No Headline
సాక్షి, చైన్నె: చైన్నె వంటి నగరాలతో పాటు అర్బన్ ప్రాంతాల్లో ప్రభుత్వ బడుల వైపు కన్నా, ప్రైవేటు వైపు మొగ్గు చూపే తల్లిదండ్రులే అధికం. ముఖ్యంగా కార్పొరేట్ స్కూళ్ల ముందు అడ్మిషన్ల కోసం పడిగాపులు కాసే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇక కార్పొరేషన్ బడులు అంటే చెట్ల కింద తరగతులు, పెచ్చులు ఉడిన గోడలు, అక్కడక్కడ విరిగిన రేకులు , అపరిశుభ్ర వాతావరణం...ఇలా అనేక విమర్శలు గుప్పించే వాళ్లూ ఉన్నారు. ఇలాంటి విమర్శలకు చెక్ పెట్టే విధంగా ఇటీవల ప్రభుత్వ బడులపై పాలకులు ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. కొన్ని ప్రాంతాలలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యం సహకారంతో ఆయా పాఠశాలలలోని కొన్ని తరగతులను స్మార్ట్గా మారుస్తున్నారు. అలాగే, పరిసరాలను పచ్చదనంతో నింపేపనులు శరవేగంగా చేపడుతున్నారు.
చైన్నె తరహాలో..
చైన్నె కార్పొరేషన్ పరిధిలో 119 ప్రాథమిక, 92 మాధ్యమిక, 38 ఉన్నత, 32 మహోనత్న పాఠశాలు ఉన్నాయి. ఈ బడులలో 3.5 లక్షల మంది చదువుకునేందుకు అవకాశం ఉంది. ప్రైవేటుకు దీటుగా కార్పొరేషన్ బడులను తీర్చిదిద్దేందుకు చైన్నె కార్పొరేషన్ వర్గాలు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేస్తున్నాయి. పాఠశాల పరిసరాల సుందరీకరణ, తరగతి గదులు స్మార్ట్గానే కాకుండా ఇంటర్నెట్ సేవలు, తరగతి గదులలో ప్రత్యేక పెయింటింగ్స్, విద్యార్థులు కూర్చునేందుకు ప్రత్యేక చైర్స్ వంటివి చైన్నెలో ఏర్పాటు చేస్తున్నారు. కార్పొరేషన్ యంత్రాంగం చేపట్టిన పనులతో విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇదే తరహాలో రాష్ట్రవ్యాప్తంగా బడులను స్మార్ట్స్గా మార్చేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. డిజిటల్ యుగంలో విద్యార్థులు ఆన్లైన్ ద్వారా అన్ని రకాల సేవలను పొందుతున్న ఈ తరుణంలో అన్ని పాఠశాలలో ఆధునిక అంశాలకు అనుగుణంగా విద్యా బోధనకు సిద్ధమయ్యారు. అన్ని బడులను స్మార్ట్గా తీర్చిదిద్దేందుకు నిర్ణయించారు. ఇందులో భాగంగా అన్ని బడులలో 100 మెగా బైట్స్ వేగం కలిగిన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు బీఎస్ఎన్ఎల్తో కలిసి పాలకులు ముందుకు సాగనున్నారు.
అన్ని బడులలో సూపర్ ఫాస్ట్ ఇంటర్నెట్..
అన్ని బడులనూ స్మార్ట్గా తీర్చిదిద్దడమే కాకుండా, డిజిటల్ యుగానికి తగ్గట్టుగా విద్యార్థులకు అన్ని రకాల విద్యా బోధనలు ఇంటర్నెట్ ద్వారా అందించేందుకు సిద్ధమయ్యారు. కీలక అంశాలు, ముఖ్యమైన పాఠ్యాంశాలను స్మార్ట్ బోర్డుల ద్వారా ఆన్లైన్ సేవలతో సవివరంగా విద్యార్థులకు తెలియజేయాలని నిర్ణయించారు. ఈనెలాఖరులోపు ఇంటర్నెట్ పనులను ముగించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బీఎస్ఎన్ఎల్ ద్వారా 19,668 బడులలో కొత్తగా ఇంటర్నెట్ సేవలు కల్పించడం, మిగిలిన పాఠశాలలో వేగాన్ని పెంచేందుకు సిద్ధమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉన్నత, మహోన్నత పాఠశాలలు 6,223 ఉన్నాయి. ఇందులో 5,907 బడులలో ఇంటర్నెట్ సేవలు ఉన్నాయి. 6,992 మాధ్యమిక పాఠశాలలో 3,267, అలాగే 24,338 ప్రాథమిక పాఠశాలలో 8,711 బడులలో ఇంటర్నెట్ సౌకర్యంతో స్మార్ట్ తరగతులు నిర్వహిస్తున్నారు. అయితే, ఈ సేవల స్పీడ్ మరీ తక్కువగా ఉండటంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఈ బడులలో 100 మెగా బైట్స్ స్పీడ్తో కూడిన ఇంటర్నెట్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు చేపట్టారు. మిగిలిన 19,668 బడులలో కొత్తగా ఇంటర్నెట్ సేవలు, స్మార్ట్ ఏర్పాట్లను వేగవంతం చేసే విధంగా బుధవారం విద్యా శాఖ ఉత్తర్వులను జారీ చేసింది. విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు చైన్నెలోని స్మార్ట్ బడి