేలియా) తర్వాత యూఎస్ ఓపెన్లో ఫైనల్ చేరిన తొలి అన్సీడెడ్ ప్లేయర్గా ఘనత సాధిస్తాడు. -
సెమీఫైనల్లో శ్రీకాంత్
పుణే: జాతీయ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ పురుషుల సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ సెమీస్లోకి అడుగు పెట్టాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో రెండో సీడ్ శ్రీకాంత్ 21–10, 18–21, 21–16 స్కోరుతో కార్తికేయ కుమార్పై విజయం సాధించాడు. ఇతర పురుషుల సింగిల్స్లో ప్రియాన్షు రజావత్, హర్షీల్ దాని, మిథున్ మంజునాథ్ కూడా సెమీఫైనల్కు చేరుకున్నారు. మహిళల డబుల్స్లో టాప్ సీడ్ గాయత్రి గోపీచంద్ – ట్రెసా జాలీ జంట సెమీస్లోకి అడుగు పెట్టింది. క్వార్టర్స్లో గాయత్రి–ట్రెసా 21–16, 21–12 తేడాతో తనీషా క్రాస్టో–అశ్విని పొన్నప్పపై విజయం సాధించారు. మహిళల సింగిల్స్లో ఆకర్షి కశ్యప్, అస్మిత చలీహ సెమీస్ చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్లో హేమనాగేంద్ర–కనికా కన్వాల్ జోడి సెమీస్ చేరుకుంది. ఇషాన్ భట్నాగర్ –తనీషా క్రాస్టో జంట వీరికి వాకోవర్ ఇచ్చింది. -
హర్మన్, జెమీమా పోరాటం వృథా.. సెమీస్లో టీమిండియా ఓటమి
2017 వన్డే వరల్డ్కప్ ఫైనల్... 2018 టి20 వరల్డ్కప్ సెమీఫైనల్... 2020 టి20 వరల్డ్కప్ ఫైనల్... 2022 కామన్వెల్త్ గేమ్స్ ఫైనల్... గత కొన్నేళ్లుగా భారత మహిళల క్రికెట్ జట్టుకు వేదన మిగుల్చుతున్న నాకౌట్ మ్యాచ్ల పరాజయాల జాబితాలో మరొకటి చేరింది. ఐదుసార్లు చాంపియన్ ఆస్ట్రేలియాతో పోరులో చివరి వరకు పోరాడినా మన జట్టుకు ఓటమి తప్పలేదు. తాజా టి20 వరల్డ్కప్లో మన జట్టు ప్రస్థానం సెమీస్కే పరిమితమైంది. రెండు మెరుపు బ్యాటింగ్ ప్రదర్శనలు గెలుపు ఆశలు రేపినా... గెలుపు గీత దాటలేక జట్టు నిరాశగా నిష్క్రమించింది. కేప్టౌన్: మహిళల టి20 ప్రపంచకప్లో భారత జట్టు ఆట ముగిసింది. గత టోర్నీ రన్నరప్ అయిన భారత్ ఈసారి సెమీఫైనల్లో ఆసీస్కే తలవంచింది. గురువారం ఆసక్తికరంగా జరిగిన మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా 5 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. బెత్ మూనీ (37 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్), మెగ్ లానింగ్ (34 బంతుల్లో 49 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్స్లు), ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ యాష్లీ గార్డ్నర్ (18 బంతుల్లో 31; 5 ఫోర్లు) ఆసీస్ స్కోరులో కీలకపాత్ర పోషించారు. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 167 పరుగులే చేయగలిగింది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (34 బంతుల్లో 52; 6 ఫోర్లు, 1 సిక్స్), జెమీమా రోడ్రిగ్స్ (24 బంతుల్లో 43; 6 ఫోర్లు) మినహా మిగతా వారంతా విఫలమయ్యారు. ఆసీస్కు ఇది ఏడో ఫైనల్ కాగా, నేడు ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే రెండో సెమీస్ విజేతతో ఆదివారం తుది పోరులో ఆస్ట్రేలియా జట్టు తలపడుతుంది. లానింగ్ జోరు... ఆ్రస్టేలియాకు ఓపెనర్లు అలీసా హీలీ (26 బంతుల్లో 25; 3 ఫోర్లు), మూనీ శుభారంభం అందించారు. రేణుక వేసిన తొలి బంతినే హీలీ ఫోర్గా మలచడంతో ఆసీస్ ఇన్నింగ్స్ ప్రారంభమైంది. తొలి వికెట్కు 52 పరుగులు (45 బంతుల్లో) జోడించిన అనంతరం రాధా యాదవ్ బౌలింగ్లో హీలీ స్టంపౌట్ అయింది. అనంతరం మూనీ, లానింగ్ కలిసి జట్టును నడిపించారు. భారత ఫీల్డర్లు వదిలేసిన రెండు క్యాచ్లు కూడా వీరికి కలిసొచ్చాయి. సగం ఇన్నింగ్స్ ముగిసేసరికి ఆసీస్ 69 పరుగులకు చేరింది. అయితే ఆ తర్వాత ఆ్రస్టేలియా జోరు పెంచింది. శిఖా ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన మూనీ అదే ఓవర్లో వెనుదిరిగినా... స్నేహ్ రాణా ఓవర్లో లానింగ్, రాధ ఓవర్లో గార్డ్నర్ రెండేసి ఫోర్లు కొట్టారు. చివర్లో ఐదు బంతుల వ్యవధిలో భారత్ 2 కీలక వికెట్లు తీసినా... రేణుక వేసిన ఆఖరి ఓవర్లో 2 సిక్స్లు, 1 ఫోర్తో 20 పరుగులు రాబట్టి లానింగ్ ఘనంగా ముగించింది. చివరి 10 ఓవర్లలో ఆస్ట్రేలియా 103 పరుగులు సాధించగా... ఇందులో ఆఖరి 5 ఓవర్లలో వచి్చన 59 పరుగులు ఉన్నాయి. కీలక భాగస్వామ్యం... భారీ ఛేదనలో భారత్ ఆరంభంలోనే తడబడింది. 4 ఓవర్లు ముగిసేలోపే 28 పరుగులకు టాప్–3 బ్యాటర్లు షఫాలీ (9), స్మృతి మంధాన (2), యస్తిక భాటియా (4) పెవిలియన్ చేరారు. ఈ దశలో జెమీమా, హర్మన్ భాగస్వామ్యం గెలుపుపై ఆశలు రేపింది. వీరిద్దరు ఒకరితో మరొకరు పోటీ పడి ధాటిగా ఆడారు. వీరి దూకుడుకు ఆసీస్ బౌలర్లు కొద్దిసేపు అచేతనంగా మారిపోయారు. అయితే ఇదే జోరులో మరో భారీ షాట్కు ప్రయత్నించి జెమీమా వెనుదిరిగింది. నాలుగో వికెట్కు వీరిద్దరు 41 బంతుల్లోనే 69 పరుగులు జోడించారు. మరోవైపు హర్మన్ మాత్రం తగ్గకుండా చక్కటి షాట్లతో దూసుకుపోయింది. 36, 37 పరుగుల వద్ద కీపర్ హీలీ తన క్యాచ్లు వదిలేయడంతో బతికిపోయిన హర్మన్ 32 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకుంది. అయితే కీలక దశలో హర్మన్ రనౌట్ కావడం భారత్ అవకాశాలను దెబ్బ తీసింది. చివర్లో రిచా (14), దీప్తి శర్మ (17 బంతుల్లో 20 నాటౌట్; 2 ఫోర్లు) పోరాడినా విజయానికి అది సరిపోలేదు. హర్మన్ రనౌట్తో... మ్యాచ్కు కొద్దిసేపు క్రితం వరకు కూడా జ్వరం కారణంగా ఆడలేని స్థితిలో ఉన్న కెప్టెన్ హర్మన్ పట్టుదలగా బరిలోకి దిగింది. మెరుపు బ్యాటింగ్తో విజయానికి చేరువగా తెచ్చిం ది. విజయం కోసం 33 బంతుల్లో 41 పరుగులు కావాలి. ఈ దశలో రెండో పరుగుకు ప్రయత్నిస్తూ క్రీజ్లో చేరే సమయంలో బ్యాట్ పిచ్లో ఇరుక్కుపోవడంతో హర్మన్ దురదృష్టవశాత్తూ రనౌట్గా వెనుదిరిగింది. దాంతో ఆట ఆసీస్ వైపు మొగ్గింది. ఆ క్యాచ్లు పట్టి ఉంటే... ఫీల్డింగ్లో వదిలేసిన రెండు క్యాచ్లు భారత్ను నష్టపరిచాయి. లానింగ్ 1 వద్ద ఇచ్చిన క్యాచ్ను కీపర్ రిచా, 32 వద్ద మూనీ క్యాచ్ను షఫాలీ వర్మ వదిలేశారు. వీటి నష్టం ఏకంగా 70 పరుగులు! వీటిని పట్టి ఉంటే పరిస్థితి భిన్నంగా ఉండేదేమో. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: అలీసా హీలీ (స్టంప్డ్) రిచా (బి) రాధ 25; మూనీ (సి) షఫాలీ (బి) శిఖా 54; లానింగ్ (నాటౌట్) 49; గార్డ్నర్ (బి) దీప్తి 31; హారిస్ (బి) శిఖా 7; ఎలీస్ పెర్రీ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–52, 2–88, 3–141, 4–148. బౌలింగ్: రేణుకా సింగ్ 4–0–41–0, దీప్తి శర్మ 4–0–30–1, శిఖా పాండే 4–0–32–2, రాధ యాదవ్ 4–0–35–1, స్నేహ్ రాణా 4–0–33–0. భారత్ ఇన్నింగ్స్: షఫాలీ (ఎల్బీ) (బి) షుట్ 9; స్మృతి (ఎల్బీ) (బి) గార్డ్నర్ 2; యస్తిక (రనౌట్) 4; జెమీమా (సి) హీలీ (బి) బ్రౌన్ 43; హర్మన్ప్రీత్ (రనౌట్) 52; రిచా (సి) తాలియా (బి) బ్రౌన్ 14; దీప్తి (నాటౌట్) 20; స్నేహ్ రాణా (బి) జొనాసెన్ 11; రాధ (సి) పెర్రీ (బి) గార్డ్నర్ 0; శిఖా (నాటౌట్) 1; ఎక్స్ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 167. వికెట్ల పతనం: 1–11, 2– 15, 3–28, 4–97, 5–133, 6–135, 7–157, 8– 162. బౌలింగ్: యాష్లీ గార్డ్నర్ 4–0–37–2, షుట్ 4–0–34–1, డార్సీ బ్రౌన్ 4–0–18–2, ఎలీస్ పెర్రీ 1–0–14–0, జొనాసెన్ 3–0–22–1, వేర్హామ్ 3–0–29–0, తాలియా మెక్గ్రాత్ 1–0–13–0. -
జ్వెరెవ్ జోరు
న్యూయార్క్: ‘బిగ్ త్రీ’ నీడలో ఇన్నాళ్లూ గ్రాండ్స్లామ్ టైటిల్ వేటలో వెనుకబడిపోయిన జర్మనీ యువతార అలెగ్జాండర్ జ్వెరెవ్ అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా మరో అడుగు వేశాడు. యూఎస్ ఓపెన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్లో 23 ఏళ్ల జ్వెరెవ్ తొలిసారి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. 27వ సీడ్ బొర్నా చోరిచ్ (క్రొయేషియా)తో జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో జ్వెరెవ్ 1–6, 7–6 (7/5), 7–6 (7/1), 6–3తో గెలుపొందాడు. 1995లో బోరిస్ బెకర్ తర్వాత యూఎస్ ఓపెన్లో సెమీఫైనల్ చేరిన తొలి జర్మనీ ప్లేయర్గా జ్వెరెవ్ నిలిచాడు. జూనియర్స్థాయి నుంచి తన ప్రత్యర్థిగా ఉన్న చోరిచ్తో 3 గంటల 25 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో జ్వెరెవ్ తొలి సెట్లో తేలిపోయాడు. మూడు డబుల్ ఫాల్ట్లు, 12 అనవసర తప్పిదాలు చేయడంతోపాటు తన సర్వీస్ను రెండుసార్లు కోల్పోయి సెట్ను చేజార్చుకున్నాడు. అయితే రెండో సెట్ నుంచి జ్వెరెవ్ గాడిలో పడ్డాడు. ఈ సెట్లో ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్లను కోల్పోయారు. చివరకు టైబ్రేక్లో జ్వెరెవ్ పైచేయి సాధించాడు. మూడో సెట్లోనూ ఇద్దరూ ఒక్కోసారి తమ సర్వీస్లను కోల్పోయారు. చివరకు టైబ్రేక్లోనే ఫలితం వచ్చింది. ఈసారీ జ్వెరెవ్ ఆధిక్యం కనబరిచాడు. టైబ్రేక్లో రెండు సెట్లను కోల్పోయిన చోరిచ్ నాలుగో సెట్లో తడబడ్డాడు. ఎనిమిదో గేమ్లో చోరిచ్ సర్వీస్ను బ్రేక్ చేసి 5–3తో ఆధిక్యంలోకి వెళ్లిన జ్వెరెవ్ ఆ తర్వాత తొమ్మిదో గేమ్లో తన సర్వీస్ను నిలబెట్టుకొని 6–3తో సెట్తోపాటు మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. కెరీర్లో 20 గ్రాండ్స్లామ్ టోర్నీలు ఆడిన జ్వెరెవ్ కేవలం రెండోసారి మాత్రమే సెమీఫైనల్ దశకు అర్హత సాధించాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్లో తొలిసారి అతను సెమీస్ చేరి డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో ఓడిపోయాడు. యూఎస్ ఓపెన్ ఫైనల్లో చోటు కోసం సెమీఫైనల్లో 20వ సీడ్ పాబ్లో కరెనో బుస్టా (స్పెయిన్)తో జ్వెరెవ్ ఆడతాడు. బుస్టా పోరాటం... ప్రిక్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్వన్ జొకోవిచ్ (సెర్బియా)తో తొలి సెట్లో 6–5తో ఆధిక్యంలో ఉన్న దశలో జొకోవిచ్ కోపంలో బంతిని వెనక్కి కొట్టడం... అదికాస్తా లైన్ జడ్జికి తగలడంతో... నిర్వాహకులు జొకోవిచ్పై అనర్హత వేటు వేశారు. దాంతో పూర్తిస్థాయి మ్యాచ్ ఆడకుండానే కరెనో బుస్టా క్వార్టర్ ఫైనల్ బెర్త్ దక్కించుకున్నాడు. అయితే క్వార్టర్ ఫైనల్లో కరెనో బుస్టాకు 12వ సీడ్ డెనిస్ షపోవలోవ్ (కెనడా) నుంచి గట్టిపోటీ ఎదురైంది. 4 గంటల 8 నిమిషాలపాటు జరిగిన క్వార్టర్ ఫైనల్లో కరెనో బుస్టా 3–6, 7–6 (7/5), 7–6 (7/0), 0–6, 6–3తో గెలుపొంది సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. ఒసాకా అలవోకగా... కెరీర్లో మూడో గ్రాండ్స్లామ్ టైటిల్పై గురి పెట్టిన జపాన్ క్రీడాకారిణి నయోమి ఒసాకా సెమీఫైనల్ చేరింది. మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో నాలుగో సీడ్ ఒసాకా 6–3, 6–4తో షెల్బీ రోజర్స్ (అమెరికా)పై గెలిచి సెమీఫైనల్లో 28వ సీడ్ జెన్నిఫర్ బ్రేడీ (అమెరికా)తో పోరాటానికి సిద్ధమైంది. షెల్బీ రోజర్స్తో 80 నిమిషాలపాటు జరిగిన మ్యాచ్లో ఒసాకా ఏడు ఏస్లు సంధించి, మూడు బ్రేక్ పాయింట్లు సాధించింది. సెమీస్లో సెరెనా అమెరికా స్టార్ సెరెనా వరుసగా 11వ సారి యూఎస్ ఓపెన్లో సెమీస్ చేరింది. బుధవారం రాత్రి జరిగిన క్వార్టర్స్లో మూడో సీడ్ సెరెనా 4–6, 6–3, 6–2తో స్వెతానా పిరన్కోవా (బల్గేరియా)పై గెలిచింది. తొలి సెట్ను కోల్పోయిన సెరెనా వెంటనే కోలుకుంది. రెండో సెట్లోని ఎనిమిదో గేమ్లో పిరన్కోవా సర్వీస్ను బ్రేక్ చేసి ఆ తర్వాత తన సర్వీస్ను నిలబెట్టుకొని 6–3తో సెట్ను దక్కించుకుంది. నిర్ణాయక మూడో సెట్లోని తొలి గేమ్లో, ఏడో గేమ్లో పిరన్కోవా సర్వీస్లను బ్రేక్ చేసిన సెరెనా ఆ తర్వాత తన సర్వీస్లను కాపాడుకొని విజయాన్ని ఖాయం చేసుకుంది. -
ఓటమి అంచుల నుంచి...
మనీలా (ఫిలిప్పీన్స్): ఆసియా టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత పురుషుల జట్టు అద్భుతం చేసింది. ఓటమి అంచుల నుంచి తేరుకొని విజయబావుటా ఎగురువేసింది. సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో భారత్ 3–2తో థాయ్లాండ్ను ఓడించింది. తొలి సింగిల్స్లో సాయిప్రణీత్ 14–21, 21–14, 12–21తో కాంతాపోన్ వాంగ్చరోయిన్ చేతిలో... రెండో సింగిల్స్లో కిడాంబి శ్రీకాంత్ 20–22, 14–21తో కున్లావుత్ వితిద్సర్న్ చేతిలో ఓడిపోయారు. దాంతో భారత్ 0–2తో వెనుకబడి ఓటమి అంచుల్లో నిలిచింది. అయితే మూడో మ్యాచ్గా జరిగిన డబుల్స్లో ధ్రువ్ కపిల–ఎం.ఆర్.అర్జున్ జంట 21–18, 22–20తో కెద్రిన్–విరియంగ్కురా (థాయ్లాండ్) జోడీని ఓడించింది. నాలుగో మ్యాచ్గా జరిగిన సింగిల్స్లో లక్ష్య సేన్ 21–19, 21–18తో సుపన్యు అవింగ్సనోన్ (థాయ్లాండ్)పై గెలిచాడు. దాంతో స్కోరు 2–2తో సమమైంది. నిర్ణాయక ఐదో మ్యాచ్లో చిరాగ్ శెట్టి–కిడాంబి శ్రీకాంత్ జంట 21–15, 16–21, 21–15తో జోంగ్జిత్–నిపిత్పోన్ (థాయ్లాండ్) జోడీని ఓడించి భారత్కు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. నేడు జరిగే సెమీఫైనల్లో ఇండోనేసియాతో భారత్ ఆడుతుంది. 2016 చాంపియన్షిప్లోనూ భారత్ సెమీస్లో ఇండోనేసియా చేతిలో ఓడి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. -
సెమీస్లో శ్రీకాంత్
హాంకాంగ్: అదృష్టం కలిసి వస్తుండటంతో... హాంకాంగ్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత షట్లర్ కిడాంబి శ్రీకాంత్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్ రియో ఒలింపిక్స్ చాంపియన్, ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ లాంగ్ (చైనా)పై విజయం సాధించాడు. తొలి గేమ్ను శ్రీకాంత్ 21–13తో గెలిచిన తర్వాత... గాయం కారణంగా చెన్ లాంగ్ మ్యాచ్ నుంచి వైదొలిగాడు. ఓవరాల్గా చెన్ లాంగ్పై శ్రీకాంత్కిది రెండో విజయం. గతంలో ఆరుసార్లు చెన్ లాంగ్ చేతిలో శ్రీకాంత్ ఓడిపోయాడు. ఈ ఏడాది మార్చిలో ఇండియా ఓపెన్ టోర్నీలో సెమీస్ చేరిన తర్వాత శ్రీకాంత్ మరో టోర్నీలో క్వార్టర్ ఫైనల్ దశను అధిగమించడం ఇదే తొలిసారి. నేడు జరిగే సెమీఫైనల్లో లీ చెయుక్ యియు (హాంకాంగ్)తో ఆడతాడు. ముఖాముఖి రికార్డులో శ్రీకాంత్ 1–0తో ఆధిక్యంలో ఉన్నాడు. మరో క్వార్టర్ ఫైనల్లో లీ చెయుక్ యియు 21–14, 21–19తో ప్రపంచ మాజీ చాంపియన్ విక్టర్ అక్సెల్సన్ (డెన్మార్క్)పై సంచలన విజయం సాధించాడు. ఈ టోర్నీ తొలి రౌండ్లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ కెంటో మొమోటా (జపాన్)తో శ్రీకాంత్ తలపడాల్సింది. అయితే మొమోటా టోర్నీ నుంచి వైదొలగడంతో శ్రీకాంత్కు తొలి రౌండ్లో వాకోవర్ లభించింది. మొమోటా చేతిలో శ్రీకాంత్ ఇప్పటివరకు 12 సార్లు ఓడిపోయి, మూడుసార్లు గెలిచాడు. శ్రీకాంత్ చివరిసారి మొమోటాపై 2015లో గెలుపొందడం గమనార్హం.
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
తప్పక చదవండి
- జనసేన నాయకుడి దౌర్జన్యం
- బైక్పైనే ముద్దుముచ్చట
- ఈ విమానం ఇంకోసారి ఎక్కితే.. ఎయిరిండిపై ప్రయాణికుడు ఆగ్రహం
- Warangal Murder: కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు
- బాలాజీ నాయుడు టార్గెట్ రాజకీయ ప్రముఖులే...
- నా భార్య హింసిస్తోంది.. రక్షణ కల్పించండి
- కొండెక్కిన చికెన్ ధర
- ఇక్కడ నాపై బ్యాన్ విధిస్తామని బెదిరిస్తున్నారు: పాయల్ రాజ్పుత్
- Telangana: ప్రారంభమైన టెట్ పరీక్ష
- గాల్లో తేలిపోతూ..కార్లో ఎగిరిపోతూ..
Advertisement