-
మిస్సవుతున్నందుకు బాధగా ఉంది.. సుధీర్ బాబు ట్వీట్!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్బాబు, మాళవిక శర్మ జంటగా నటించిన తాజా చిత్రం హరోం హర. ఈ చిత్రాన్ని జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ మూవీని మే 31న రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్మెంట్ చేశారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయాలని భావించారు.కానీ ఊహించని విధంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు సుధీర్ బాబు ట్వీట్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. కొన్ని కారణాల వల్ల హరోం హర మూవీని వాయిదా వేస్తున్నట్లు రాసుకొచ్చారు. సినిమా వాయిదా వేస్తున్నందుకు బాధగా ఉందన్నారు. స్పెషల్ డేట్ మిస్ అవుతున్నానని సుధీర్ బాబు ట్విటర్ ద్వారా వెల్లడించారు.సుధీర్బాబు తన ట్విటర్లో రాస్తూ..' వివిధ కారణాల వల్ల హరోం హర సినిమాను వాయిదా వేస్తున్నాం. వచ్చేనెల జూన్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తాం. మొదట అనుకున్న ప్రకారం కృష్ణ గారి బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయాలనుకున్నా. కానీ మిస్ అయినందుకు బాధగా ఉంది. అయినప్పటికీ జూన్ ఇప్పటికీ నా లక్కీ నెల. ఈ సమయంలోనే ప్రేమకథా చిత్రం, సమ్మోహనం చిత్రాలు విడుదలయ్యాయి. అలాగే హరోం హర కూడా మీ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుంది.' అని పోస్ట్ చేశారు. 1989 నాటి చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు. For various reasons, #HaromHara will now be releasing in theaters worldwide on 14th June. Although I feel sad for missing the release on the occasion of Krishna gari birthday, nevertheless June is still my lucky month. PKC & Sammohanam were both released during this time😎 I… pic.twitter.com/NZvcKA2Fdu— Sudheer Babu (@isudheerbabu) May 21, 2024 -
Sudheer Babu: సుధీర్ బాబు పుట్టినరోజు ప్రత్యేకం.. ఫోటోలు వైరల్
-
‘బండి’ది ఓట్ల రాజకీయం..!
కరీంనగర్: ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఎంపీ బండి సంజయ్కుమార్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓట్ల రాజకీయానికి తెరలేపారని కరీంనగర్, జగిత్యాల, హన్మకొండ జెడ్పీ చైర్మన్లు కనుమల్ల విజయ, దావ వసంత, సుధీర్బాబు ఆరోపించారు. కరీంనగర్లోని ఓ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోని సంజయ్ సర్పంచ్ల పదవీ కాలం ముగిశాక సానుభూతి చూపిస్తూ మొసలి క న్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను అబాసుపాలు చేయడానికే సర్పంచులకు రావాల్సి న బిల్లులపై పోరాటం చేస్తామని ఓట్ల జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్కుమార్ బెస్ట్ పార్లమెంటేరియన్గా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఎంపీగా ఏం చేశావో చెప్పి ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. శ్రీరాముని ఫొటో, అక్షింతలు పంపి సెంటిమెంట్తో ఓట్లు దండుకునే ప్రయత్నం సరికాదన్నారు. ఇప్పటికైనా సంజయ్ అభివృద్ధిపై అబద్ధాలు మాట్లాడడం మానుకోవాల ని హితవు పలికారు. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు మారుతి, నయీం పాల్గొన్నారు. ఇవి చదవండి: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు -
కుటుంబంతో తిరుమల సందర్శనలో హీరో సుధీర్ బాబు (ఫొటోలు)
-
Sudheer Babu Family Vacation: ఫ్యామిలీతో వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న టాలీవుడ్ హీరో (ఫోటోలు)
-
నా కెరీర్లో గేమ్ చేంజర్ అయ్యే చిత్రమిది: సుధీర్ బాబు
‘‘హరోం హర’ సినిమా కోసం యూనిట్ అంతా చాలా కష్టపడ్డాం. ఒక్కో రోజు సెట్స్లో వెయ్యిమంది ఉండేవారు. మంచి ఎమోషన్స్, హై కమర్షియల్ కంటెంట్ ఉన్న చిత్రమిది. ఇందులో చాలా బలమైన పాత్ర చేశాను. ఈ సినిమా నా కెరీర్లో గేమ్ చేంజర్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు సుధీర్ బాబు. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పతాకంపై సుమంత్ జి. నాయుడు నిర్మించిన పాన్ ఇండియా చిత్రం ‘హరోం హర’. మాళవికా శర్మ హీరోయిన్. హైదరాబాద్లో యూనిట్ నిర్వహించిన ఈ చిత్రం టీజర్ సక్సెస్ సెలబ్రేషన్స్లో సుధీర్ బాబు మాట్లాడుతూ– ‘‘సుమంత్ జి. నాయుడు వంటి నిర్మాతలు చిత్ర పరిశ్రమకు రావాలి. మైత్రీ, సితార, వైజయంతి.. లాంటి బ్యానర్స్లానే కథని నమ్మి ఎంతైనా ఖర్చు పెట్టే నిర్మాణ సంస్థగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ పరిశ్రమలోకి వచ్చినట్లేనని నమ్ముతున్నాను. నా కోసమే ఈ చిత్రకథ రాసుకొచ్చిన సాగర్కి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నా రెండో చిత్రానికి ఇంత హై బడ్జెట్ ఇస్తారని ఊహించలేదు. మంచి సినిమా చేశాం’’ అన్నారు జ్ఞానసాగర్. ‘‘నిర్మాతగా ఇది నా తొలి చిత్రం. టీజర్కి వస్తున్న స్పందన చూస్తుంటే ఓ మంచి సినిమా చేశాననే నమ్మకం వచ్చింది’’ అన్నారు సుమంత్ జి. నాయుడు. ఈ వేడుకలో కెమెరామేన్ అరవింద్, యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
'మామయ్య.. ఆగిపోలేదు మీ ప్రస్థానం'.. సుధీర్ బాబు ఎమోషనల్!
ఇటీవలే మామ మశ్చీంద్ర సినిమాతో ప్రేక్షకులను అలరించిన యంగ్ హీరో సుధీర్ బాబు. అయితే ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఇవాళ సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఎమోషనలయ్యారు. మామయ్యను తలుచుకుంటూ సోషల్ మీడియాలో వేదికగా సూపర్ కృష్ణ ఫోటోను పంచుకున్నారు. సుధీర్ బాబు తన ట్వీట్లో రాస్తూ 'మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.' అంటూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. కాగా.. ప్రస్తుతం హరోం హర అనే పాన్ ఇండియా చిత్రంలో సుధీర్ బాబు నటిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈనెల 22న టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు. ఈ సినిమాను సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. సుధీర్ బాబు కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో రూపొందిస్తున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు మహేశ్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ కూడా కృష్ణ మొదటి వర్ధంతి సందర్భంగా మరిన్ని సేవ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. ఇప్పటికే ఎం.బీ ఫౌండేషన్ పేరుతో ఎంతోమంది చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్లకు సాయం చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ ఫౌండేషన్ ద్వారా చిన్నారుల చదువు కోసం ఉపకారవేతనాలు కూడా ఇవ్వనున్నారు. మామయ్య , మీకు మాకు ఉన్న దూరం ఎంత? కలవరిస్తే కలలోకి వచ్చేంత, తలచుకుంటే మా గుండెల్లో బ్రతికేంత. ఆగిపోలేదు మీ ప్రస్థానం, ఆరిపోలేదు మా అభిమానం. మరువను నేను, మరువదు నేల. మీ కీర్తి, మీ స్పూర్తి ... అమరం .... అద్భుతం.#SSKLivesOn pic.twitter.com/lYdFgRIcaa — Sudheer Babu (@isudheerbabu) November 15, 2023 -
14 రోజులకే ఓటీటీలోకి వచ్చేసిన మామా మశ్చీంద్ర.. అక్కడే స్ట్రీమింగ్!
టాలీవుడ్ హీరో సుధీర్ బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం మామా మశ్చీంద్ర. మృణాలినీ రవి, ఈషా రెబ్బ హీరోయిన్లుగా నటించారు. హర్షవర్దన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ ముఖ్య పాత్రలు పోషించగా చైతన్ భరద్వాజ్ సంగీతం అందించారు. అక్టోబర్ 6న థియేటర్లలో విడుదలైన చిత్రం జనాలను ఆకర్షించడంతో విఫలమైంది. దీంతో రెండువారాలకే బాక్సాఫీస్ దగ్గర తట్టాబుట్టా సర్దేసుకుంది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేటర్లో సినిమా విడుదలైన 14 రోజులకే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. అమెజాన్ ప్రైమ్తో పాటు ఆహాలోనూ మామా మశ్చీంద్ర అందుబాటులో ఉంది. సినిమా కథేంటంటే? సుధీర్.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రల్లో నటించాడు. పరశురామ్కు స్వార్థమెక్కువ. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపేందుకు కుట్ర పన్నుతాడు. కానీ వాళ్లు బతికిపోతారు. పరశురామ్ కూతురు విశాలాక్షి(ఈషా రెబ్బ), పరశురామ్ దగ్గర పనిచేసే దాసు కూతురు మీనాక్షి(మృణాళిని రవి).. దుర్గ, డీజే అనే కుర్రాళ్లతో లవ్లో పడతారు. వీళ్లిద్దరూ పరశురామ్ పోలికలతో ఉండటంతో వాళ్లు తన మేనల్లుళే అని పరశురామ్కు నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? ముగ్గురి ప్రేమకు మంచి ముగింపు పడిందా? లేదా? అనేది ఓటీటీలో చూసేయండి.. చదవండి: లియో ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని వందల కోట్లంటే? ఏ ఓటీటీలోకి రానుందంటే? -
ఓటీటీలోకి వచ్చేస్తున్న సుధీర్బాబు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే!
ఓటీటీల దెబ్బకు మనం సినిమాలు చూసే విధానమే మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు థియేటర్లో సినిమా రిలీజైన చాన్నాళ్లకు హెచ్డీ ప్రింట్ అందుబాటులోకి వచ్చేది. కానీ ఓటీటీల పుణ్యామా అని కొన్ని డైరెక్ట్గా వీటిలోనే రిలీజ్ అవుతుండగా, మరికొన్ని నెలలోపే స్ట్రీమింగ్ అయిపోతున్నాయి. ఇప్పుడు ఓ మూవీ అయితే థియేటర్లలో ఉండగానే ఓటీటీ విడుదలకు సిద్ధమైపోయిందట. (ఇదీ చదవండి: 'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ) ఆ సినిమా ఏంటి? సుధీర్బాబు మూడు పాత్రల్లో నటించిన సినిమా 'మామా మశ్చీంద్ర'. అక్టోబరు 6న అంటే రెండు రోజుల క్రితమే థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. ఈ క్రమంలో డిజిటల్ రైట్స్ దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్.. ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని తాజాగా ప్రకటించేసినట్లు తెలుస్తోంది. ఆ రోజే స్ట్రీమింగ్ అక్టోబరు 24న దసరా పండగ. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల్లో సందడి గ్యారంటీ. మరోవైపు ఈ ఫెస్టివల్ సందర్భంగా లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు లాంటి సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఇప్పుడు అదే పండక్కి అంటే అక్టోబరు 20 నుంచి 'మామా మశ్చీంద్ర' సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం థియేటర్లలోకి వచ్చిన రెండు వారాల్లోనే ఓటీటీ రిలీజ్ అయిపోతున్నట్లే. (ఇదీ చదవండి: ఫారెన్ టూర్లో విజయ్-రష్మిక.. అది నిజమేనా?) #MaamaMascheendra from October 20. 📸 @PrimeVideoIN #MaamaMaschindra pic.twitter.com/Ptv3HhFio8 — SpreadFLIX (@spreadflix) October 8, 2023 -
'మామా మశ్చీంద్ర' సినిమా రివ్యూ
టైటిల్: మామా మశ్చీంద్ర నటీనటులు: సుధీర్ బాబు, ఈషా రెబ్బా, హర్షవర్ధన్, మృణాళిని రవి, అజయ్ తదితరులు నిర్మాత: సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహన్ డైరెక్టర్: హర్షవర్ధన్ మ్యూజిక్: చైతన్ భరద్వాజ్, ప్రవీణ్ లక్కరాజు సినిమాటోగ్రఫీ: పి.జి. విందా విడుదల తేదీ: అక్టోబర్ 06 నిడివి: 2h 29m కథేంటి? పరశురామ్(సుధీర్ బాబు)కి చాలా స్వార్థం. వందల కోట్ల ఆస్తి కోసం సొంత చెల్లి కుటుంబాన్ని చంపమని తన మనిషి దాసుకి చెప్తాడు. కానీ వాళ్ళు బతికిపోతారు. కట్ చేస్తే పరశురామ్ కూతురు విశాలాక్షి (ఈషా రెబ్బా), దాసు కూతురు మీనాక్షి (మృణాళిని రవి).. దుర్గ(సుధీర్ బాబు) డీజే (సుధీర్ బాబు) అనే కుర్రాళ్లతో లవ్ లో పడతారు. వీళ్ళిద్దరూ పరశురామ్ పోలికలతో ఉంటారు. వీళ్లు తన మేనల్లుడ్లే అని పరశురామ్కి నిజం తెలుస్తుంది. ఆ తర్వాత ఏమైంది? చివరకు పరశురామ్ ఏం తెలుసుకున్నాడు అనేది స్టోరీ. ఎలా ఉంది? సినిమా అంటే ఎవరెన్ని చెప్పినా వినోదం మాత్రమే. రెండు లేదా మూడు గంటలా అనేది ఇక్కడ మేటర్ కాదు. నవ్వించవా, థ్రిల్ చేశావా? ఇలాంటి అంశాలు మాత్రమే ఆడియెన్స్ చూస్తారు. ఈ విషయంలో మామ మశ్చీంద్ర పూర్తిగా ఫెయిల్ అయ్యింది. ఎందుకంటే కామెడీ, థ్రిల్, డ్రామా.. ఇలా ఏ పార్ట్ లోనూ కనీసం అలరించ లేకపోయింది. ట్విస్టులు ఎక్కువ ఉంటే ప్రేక్షకులు థ్రిల్ అవుతారని డైరెక్టర్ అనుకున్నాడు. అవి రెండున్నర గంటలు బుర్ర గొక్కునేల చేశాయి! ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే.. జాలి దయలేని తండ్రి వల్ల చిన్నప్పుడే పరశురామ్ తల్లి చనిపోవడం... తల్లికి దక్కాల్సిన ఆస్తిని మేనమామ లాగేసుకోవడం.. ఆ తర్వాత పక్క ప్లాన్ తో మేనమామకు కూతురు వరసైన అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అస్తినంతా దక్కించుకోవడం.. ఇక వయసు పెరిగిన తర్వాత పరశురామ్.. అతడు కూతురు విశాలాక్షీ.. పరశురామ్ దగ్గర పనిచేసే దాసు.. అతడు కూతురు మీనాక్షి.. వీళ్ళ లైఫ్ లోకి దుర్గ, డీజే అనే వ్యక్తులు రావడం.. అల ఈ పాత్రల మధ్య ఎలాంటి డ్రామా నడిచింది చివరకి ఏమైంది అనేదే తెలియాలంటే సినిమా చూడాలి.. స్టోరీ పరంగా స్వార్థం అనే మంచి పాయింట్ తీసుకున్నారు కానీ దాన్ని చెప్పడంలో ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు. దీంతో చూసే ప్రేక్షకుడికి కూడా అది ఎక్కలేదు. హీరో సుదీర్ బాబు.. పరశురామ్, దుర్గ, డీజే అనే మూడు పాత్రలు చేశాడు. డీజేగా రెగ్యులర్ లుక్ లో కనిపించాడు. ఇది ఓకే. కానీ మిగతా రెండు పాత్రలు డిజైన్ అస్సలు సెట్ కాలేదు. ఇక ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్స్ లవ్ ట్రాక్ తో చాలా చిరాకు పెట్టించారు. పబ్ లో వచ్చే ఆర్జీవీ ఎపిసోడ్ అయితే అనవసరం. ఇక సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో చుట్టేశారు. క్వాలిటీ విషయం కూడా కాస్త ఇబ్బంది పెడుతుంది. సినిమాలో ఏదైనా ప్లస్ పాయింట్ ఉందంటే.. క్లైమాక్స్ లో మనిషిలో స్వార్థం గురించి చెప్పే సీన్ మాత్రమే. ఎవరెలా చేశారు? మూడు పాత్రల్లో ఏదో ప్రయోగం చేద్దామని హీరో సుధీర్ బాబు ప్రయత్నించాడు గానీ అది అడ్డంగా బెడిసికొట్టింది. పరశురామ్ కారెక్టర్ ని అయిన మంచిగా రాసుకుని సినిమా తీసుంటే బాగుండేది. ఇక హీరోయిన్స్ గ చేసిన ఈషా రెబ్బ, మృణాళిని రవి ఓకే ఓకే. ఈ మూవీ రైటర్ అండ్ డైరెక్టర్ హర్షవర్ధన్ ఇందులో దాసు పాత్ర చేశాడు అది పర్లేదు. మిగతా కారెక్టర్స్ చేసిన వాళ్ళు మామ అనిపించారు. అజయ్, హరితేజ, రాజీవ్ కనకాల లాంటి వాళ్లని సరిగా వాడుకొలేకపోయారు. టెక్నికల్ విషయాల్లో ఈ సినిమాలోని పాటలు పెద్దగా గుర్తుండవ్. సినిమాటోగ్రఫీ ఓకే. నిర్మాణ విలువలు చాలా పూర్. రైటింగ్ కూడా అస్సలు ఎఫెక్టివ్గా లేదు. ఓవరాల్గా థియేటర్స్లో మామ మశ్చీంద నిలబడటం అంటే చాలా కష్టం. - చందు డొంకాన, సాక్షి వెబ్ డెస్క్ -
పోస్టర్ లో చూసి విజయ్ సేతుపతి అనుకున్నాను..!
-
‘మామా మశ్చీంద్ర’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)
-
సాయిపల్లవికి అక్కగా వచ్చిన ఛాన్స్ ఈ కారణంతో పోయింది: హరితేజ
సుధీర్ బాబు హీరోగా హర్ష వర్దన్ తెరకెక్కించిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’ . ఈషా రెబ్బా, మృణాళిని రవి ఇందులో హీరోయిన్లుగా కనిపించనున్నారు. సుధీర్ త్రిపాత్రాభినయం చేసిన ఈ సినిమా ఈ నెల 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్కు దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరోలు శర్వానంద్, విశ్వక్సేన్, శ్రీవిష్ణు, అశోక్ గల్లా ముఖ్య అతిథులుగా హాజరు అయ్యారు. (ఇదీ చదవండి: మీనాక్షి చౌదరి ఫేట్ మార్చేసిన మహేశ్ బాబు 'గుంటూరు కారం') ఈ సినిమాలో సినీ నటి హరితేజ కూడా ఉంది. ఈ ఈవెంట్లో ఆమె మాట్లాడుతూ.. 'శేఖర్ కమ్ముల గారు మిమ్మల్ని చూడగానే ఒకటి గుర్తొచ్చింది.. చెప్పుకోవాలనిపిస్తోంది. మంచి అనుభవం. నేను మీ ఫిలింస్కి ఫ్యాన్ సర్. ఫిదా సినిమాలో అక్క క్యారెక్టర్ కోసం నన్ను ఆడిషన్కి రమ్మని పిలిచారు. నేను ఎలాగైనా మీ దర్శకత్వంలో సినిమా చేయాలని రెండు మూడు సార్లు వచ్చి ఆడిషన్ ఇచ్చాను. కానీ అప్పుడు నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో తెలుసా.. తెలంగాణ యాస రాలేదని. ఆ సినిమా తర్వాత నేను తెలంగాణ యాస నేర్చుకున్నాను సర్. ఇప్పుడు అసలు తెలంగాణ యాసలో ఇచ్చిపడేస్తున్నాం సర్. మరీ అంత ప్యూర్ కాకపోయినప్పటికి ప్రస్తుతం నేను ప్రయత్నిస్తున్నాను.' అని చెప్పుకొచ్చింది. ఆమె మాటలకు శేఖర్ ఖమ్మల కూడా బాగా ఎంజాయ్ చేశాడు. ఇందులో హరితేజ ఓల్డ్ ఉమెన్ పాత్రలో కనిపించనుంది. -
వైరల్ విశాలాక్షి కొత్తగా అనిపించింది
సుధీర్బాబు త్రిపాత్రాభినయం చేసిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. హర్షవర్ధన్ నటించి, దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 6న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఈషా రెబ్బా మాట్లాడుతూ– ‘‘సుధీర్బాబుగారు చేసిన మూడు పాత్రల్లో దుర్గ పాత్రకు జోడీగా వైరల్ విశాలాక్షి పాత్ర చేశాను. ఏదో ఒకటి చేసి వైరల్ కావాలనుకునే మనస్తత్వం విశాలాక్షిది. ఈ పాత్ర నాకు కొత్తగా అనిపించింది. ఈ సినిమా కథను హర్షవర్ధన్గారు చెప్పినప్పుడు కన్ఫ్యూజ్ అయ్యాను. కానీ సెట్స్లో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం తమిళంలో విక్రమ్ ప్రభుతో ఓ సినిమా కమిట్ అయ్యాను. అలాగే నాకు మంచి గుర్తింపు తెచ్చిన ‘దయ’ వెబ్ సిరీస్ రెండో భాగం‘దయ 2’ వచ్చే సంవత్సరం ఆరంభమవుతుంది’’ అన్నారు. -
మహేష్ బాబు నా కోసం ఏదైనా చేస్తాడు ఎందుకంటే..
-
Mama Mascheendra Trailer Launch: ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో హీరో సుధీర్ బాబు (ఫోటోలు)
-
ఇలాంటి కథను ఇప్పటి వరకు ఎవరూ రాయలేదు
-
'నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు'.. ఆసక్తిగా ట్రైలర్!
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు, ఈషా రెబ్బా జంటగా నటిస్తోన్న చిత్రం మామ మశ్చీంద్ర. ఈ చిత్రానికి హర్షవర్ధన్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ సుధీర్ బాబు డిఫరెంట్ లుక్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?) ట్రైలర్ చూస్తే.. 'ఈ సృష్టింలో నువ్వొక్కడివే నిజం.. నీ ఫీలింగ్స్ ఎవరితోనూ పంచుకోకు' అనే డైలాగ్లో మొదలైంది. ట్రైలర్లో గమనిస్తే సుధీర్ డబుల్ రోల్తో పాటు విభిన్నమైన పాత్రలో కనిపించున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో డిఫరెంట్ షేడ్స్లో సుధీర్ బాబు ఫ్యాన్స్ను అలరించడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ చిత్రంలో మీర్నాలిని రవి, హర్షవర్ధన్, అలీ రెజా, రాజీవ్ కనకాల, హరితేజ, అజయ్, మిర్చి కిరణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి చైతన్ భరద్వాజ్ సంగీతమందిస్తున్నారు. ఈ మూవీ అక్టోబర్ 6న థియేటర్లలో సందడి చేయనుంది. -
సుధీర్ బాబు పాన్ ఇండియా చిత్రం హరోం హర, గ్లింప్స్ చూశారా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం హరోం హర. ది రివోల్ట్ అనేది ఉప శీర్షిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో సుమంత్ జి.నాయుడు నిర్మిస్తున్నారు. నేడు(మే 11) సుధీర్బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా సినిమా నుంచి ప్రత్యేక గ్లింప్స్ విడుదల చేశారు. అందరూ పవర్ కోసం గన్ పట్టుకుంటారు. కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది అని సుధీర్ బాబు కుప్పం యాసలో చెప్పే డైలాగ్స్ గ్లింప్స్లో ఉంది. చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగిన కథతో రూపొందుతున్న ఈ సినిమాను డిసెంబర్ 22న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇకపోతే సుధీర్ బాబు మరోపక్క మామా మశ్చీంద్ర సినిమా చేస్తున్నాడు. దర్శకుడు హర్షవర్ధన్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాలిని రవి, ఈషా రెబ్బా హీరోయిన్స్గా నటిస్తున్నారు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. చదవండి: హీరోలకే ఎక్కువ పారితోషికం, వ్యత్యాసం ఎందుకు?: రకుల్ ప్రీత్ సింగ్ -
మామా మశ్చీంద్ర: గాలుల్లోన పాట విన్నారా?
సుధీర్ బాబు హీరోగా రూపొందిన చిత్రం ‘మామా మశ్చీంద్ర’. నటుడు, దర్శకుడు హర్షవర్ధన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాలినీ రవి, ఈషా రెబ్బా కథానాయికలు. సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘గాలుల్లోన కలలే వాలే...’ అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ పాటను కపిల్ కపిలన్, నూతన మోహన్ పాడారు. ‘‘ఈ చిత్రంలో మూడు పాత్రల్లో కనిపించనున్నారు సుధీర్ బాబు. ‘గాలుల్లోన...’ అనే పాటలో దుర్గ, డీజే పాత్రల్లో ఆకట్టుకుంటారాయన. తెలుగు, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. చదవండి: ఉగ్రం నా కెరీర్లో హయ్యస్ట్ గ్రాసర్గా నిలుస్తుంది: అల్లరి నరేశ్ -
మొన్న గుర్తుపట్టలేనంతగా.. ఇప్పుడేమో స్టైలిష్గా యంగ్ హీరో!
దుర్గ లావుగా, మాస్గా ఉంటాడు. దుర్గకు పూర్తి భిన్నంగా ఉంటాడు పరశురామ్. చేతిలో తుపాకీ పట్టుకొని ఏజ్డ్ గ్యాంగ్స్టర్లా కనిపిస్తాడు. డ్రెస్సింగ్, సిట్టింగ్.. అంతా ఫుల్ స్టయిల్. ఇక్కడున్న పరశురామ్ లుక్ చూస్తే ఆ విషయం అర్థం అవుతుంది. దుర్గ, పరశురామ్, డీజే.. ఈ మూడు పాత్రల్లో సుధీర్బాబు నటిస్తున్న చిత్రం ‘మామా మశ్చీంద్ర’. ఇటీవల దుర్గ లుక్ని, శనివారం పరశురామ్ లుక్ని రిలీజ్ చేశారు. హర్షవర్ధన్ దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న చిత్రం ఇది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రానికి సంగీతం: చేతన్ భరద్వాజ్, కెమెరా: పీజీ విందా, సమర్పణ: సోనాలి నారంగ్, సృష్టి. We decided one surprise wasn't enough 😁 Meet #Parasuram!!#MaamaMascheendra#SBasParasuram@HARSHAzoomout @chaitanmusic @pgvinda @AsianSuniel @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/WNW2PVsWR5— Sudheer Babu (@isudheerbabu) March 4, 2023 -
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన సుధీర్ బాబు, కొత్తలుక్ చూశారా?
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంట్ హీరో సుధీర్ బాబు ఫలితాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల ఆయన యాక్షన్ ఫిలింతో అలరించాడు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన హంట్ బాక్సాఫీసు వద్ద మిశ్రమ స్పందనను అందుకుంది. ఫలితంగా ఈ చిత్రం ప్లాప్గా నిలిచింది. ఇక సుధీర్ బాబు తన తదుపరి సినిమాను లైన్లో పెట్టాడు. ప్రస్తుతం ఆయన మామ మశ్చీంద్ర అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైన హిట్ కొట్టాలని ఆశగా ఎదురు చూస్తున్న సుధీర్ బాబు ఇందుకోసం ప్రమోగం చేస్తున్నాడని అప్పట్లో టాక్ వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. ఇప్పటి వరకు సిక్స్ ప్యాక్, ఫిట్నెస్ లుక్తో ఆకట్టుకున్న సుధీర్ బాబు ఈ సినిమా కోసం బొద్దుగా తయారయ్యాడు. ప్రస్తుతం షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీలో తన లుక్ను తాజాగా విడుదల చేసి ఫ్యాన్స్కి షాకిచ్చాడు. దీనికి ‘బెట్.. ఇలా వస్తానని మీరు అనుకుని ఉండరు’ అని క్యాప్షన్ ఇచ్చాడు. లావుగా ఉన్న సుధీర్ బాబుని ఇలా చూసిన నెటిజన్లు, ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతున్నారు. ఎవరూ ఊహించని విధంగా ఇలా ట్విస్ట్ ఇచ్చావేంటి భయ్యా అంటూ నెటిజన్లు అతడి పోస్ట్ కామెంట్స్ చేస్తున్నారు. Bet you didn't see this coming 😉 Meet Durga! #MaamaMascheendra@HARSHAzoomout @chaitanmusic @pgvinda #SunielNarang @puskurrammohan @SVCLLP #SrishtiCelluloids pic.twitter.com/IWhVydn4ie — Sudheer Babu (@isudheerbabu) March 1, 2023 -
సుధీర్ బాబు వీడియో లీక్.. అలా మారిపోయాడేంటీ భయ్యా?
టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు ఇటీవల హంట్ సినిమాతో ప్రేక్షకులను అలరించారు. అయితే ఆ చిత్రం బాక్సాపీస్ వద్ద పెద్ద ఆకట్టుకోలేకపోయింది. తాజాగా మరో చిత్రంతో అభిమానులను అలరించేందుకు వస్తున్నారు. ప్రస్తుతం ఆయన హర్షవర్ధన్ డైరెక్షన్లో మామ మశ్చీంద్ర చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్, గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియోలో తెగ వైరలవుతోంది. మామ మశ్చీంద్ర మూవీలో సుధీర్ బాబు మేక్ ఓవర్కు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో లీకైంది. అందులో హీరో పూర్తి భిన్నమైన లుక్లో కనిపించారు. అది చూసిన ఆయన అభిమానులు షాక్కు గురవుతున్నారు. ఆ వీడియోలో సుధీర్ బాబు బాడీ లాంగ్వేజ్ చాలా మారిపోయింది. అసలు ఆ వీడియోలో ఉన్నది అతనేనా అన్న అనుమానం కలుగుతోంది. సుధీర్ బాబు, హర్షవర్ధన్ కాంబినేషన్లో మామా మశ్చీంద్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర సినిమాస్ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. Leaked Video: @isudheerbabu's Shocking Makeover for #MamaMascheendra pic.twitter.com/VnLpMlTzzb — Gulte (@GulteOfficial) February 27, 2023 -
‘నాన్నకు ప్రేమతో.... ’అంటున్న స్టార్ హీరోలు
తండ్రీకొడుకుల అనుబంధం నేపథ్యంలో ఇప్పటికే చాలా సినిమాలు వచ్చాయి. ఎన్ని వచ్చినా ఈ ‘అనుబంధం’ ఎవర్ గ్రీన్. అందుకే ఈ రిలేషన్ చుట్టూ కొత్త కథలు అల్లుకుని సినిమాలు తీస్తుంటారు. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ ఈ అనుబంధం నేపథ్యంలో కొన్ని సినిమాలు రానున్నాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం. కమల్హాసన్ తండ్రీకొడుకుగా రెండు పాత్రలు చేసిన ఓ చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). 1996లో శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో స్వాతంత్య్ర సమరయోధుడు సేనాపతి, అతని తనయుడు, ప్రభుత్వ ఉద్యోగి చంద్రబోస్ సేనాపతి పాత్రల్లో కమల్హాసన్ ద్విపాత్రాభినయం చేశారు. దేశభక్తుడైన సేనాపతి లంచగొండి అయిన తన తనయుడు చంద్రబోస్ను హత్య చేయడం ఈ సినిమాకే ప్రధాన హైలైట్. భారీ ఎత్తున ప్రేక్షకాదరణ పొందిన ఈ ‘ఇండియన్’ సినిమాకు సీక్వెల్గా పాతికేళ్ల తర్వాత కమల్హాసన్, శంకర్ ‘ఇండియన్ 2’ చేస్తున్నారు. ఈ సినిమా కూడా ప్రధానంగా తండ్రీకొడుకుల నేపథ్యంలోనే సాగుతుందని తెలిసింది. ఇండియన్ సినిమాలో మాదిరిగానే ‘ఇండియన్ 2’లో కూడా కమల్హాసన్ తండ్రీకొడుకుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారని కోలీవుడ్ టాక్. కథలోని కీలక సన్నివేశాలు 1920 నేపథ్యంలో ఉంటాయని తెలిసింది. అంటే కథ.. స్వాతంత్య్రానికి పూర్వం సేనాపతి, అతని తండ్రికి ఉన్న అనుబంధం నేపథ్యంలో ఉంటుందన్నట్లుగా ఈ చిత్రరచయితల్లో ఒకరైన జయ మోహన్ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో విడుదల చేయాలనుకుంటున్నారు. ► ప్రభాస్ చేస్తున్న తాజా చిత్రాల్లో ‘సలార్’ ఒకటి. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు లుక్స్ను విడుదల చేశారు మేకర్స్. ఈ చిత్రంలో ప్రభాస్ డ్యూయల్ రోల్ చేస్తున్నారని వినికిడి. అలాగే ఈ సినిమా కథకు తండ్రీకొడుకుల సెంటిమెంట్ను జోడించారట ప్రశాంత్ నీల్. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తండ్రి బాధ్యతను కొనసాగించి, సక్సెస్ అయ్యే కొడుకు పాత్రలో ప్రభాస్ కనిపిస్తారన్నది ఫిల్మ్నగర్ టాక్. ఈ చిత్రం సెప్టెంబరు 28న రిలీజ్ కానుంది. దర్శకుడు శంకర్, హీరో రామ్చరణ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. కథాంశం తండ్రీతనయుల అనుబంధమేనట. ఈ రెండు పాత్రలనూ చరణే చేస్తున్నారు. ఒక రాజకీయ పార్టీ అధికారంలోకి రావడం కోసం ఓ వ్యక్తి శ్రమిస్తాడు. కానీ కొందరు స్వార్థపరుల కారణంగా అతనికి అన్యాయం జరుగుతుంది. ఆ తర్వాతి కాలంలో ఆ వ్యక్తి తనయుడు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు. తండ్రిని ఇబ్బంది పెట్టినవారిని శిక్షిస్తూనే, డబ్బు, స్వార్థం లేని రాజకీయాల కోసం ప్రజలు ఎలా చైతన్యవంతులై ఉండాలి? ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా విధులు నిర్వర్తించాలి? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ► సుధీర్బాబు ప్రస్తుతం ‘మామా మశ్చీంద్ర’ అనే సినిమా చేస్తున్నారు. హర్షవర్థన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రధానంగా తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగుతుందని, ఇందులో మూడు డిఫరెంట్స్ లుక్స్లో సుధీర్బాబు కనిపిస్తారని టాక్. ► తండ్రీకొడుకుల ఎమోషన్ నేపథ్యంలో సాగే చిత్రాలు బాలీవుడ్లోనూ కొన్ని ఉన్నాయి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన చిత్రం ‘యానిమల్’. ‘అర్జున్రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తండ్రి కోసం గ్యాంగ్స్టర్గా మారే ఓ యువకుడి కథే ‘యానిమల్’ అని బాలీవుడ్ టాక్. ఇందులో రణ్బీర్ కపూర్ తండ్రిగా అనిల్కపూర్ కనిపిస్తారని సమాచారం. -
ఆఫీషియల్: విడుదలైన రెండు వారాలకే ఓటీటీకి హాంట్, స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
నైట్రో స్టార్ సుధీర్ బాబు హీరోగా భవ్య క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత వి. ఆనంద ప్రసాద్ నిర్మించిన సినిమా 'హంట్'. మహేశ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్, ‘ప్రేమిస్తే’ ఫేం భరత్ కీలకపాత్రలు పోషించారు. బాలీవుడ్ మూవీ ‘ముంబై పోలీస్’కు రీమేక్గా వచ్చిన ఈ చిత్రం రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదలైంది. అయితే హంట్ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఫలితంగా బాక్సాఫీసు వద్ద ఈ మూవీ బోల్తా పడింది. చదవండి: హైటెక్ సిటీ ఆఫీసులో మహేశ్ బాబు .. వీడియో వైరల్ దీంతో ఈ మూవీ థియేటర్లో విడుదలైన 2 వారాలకే ఓటీటీలోకి రాబోతోంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ మూవీ స్ట్రీమింగ్కు అంతా రంగం సిద్ధం చేసింది. ఫిబ్రవరి 10న ఈ చిత్రాన్ని ఓటీటీలో అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తాజాగా ఆహా అధికారిక ప్రకటన ఇచ్చింది. అంటే ఈ శుక్రవారం నుంచి హంట్ ఓటీటీలో సందడి చేయబోతోంది. కాగా ఏ చిత్రమైన థియేటర్లో విడుదలైన 6 నుంచి 8 వారాల తర్వాతే ఓటీటీకి వస్తుంది. కానీ సుధీర్ భాబు, శ్రీకాంత్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ మూవీ రిలీజ్ అయిన రెండు వారాలకే ఓటీటీలోకి రావడం గమనార్హం. చదవండి: సరిగమప విన్నర్ యశస్వి కొండెపూడి మోసం.. స్పందించిన స్వచ్చంద సంస్థ Get ready for the action-packed #HuntTheMovie thriller movie releasing on Feb 10 on aha.#HuntTheMovieOnAHA Premieres Feb 10@isudheerbabu @_apsara_rani @actorsrikanth @bharathhere @Imaheshh #Anandaprasad @BhavyaCreations @GhibranOfficial @anneravi @adityamusic pic.twitter.com/qGghi97ip0 — ahavideoin (@ahavideoIN) February 9, 2023
Pagination
మళ్లీ చరిత్ర సృష్టిస్తున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న ఈసీ
ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. స్ట్రీమింగ్ అందులోనే?
వరల్డ్కప్ జట్టులో నో ఛాన్స్: రోహిత్పై కేఎల్ రాహుల్ కామెంట్స్ వైరల్
ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు అలెర్ట్.. మారిన విత్ డ్రా నిబంధనలు
ఎన్ఆర్ఐతో విధి ఆడిన వింత నాటకం.. విషాదం
స్వాతి మలివాల్ డ్రామా.. బీజేపీ కుట్రే ఇదంతా: సంచలన వీడియో బయట పెట్టిన ఆప్
Heeramandi Jewellery ఎవరీ సినిమా నగల స్పెషలిస్ట్ జంట
పెళ్లి చేసి పల్లకిలో పంపాలనుకున్నాం.. కానీ : పుణే బాధితులు కన్నీరుమున్నీరు
తప్పక చదవండి
- ఘోర ప్రమాదం.. ఆర్టీసీ బస్సు, కారు ఢీ.. ముగ్గురి మృతి
- Hyd Viral: మండదా అన్నా.. మండదా అక్కా!
- హైదరాబాద్లో మినీ కశ్మీర్ అందాలు (ఫొటోలు)
- ఈ రాశి వారికి సకాలంలో ముఖ్యమైన పనులు పూర్తి, ధనలాభం
- నేటి నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
- పిన్నెల్లి ఫిర్యాదు పట్టదా?
- రైసీ మరణం రేపుతున్న ప్రశ్నలు
- బంగ్లా ఎంపీ హత్యకు రూ.5 కోట్ల సుపారీ
- టీడీపీ రీపోలింగ్ ఎందుకు కోరలేదు?
- ఆస్కార్ లైబ్రరీలో పార్కింగ్
Advertisement