-
ఈసీ సీరియస్..కలెక్టర్, ఎస్పీలపై సస్పెన్షన్ వేటు
-
టీడీపీపై ఈసీ సీరియస్..
-
బాబుకు సుప్రీం కోర్ట్ సీరియస్ వార్నింగ్
-
షర్మిల చీప్ పాలిటిక్స్..మహిళా నేతలు ఆగ్రహం
-
పెన్షనర్ల కష్టాలు...ఈ పాపం చంద్రబాబుదే
-
గీతాంజలి ఘటనపై..విజయసాయి రెడ్డి సీరియస్
-
యువత కబుర్లు కాస్త సీరియస్ విషయాలుగా మారితే...!
కబుర్లు అంటే... ఏ సినిమా చూశావు? ఓటీటీలో ఆ షో నచ్చిందా? ఆ గాసిప్ గురించి విన్నావా? ఇన్స్టాగ్రామ్లో నా లేటెస్ట్ ఇమేజ్లు చూశావా?... ఇలాంటి కబుర్లేనా? యువతరం తాజా ధోరణి ‘కానే కాదు’ అంటుంది. ‘స్మాల్ టాక్’ కంటే.. ‘బిగ్ టాక్’కు ప్రాధాన్యత ఇస్తోంది. యువతరంలో నలుగురు ఒక దగ్గర కూడితే ఏం జరుగుతుంది? సరదా సరదా మాటలు, జోక్స్, సినిమా కబుర్లు, సోషల్ మీడియా సంగతులూ వినిపిస్తాయి. అయితే యువతరంలో కాలక్షేపం కబుర్లు కాకుండా కాస్త సీరియస్ విషయాల గురించి చర్చించే ధోరణి పెరుగుతోంది. ఈ సరికొత్త ధోరణిని ‘బిగ్ టాక్’ ట్రెండ్ అంటున్నారు. ‘బిగ్ టాక్’ అనేది ‘టాప్ ట్రెండ్స్ ఫర్ 2024’ ఒకటిగా నిలిచించి. ఇది‘స్మాల్ టాక్’కు అపోజిట్ ట్రెండ్. ‘స్మాల్ టాక్’ అంటే కాలక్షేపం కబుర్లలాంటివి. ‘బిగ్ టాక్ ట్రెండ్ గురించి విన్నప్పుడు ఆసక్తిగా అనిపించింది. డిగ్రీ ఫ్రెండ్స్లో కొందరం వారానికి ఒకసారి కలుసుకొని కబుర్లు చెప్పుకుంటాం. ఎప్పుడూ కాలక్షేప కబుర్లేనా? సీరియస్ టాపిక్స్పై కూడా మాట్లాడుకుందాం అనే ప్రపోజ్కు వెంటనే కాకపోయినా కాస్త లేటుగా అయినా ఫ్రెండ్స్ ఒకే అన్నారు. అయితే బిగ్ టాక్ అనేది అంత తేలిక కాదు. ఎప్పుడూ సరదాగా మాట్లాడే ఫ్రెండ్స్తో ఉన్నట్టుండి పర్యావరణ విషయాలు, రాజకీయ పరిణామాలు... మొదలైన విషయాల గురించి మాట్లాడడం అంతా ఈజీ కాదు. వినే వాళ్లు లెక్చర్ విన్నట్లుగా ఫీలవుతారు. ఎన్ని అడ్డంకులు ఉన్నా ఒకసారి ట్రై చేసి చూద్దాం అని మొదలు పెట్టాం. వారం వారం ఒక్కొక్కరు ఒక్కో టాపిక్పై మాట్లాడాలనికి నిర్ణయించుకున్నాం’ అంటుంది ముంబైకి చెందిన ప్రణతి. ఇక యువ ఉద్యోగుల విషయానికి వస్తే...‘బిక్ టాక్’లో భాగంగా ప్రొఫెషనల్గా, పర్సనల్గా ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల గురించి మాట్లాడుకుంటున్నారు. ‘నా కొలీగ్ చిన్న విషయాలకు భయపడుతుంటాడు. ఏఐ టెక్నాలజి వల్ల మన ఉద్యోగాలు ఉండవేమో అన్నట్లుగా మాట్లాడేవాడు. దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం బిగ్ టాక్లో కూర్చుందాం అన్నాను. అతడికి ఏమీ అర్థం కాలేదు. ఒక ఆదివారం కేఫ్ కాఫీ కార్నర్లో బిగ్ టాక్ కోసం కూర్చున్నాం’ అంటున్నాడు నాగ్పూర్కు చెందిన నిఖిల్ మిత్ర. బిగ్ టాక్లో భాగంగా.. జాబ్ మార్కెట్పై ఏఐ చూపించే ప్రభావం? ప్రపంచవ్యాప్తంగా ఫుల్–టైమ్ జాబ్స్పై ‘చాట్జీపీటి’లాంటి జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ చూపించే ప్రభావం, మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ వర్కర్స్ ఎలాంటి అడ్జెస్ట్మెంట్స్కు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది, సీనియర్లతో పోల్చితే జెన్ జెడ్ ఏఐ గురించి ఎందుకు ఎక్కువగా భయపడుతున్నారు? ఏఐని ఫేస్ చేయడానికి ఎలా సన్నద్ధం కావాలి?... మొదలైన ఎన్నో టాపిక్లపై కొలీగ్తో మాట్లాడాడు నిఖిల్ మిత్ర. మిత్రుడిలోని అకారణ భయాలను దూరం చేయడంలో సక్సెస్ అయ్యాడు. ‘బిగ్ టాక్’ అయినంత మాత్రాన సమావేశం మొత్తం ముఖం సీరియస్గా పెట్టుకొని, అత్యంత గంభీరంగా మాట్లాడాలని కాదు. కాలహరణ కబుర్లకు తక్కువ ప్రాముఖ్యం ఇచ్చి, మనకు ఉపయోగపడే విషయాలకు ప్రాధాన్యత ఇవ్వడమే ‘బిగ్ టాక్’ ట్రెండ్ సారాశం. పారదర్శక సంభాషణ స్నేహానికి సంభాషణే ప్రధాన ద్వారం. యంగ్ ప్రొఫెషనల్స్కు కొలీగ్స్తో ఉండే స్నేహం ఆఫీస్ టైమింగ్స్ వరకు మాత్రమే పరిమితమా? గత జెనరేషన్ ఉద్యోగులలో చాలామంది పాటించిన సెల్ఫ్–సెన్సర్ విధానం వీరిలోనూ ఉందా? అనే ప్రశ్నలకు ‘లేదు’ అనే సమాధానం వినిపిస్తుంది. ముఖ్యమైనవి అనుకునే అంశాలపై మాట్లాడడానికి, తమ అభిప్రాయాన్ని వినిపించడానికి యంగ్ ప్రొఫెషనల్స్లో ఎలాంటి సంకోచాలు లేవు. ఎడోబ్ సర్వే ప్రకారం సెన్సిటివ్ టాపిక్స్ గురించి కొలీగ్స్తో మాట్లాడటాన్ని సౌకర్యంగా ఫీలవుతున్నారు. ఇవి చదవండి: పర్పుల్ కలర్ ఎందుకు? -
పవన్ కళ్యాణ్ తీరుపై రగిలిపోతున్న కాపులు
-
జస్టిస్ రాకేష్ పై సుప్రీం సీరియస్
-
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల వ్యాఖ్యలపై గవర్నర్ తమిళిసై సీరియస్
-
రేవంత్ రెడ్డిపై ఎన్నికల కమిషన్ సీరియస్
-
ఢిల్లీలో వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్
-
రోజు రోజుకు దిగజారుతోంది..పట్టించుకోరా: బాంబే హైకోర్టు సీరియస్
ముంబై: నగరంలోని గాలి నాణ్యత సూచిక (ఏక్యూఐ) క్షీణించడంపై బాంబే హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అంశంపై ప్రధాన న్యాయమూర్తి డికె ఉపాధ్యాయ, జస్టిస్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన డివిజన్ బెంచ్ కేంద్ర, మహారాష్ట్ర ప్రభుత్వాలు, బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్, మహారాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఎంపీసీబీ), సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)ల వివరణ కోరింది. ముంబైలో వాయు కాలుష్యం పెరిపోవడంపై నగరవాసులు ముగ్గురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం పై బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.కె.ఉపాధ్యాయ, జస్టిర్ ఆరిఫ్ డాక్టర్లతో కూడిన బెంచ్ ఈ అంశంపై విచారించింది. ‘‘నగరంలో గాలి నాణ్యత రోజురోజుకూ క్షీణిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టాల ప్రకారం ఎలాంటి చర్యలు తీసుకున్నారో సంబంధిత అధికారులందరూ తెలియ జేయాలి’’ అని కోర్టు ఆదేశించింది తదుపరి విచారణను నవంబర్ ఆరవ తేదీకి వాయిదా వేసింది. నగరంలో కాలుష్యాన్ని అరికట్టడానికి, గాలి నాణ్యతను పెంచడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, బృహన్ముంబై పాలక సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్లు – అమర్ బాబాన్ టికే, ఆనంద్ ఝా మరియు సంజయ్ సర్వే – తమ వాజ్యంలో కోరారు. ముంబైలో విచ్చలవిడిగా నిర్మాణ కార్యకలాపాలు, తగినంత పచ్చదనం లేకపోవడం వల్ల వాయు కాలుష్యం పెరుగుతోందని, ఇది నివాసితులపై, పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతోందని వారు పిటిషన్లో ఆందోళన వ్యక్తం చేశారు. -
పండుగ పూట పచ్చి అసత్యాలతో చంద్రబాబు 'నకిలీ' విన్యాసాలు
-
బండారు వ్యాఖ్యలపై మహిళాగ్రహం
-
టీడీపీ నేత బండారుపై సినీ నటి మీనా తీవ్ర ఆగ్రహం
-
జడ్జి హిమ బిందుపై టీడీపీ నేతల పోస్టులు..రాష్ట్రపతి భవన్ సీరియస్
-
D Srinivas: డీఎస్ పరిస్థితి విషమం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్(74) హెల్త్ బులిటెన్ విడుదల అయ్యింది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నాం రిలీజ్ చేసిన హెల్త్ బులిటెన్లో పేర్కొన్నాయి. శ్వాస సంబంధిత సమస్యలతో సోమవారం మధ్యాహ్నాం నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆయన్ని చేర్పించారు. అప్పటి నుంచే ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్యం ఇవాళ మరింత విషమించినట్లు తెలుస్తోంది. ‘‘ఆయన శ్వాస తీస్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. ICU లో ట్రీట్మెంట్ అందిస్తున్నాం. వయసు రీత్యా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తాయి. ఆస్తమా, కిడ్నీల సమస్య, బీపీ పడిపోవడం లాంటి సమస్యలున్నాయి. 48 గంటలు గడిస్తే కానీ హెల్త్ కండిషన్ చెప్పలేం. :::సిటీ న్యూరో వైద్యుడు ప్రవీణ్ నిజామాబాద్ జిల్లా డిచ్ పల్లి, నిజామాబాద్ రూరల్ నుంచి ధర్మపురి శ్రీనివాస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు డి. శ్రీనివాసే పీసీసీ ప్రెసిడెంట్ గా ఉన్నారు. డీఎస్ ఉమ్మడి ఏపీలో రెండుసార్లు మంత్రిగా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్(అప్పటి టీఆర్ఎస్)లో రాజ్యసభ సభ్యుడిగానూ పని చేశారు. ఆయన కొడుకులు ఇద్దరూ రాజకీయాల్లో ఉండగా.. చిన్న కుమారుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ ఎంపీ. అనారోగ్యం కారణంగా డీఎస్ కొంతకాలంగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. -
బాబు..పాపం పండింది
-
తిరుమల ఆలయంపై విమానం సంచారం...తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన టీటీడీ
-
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి అలక
-
అమెరికా తీరుపై చైనా గుర్రు
ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనల నేపథ్యంలో అమెరికా తీరుపై చైనా ఆగస్ట్ 18న ఒక నివేదిక విడుదల చేసింది. బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను బలహీనపరిచే అమెరికా చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థ వల్ల లబ్ధి పొందిన అమెరికా, తన దేశీయ సమస్యలకు (వాణిజ్య లోటు, నిరుద్యోగానికి) ప్రపంచ వాణిజ్యం కారణమంటూ, 2017 నుంచి కొత్త అప్పిలేట్ బాడీ సభ్యుల నియామకాలను నిలిపివేసింది. అయితే, అమెరికాను వేలెత్తి చూపుతున్న చైనా ఇతర దేశాల పట్ల తన చర్యల గురించి సమీక్షించలేదు. ఏమైనా, ప్రపంచ వాణిజ్య సంస్థ, దాని చుట్టూ ముసురుకుంటున్న సమస్యల మీద ఇటువంటి నివేదికను భారత ప్రభుత్వం కూడా రూపొందించి ప్రజలకు నివేదిస్తే బాగుంటుంది. 1990 నుంచి భారత ప్రభుత్వాలు ఆర్థిక సరళీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. 1995లో ప్రపంచ వాణిజ్య సంస్థ ఏర్పాటుతో పాటు రెండు ఒప్పందాల మీద దేశాలు సంతకాలు చేశాయి. అందులో వ్యవసాయం మీద చేసిన ఒప్పందం కీలకమైనది. ఆనాటి నుంచి కూడా భారతదేశం అనేక రంగాలను అంతర్జాతీయ వాణిజ్యంతో ముడిపెడుతూ వస్తు న్నది. దానికి అనుగుణంగా అనేక రంగాలలో విధానాలు మార్పు చేశారు. ఈ మార్పుల వెనుక అమెరికా ఒత్తిడి ఉన్నది. అయితే, ఇటీవలి కాలంలో అనూహ్యంగా, ప్రపంచ వాణిజ్య సంస్థ ప్రాభవం తగ్గుతూ వస్తున్నది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాలకు, చర్చలకు ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే, ప్రపంచ వాణిజ్య సంస్థ తన ప్రయోజనాలకు అనువుగా లేదని అమెరికా భావించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ వాణిజ్య సంస్థ (వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ – డబ్ల్యూటీవో) నిబంధనల ప్రకారం అమెరికా తన బాధ్యతలను నెరవేరుస్తున్న తీరు పైన చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మొన్న ఆగస్ట్ 18 నాడు ఒక నివేదికను విడుదల చేసింది. ఈ 65 పేజీల నివేదికలో దాదాపు 210 డాక్యుమెంట్లను ఉటంకిస్తూ, బహుళపక్ష వాణిజ్య వ్యవస్థను బలహీనపరిచే అమెరికా విధాన చర్యలపై ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఏకపక్ష వాణిజ్య బెదిరింపులను, పారిశ్రామిక విధా నాలలో ద్వంద్వ ప్రమాణాలను, ప్రపంచ పారిశ్రామిక, సరఫరా గొలు సులకు విఘాతం కలిగించే అంశాలను ప్రస్తావించింది. వివాద పరిష్కార సంస్థ తీర్పులు, సిఫార్సులను ఇష్టానుసారం అమలు చేయడం ద్వార డబ్ల్యూటీవో వివాద పరిష్కార యంత్రాంగాన్ని అమెరికా బలహీనపరిచిందని ఈ నివేదిక ఎత్తిచూపింది. 157 వాణిజ్య వివాదాలలో అమెరికా ప్రతివాదిగా ఉందనీ, మొత్తం వాణిజ్య వివాదాలలో ఇది సుమారు 20 శాతం అనీ నివేదిక తెలిపింది. సంస్థాగత సమస్యల కారణంగా 2017 నుంచి కొత్త అప్పీలేట్ బాడీ సభ్యుల నియామకాలను అమెరికా నిలిపివేసిందనీ, ఈ చర్య వల్ల అప్పిలేట్ బాడీ ‘నిరర్థక’ పరిస్థితికి చేరుకున్నదనీ పేర్కొంది.పారిశ్రామిక విధానాలకు సంబంధించి అమెరికా ఇతర సభ్యదేశాల మధ్య వేర్వేరు ప్రమాణాలను వర్తింపజేసిందని నివేదిక తెలిపింది. అధిక సుంకాలు విధించడం లేదా వాణిజ్య–నియంత్రణ చర్యలు తీసుకోవడం, దేశీయ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడానికి భారీ సబ్సిడీలను అందించడం, పారిశ్రామిక మరియు సరఫరా గొలుసు లను విచ్ఛిన్నం చేయడం వంటి వివిధ రక్షణాత్మక పద్ధతులను అమె రికా అవలంబించిందని ఆరోపించింది. డబ్ల్యూటీవో నిర్దేశిస్తున్న వాణిజ్యం వల్ల ప్రధానంగా అమెరికా లబ్ధి పొందింది. అయితే పటిష్టమైన అంతర్గత ప్రయోజన పంపిణీ వ్యవస్థ లేకపోవడం వలన, దేశ ఆదాయం, ఉపాధిని సక్రమంగా నిర్వహించడంలో వైఫల్యం వల్ల అమెరికాలో వివిధ వర్గాల మధ్య అసమానతలు పెరిగిపోయాయని చైనా నివేదిక అంటున్నది. ఒక దేశంగా తక్కువ పొదుపు, అధిక వినియోగం, అధిక రుణం ఉన్న పరిస్థితులలో, అమెరికాలో పొదుపు నిలువలు లేకపోవడం వలన ఆర్థికాభివృద్ధికి కరెంట్ ఖాతా లోటులు, వాణిజ్య లోటులపై ఆధార పడవలసి వస్తున్నది. అమెరికా ప్రభుత్వం తన దేశీయ సామాజిక సమస్యలను (వాణిజ్య లోటు, నిరుద్యోగానికి) ప్రపంచ వాణిజ్యం కారణమంటున్నది. దేశీయ విధాన వైఫల్యాలకు ప్రపంచీకరణను, ప్రపంచ వాణిజ్య సంస్థను కారణాలుగా చూపెడుతున్నది. అమెరికా ద్వంద్వ వైఖరిని చైనా నివేదిక ఎత్తి చూపెడుతున్నది. ఒకప్పుడు ఆ దేశానికి ప్రయోజనకారిగా ఉన్న కారణాలు ఈ రోజు కంటగింపుగా మారినాయి. ఇంకొకవైపు, భారత్, మెక్సికో తది తర దేశాల మీద తన ఉత్పత్తులను రుద్దే ప్రయత్నం చేస్తున్నది. దీనికి ద్వైపాక్షిక, బహుళ పక్ష ఒప్పందాలను ఆయుధంగా వాడుతున్నది.ప్రపంచ వాణిజ్య సంస్థలో వివాద పరిష్కార వేదిక, ఈ వేదిక పనికి ఆమోదించిన పద్ధతి కీలకం. దీని సిఫార్సులు, తీర్పులు వాణిజ్యం సమతుల్యంగా, వివాదరహితంగా కొనసాగడానికి ఉపయో గపడుతున్నాయి. అన్ని తీర్పులు ఆమోదయోగ్యం కాకపోయినా, ఒక ప్రజాస్వామ్య బద్ధ వేదిక ఉండడం ముదావహం. అయితే, 2017 నుంచి అప్పిలేట్ బాడీ నిబంధనల ప్రకారం, సభ్యుల గడువు ముగిసింది. ఖాళీలు ఏర్పడ్డాయి. అనూహ్యంగా, సంస్థాగత సమస్య లను ప్రస్తావిస్తూ అమెరికా కొత్త సభ్యుల నియామకాల ప్రక్రియను నిలిపివేసింది. ప్రపంచ వాణిజ్య సంస్థలో నిర్ణయాలు ఏకాభిప్రాయం ద్వారానే ఉంటాయి. అమెరికా మొండి వైఖరితో కొత్త అప్పీలేట్ బాడీ ఏర్పడక వివాద పరిష్కార యంత్రాంగం పని చేయలేని పరిస్థితికి చేరుకున్నది. కొత్త సభ్యులతో వివాద పరిష్కార సంస్థ (డిస్ప్యూట్ సెటిల్మెంట్ బాడీ) ఏర్పాటుకు ఇతర దేశాల నుంచి వచ్చిన ప్రతిపా దనలను డిసెంబర్ 2022 నాటికి అమెరికా దాదాపు 60 సార్లు తిరస్కరించింది. డబ్ల్యూటీవో సభ్యదేశాలలో భారత్ సహా అత్యధికం దీనిని త్వరగా పునఃప్రారంభించడాన్ని సమర్థిస్తున్నాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ తన సభ్యులు, ఇతరులపై అనుమతి లేని ఏకపక్ష చర్యలు తీసుకోవడాన్ని నిషేధిస్తుంది. కానీ, అమెరికాకు జాతీయ భద్రత, మానవ హక్కులు, బలవంతపు సాంకేతిక బదిలీ పేరుతో ఇతర సభ్యులపై ఏకపక్ష చర్యలు ప్రకటించిన సుదీర్ఘ చరిత్ర దానికి ఉంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో, సాంకేతిక పరిజ్ఞానంలో తనకున్న ఆధిపత్య జ్ఞానాన్ని ఉపయోగించి, తన దౌత్య విధానాలు మరియు చట్టవిరుద్ధమైన డిమాండ్లను ఇతర దేశాలు, ప్రాంతీయ వాణిజ్య సమూహాలు, సంస్థల మీద కూడా రుద్దింది. ఈ పద్ధతులు అంతర్జాతీయ వాణిజ్యంపై దుష్ప్రభావాన్ని చూపెడుతున్నాయి. ఈ నివేదికలో చైనా 4 చోట్ల భారత్ ప్రస్తావన తీసుకువచ్చింది. 1997లో అమెరికాలో ఒక వ్యవసాయ సంస్థ బాస్మతి బియ్యాన్ని అమెరికన్ లాంగ్ ఇండికా బియ్యంతో సంకరించిన తరువాత 20 పేటెంట్ల కోసం మేధా హక్కుల కోసం దరఖాస్తు చేసుకున్నది. ఇది భారతదేశం నుండి బాస్మతి బియ్యం ఎగుమతిని తీవ్రంగా పరిమితం చేసిందని వ్యాఖ్యానించింది. ఫిబ్రవరిలో 2019లో చైనా, భారత్, దక్షిణాఫ్రికా, వెనిజులా, లావోస్ పీడీఆర్, బొలీవియా, కెన్యా,సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్, పాకిస్తాన్, క్యూబా సంయుక్తంగా ప్రపంచ వాణిజ్య సంస్థకు ఒక విశ్లేషణాత్మక పత్రం సమర్పించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల పట్ల ఉండే వివక్షను ఎండగడుతూ, ఆయా దేశా లకు ఉన్న ప్రత్యేక పరిస్థితుల పరిరక్షణకు హక్కులను కల్పించాల్సిన అవసరాన్ని ఈ పత్రం ద్వారా కోరాయి. అదే సంవత్సరం (2019) అక్టోబర్ నెలలో, 53 సభ్యదేశాలు (చైనా, భారత్, పాకిస్తాన్, ఆఫ్రికన్ గ్రూప్ సహా) సంయుక్తంగా ఒక పత్రం సమర్పించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక, భిన్నమైన వాణిజ్య నిబంధనలను రూపొందించడం తమ హక్కుగా ఈ పత్రంలో వర్ణించారు. ఈ నివేదిక ద్వారా డబ్ల్యూటీవో సభ్యత్వ దేశాలతో కలిసి పని చేస్తామని చైనా హామీ ఇచ్చింది. చైనా ఇస్తున్న ఈ హామీలు ప్రపంచీ కరణ, ఆర్థిక సరళీకృత విధానాలను వ్యతిరేకించేవారికి ఆశ్చర్యం కలిగించవచ్చు. కమ్యూనిస్ట్ దేశంగా ముద్ర పడిన చైనా సరళీకృత ఆర్థిక విధానాలకు, ప్రపంచీకరణకు, ప్రైవేటీకరణకు ఆలవాలమైన ప్రపంచ వాణిజ్య సంస్థ కొనసాగింపునకు ఈ విధంగా ఊతం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించకమానదు. అయితే, అమెరికాను వేలెత్తి చూపుతున్న చైనా ఇతర దేశాల పట్ల తన చర్యల గురించి సమీక్షించలేదు. కనీసం ప్రస్తావించలేదు. ఏది ఏమైనా, ప్రపంచ వాణిజ్య సంస్థ, దాని చుట్టూ ముసురుకుంటున్న సమస్యల మీద ఇటువంటి సవివరమైన నివేదికను భారత ప్రభుత్వం కూడా తయారు చేసి, ప్రత్యేకంగా అమెరికా, చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్ళ గురించి ప్రజలకు, పార్లమెంటుకు నివేదిస్తే బాగుంటుంది. - దొంతి నరసింహారెడ్డి, విధాన విశ్లేషకులు 90102 05742 -
రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డిని తరిమికొట్టాలి :కవిత
-
పవన్పై పోసాని కృష్ణ మురళి ఫైర్
-
పిచ్చి పట్టిందా పవన్
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
అతనితో డేటింగ్.. తొలిసారి నోరువిప్పిన ముద్దుగుమ్మ!
త్వరలో లాంచ్ కానున్న కొత్త బెంట్లీ కారు ఇదే.. ఫోటోలు
AP: ఎన్నికల హింసాత్మక ఘటనలపై సిట్ ఏర్పాటు
ఐపీఎల్లో విధ్వంసం.. కేవలం 19 బంతుల్లోనే!
Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
స్వాతి మలివాల్పై దాడి.. ఆమ్ ఆద్మీ సంచలన ఆరోపణలు
దేవర సాంగ్ ప్రోమో.. ఆ రోజు ఇక గూస్బంప్సే!
Sangeetha Sringeri: పునీత్ రాజ్కుమార్ సమాధి వద్ద నటి బర్త్డే సెలబ్రేషన్స్ (ఫొటోలు)
ప్రతి విద్యార్ధి చదవాల్సిన బుక్ ఇది.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
ఇదే చివరిది: అతిచిన్న, పాపులర్ వ్లాగర్ ఎమోషనల్ వీడియో వైరల్
తప్పక చదవండి
- Bongaon Lok Sabha: 67 శాతం ఓటర్లు వాళ్లే.. మథువాలుఎటు వైపు?
- కోలీవుడ్ టూ బాలీవుడ్.. ఇండస్ట్రీని కుదిపేస్తోన్న సుచిత్ర కామెంట్స్!
- కేన్స్లో మెరిసిన శోభితా ధూళిపాళ..ఆ డ్రస్ ధర ఏకంగా..!
- పీఎం కుసుమ్ స్కీమ్.. రైతుకు డబుల్ ఆదాయం - ఎలా అంటే?
- అధికారులను మార్చిన చోటే అల్లర్లు: మంత్రి బొత్స
- ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్లో కృత్రిమ మేధ!
- విద్యుత్ షాక్తో ఆగిన బాలుడి గుండె.. సీపీఆర్ చేసి ప్రాణం పోసిన డాక్టర్
- T20 WC: ఇంగ్లండ్, పాక్ కాదు! టైటిల్ రేసులో ఉన్న జట్లు ఇవే: జై షా
- ఛాతిలో కొట్టాడు, కడుపులో తన్నాడు: స్వాతి మలీవాల్ సంచలన ఆరోపణలు
- ట్విటర్ నుంచి నాగబాబు ఔట్.. వారిద్దరూ వార్నింగ్ ఇచ్చారా..?
Advertisement