-
Sreeleela: సమ్మర్ స్పెషల్ లుక్లో శ్రీలీల (ఫోటోలు)
-
శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది హీరోయిన్లు చెబుతుంటారు. కానీ డాక్టర్ కోర్స్ చదువుతూనే శ్రీలీల హీరోయిన్ అయిపోయింది. 'పెళ్లి సందడి' మూవీతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమా సక్సెస్ కానప్పటికీ వరస అవకాశాలు ఈమెని వరించాయి. రవితేజ 'ధమాకా'తో రూ.100 కోట్ల హిట్ అందుకుంది. మహేష్ బాబుతో 'గుంటూరు కారం'లోనూ నటించి ఆకట్టుకుంది.(ఇదీ చదవండి: సమంత షాకింగ్ పోస్ట్.. పెట్టి డిలీట్ చేసిందా?)అయితే తెలుగులో వరస ఫ్లాప్స్ దెబ్బకు ఈమెకు టాలీవుడ్లో ఛాన్సులు కరువయ్యాయి. లేదంటే ఈమె వద్దనుకుందో తెలియదు గానీ మన సినిమాలు ఇప్పట్లో చేసే సూచనలు కనిపించట్లేదు. అదే టైంలో తమిళంలో విజయ్, అజిత్ చిత్రాల్లో నటించే అవకాశం వరించిందనే వార్తలు తెగ వైరల్ అయ్యాయి.కాగా శ్రీలీలకు ఇప్పుడు మరో భారీ అవకాశం తలుపు తట్టినట్లు తెలిసింది. కార్తీ హీరోగా ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ భారీ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తుందని, ఇందులో హీరోయిన్గా ఈమెని తీసుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇది నిజమై, మూవీ హిట్ అయితే మాత్రం తమిళంలో శ్రీలీల క్రేజ్ పెరగడం ఖాయం.(ఇదీ చదవండి: సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య) -
అషూ రెడ్డి అందాల జాతర.. పాయల్ క్యూట్ మూమెంట్స్
విచిత్రమైన పోజుల్లో యంగ్ సెన్సేషన్ శ్రీలీలతమ్ముడు చనిపోయి మూడేళ్లు.. హీరోయిన్ నిక్కీ ఎమోషనల్ పోస్ట్చీరలో మరింత అందంగా బిగ్బాస్ ఫేమ్ స్రవంతిసొగసులు చూపిస్తూ రెచ్చగొట్టేస్తున్న హాట్ బ్యూటీ అషూరెడ్డి45 ఏళ్ల వయసులోనే చూపుతిప్పుకోనివ్వంత బ్యూటీతో జ్యోతిక View this post on Instagram A post shared by Aashu Reddy❤️ (@ashu_uuu) View this post on Instagram A post shared by Manchu Lakshmi Prasanna (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikki Tamboli (@nikki_tamboli) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Jyotika (@jyotika) View this post on Instagram A post shared by swathishta R (@swathishta_krishnan) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Aditiii🔥Ravi (@aditi.ravi) View this post on Instagram A post shared by Payal Rajput ⭐️ ♾ (@rajputpaayal) View this post on Instagram A post shared by Asha Bhat (@asha.bhat) View this post on Instagram A post shared by ANANTARA (@label_anantara) -
భారీ ఆఫర్ను రిజెక్ట్ చేసిన శ్రీలీల.. కారణం ఇదేనట
టాలీవుడ్లో పెళ్లి సందడి చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయ్యి తనదైన చలాకీ నటనతో సినీ పరిశ్రమ దృష్టిని తన వైపునకు తిప్పుకున్న నటి శ్రీలీల. అలాగే ఆ చిత్రం సక్సెస్ అయినా ఆ వెంటనే మరో అవకాశం రాకపోవడంతో ఈ అమ్మడి పరిస్థితి అంతేనా అనే కామెంట్స్ కూడా దొర్లాయి.అయితే రవితేజ సరసన నటించిన ఢమాకా చిత్రం హిట్ అవడం, ముఖ్యంగా అందులోని పాటల్లో శ్రీలీల తన డా¯న్స్తో కుర్రకారును ఫిదా చేసింది. దీంతో ఆమె పేరు మారు మ్రోగింది. ఆ తరువాత మహేష్ బాబు సరసన నటించే అవకాశం రావడంతో మరింత క్రేజ్ వచ్చింది. దీంతో ఇతర భాషల దర్శక నిర్మాతల దృష్టి శ్రీలీలపై పడింది. అలా కోలీవుడ్లో భారీ అవకాశాలు తలుపు తడుతున్నాయి. ముందుగా దళపతి విజయ్తో స్పెషల్ సాంగ్లో నటించే అవకాశం వచ్చింది.విజయ్ ప్రస్తుతం గోట్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఏజీ ఎస్ ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో నటి మీనాక్షి శేషాద్రి, స్నేహ, లైలా, మైక్ మోహన్, ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్ జీ మొదలగు పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటుడు విజయ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇందులో ఒకటి విలన్ పాత్ర అనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ రష్యాలో జరుగుతోంది. కాగా ఇందులో ఒక స్పెషల్ సాంగ్ చోటు చేసుకుంటుందట. ఆ పాటలో నటి త్రిష నటించనున్నారనే ప్రచారం జరిగింది.ఆ తరువాత కాల్ షీట్స్ సమస్య కారణంగా ఆమె నటించలేని పరిస్థితి అని, దీంతో టాలీవుడ్ యువ స్టార్ కథానాయకి శ్రీలీలను ఆ అవకాశం వరించిందని సమాచారం. అయితే ఆ అవకాశాన్ని శ్రీలీల తిరస్కరించినట్లు తెలిసింది. కారణం కోలీవుడ్లో సింగిల్ సాంగ్తో ఎంట్రీ అయితే అది కెరీర్ ఎదుగుదలకు బాధింపు ఏర్పడుతుందని భావించడమేనట. ఇది ఆమె బ్రిలియంట్ డెసిషన్ అంటున్నారు సినీ విశ్లేషకులు. కాగా ఇప్పుడు శ్రీలీల త్వరలో మరో స్టార్ హీరో అజిత్ సరసన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రంలో కథానాయికగా నటించడానికి సిద్ధం అవుతున్నట్లు టాక్. -
Sreeleela HD Photos: యువరాణిలా శ్రీలీల.. క్యూట్నెస్తో చంపేస్తోందిగా! (ఫొటోలు)
-
స్టార్ హీరో సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్?
దర్శకుడు వెంకట్ ప్రభు చిత్రం అంటే చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ముఖ్యంగా నటీనటులు ఎక్కువగా ఉంటారు. సాంకేతిక విలువలకు ప్రాముఖ్యత ఉంటుంది. గోట్ చిత్రంలోనూ ఇవి కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. నటుడు విజయ్ నటిస్తున్న చివరి చిత్రానికి ముందు చిత్రం గోట్. దీని తరువాత తన 69వ చిత్రం చేసి విజయ్ నటనకు స్వస్తి పలకనున్నారనే టాక్ చాలా కాలంగా జరుగుతున్న విషయం తెలిసిందే.వెంకట్ప్రభు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్టెయిన్మెంట్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తోంది. నటి మీనాక్షి చౌదరి, స్నేహ, లైలా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, వైభవ్, ప్రేమ్జీ, మైక్ మోహన్ తదితరు లు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది. గోట్ చిత్రాన్ని సెప్టెంబర్ 5వ తేదీన వినాయక చతుర్థి సందర్భంగా విడుదల చేయనున్నట్లు యూనిట్ వర్గాల సమాచారం.కాగా ఇందులో నటి త్రిష ప్రత్యేక పాత్రలో మెరవనున్నట్లు ఇంతకు ముందు ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడా స్పెషల్ అప్పీరియన్స్ను ఇవ్వడానికి టాలీవుడ్ క్రేజీ నటి శ్రీలీలతో చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఇందులో ఈమెకు ప్రత్యేకంగా ఒక పాట కూడా ఉంటుందని తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదన్నది గమనార్హం. ఇదే గనుక నిజం అయితే శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ చిత్రం గోట్నే అవుతుంది. కాగా ఈ అమ్మడు మరో టాప్స్టార్ అజిత్తో జత కట్టడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో శ్రీలీల కోలీవుడ్పై దండెత్తబోతున్నారన్నమాట. చూద్దాం ఇక్కడ ఈమె ప్యూచర్ ఎలా ఉండబోతోందో. -
లక్కీ చాన్స్ కొట్టేసిన శ్రీలీల!
తమిళసినిమా: నటుడు అజిత్తో కలిసి టాలీవుడ్ క్రేజీ నటి నటించనున్నారా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అలాంటి అవకాశం ఉందని సమాధానం వస్తోంది. కోలీవుడ్లో స్టార్ హీరోల్లో అజిత్ ఒకరు. ఈయన ఇటీవల నటించిన చిత్రం తుణివు. మంచి యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. తాజాగా విడాముయర్చి చిత్రంలో నటిస్తున్నారు. మగిళ్ తిరుమేణి దర్శకత్వంలో లైకా ఫిలింస్ సంస్థ ని ర్మిస్తున్న ఈ చిత్రంలో నటి త్రిష నాయకిగా నటిస్తున్నారు. నటుడు అర్జున్, ఆరవ్, రెజీనా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకూ షూటింగ్ను పూర్తి చేసుకుంది. తాజాగా అజర్బైజాన్లో షూటింగ్ను నిర్వహించారు. తదుపరి సెడ్యూల్ ఎప్పుడు? ఎక్కడ నిర్వహించేది చిత్ర వర్గాలు ఇంకా వెల్లడించలేదు. ఇకపోతే మే నెల 1వ తేదీన నటుడు అజిత్ పుట్టిన రోజు. ఆ సందర్భంగా విడాముయర్చి చిత్రానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వస్తుందనే ఆశాభావంతో అజిత్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే వారిని ఖుషీపరచడానికి అజిత్ నటించిన బిల్లా చిత్రం రీరిలీజ్ కానుంది. ప్రస్తుతం అజిత్ బైక్లో విదేశాలు చుట్టొస్తున్న పని లో ఉన్నారు. కాగా విడాముయర్చి చిత్రం అజిత్ నటిస్తున్న 62వ చిత్రం అవుతుంది. దీంతో తన 63వ చిత్రానికీ గ్రీన్సిగ్నల్ ఇచ్చారు. దీంతో తెలు గు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ నిర్మించనుంది. ఈ చిత్రానికి ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వచ్చనున్నారు. దీనికి గుడ్ బ్యాడ్ అగ్లీ అనే టైటిల్ను నిర్ణయించారు. ఇందులో అజిత్ మూడు గెటప్లలో నటిస్తారట. కాగా టాలీవుడ్ క్రేజీ నాయకి శ్రీలీల ఈ చిత్రంలో అజిత్కు జంటగా నటించనున్నట్లు తాజాగా సామాజిక మాధ్యమా ల్లో ప్రచారం వైరల్ అవుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. శ్రీలీల తెలుగులో రవితేజ, మహేశ్బాబు వంటి స్టార్ నటుల సరసన నటించారు. తాజాగా అజిత్ సరసన నటించడం నిజమైతే ఇదే ఈమె తొలి తమిళ చిత్రం అవుతుంది. ఇక పోతే ఈ చిత్రాన్ని త్వరలో ప్రారంభించి 2025 పొంగల్కు విడుదల చేయడానికి నిర్మాతలు ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. -
మెగా కోడలు లేటేస్ట్ లుక్.. రెడ్ డ్రెస్లో శ్రీలీల హోయలు!
అలాంటి డ్రెస్లో మెగా కోడలు లావణ్య త్రిపాఠి లుక్స్.. కాఫీ తాగుతూ చిల్ అవుతోన్న నేషనల్ క్రష్ రష్మిక.. శారీలో బుల్లితెర భామ రూపాలీ గంగూలీ ట్రెండీ లుక్స్.. రెడ్ డ్రెస్లో శ్రీలీల హోయలు.. రెడ్ శారీలో శృతిహాసన్ గ్లామర్ లుక్స్.. View this post on Instagram A post shared by Shruti Haasan (@shrutzhaasan) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rups (@rupaliganguly) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Lavanya tripathi konidela (@itsmelavanya) -
సలార్ అయినా.. గుంటూరు కారం అయినా.. అదే చూడాల్సింది: నాగవంశీ కౌంటర్
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఈ ఏడాది మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం సినిమాకు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. సంక్రాంతికి రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ ఈ సినిమాపై ట్రోల్స్ వచ్చాయి. చాలా మంది గుంటూరు కారంపై విమర్శలు కూడా చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆయన సినిమా రిలీజ్ సమయంలో వచ్చిన విమర్శలకు కౌంటరిచ్చారు. పెద్ద హీరోల సినిమాలకు లాజిక్లతో పనిలేదని ఆయన అన్నారు. స్టార్ హీరోల ఎలివేషన్స్ చూసి సినిమాను ఎంజాయ్ చేయాలన్నారు. నాగవంశీ మాట్లాడుతూ.. 'సలార్లో ప్రభాస్ను చూసి ఫ్యాన్స్ ఫుల్ ఎంజాయ్ చేశారు. కొందరు మాత్రం కొన్ని సీన్స్లో లాజిక్ లేదని కామెంట్స్ చేశారు. మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాలో కూడా తరచుగా హీరో హైదరాబాద్ వెళ్లినట్లు చూపించారు. వెంటనే ఎలా వెళ్తాడని కొందరు కామెంట్స్ చేశారు. ఇలాంటి వారి కోసం గుంటూరు టూ హైదరాబాద్ మూడున్నర గంటల జర్నీని సినిమాలో చూపించలేం కదా. కొందరైతే గుంటూరు కారంలో మాస్ సీన్స్ లేవని, త్రివిక్రమ్ మార్క్ కనిపించలేదని అన్నారు. కానీ ఓటీటీలో రిలీజ్ తర్వాత సినిమా చాలా బాగుందని మెసేజ్లు పెట్టారు' అని అన్నారు. గతంలో మహేశ్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట చిత్రాల్లో మాస్ సాంగ్స్ చేశారు. అందుకే గుంటూరు కారంలోనూ అలాంటి సాంగ్ ఉంటే బాగుంటుందని కుర్చినీ మడతపెట్టి పాటను పెట్టినట్లు నాగవంశీ తెలిపారు. ఇక్కడ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి కానీ.. ఆ టైమ్కు శ్రీలీల రావడం.. వెంటనే దుస్తులు మార్చుకోవడం లాంటి లాజిక్లు మాట్లాడకూడదని అన్నారు. సినిమాను కేవలం వినోదం రూపంలోనే చూడాలని.. ఇండస్ట్రీలోనే గొప్ప రచయిత అని పేరున్న ఆయనకు సినిమా ఎలా తీయాలో నేర్పించాల్సిన అవసరం లేదన్నారు. సినిమా బాగోలేదని కామెంట్ చేసే అర్హత ఎవరికైనా ఉంటుంది.. కానీ చిత్ర బృందంపై ఎవరు పడితే వారు మాట్లాడకూడదంటూ నాగవంశీ గట్టిగా బదులిచ్చారు. -
కోలీవుడ్ హీరోతో కుర్చీ మడతపెట్టిన శ్రీలీల
తమిళ హీరో శివకార్తికేయన్ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అందులో ఒకటి కమల్ హాసన్ నిర్మాతగా తన రాజ్కమల్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్న అమరన్ చిత్రం కాగా, మరొకటి ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం. అమరన్ చిత్రంలో శివకార్తికేయన్ సైనికుడిగా పవర్ఫుల్ పాత్రను పోషిస్తున్నారు. సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న SK23వ చిత్రం షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఈ రెండూ కమర్షియల్ ఫార్మాట్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ కథా చిత్రాలు కావడం గమనార్హం. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం శివకార్తికేయన్ టాలీవుడ్ హీరోయిన్ శ్రీలీలతో డ్యాన్స్ చేశాడు. వీళ్లు డ్యాన్స్ చేసింది సినిమాలో కాదు.. ఓ స్టేజీపై! ఇటీవల తిరుచ్చిలోని ఒక కళాశాలలో జరిగిన కార్యక్రమంలో అతిథులుగా పాల్గొన్న శివకార్తికేయన్, శ్రీలీల గుంటూరు కారంలోని కుర్చీని మడత పెట్టి అనే పాటకు డ్యాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా ప్రస్తుతం టాలీవుడ్లో క్రేజీ కథానాయకిగా రాణిస్తున్న శ్రీలీల కోలీవుడ్ ఎంట్రీ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. #PrinceSK and #Sreeleela shakes legs for #KurchiMadathaPetti !🔥🕺🏻💃🏻 This combo would shatter the screens ! Make it happen @Siva_Kartikeyan naahh!💥❤️#Amaran #SK23 pic.twitter.com/Nya09oDRq9 — ꜰᴀᴢɪʟ🖤 (@SKFazil_) March 23, 2024 చదవండి: పెళ్లి తేదీతో పాటు కాబోయే భర్త ఎవరో చెప్పిన బర్రెలక్క -
సినిమాలకు దూరంగా శ్రీలీల.. ఇప్పుడేం చేస్తుంది?
నాలుగు నెలల కిత్రం.. టాలీవుడ్లో ఎక్కడ చూసిన ఆమె గురించే చర్చ. ఏ పోస్టర్ మీద చూసినా ఆమె ఫోటోనే కనిపించేంది. ఏ స్టార్ హీరో సినిమా చూసినా..అమె స్టెప్పుల గురించే మాట్లాడుకునేవారు. కట్ చేస్తే.. ఇప్పుడు ఆ హీరోయిన్ ఎక్కడా కనిపించట్లేదు. సంక్రాంతి వరకు హడావుడి చేసి.. ఇప్పుడు సైలెంట్ అయిపోయింది. ఈ పాటికే ఆ హీరోయిన్ ఎవరనేది తెలిసిపోయి ఉంటుంది కదా? మీరనకున్నట్లే ఆ బ్యూటీ శ్రీలీలను. నాలుగు నెలల్లో అర డజనుకు పైగా చిత్రాలతో అలరించిన శ్రీలీల..ఇప్పుడు సైలెంట్ అయింది. ఆమె నుంచి కొత్త సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ రావడం లేదు. ఇంతకీ శ్రీలీల ఏం చేస్తున్నట్లు? పెళ్లి సందడిలో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శ్రీలీల. ఈ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ.. శ్రీలీలకు మాత్రం మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అయితే ఆ తర్వాత దాదాపు ఏడాది వరకు తెలుగు తెరకు దూరంగా ఉంది. ఇక రెండో సినిమా ‘ధమాకా’ సూపర్ హిట్ కావడం.. దానికి తన గ్లామర్, డ్యాన్స్ ప్రధాన కారణం అవ్వడంతో.. శ్రీలీల స్టార్ హీరోయిన్ల లిస్ట్లో చేరిపోయింది. ఆ తర్వాత వచ్చిన ప్రతి అవకాశాన్ని వదులుకోకుండా ఒప్పుకుంది. కథ, తన పాత్రతో సంబంధం లేకుండా పెద్ద బ్యానర్, బడా హీరో ఉంటే చాలు సినిమాకు ఓకే చెప్పింది. ఫలితంగా ఇప్పుడు వరుస ఫ్లాపులతో డేంజర్ జోన్లోకి వెళ్లింది. సంక్రాంతికి ముందు నెలకో సినిమాతో సందడి చేసింది. రామ్ ‘స్కంధ’, వైష్ణవ్ తేజ్ ‘ఆదికేశవ’, నితిన్ ‘ఎక్ ట్రా ఆర్డినరీ మ్యాన్’.. ఈ సినిమాలన్నీ నెలల వ్యవధిలో ప్రేక్షకుల ముందుకు వచ్చి.. డిజాస్టర్ టాక్ని సంపాదించుకున్నాయి. ఆమె కీలక పాత్ర పోషించిన ‘భగవంత్ కేసరి’మాత్రం హిట్ టాక్కి సంపాదించుకుంది. కానీ అది బాలయ్య ఖాతాలోకే వెళ్లింది. ఇక సంకాంత్రికి వచ్చిన ‘గుంటూరు కారం’. కూడా యావరేజ్ టాక్ని సంపాదించుకుంది.ఆ సినిమాకు వచ్చిన ఆ కాస్త హిట్ క్రెడిట్ కూడా మహేశ్ ఖాతాలోకే వెళ్లిపోయింది. ఇప్పడు ఈ బ్యూటీ చేతిలో ఉస్తాద్ భగత్ సింగ్ తో పాటు మరో సినిమా ఉంది. అయితే ఆ రెండు ఇప్పట్లో మొదలయ్యేలా లేవు. కొత్తగా ఏ ప్రాజెక్టులు ఒప్పుకోలేదు. ప్రస్తుతం ఖాలీ సమయం దొరకడంతో చదువుపై ఫోకస్ చేసినట్లు తెలుస్తోంది. మంచి పాత్రలు వస్తేనే సినిమా చేద్దాం అనే ఆలోచనలో శ్రీలీల ఉన్నట్లు తెలుస్తోంది. -
గుంటూరు కారం సాంగ్.. అంత భయంకరంగా ఉందన్న టీమిండియా స్టార్ క్రికెటర్!
కొత్త ఏడాదిలో గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకులను అలరించిన భామ శ్రీలీల. సంక్రాంతి కానుకగా రిలీజైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. జనవరి 12న థియేటర్లలో రిలీజైన ఈ చిత్రంలోని కుర్చీని మడతపెట్టి అనే సాంగ్ అభిమానులను ఓ ఊపు ఊపేసింది. ఈ సాంగ్కు అభిమానులకు అయితే ఏకంగా పూనకాలు తెప్పించింది. ఈ సాంగ్లో శ్రీలీల స్టెప్పులకు ఫిదా కానీ వారు ఉండరేమో. అంతలా తన డ్యాన్స్తో అదరగొట్టింది ఈ కన్నడ భామ. అయితే తాజాగా గుంటూరు కారం సాంగ్పై టీమిండియా క్రికెటర్, స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా శ్రీలీల, మహేశ్బాబు డ్యాన్స్కు తాను ఫిదా అయ్యానని వెల్లడించారు. ఓ అభిమానితో మాట్లాడుతూ గుంటూరు కారం సాంగ్ను ప్రస్తావించారు. మహేశ్ బాబు మూవీ గుంటూరు కారం సాంగ్లో శ్రీలీల, మహేశ్ బాబు డ్యాన్స్ భయంకరంగా ఉందని అన్నారు. ఇప్పటికీ ఆ సాంగ్ చూడకపోతే యూట్యూబ్కు వెళ్లి గుంటూరు కారం శ్రీలీల డ్యాన్స్ టైప్ చూడమని అశ్విన్ సలహా కూడా ఇచ్చాడు. మహేశ్ బాబు ఎక్స్ట్రార్డినరీ డ్యాన్సర్ అని.. అతనితో పాటు శ్రీలీల అదరగొట్టిందని అశ్విన్ ప్రశంసలతో ముంచెత్తారు. ఈ సాంగ్ ఐపీఎల్ ఎస్ఆర్హెచ్ టీమ్కు ఊపు తీసుకొస్తుందని రవిచంద్రన్ అశ్విన్ అన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. Cricketer @ashwinravi99 about #GunturKaaram 🔥@urstrulyMahesh @sreeleela14 pic.twitter.com/8mV2JNreU2 — Mahesh Babu Trends ™ (@MaheshFanTrends) March 19, 2024 -
Remuneration Details: ఈ టాలీవుడ్ భామల రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
-
శ్రీలీలకు చెక్ పెట్టిన మీనాక్షి చౌదరి
-
పూజా హెగ్డే ఈజ్ బ్యాక్.. త్రివిక్రమ్పై మళ్లీ ట్రోల్స్!
'గుంటూరు కారం' మరోసారి ట్రెండింగ్లోకి వచ్చింది. దీంతో డైరెక్టర్ త్రివిక్రమ్ని మహేశ్ ఫ్యాన్స్ మళ్లీ ట్రోల్ చేస్తున్నారు. అసలు ఎందుకిలా చేశారు అని తెగ బాధపడుతున్నారు. అయితే ఇదంతా కూడా కేవలం రెండు ఫొటోల వల్లే వచ్చింది. మళ్లీ ఏమైంది? ఇప్పుడు ఏం జరుగుతోంది? మహేశ్-త్రివిక్రమ్ కాంబోలో మూడో సినిమాగా 'గుంటూరు కారం' తీశారు. అప్పుడెప్పుడో 2021 మేలో లాంచ్ చేశారు. అప్పుడు ఫుల్ ఫామ్లో ఉన్న పూజా హెగ్డేని హీరోయిన్గా ఫిక్స్ చేశారు. కానీ షూటింగ్ లేటు అయ్యేకొద్ది స్టోరీ దగ్గర నుంచి ఫైట్ మాస్టర్స్, సినిమాటోగ్రాఫర్ ఒక్కొక్కరుగా మారుతూ వచ్చారు. మరి పూజా హెగ్డేని తప్పించారో, తప్పుకొందో తెలీదు గానీ సినిమా నుంచి సైడ్ అయిపోయింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోయిన్.. నెల తర్వాత బయటపెట్టింది) దీంతో మహేశ్ సరసన శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా చేశారు. మొన్నీమధ్ సంక్రాంతికి థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాగా ఫ్యాన్స్ అయితే త్రివిక్రమ్ని మాములుగా ట్రోల్ చేయలేదు. ఓటీటీలోకి వచ్చిన తర్వాత మరో దఫా ట్రోలింగ్ జరిగింది. ఇప్పుడు అప్పట్లో షూటింగ్ సందర్భంగా తీసిన ఫొటోల్ని ఎవరో సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఇందులో మహేశ్తో పాటు పూజా హెగ్డే కూడా కనిపించింది. ఈ ఫొటోల బట్టి చూస్తే శ్రీలీల చేసిన అమ్మూ పాత్ర పూజా చేయాల్సింది. మీనాక్షి చేసిన బుజ్జి పాత్ర శ్రీలీల చేయాలి. తాజాగా రిలీజైన ఫొటోల్లో పూజా లుక్ బాగుంది. దీంతో ఇంత మంచిగా ఉన్న హీరోయిన్ని ఎందుకు తీసేశార్రా బాబు అని నెటిజన్స్ దర్శకుడిని ట్రోల్ చేస్తున్నారు. అదీ సంగతి. (ఇదీ చదవండి: ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్) -
Actress Sreeleela: శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు..ఫ్యాన్స్ ఫిదా (ఫొటోలు)
-
శ్రీలీలని ఇలా ఎప్పుడూ చూసుండరు.. వీడియో వైరల్
శ్రీలీల పేరు చెప్పగానే డ్యాన్సులే గుర్తొస్తాయి. ఈ విషయంలో మిగతా హీరోయిన్లతో పోలిస్తే ఈమె టాప్లో ఉంటుంది. ఇప్పుడు ఈ డ్యాన్సుల వల్ల ఈమెని ట్రోల్ కూడా చేశారు. కానీ అవన్నీ పక్కనబెడితే చాలా ఏళ్ల తర్వాత శ్రీలీలలో మళ్లీ పాత అమ్మాయి కనిపించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అమెరికాలో పుట్టిన తెలుగు మూలులున్న అమ్మాయి శ్రీలీల. చిన్నతనంలో భరతనాట్యం నేర్చుకుంది. అప్పట్లో ఈమె ఫెర్ఫార్మ్ చేసింది. ఆ వీడియో ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది. కావాలంటే సెర్చ్ చేసి చూడొచ్చు. ఇక సినిమాల్లోకి వచ్చిన క్లాస్ డ్యాన్సులు పక్కనబెట్టి మాస్ డ్యాన్సులు చేయడం షురూ చేసింది. దీంతో పాత శ్రీలీలని చాలామంది మిస్ అయ్యారు. తాజాగా హైదారాబాద్లో సమతా కుంభ్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా శ్రీలీల.. గోదా దేవి వేషధారణలో క్లాసికల్ డ్యాన్స్ చేసింది. దాదాపు 10 నిమిషాల పాటు నాన్స్టాప్గా ఫెర్ఫార్మ్ చేసింది. ఆ వీడియో దిగువనే ఉంది. మీరు కూడా దీనిపై ఓ లుక్కేసేయండి. (ఇదీ చదవండి: అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్.. ఆ తెలుగు హీరోకి మాత్రమే ఆహ్వానం!) After a long time, Sreeleela Bharatanatyam classical dance performance at #SamathaKumbh2024 That charm, elegance and expressions 😍✨ Literally got chills watching this I'M SO PROUD OF YOU @sreeleela14 🫡#Sreeleela ♥️🙏🏼 pic.twitter.com/xysonVncVP — Mighty Mate (@MightyMate118) March 2, 2024 -
రష్మిక, పూజా హెగ్డే బాటలో శ్రీలీల.. బిగ్ ప్లాన్ వేసిన బ్యూటీ
ప్రస్తుతం టాలీవుడ్లో మారు మోగుతున్న పేరు శ్రీలీల. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ బ్యూటీ పూర్వీకం కర్ణాటకకు చెందింది. డాక్టర్ విద్య చదివి యాక్టర్ అయిన శ్రీలీల 2019లో కిస్ అనే కన్నడ చిత్రం ద్వారా కథానాయికగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత పెళ్లిసందడి చిత్రంతో టాలీవుడ్లో యమ సందడి చేశారు. ఆ తర్వాత ఒక ఏడాది పాటు సైలెంట్గా ఉన్న ఈమె ధమాకా చిత్రంతో తెలుగులో క్రేజీ హీరోయిన్గా మారిపోయారు. దీంతో వరుసగా అవకాశాలు శ్రీలీల తలుపు తడుతున్నాయి. జస్ట్ నాలుగేళ్లలో డజనుకు పైగా చిత్రాలు చేసేశారు. అయితే పాటలకు, అందాలారబోతకే ఎక్కువగా పరిమితం అవుతున్న శ్రీలీలకు ఇంకా అవకాశం ఉన్న పాత్రల్లో సత్తా చాటే స్థాయికి ఎదగలేదు. తాజాగా మహేష్బాబు సరసన నటించిన గుంటూరు కారం చిత్రం కమర్షియల్గా మంచి విజయాన్ని సాధించింది. కాగా శ్రీలీల తాజాగా తిరుమలకు వెళ్లి శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ స్థాయికి చేరుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాలను నటించే అవకాశాలు వస్తున్నాయని చెప్పారు. వాటి వివరాలను త్వరలోనే ఆయా దర్శక నిర్మాతలు అధికారిక పూర్వకంగా వెల్లడిస్తారని పేర్కొన్నారు. మొత్తానికి కన్నడం, తెలుగు భాషల్లోనే నటిస్తున్న బ్యూటీ త్వరలో తమిళంలోనూ పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారన్న మాట. అయితే ఇప్పటికే రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి కన్నడ భామలు కోలీవుడ్లో నటించినా, ఆశించిన స్థాయికి చేరుకోలేదన్నది గమనార్హం. మరి శ్రీలీల భవిష్యత్తు ఇక్కడ ఎలా ఉంటుందో చూడాలి. -
ట్రోల్స్ కి శ్రీలీల రియాక్షన్..!
-
తిరుమల లో ఇతను చేసిన పనికి శ్రీలీల ఏం చేసిందో చూస్తే..!
-
శ్రీవారి సేవలో గుంటూరు కారం భామ.. వీడియో వైరల్!
కొత్త ఏడాదిలోనే హిట్ సినిమాతో బోణి కొట్టిన ముద్దుగుమ్మ శ్రీలీల. మహేశ్ బాబు- త్రివిక్రమ్ కాంబోలో తెరెకెక్కిన గుంటూరు కారం చిత్రంలో హీరోయిన్గా నటించింది. సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ను సొంతం చేసుకుంది. వరుసపెట్టి సినిమాలు చేస్తోన్న ఈ కన్నడ బ్యూటీకి గుంటూరు కారంతో సక్సెస్ ట్రాక్లో వచ్చేసింది. తాజాగా ఈ పెళ్లిసందడి భామ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు శ్రీలీలకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు అమెకు ఆశీర్వచనం చేసి, తీర్థప్రసాదాలు అందజేశారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరలవుతోంది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ..' గతంలో పెళ్లి సందడి సినిమా తర్వాత తిరుమలకు వచ్చా. ఇప్పుడు మళ్లీ నా కుటుంబంతో కలిసి స్వామివారిని దర్శించుకున్నా. చాలా సంతోషంగా ఉంది. నా కొత్త ప్రాజెక్ట్స్ త్వరలోనే అనౌన్స్ చేస్తారు. అన్ని సిద్ధంగా ఉన్నాయి. తిరుమలకు రావడం చిన్నప్పటి నుంచి నాకు అలవాటు. అందుకే వచ్చా' అని చెప్పుకొచ్చింది. #Sreeleela, "#GunturKaaram," Actress visited the esteemed Tirumala Tirupati Venkateswara Temple. During her pilgrimage, she participated in the VIP break darshan & offered her सेवा to Lord Venkateswara. The warm reception from temple authorities & blessings from pundits. pic.twitter.com/EUHVCxkj8p — Informed Alerts (@InformedAlerts) February 19, 2024 -
వరుస ప్లాపులు వస్తున్నా తగ్గేదేలేదంటున్న శ్రీలీల..!
-
స్మైలీ లుక్స్తో గుంటూరు కారం హీరోయిన్.. కొత్త సినిమా పూజ కార్యక్రమంలో నిహారిక!
స్మైలీ లుక్స్తో గుంటూరు కారం హీరోయిన్ శ్రీలీల.. కొత్త సినిమా పూజ కార్యక్రమంలో మెగా డాటర్ నిహారిక కొణిదెల.. ఆరెంజ్ డ్రెస్లో మహేశ్ బాబు కూతురు సితార ఘట్టమనేని.. గ్రీన్ డ్రెస్లో రీతూ భామ హోయలు.. బిగ్ బాస్ బ్యూటీ సిరి హన్మంత్ లుక్ వైరల్ తన కూతురితో కలిసి హీరోయిన్ రంభ పోజులు View this post on Instagram A post shared by Rambha💕 (@rambhaindran_) View this post on Instagram A post shared by Siri Hanumanthu (@sirihanmanth) View this post on Instagram A post shared by Niharika Konidela (@niharikakonidela) View this post on Instagram A post shared by sitara 🪩 (@sitaraghattamaneni) View this post on Instagram A post shared by Sreeleela (@sreeleela14) View this post on Instagram A post shared by Rithu_chowdary (@rithu_chowdhary) -
ఓటీటీలోకి వచ్చేసిన 'గుంటూరు కారం'.. ఆ వర్షన్లో మరింత క్రేజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన గుంటూరు కారం చిత్రంపై నెగటివ్ కామెంట్లు వచ్చినా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ కొట్టింది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా టాక్తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ను షేక్ చేసింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న వచ్చిన గుంటూరు కారం సుమారు రూ. 280 కోట్లకు పైగానే కలెక్ట్ చేసింది. మహేశ్ కెరీర్లోనే మూడోసారి రూ. 200 కోట్ల మార్క్ను ఈ చిత్రంతో అందుకున్నారు. సినిమా టాక్తో సంబంధం లేకుండా సూపర్ కొట్టి టాలీవుడ్లో తన రేంజ్ ఏంటో మరోసారి చూపించాడు ప్రిన్స్ మహేశ్.. ఆయన క్రేజ్కు తగ్గట్లే గుంటూరు కారం ఓటీటీ రైట్స్ను భారీ మొత్తానికి నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ క్రమంలో నేడు ఫిబ్రవరి 9 నుంచి స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించగా.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా మెప్పించారు. ప్రకాశ్ రాజ్, జగపతిబాబు, జయరాం, రమ్యకృష్ణలు కీలక పాత్రలను పోషించారు. ఈ మూవీని హారిక హాసినీ క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. హిందీలో క్రేజ్ టాలీవుడ్ నుంచి ఇప్పటికే అల్లు అర్జున్, ప్రభాస్,తారక్,రామ్ చరణ్ వంటి స్టార్స్ బాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. ఈ క్రమంలో మహేశ్ కూడా బాలీవుడ్లో అడుగుపెట్టాలని ఆయన ఫ్యాన్స్ కోరుకుంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయన SSMB29 చిత్రాన్ని డైరెక్టర్ రాజమౌళితో ప్లాన్ చేశారు. ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానుంది. ఇలాంటి సమయంలో నెట్ ఫ్లిక్స్ ద్వారా 'గుంటూరు కారం' చిత్రాన్ని హిందీలో విడుదల చేశారు మేకర్స్. ఇప్పటికే సినిమా చూసిన ఆయన అభిమానులు ఇప్పుడు హిందీలో మరోసారి రమణగాడిని చూస్తున్నారు. Hindi version of Kurchi madathapetti song from Guntur Kaaram ain’t bad 🪑🔥 @MusicThaman#GunturKaaramOnNetflix pic.twitter.com/76YumZyRCy — Satvik (@SatvikV1) February 8, 2024 Dum Masala Biryani Erra Kaaram Ara kodi ready ga pettukoni full ga enjoy chese Guntur Kaaram vacchesindhi 🤤 Guntur Kaaram, now streaming on Netflix in Telugu, Tamil, Malayalam, Kannada and Hindi.#GunturKaaramOnNetflix pic.twitter.com/ROm8FYyjcU — Netflix India South (@Netflix_INSouth) February 8, 2024 -
పుష్ప 2 పై ఆశలు పెట్టుకున్న శ్రీలీల
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- మాజీ భర్త గే అన్న సుచిత్ర.. స్పందించిన నటుడు
- Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
- MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement